రోజాకు టీటీడీ ప్రొటోకాల్ దర్శనం? అసలేం జరుగుతోంది?

Publish Date:Jan 12, 2025

Advertisement

జగన్ ఐదేళ్ల అరాచకపాలనను జనం అసహ్యించుకున్నారు. ఆయన కేబినెట్ లోని కొందరు మంత్రుల తీరును, వారి అసహ్యకరమైన భాషను భరించలేకపోయారు. అందుకే ఎన్నికలలో ఆ పార్టీకి కనీసం ప్రతిపక్ష హోదా కూడా ఘోరాతి ఘోరంగా ఓడించి బుద్ధి చెప్పారు. తెలుగుదేశం కూటమికి చారిత్రాత్మక విజయం కట్టబెట్టారు. బూతులతో రెచ్చిపోయిన మంత్రులలో ఒక్కరంటే ఒక్కరు కూడా విజయం సాధించలేదంటే.. జనం వారిని ఎంతగా ఏవగించుకున్నారో ఇట్టే అవగతమౌతుంది. ప్రజా తిరస్కారానికి గురైన వైసీపీ నేతల అక్రమాలు, దౌర్జన్యాలపై తెలుగుదేశం కూటమి ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని అంతా భావించారు. భావించడం కాదు.. ఐదేళ్ల పాటు తమను అష్టకష్టాలూ పెట్టిన వైసీపీయుల అరాచకత్వం, దౌర్జన్యం, దుర్మార్గం, అవినీతి, అక్రమాలపై విచారణ జరిపి చర్యలు తీసుకోవాలనే జనం కూటమికి బ్రహ్మరథం పడుతూ తీర్పు ఇచ్చారు.  

వైసీపీ నేతలు కూడా తమ తప్పులకు కూటమి ప్రభుత్వంలో శిక్ష తప్పదని అనుకున్నారు.   దీంతో భయంతో వణికి పోతూ ఈ ఆరు నెలలూ దాదాపు అజ్ణాత వాసం గడిపారు. అధికారం అండతో ప్రత్యర్థులపై బూతులతో రెచ్చిపోయిన వారిలో  రోజా కూడా ఒకరు. ఆమెకు నగరి ప్రజలు ఓటుతో బుద్ధి చెప్పారు. వరుసగా రెండు సార్లు విజయం సాధించిన నగరి నియోజకవర్గం నుంచి ఆమెను ఓడించారు. ఆ ఓటమి ఎంత ఘోరంగా ఉందంటే.. పోలింగ్ రోజునే రోజా తన ఓటమిని అంగీకరించేసి కౌంటింగ్ సెంటర్ నుంచి వెళ్లిపోయారు. బూతల రోతతో పాటు.. పర్యాటక మంత్రిగా ఆమె కోట్లాది రూపాయల అవినీతికి పాల్పడ్డారన్న ఆరోపణలూ ఉన్నాయి. వీటన్నిటిపైనా ఆమెపై విచారణ జరిపి చట్ట ప్రకారం చర్యలుంటాయని అంతా భావించారు. రోజా కూడా అదే భయంతో ఓటమి తరువాత చాలా కాలం ఎవరికీ ముఖం చూపకుండా చెన్నై చెక్కేశారు.

అయితే ఈ ఆరు నెలల కాలంలో అధికారంలో ఉన్న తెలుగుదేశం కూటమి ప్రభుత్వమే రోజా వంటి వారికి ధైర్యం నూరి పోసినట్లుగా వ్యవహరించింది. అక్రమాలు, దౌర్జన్యాలకు పాల్పడిన వారిపై చర్యలు లేవు. కేసులు లేవు. జగన్ హయాంలోఅధికారం అండతో ఇష్టారీతిగా వ్యవహరించిన వారిపై ఎటువంటి ప్రతీకార చర్యలు ఉండవని స్వయంగా సిఎం చంద్రబాబు నాయుడు, డెప్యూటీ సిఎం పవన్ కళ్యాణ్‌ ప్రకటించారు. మాటవరసకైతే ప్రతీకార చర్యలు ఉండవని అన్నారు కానీ, చేతలలో మాత్రం అసలు అటువంటి వారిపై చర్యలు తీసుకునే ఉద్దేశమే తమకు లేదని చాటారు. దీంతో తెలుగుదేశం కూటమి ప్రభుత్వంలో తమకు వచ్చిన ఇబ్బందేమీ ఉండదని అర్ధం చేసుకున్న వైసీపీ నేతలు ఇప్పుడు మళ్లీ బయటకు వచ్చి తామే అధికారంలో ఉన్నామన్నట్లుగా ఇష్టారీతిగా వ్యవహరించడం మొదలు పెట్టారు. తెలుగుదేశం కూటమి మెతకతనాన్ని అలుసుగా తీసుకుని  మళ్లీ గతంలోలాగే నోటికి పని చెబుతున్నారు.  వైసీపీ సోషల్ మీడియా కూడా గతంలోలాగే అసభ్య, అశ్లీల పోస్టులతో రెచ్చిపోతోంది. ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి, ఇతర నాయకులపై అనుచిత ఫొటోలు, వీడియోలతో రెచ్చిపోతోంది. తిరుపతి ఘటనలో వైసీపీ నేతలు వ్యవహరించిన తీరు చూస్తే వారందరికీ  తెలుగుదేశం కూటమి ప్రభుత్వం వారికి ఎంత అలుసు ఇచ్చిందో స్పష్టంగా అర్థమౌతోంది.  

ముఖ్యంగా  మాజీ మంత్రి రోజా తిరుపతి తొక్కిసలాట ఘటన జరిగిన తరువాత నుంచీ రోజుకు రెండు మూడు సార్లు మీడియా ముందుకు వస్తూ ఈ ఘటనకు చంద్రబాబు బాధ్యత వహించి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. అంతే కాదు ఆయనది ఐరన్ లెగ్ అంటూ రెచ్చిపోయారు. చంద్రబాబు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన ప్రతి సారీ రాస్ట్రంలో ఇటువంటి విషాద ఘటనలు జరుగుతాయంటూ నోటికొచ్చినట్లు మాట్లాడారు. అలాగే ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ పైనా నోటికొచ్చినట్లు విమర్వలు చేశారు. అటువంటి  రోజా, శనివారం ఉదయం తిరుమల స్వామివారి దర్శనానికి వెళితే, ఆలయ అధికారులు, టీటీడీ సిబ్బంది ఆమెకు ప్రోటోకాల్ మర్యాదలతో బ్రేక్ దర్శనం చేయించి సాగనంపారు. దర్శనం చేసుకు వచ్చిన తర్వాత కూడా ఆమె మళ్ళీ మరోసారి టీటీడీ, సిఎం చంద్రబాబు నాయుడులపై నిప్పులు చెరిగారు. అసలు కనీసం ఎమ్మెల్యే కూడా కాని రోజాకు ప్రొటోకాల్ దర్శనం ఎలా సాధ్యమైందన్నదానికి టీటీడీ సమాధానం చెప్పాలి. అసలు ఆమె పేరును ఎవరు సిఫారసు చేశారు? దానిని ఎవరు ఆమోదించారు అన్న విషయం తేలాల్సి ఉంది.  మంత్రిగా ఉన్న సమయంలో రోజా ప్రొటోకాల్ దర్శనం పేరిట వందల మందిని తనతో తీసుకువెడుతూ దర్శనం టికెట్లను సొమ్ము చేసుకున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. కనీసం ఎమ్మెల్యే కూడా కాని రోజాకు తిరుమలలో ప్రొటోకాల్ దర్శనం ఎలా సాధ్యమైంది?  పరిస్థితి చూస్తుంటే ప్రభుత్వ మెతకతనాన్ని అధికారులు కూడా అలుసుగా తీసుకుని ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారా అన్న అనుమానాలు వెల్లువెత్తుతున్నాయని పరిశీలకులు అంటున్నారు. అసలు ప్రభుత్వానికి యంత్రాం గంపై పట్టులేనట్టు కనిపిస్తోందనీ, ఇప్పటికీ క్షేత్రస్థాయిలో వైసీపీయుల హవాయే నడు స్తోందని అనిపిస్తోందని అంటున్నారు. 

By
en-us Political News

  
రాబోయే రోజుల్లో ఏ ప్రాంతీయ పార్టీని దగ్గరకు చేర్చుకొనే అవకాశం లేదని ఆయన కుండబద్దలు కొట్టారు. ఎన్డీయే ప్రభుత్వం కేంద్రంలో అధికారంలోకి వచ్చి బుధవారంతో 12 ఏళ్లు పూర్తి చేసుకుంటున్న నేపథ్యంలో మంగళవారం (జూన్ 9) ఢిల్లీలో ఆయన విలేకరులతో ఇష్టాగోష్టిగా మాట్లాడుతూ ఈ సోలో ఎజెండా ప్రకటించారు.
మొత్తంగా తెలుగు రాష్ట్రాలలో బీజేపీ వ్యూహం ఏమిటన్న విషయాన్ని అమిత్ షా తేటతెల్లం చేసేశారు. దేశవ్యాప్తంగా కూటమి రాజకీయాలు నడుస్తున్న తరుణంలో.. కేంద్ర హోం మంత్రి, బీజేపీ అగ్రనేత అమిత్ షా తెలంగాణ రాజకీయాలపై చేసిన వ్యాఖ్యలు జనసేనకు ఒకింత ఇబ్బందికలిగేలా ఉన్నాయని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.
పార్టీ నాయకత్వంపై అసంతృప్తితో ఉన్న కీలక నేతలు ఒక్కొక్కరుగా పార్టీని వీడి బయటకు వచ్చేస్తున్నారు. తాజాగా టీఎంసీకి చెందిన రాజ్యసభ ఎంపీ సుస్మితా దేవ్ తన పదవికి, పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేశారు. వారం రోజుల వ్యవధిలో టీఎంసీకి గుడ్ బై చెప్పిన రెండో రాజ్యసభ సభ్యురాలు సుస్మితాదేవ్.
కాంగ్రెస్ సీనియర్ నాయకురాలు మీనాక్షి నటరాజన్ నామినేషన్‌ తిరస్కరనకు గురి కావడం దేశవ్యాప్తంగా పెను సంచలనం సృష్టిస్తోంది. మీనాక్షీ నటరాజన్ రాజ్యసభ నామినేషన్ ను ఎన్నికల సంఘం తిరస్కరించడంపై తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి తీవ్రంగా స్పందించారు. మీనాక్షి నటరాజన్‌పై తెలంగాణ రాష్ట్రంలో ఎలాంటి క్రిమినల్ కేసులు లేవని స్పష్టం చేశారు.
పునర్విభజన ప్రక్రియ వల్ల ఏ ఒక్క రాష్ట్రానికి గానీ, ఎవరికీ గానీ ఎలాంటి అన్యాయం జరగదని పునరుద్ఘాటించారు. డీలిమిటేషన్ బిల్లుపై తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేస్తున్న విమర్శలను అమిత్ షా కొట్టిపారేశారు. రేవంత్ రెడ్డి చేస్తున్న వ్యాఖ్యల్లో సీరియస్‌నెస్ లేదని, వాటిని పట్టించుకోవలసిన అవసరం లేదనీ అన్నారు.
మోదీ ప్రధాని పీఠంపై విజయవంతంగా 12 ఏళ్ల సుదీర్ఘ పదవీకాలాన్ని పూర్తి చేసుకున్నారు. ఇంకా స్పష్టంగా చెప్పాలంటే 4,399 రోజుల పాటు ఆయన నిరంతరాయంగా ప్రధాని పదవిలో ఉన్నారు. 1952లో భారతదేశంలో మొట్టమొదటి సార్వత్రిక ఎన్నికలు జరిగిన తర్వాత.. జవహర్‌లాల్ నెహ్రూ ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికై 4,398 రోజుల పాటు నిరవధికంగా ప్రధానిగా బాధ్యతలు నిర్వహించారు.
ఒక్క తెలంగాణ అని కాదు, ఏ రాష్ట్రంలోనైనా ఒంటరిగానే బరిలోకి దిగుతామని చెప్పారు. ఆ దిశగా ముందు.. తెలంగాణ, పంజాబ్ రాష్ట్రాల్లో వచ్చే ఎన్నికలలో ఒంటరి పోరుకు సిద్ధమౌతున్నట్లు చెప్పారు.
ఈ ఎన్నికలకు సంబంధించి దాఖలైన నాలుగు నామినేషన్ పత్రాలు పూర్తిగా సక్రమంగా ఉన్నాయని రిటర్నింగ్ అధికారి, అసెంబ్లీ సంయుక్త కార్యదర్శి ఆర్. వణితా రాణి ప్రకటించారు. శాసనసభ భవనంలోని తన చాంబర్‌లో అభ్యర్థుల సమక్షంలో జరిగిన ఈ స్కృటినీ ప్రక్రియలో ఎలాంటి సాంకేతిక లోపాలు లేవని తేలడంతో కూటమి శ్రేణుల్లో హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి.
తెలుగు రాష్ట్రాల రాజకీయాల్లో 2027 సంవత్సరం ఒక సరికొత్త సంచలనానికి వేదిక కాబోతోందా? అంటే రాజకీయ పరిశీలకులు ఔననే ఉంటున్నారు. 2024లో ఏపీ అసెంబ్లీ ఎన్నికలలో ఘోర పరాజయాన్ని ఎదుర్కొన్న జగన్, అలాగే 2023 తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలలో పరాజయాన్ని చవిచూసిన కేసీఆర్ ఇద్దరూ 2027 సంవత్సరంలో మళ్లీ ప్రజలతో మమేకమై పూర్వ వైభవాన్ని అందిపుచ్చుకోవాలన్నవ్యూహరచనలో ఉన్నారు.
సాక్షాత్తూ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ స్వయంగా రంగంలోకి దిగి ఆదేశాలు జారీ చేసినప్పటికీ.. క్షేత్రస్థాయిలో అధికారులు ఆ ఫైళ్లను పక్కన పెట్టేయడం రాజకీయ, అధికార వర్గాల్లో తీవ్ర కలకలం రేపుతోంది.
మహారాష్ట్ర రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా ప్రతిష్ఠాత్మకంగా ఏర్పాటు చేసిన 20 అడుగుల ఛత్రపతి శివాజీ మహారాజ్ విగ్రహ ఆవిష్కరణ వేడుకలో వివాదం తలెత్తింది. ఈ భారీ విగ్రహావిష్కరణ కార్యక్రమానికి రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి అయిన ఏక్‌నాథ్ షిండేకు కనీసం ఆహ్వానంఅందలేదు.
దేశరాజకీయాల్లో ప్రతిపక్ష ఇండియా కూటమి అత్యంత కీలకమైన అడుగులు వేస్తోంది.
రాజ్యసభ ఎంపీ అభ్యర్థులుగా తెలుగు దేశం పార్టీ తరుపున సానా సతీష్, భాష్యం రామకృష్ణ, చింతకాయల విజయ్ లు నామినేషన్ లు దాఖలు చేశారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.