Publish Date:Feb 12, 2026
కేంద్ర ప్రభుత్వం కార్మిక, కర్షక వ్యతిరేక విధానాలకు నిరసనగా కార్మిక సంఘాలు హైదరాబాద్ నగరంలో భారీ ర్యాలీ నిర్వహించారు. కేంద్రం అమలు చేయాలని భావిస్తున్న నాలుగు లేబర్ కోడ్లను వెంటనే రద్దు చేయాలన్న డిమాండ్ తో జాతీయ స్థాయిలో పది కార్మిక సంఘాల ఐక్యవేదిక పిలుపు మేరకు జరుగుతున్న సార్వత్రిక సమ్మెలో భాగంగా కార్మిక సంఘాలు నగరంలో ర్యాలీ నిర్వహించారు భాగ్ లింగంపల్లిలోని ఆర్టీసీ కళాభవన్ నుంచి ఇందిరా పార్క్ ధర్నా చౌక్ వరకు సాగిన ఈ ర్యాలీలో వేలాది మంది కార్మికులు, సంఘాల నాయకులు, అసంఘటిత రంగ ప్రతినిధులు, ఆటో యూనియన్ సభ్యులు పాల్గొన్నారు.
గురువారం (ఫిబ్రవరి 12) ఉదయం నుంచే ఆర్టీసీ కళాభవన్ ప్రాంగణం కార్మికులతో కిక్కిరిసిపో యింది. వివిధ రంగాలకు చెందిన కార్మికులు తమ తమ జెండాలు, బ్యానర్లతో అక్కడికి చేరుకున్నారు. ర్యాలీ ఆసాంతం లేబర్ కోడ్లు వెంటనే రద్దు చేయాలి, కార్మిక హక్కులు కాపాడాలి, మోడీ డౌన్ డౌన్ నినాదాలతో మార్మోగింది. నాలుగు లేబర్ కోడ్లు కార్మికుల ఉద్యోగ భద్రతను దెబ్బతీసేలా ఉన్నాయని కార్మిక సంఘాల నేతలుఆరోపించారు. శాశ్వత ఉద్యోగాల స్థానంలో కాంట్రాక్టు విధానాన్ని ప్రోత్సహించేలా నిబంధనలు ఉన్నాయని, కార్మికుల హక్కులను ఇవి పరిమితం చేసే ప్రమాదం ఉందని పేర్కొ న్నారు. వేతన భద్రత, సామాజిక భద్రత, ట్రేడ్ యూనియన్ హక్కులను కాలరాసే విధంగా ఇవి ఉన్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు.
అసంఘటిత రంగ కార్మికులు మాట్లాడుతూ ఇప్పటికే తక్కువ వేతనాలు, అస్థిర ఉద్యోగాలతో ఇబ్బందులు పడుతున్నామని, కొత్త కోడ్లు అమల్లోకి వస్తే తమ పరిస్థితి మరింత దారుణమవుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. ఆటో యూనియన్ ప్రతినిధులు కూడా తమ సమస్యలను ప్రస్తావిస్తూ, కార్మికులకు అనుకూలంగా చట్టాలు ఉండాలని డిమాండ్ చేశారు. ఇందిరా పార్క్ ధర్నా చౌక్ వద్ద జరిగిన సభలో పలువురు నాయకులు ప్రసంగించారు. కార్మికుల ఐక్యతే ప్రభుత్వాలకు హెచ్చరిక అని పేర్కొన్నారు. కార్మికుల అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకోకుండా ఏకపక్షంగా చట్టాలు తీసుకురావడం తగదని విమర్శించారు. కేంద్ర ప్రభుత్వం వెంటనే కార్మిక సంఘాలతో చర్చలు జరిపి కోడ్లను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. డిమాండ్లు నెరవేరకపోతే దేశవ్యాప్తంగా మరింత తీవ్రస్థాయిలో ఆందోళనలు చేపడతామని హెచ్చరిం చారు. ర్యాలీ సందర్భంగా పోలీసులు విస్తృత భద్రతా ఏర్పాట్లు చేశారు.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/protest-against-labour-codes-36-213945.html
ఉత్తరప్రదేశ్ లోని కాన్పూర్ దేహత్ జిల్లాలో అత్యంత విచిత్రమైన, సమాజాన్ని నివ్వెరపరిచే ఘటన ఒకటి వెలుగులోకి వచ్చింది.
హైదరాబాద్లో ఆహార భద్రత, ప్రజారోగ్య పరిరక్షణ లక్ష్యంగా పనిచేస్తున్న H-FAST (Hyderabad Food Adulteration Surveillance Team) బృందం మృగశిర కార్తి రోజున భారీ ఆపరేషన్ నిర్వహించారు.
కాచిగూడ పోలీస్ స్టేషన్ పరిధిలో నమోదైన బీటెక్ విద్యార్థి అదృశ్యం కేసు విషాదాంతమైంది.
క్రికెట్ ప్రపంచంలో సరికొత్త చరిత్ర సృష్టించబడింది.
నేటి ఆధునిక కాలంలో ఐదెంకల జీతం వస్తే జీవితం ఎంతో విలాసవంతంగా ఉంటుందని చాలా మంది భావిస్తారు.
ఇద్దరు మేజర్లు పరస్పర అంగీకారంతో శారీరక సంబంధాలు కలిగి ఉండటం చట్టప్రకారం నేరం కాదని దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు స్పష్టం చేసింది.
మేడిపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని చెంగిచెర్ల ఎంఎల్ఆర్ కాలనీకి చెందిన రసూల్ జాకబ్ 2024లో అల్వాల్కు చెందిన మేఘనను వివాహం చేసుకున్నాడు. వివాహ సమయంలో అమ్మాయి తల్లిదండ్రులు భారీగా కట్నకానుకలు ఇచ్చి ఘనంగా వివాహం జరిపించారు. పెళ్లి తర్వాత భార్యాభర్తల మధ్య తరచూ విభేదాలు తలెత్తడంతో పరిస్థితి దిగజా రింది. రోజురోజుకీ గొడవలు పెరిగిపోతూ ఉండడంతో మేఘన ఈ క్రమంలో జాకబ్తో పాటు అతని కుటుంబ సభ్యులపై పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది.
గర్భాలయం, అర్థమండపం, మహామండపలతో, కప్పుల వరకు ఉన్న ఆలయం, కాకతీయ వాస్తు శిల్పానికి అర్థం పడుతుందనీ, కప్పురాళ్లు, గోడలు కూలిపోయి, చుట్టూ చెట్లు పొదలు పెరిగి, ఆలయం ఉనికికే ప్రమాదం ఏర్పడిందని, ఆలయాన్ని ఊడదీసి, ఆధునిక పునాదులపై పునర్నిర్మించి, వారసత్వ సంపదగా కాపాడి, భవిష్యత్ తరాలకు అందించాలని గ్రామ ప్రజలకు, జిల్లా యంత్రాంగానికి శివనాగిరెడ్డి విజ్ఞప్తి చేశారు.
విమానాన్ని వెంటనే తిరిగి విమానాశ్రయానికి మళ్లించి, భద్రతా నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించిన ఆ మహిళను అవుట్పోస్ట్ పోలీస్ సిబ్బందికి అప్పించారు. వారు ఆమెను అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు. ఈ ఘటనలో ప్రయాణికులకు, విమానానికి ఎలాంటి ప్రమాదం జరగలేదు.
ప్రముఖ అంతర్జాతీయ వార్తా సంస్థ ఎన్బీసీ ప్రతిష్టాత్మకంగా నిర్వహించే మీట్ ది ప్రెస్ టాక్ షో లైవ్ ఇంటర్వ్యూలో ఊహించని హైడ్రామా చోటుచేసుకుంది. ఇంటర్వ్యూ మధ్యలోనే ట్రంప్ తీవ్ర ఆగ్రహానికి గురై.. షో హోస్ట్, సీనియర్ మహిళా యాంకర్ క్రిస్టెన్ వెల్కర్పై దారుణమైన పదజాలంతో విరుచుకుపడ్డారు. తన చేతిలో ఉన్న మైక్రోఫోన్ను లైవ్ కెమెరాల ముందే నేలపైకి విసిరికొట్టి, ఇంటర్వ్యూను మధ్యలోనే బహిష్కరించి వెళ్లిపోయారు. ఈ ఉదంతం ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా పెను దుమారం రేపుతోంది.
బీహార్ లోని ఔరంగాబాద్ సమీపంలో జాతీయ రహదారి పై వీరు ప్రయాణిస్తున్న బస్సును గుర్తు తెలియని భారీ వాహనం ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో బస్సు ఎడమ వైపు భాగం పూర్తిగా నుజ్జునుజ్జైంది. దీంతో బస్సు ఎడమ వైపున సీట్లలో కూర్చున్న ముగ్గురు యాత్రికులు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు.
మాసిమ్ పట్టణానికి నైరుతి దిశగా సుమారు 32 కిలోమీటర్ల దూరంలో, సముద్ర ఉపరితలం నుంచి 33 కిలోమీటర్ల లోతులో భూకంప కేంద్రం ఉన్నట్లు శాస్త్రవేత్తలు గుర్తించారు. ఇంత భారీ స్థాయిలో సముద్ర గర్భంలో పలకల కదలికలు సంభవించడంతో, సముద్ర అలలు భారీ ఎత్తున ఎగసిపడే ప్రమాదం ఉందని విశ్లేషించారు.
ఇజ్రాయెల్ లక్ష్యంగా ఇరాన్ వరుస క్షిపణి దాడులకు పాల్పడింది. దీంతో ఒక్కసారియా వెస్ట్ ఆసియా అంతటా యుద్ధ మేఘాలు కమ్ముకున్నాయి. ఈ ఆకస్మిక క్షిపణి దాడులతో జనం తీవ్ర భయాందోళనల మధ్య ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని సురక్షిత షెల్టర్లలోకి పరుగులు తీశారు.