ఆంధ్రప్రదేశ్ ఎన్నికలలో అత్యంత ప్రభావమంతమైన ఆంశం ఏదైనా ఉందంటే అది అమరావతి రాజధాని మాత్రమే. అమరావతిని నిర్వీర్యం చేసి మూడు రాజధానుల నాటకానికి తెరలేపిన జగన్ పై రాష్ట్ర ప్రజలు తీవ్ర ఆగ్రహంతో ఉన్నారనడంలో ఎటువంటి సందేహమూ లేదు. ముఖ్యంగా రాజధాని ప్రాంతంలో ప్రచారానికి వెడుతున్న వైసీపీ నేతలు, అభ్యర్థులను ఈ అంశంపై జనం నిలదీస్తున్నారు. ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇదే పరిస్థితి రాష్ట్ర మంతటా ఉంది.
అటువంటిది.. రాజధాని ప్రాంతంలోనే గత నాలుగేళ్లుగా జగన్ మూడు రాజధానుల నాటకానికి మద్దతుగా రాష్ట్రానికి మూడు రాజధానులు కావాల్సిందే అంటూ కొందరు టెంటు వేసుకుని ఉద్యమం చేస్తున్నారు. నాలుగేళ్లుగా కొనసాగుతున్న వారి ఆందోళనకు కర్త, కర్మ, క్రయ అంతా వైసీపీయేనని విమర్శలున్నాయనుకోండి అది వేరే సంగతి. జగన్ కోసం, జగన్ చేత, జగనే నడిపిస్తున్న ఉద్యమంగా మూడు రాజధానుల ఉద్యమాన్ని పరిశీలకులు అభివర్ణిస్తున్నారు. ఆ ఉద్యమ కారులు మందడం గ్రామంలో టెంటు వేసుకుని మరీ గత నాలుగేళ్లుగా మూడు రాజధానులు కావాలంటూ ఆందోళన చేస్తున్నారు. ఆ మందడం గ్రామం మంగళగిరి నియోజకవర్గ పరిధిలోకి వస్తుంది. గత ఎన్నికలలో ఈ నియోజకవర్గం నుంచి పోటీ చేసిన నారా లోకేష్ 5, 337 ఓట్ల తేడాతో అప్పటి వైసీపీ అభ్యర్థి ఆళ్ల రామకృష్ణారెడ్డి చేతిలో పరాజయం పాలైన సంగతి తెలిసిందే. అయితే ఆ క్షణం నుంచీ నారా లోకేష్ మంగళగిరి నియోజకవర్గాన్నే తన కార్యక్షేత్రంగా మలచుకుని అక్కడి జనంతో మమేకమయ్యారు. రానున్న ఎన్నికలలో నారా లోకేష్ మంగళగిరి నియోజకవర్గం నుంచి తెలుగుదేశం అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. ఎన్నికల ప్రచారంలో ఆయన దూసుకుపోతున్నారు. తన ప్రచారంలో భాగంగా అన్ని వర్గాల ప్రజల మన్ననలూ పొందుతున్నారు. అందరినీ కలుపుకుని పోతూ ముందుకు సాగుతున్నారు. తటస్థులు సైతం ఆయనకు మద్దతుగా బయటకు వచ్చి ప్రచారం చేస్తున్నారు.
అటువంటి లోకేష్ కు మద్దతుగా మూడు రాజధానుల కోసం గత నాలుగేళ్లుగా ఉద్యమం కొనసాగిస్తున్న రైతులు తమ ఉద్యమాన్ని విరమించారు. మందడంలో మూడు రాజధానులకు అనుకూలంగా ఏర్పాటు చేసిన టెంట్ ను తొలగించారు. ఉద్యమ నిర్వాహకులందరూ లోకేష్ సమక్షంలో మంగళవారం తెలుగుదేశం పార్టీలో చేరారు. సరిగ్గా ఎన్నికల వేళ.. జగన్ కు జగన్ సర్కార్ కు మద్దతుగా గత నాలు గేళ్లుగా మూడు రాజధానులకు అనుకూలంగా ఆందోళన చేస్తున్న వారు.. తెలుగుదేశం గూటికి చేరి అమరావతికి జై కోట్టడం ప్రాధాన్యత సంతరించుకుంది.
గత ఎన్నికలలో లోకేష్ కు ప్రత్యర్థిగా నిలిచి విజయం సాధించిన ఆళ్ల రామకృష్ణా రెడ్డికి విజయావకాశాలు లేవని భావించిన జగన్ లోకేష్ ను ఓడించడమే లక్ష్యంగా నియోజకవర్గంలో బీసీ మహిళలను వైసీపీ అభ్యర్థిగా రంగంలోకి దింపారు. అయితే సర్వేలన్నీ భారీ మెజారిటీతో లోకేష్ విజయం సాధించడం ఖాయమని చెబుతున్నాయి. తాజాగా మూడు రాజధానులంటూ ఉద్యమించిన వారంతా ఆ ఉద్యమానికి తెర దించి లోకేష్ కు మద్దతుగా ఆయన సమక్షంలో తెలుగుదేశం పార్టీలో చేరడంతో ఆక్కడ వైసీపీ పనైపోయిందనే భావన సర్వత్రా వ్యక్తం అవుతోంది.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/pro-three-capitals-protest-tent-close-25-173224.html
టీవీకే అధినేత విజయ్కు కాంగ్రెస్ మద్దతు తెలపడంపై ఆగ్రహంగా ఉన్న డీఎంకే.. కాంగ్రెస్కు కటీఫ్ చెప్పేసింది. మారిన రాజకీయ పరిస్థితుల దృష్ట్యా, లోక్సభలో తమ పార్టీ సభ్యులకు కాంగ్రెస్ ఎంపీలతో కాకుండా విడిగా సీటింగ్ కేటాయించాలని డీఎంకే ఎంపీ కనిమొళి స్పీకర్ ఓం బిర్లాకు లేఖ రాశారు.
తాజా సమాచారం ప్రకారం.. విజయ్ తన పార్టీకి ఉన్న బలానికి తోడుగా మరో మూడు పార్టీల మద్దతును కూడగట్టుకున్నారు. ఆ పార్టీల మద్దతుతో అధికారం చేపట్టడానికి అవసరమైన మ్యాజిక్ ఫిగర్ 118ని ఆయన సాధించారు.
తమిళనాడులో ఇటీవల జరిగిన ఎన్నికల తర్వాత, విజయ్ నేతృత్వంలోని టీవీకే పార్టీ ప్రభుత్వ ఏర్పాటుకు సిద్ధమవ్వగా.. మెజారిటీ నిరూపణ విషయంలో రాజేంద్ర విశ్వనాథ్ అర్లేకర్ కచ్చితమైన నిబంధనలు పాటించాలని పట్టుబడుతున్నారు. విజయ్ కు తన పార్టీ ఎమ్మెల్యేలు 107 మందికి అదనంగా కాంగ్రెస్ నుంచి గెలిచిన ఐదుగురు ఎమ్మెల్యేల మద్దతు కూడా ఉంది.
పదవి నుంచి తొలగించిన అనంతరం ఎస్వీఎస్ఎన్ వర్మ తీవ్ర భావోద్వేగానికి లోనయ్యారు. పార్టీ తీసుకున్న ఈ నిర్ణయం తనకు ముందే తెలుసని, నాయకత్వం నుంచి సమాచారం అందిందని చెప్పారు. అయితే పార్టీ కోసం ఎన్నో ఏళ్లుగా కష్టపడి.. క్షేత్రస్థాయిలో కేడర్ను కాపాడుకుంటూ వచ్చిన తనకు ఈ పరిణామం మనస్తాపానికి గురిచేసిందన్న ఆవేదన కూడా వ్యక్తం చేశారు.
బాబు కూటమిని ఎందుకంత విలువైనదిగా భావిస్తున్నారంటే.. కారణం వైసీపీ. ఆ పార్టీ కూటమి ఎప్పుడెప్పుడు చీలిపోతుందాని కాచుకుని కూర్చుని ఉంది. ఏ అవకాశం వచ్చినా వారు వదిలిపెట్టినట్టే కనిపించదు. మొన్న కోట వినుత ఘటన, నిన్న అరవ శ్రీధర్ వ్యవహారం, ఇవాళ వర్మ ఇష్యూ.. ఇలా సమయం దొరికినపుడల్లా ఆయా అంశాలను బాగా హైలెట్ చేసి.. కూటమిలో ఏదో ఒక చిచ్చు రాజేయాలని చూస్తోంది వైసీపీ అధినాయకత్వం.
అతి కొద్ది మంది నేతలు జగన్ ప్రకటనను సమర్దిస్తూ.. అనుకూల ప్రకటనలు చేస్తుండగా.. మెజారిటీ లీడర్, క్యాడర్ మాత్రం జగన్ నిర్ణయంపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.
తెలుగువన్ వాస్తవ వేదికలో ప్రస్తుత జాతీయ, ప్రాంతీయ రాజకీయ పరిస్థితులపై విస్తృత చర్చ జరిగింది.
తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ఆ రాష్ట్ర రాజకీయాల్లో పెను సంచలనాన్ని సృష్టించాయి.
టీవీకే అధినేత విజయ్తో భేటీ అనంతరం రాజ్ భవన్ ఒక అధికారిక ప్రెస్ నోట్ విడుదల చేసింది. అసెంబ్లీలో ప్రభుత్వం ఏర్పాటు చేయాలంటే ఉండాల్సిన సంఖ్యాబలంపై గవర్నర్.. విజయ్కు మార్గనిర్దేశం చేశారు. కేవలం అతిపెద్ద పార్టీగా ఉండటమే కాకుండా, సభలో తగినంత మంది ఎమ్మెల్యేల మద్దతు ఉన్నట్లు ఆధారాలు చూపాలని సూచించారు.
పిఠాపురంలో ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలో చంద్రబాబు ఫొటోలేదని ఆరోపిస్తూ.. మాజీ ఎమ్మెల్యే వర్మ అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ క్రమంలో జనసేన నేత, మాజీ ఎమ్మెల్యే దొరబాబు జోక్యం చేసుకోవడంతో వాగ్వాదం చోటు చేసుకుంది. వర్మ దురుసు వ్యాఖ్యలపై పార్టీలో అంతర్గతంగా చర్చించిన అధిష్టానం.. వర్మ వ్యవహారాన్ని తప్పుబట్టింది. ఇంతలోనే వర్మను ఇంచార్జ్ పదవి నుంచి తొలగించడం చర్చనీయాంశంగా మారింది.
రాష్ట్రంలో కొత్త ప్రభుత్వ ఏర్పాటుకు డీఎంకే ఏ విధంగానూ అడ్డుపడబోదన్నారు. రాష్ట్రంలో మరోసారి ఎన్నికలు రావాలని గానీ, రాజ్యాంగ సంక్షోభం తలెత్తాలనీ కానీ తాము కోరుకోవడం లేదన్నఆయన.. ప్రజాతీర్పునకు అనుగుణంగానే డీఎంకే నడుచుకుంటున్నదన్నారు.
గతంలో విజయ్కు ఉన్న ప్రాణహాని హెచ్చరికలు.. ఆయన పాపులారిటీని దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం సాయుధ పోలీసులతో కూడిన భద్రతను ఏర్పాటు చేసింది. అయితే.. తాజాగా నిర్వహించిన భద్రతా సమీక్షలో భాగంగా ఆయనకు ఇకపై అదనపు సెక్యూరిటీ అవసరం లేదని అధికారులు భావించినట్లు తెలుస్తోంది.
తాజా ఎన్నికల ఫలితాల్లో నటుడు విజయ్ నేతృత్వంలోని తమిళగ వెట్రి కళగం (టీవీకే) 108 స్థానాలతో సింగిల్ లార్జెస్ట్ పార్టీగా అవతరించిన సంగతి తెలిసిందే. అయితే.. ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన 118 మంది ఎమ్మెల్యేల మద్దతు ఆ పార్టీకి ఇంకా లభించలేదు. కాంగ్రెస్తో కలిపి విజయ్ బలం ప్రస్తుతం 112కు చేరినప్పటికీ.. మేజిక్ ఫిగర్కు ఇంకా ఆరు అడుగుల దూరంలో ఉంది.