Publish Date:Aug 25, 2022
బ్యాడ్మింటన్ చరిత్రలో పీవీ సింధు కృషి గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఒలింపిక్స్ లో పతకాలు, కామన్వెల్త్ లో గోల్డ్ సాధించి భేష్ అనిపించుకుంది. ప్రస్తుతానికి లైఫ్ ని ఎంజాయ్ చేస్తోంది. ఇటీవల ఓ ఇంటర్య్వూలో ఎన్నో కబుర్లు చెప్పింది సింధు. కొన్నిటికి క్లియర్ గా జవాబులు ఇచ్చింది. పుల్లెల గోపీచంద్ అకాడమీ నుంచి బయటికి వచ్చేయడంపై ఒక క్లారిటీ ఇచ్చింది. గోపి సర్ అకాడమీలో చాలా ఏళ్ళు ఆడాను. ఐతే ఆ అకాడమీలో జరిగిన కొన్ని విషయాలు నాకు వ్యక్తిగతంగా నచ్చలేదు..నాకు సెట్ కావనిపించి వచ్చేసాను. ఒలింపిక్స్ లో ఆడాలంటే కాన్సంట్రేషన్ చాలా అవసరం. ఇలాంటి విషయాలు ఆలోచిస్తే గేమ్ సరిగా ఆడలేను అనిపించింది.
ఈ అకాడమీలో నేను ఎంతో మంది కోచెస్ దగ్గర ట్రైనింగ్ తీసుకున్నా" అని చెప్పింది సింధు. అలాగే తన లైఫ్ లో జరిగిన ఒక బాడ్ ఇన్సిడెంట్ కూడా చెప్పింది సింధు. “2015 లో కాలి నొప్పితోనే ఆరు నెలల పాటు గేమ్ ఆడాను. డాక్టర్స్ రెస్ట్ తీసుకోవాలన్నారు. కానీ నేను ఒలింపిక్స్ లోకి వెళ్ళాలి . వెళ్లాలంటే నేను టాప్ - 16 లో ఉండాలి. కానీ అప్పటికి నేను టాప్ - 13 లో ఉన్నా. ఒలింపిక్స్ నా లక్ష్యం కాబట్టి నొప్పిని భరించి ముందుకెళ్లా. ఆడిన తొలి ఒలింపిక్స్ లోనే పతకం నెగ్గడం నాకు చాలా సంతోషంగా అనిపించింది.” కష్టడితే దాని రిజల్ట్ ఎలా ఉంటుందో అప్పుడు అర్ధమయ్యింది అని చెప్పింది సింధు. అలాగే ఓనమాలు నేర్పింది ఎవరు అనే ప్రశ్నకు.. “మహబూబ్ అలీ నాకు బ్యాడ్మింటన్ లో ఓనమాలు నేర్పించారు.
తర్వాత ఆరిఫ్, గోవర్థన్, గోపీగారి దగ్గర ట్రైన్ అయ్యాను. ప్రతి ఒక్క కోచ్ దగ్గర నేను చాలా విషయాలు నేర్చుకుని నా గేమ్ ని ఇంకా మెరుగుపరుచుకున్నాను . ఇండోనేషియా, కొరియాకు చెందిన కోచ్ ల దగ్గర కూడా నేను ట్రైనింగ్ తీసుకున్నా. ఆపొనెంట్ కి నేను టఫ్ కాంపిటీషన్ ఇస్తాను. మెడల్ గెలిచినప్పుడు పోడియంపై నిల్చుని జాతీయ జెండాను చూస్తూ.. జాతీయ గీతం వింటున్నప్పుడు నాలో కలిగే ఆనందం మాటల్లో చెప్పలేను. వేరే దేశంలో మన దేశపు జెండా ఎగరడం చాలా గొప్ప విషయం కదా" అంటూ ఎన్నో విషయాలను ఈ షోలో చెప్పింది సింధు.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/pv-sindhu-says-quitting-gopichand-academy-39-142623.html
టీవీకే అధినేత విజయ్కు కాంగ్రెస్ మద్దతు తెలపడంపై ఆగ్రహంగా ఉన్న డీఎంకే.. కాంగ్రెస్కు కటీఫ్ చెప్పేసింది. మారిన రాజకీయ పరిస్థితుల దృష్ట్యా, లోక్సభలో తమ పార్టీ సభ్యులకు కాంగ్రెస్ ఎంపీలతో కాకుండా విడిగా సీటింగ్ కేటాయించాలని డీఎంకే ఎంపీ కనిమొళి స్పీకర్ ఓం బిర్లాకు లేఖ రాశారు.
తాజా సమాచారం ప్రకారం.. విజయ్ తన పార్టీకి ఉన్న బలానికి తోడుగా మరో మూడు పార్టీల మద్దతును కూడగట్టుకున్నారు. ఆ పార్టీల మద్దతుతో అధికారం చేపట్టడానికి అవసరమైన మ్యాజిక్ ఫిగర్ 118ని ఆయన సాధించారు.
తమిళనాడులో ఇటీవల జరిగిన ఎన్నికల తర్వాత, విజయ్ నేతృత్వంలోని టీవీకే పార్టీ ప్రభుత్వ ఏర్పాటుకు సిద్ధమవ్వగా.. మెజారిటీ నిరూపణ విషయంలో రాజేంద్ర విశ్వనాథ్ అర్లేకర్ కచ్చితమైన నిబంధనలు పాటించాలని పట్టుబడుతున్నారు. విజయ్ కు తన పార్టీ ఎమ్మెల్యేలు 107 మందికి అదనంగా కాంగ్రెస్ నుంచి గెలిచిన ఐదుగురు ఎమ్మెల్యేల మద్దతు కూడా ఉంది.
పదవి నుంచి తొలగించిన అనంతరం ఎస్వీఎస్ఎన్ వర్మ తీవ్ర భావోద్వేగానికి లోనయ్యారు. పార్టీ తీసుకున్న ఈ నిర్ణయం తనకు ముందే తెలుసని, నాయకత్వం నుంచి సమాచారం అందిందని చెప్పారు. అయితే పార్టీ కోసం ఎన్నో ఏళ్లుగా కష్టపడి.. క్షేత్రస్థాయిలో కేడర్ను కాపాడుకుంటూ వచ్చిన తనకు ఈ పరిణామం మనస్తాపానికి గురిచేసిందన్న ఆవేదన కూడా వ్యక్తం చేశారు.
బాబు కూటమిని ఎందుకంత విలువైనదిగా భావిస్తున్నారంటే.. కారణం వైసీపీ. ఆ పార్టీ కూటమి ఎప్పుడెప్పుడు చీలిపోతుందాని కాచుకుని కూర్చుని ఉంది. ఏ అవకాశం వచ్చినా వారు వదిలిపెట్టినట్టే కనిపించదు. మొన్న కోట వినుత ఘటన, నిన్న అరవ శ్రీధర్ వ్యవహారం, ఇవాళ వర్మ ఇష్యూ.. ఇలా సమయం దొరికినపుడల్లా ఆయా అంశాలను బాగా హైలెట్ చేసి.. కూటమిలో ఏదో ఒక చిచ్చు రాజేయాలని చూస్తోంది వైసీపీ అధినాయకత్వం.
అతి కొద్ది మంది నేతలు జగన్ ప్రకటనను సమర్దిస్తూ.. అనుకూల ప్రకటనలు చేస్తుండగా.. మెజారిటీ లీడర్, క్యాడర్ మాత్రం జగన్ నిర్ణయంపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.
తెలుగువన్ వాస్తవ వేదికలో ప్రస్తుత జాతీయ, ప్రాంతీయ రాజకీయ పరిస్థితులపై విస్తృత చర్చ జరిగింది.
తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ఆ రాష్ట్ర రాజకీయాల్లో పెను సంచలనాన్ని సృష్టించాయి.
టీవీకే అధినేత విజయ్తో భేటీ అనంతరం రాజ్ భవన్ ఒక అధికారిక ప్రెస్ నోట్ విడుదల చేసింది. అసెంబ్లీలో ప్రభుత్వం ఏర్పాటు చేయాలంటే ఉండాల్సిన సంఖ్యాబలంపై గవర్నర్.. విజయ్కు మార్గనిర్దేశం చేశారు. కేవలం అతిపెద్ద పార్టీగా ఉండటమే కాకుండా, సభలో తగినంత మంది ఎమ్మెల్యేల మద్దతు ఉన్నట్లు ఆధారాలు చూపాలని సూచించారు.
పిఠాపురంలో ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలో చంద్రబాబు ఫొటోలేదని ఆరోపిస్తూ.. మాజీ ఎమ్మెల్యే వర్మ అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ క్రమంలో జనసేన నేత, మాజీ ఎమ్మెల్యే దొరబాబు జోక్యం చేసుకోవడంతో వాగ్వాదం చోటు చేసుకుంది. వర్మ దురుసు వ్యాఖ్యలపై పార్టీలో అంతర్గతంగా చర్చించిన అధిష్టానం.. వర్మ వ్యవహారాన్ని తప్పుబట్టింది. ఇంతలోనే వర్మను ఇంచార్జ్ పదవి నుంచి తొలగించడం చర్చనీయాంశంగా మారింది.
రాష్ట్రంలో కొత్త ప్రభుత్వ ఏర్పాటుకు డీఎంకే ఏ విధంగానూ అడ్డుపడబోదన్నారు. రాష్ట్రంలో మరోసారి ఎన్నికలు రావాలని గానీ, రాజ్యాంగ సంక్షోభం తలెత్తాలనీ కానీ తాము కోరుకోవడం లేదన్నఆయన.. ప్రజాతీర్పునకు అనుగుణంగానే డీఎంకే నడుచుకుంటున్నదన్నారు.
గతంలో విజయ్కు ఉన్న ప్రాణహాని హెచ్చరికలు.. ఆయన పాపులారిటీని దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం సాయుధ పోలీసులతో కూడిన భద్రతను ఏర్పాటు చేసింది. అయితే.. తాజాగా నిర్వహించిన భద్రతా సమీక్షలో భాగంగా ఆయనకు ఇకపై అదనపు సెక్యూరిటీ అవసరం లేదని అధికారులు భావించినట్లు తెలుస్తోంది.
తాజా ఎన్నికల ఫలితాల్లో నటుడు విజయ్ నేతృత్వంలోని తమిళగ వెట్రి కళగం (టీవీకే) 108 స్థానాలతో సింగిల్ లార్జెస్ట్ పార్టీగా అవతరించిన సంగతి తెలిసిందే. అయితే.. ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన 118 మంది ఎమ్మెల్యేల మద్దతు ఆ పార్టీకి ఇంకా లభించలేదు. కాంగ్రెస్తో కలిపి విజయ్ బలం ప్రస్తుతం 112కు చేరినప్పటికీ.. మేజిక్ ఫిగర్కు ఇంకా ఆరు అడుగుల దూరంలో ఉంది.