ఘనత చాటుకుంటే సరిపోదు.. కళ్లకూ కనబడాలి!

Publish Date:May 1, 2023

Advertisement

స్వరాష్ట్రం సాధనతో పాటు ..తెలంగాణ పునర్నిర్మాణలంలోనూ పురోగమనం.. చెప్పేది ఎక్కువ చేసేది తక్కువ అన్నట్లుగా సాగుతోంది. అభివృద్ధి, సంక్షేమం గురించి అధికార బీఆర్ఎస్ ఎంతగా ప్రచారం చేసుకుంటున్నా.. అంతకు మించి రాష్ట్రంలో అవినీతి గురించిన విమర్శలు వినవస్తున్నాయి. మొత్తంగా తెలంగాణ ఆవిర్భావం తరువాత రాష్ట్రంలో జరిగిన అభివృద్ధితో సమానంలో వైఫల్యాలూ ఉన్నాయి. అయితే ప్రభుత్వం తెలంగాణ మోడల్ అంటూ చేసుకుంటున్న ప్రచారం.. విపక్షాల అవినీతి ఆరోపణల ముందు వెలవెలబోతోంది.

ముఖ్యంగా టీఎస్పీఎస్పీ పేపర్ లీకేజీ, ఢిల్లీ మద్యం కుంభకోణంలో కవితపై ఆరోపణలు, ఈడీ, సీబీఐ విచారణల తరువాత కేసీఆర్ ప్రభుత్వ ప్రతిష్ట మసకబారిందనడంలో సందేహం లేదు. అయితే పొరుగున ఉన్న ఏపీతో పోలిస్తే తెలంగాణ రాష్ట్ర విభజన తరువాత అభివృద్ధి, సంక్షేమం విషయంలో కచ్చితంగా మెరుగ్గా ఉందని చెప్పడానికి మాత్రం ఇసుమంతైనా సందేహం అవసరం లేదు. అందుకే తెలంగాణ మోడల్ అంటూ  సొంత భుజాలను తడుము కోవడం కంటే ముందే తెలంగాణ మంత్రులు ఏపీలో అభివృద్ధి లేమి, అందని సంక్షేమం గురించి ముందుగా ప్రస్తావిస్తూ వస్తున్నారు.  ఇకపోతే తెలంగాణ సచివాలయ నిర్మాణం, ప్రారంభాన్ని మహోజ్వల ఘట్టంతో పోలుస్తూ ముఖ్యమంత్రి కేసీఆర్ సహా, బీఆర్ఎస్ మంత్రులు, ఎమ్మెల్యేలు, శ్రేణులు చేస్తున్న హడావుడి, ఆర్బాటం, సచివాలయంపై అక్కడ పని చేయాల్సిన ఉద్యోగులే పెదవి విరవడంతో తుస్సుమన్నట్లైంది.

ఉద్యోగులకు పని చేసుకోవడానికి అవసమైనంత విశాలంగా వివిధ శాఖలకు కేటాయించిన ప్రదేశం లేదని ఉద్యోగులు సచివాలయ ప్రారంభానికి ముందే అసంతృప్తి వ్యక్తం చేశారు.  వాస్తవానికి కేసీఆర్ ఏం చేసినా ఘనంగా చేస్తారు. ఆర్భాటంగా చేస్తారు. గోటితో పోయే దానికి గొడ్డలి ఉపయోగిస్తారు. అలాగే  కొత్త సచివాలయ నిర్మాణం విషయంలో అవసరానికి మించి ఆర్భాటం చేశారు. అత్యాధునిక హంగులతో సర్వాంగ సుందరంగా రూపుదిద్దుకుందంటూ అడ్వర్టైజ్ మెంట్లు గుప్పించారు.  

నిర్మాణ సమయంలో వీలైనన్ని సార్లు సందర్శించి పర్యవేక్షించారు. అలా పర్యవేక్షించిన ప్రతి సారీ కొత్త కొత్త సూచనలు చేశారు.  మొత్తానికి  265 అడుగుల ఎత్తుతో 28 ఎకరాల్లో నిర్మించారు. మొత్తం 10,51,676 చదరపు అడుగుల నిర్మాణ విస్తీర్ణం ఉంది. మొత్తం ఏడు అంతస్తులు నిర్మించగా.. ఒక్కో అంతస్తు 14 అడుగుల ఎత్తు ఉంటుంది. తొలి రెండు అంతస్తుల్లో సాధారణ పరిపాలన, ఆర్థిక శాఖ కార్యాలయాలు ఉంటాయి. 3 నుంచి 5 అంతస్తుల్లో మంత్రుల కార్యాలయాలు, ఇతర శాఖల కార్యాలయాలు ఏర్పాటు చేశారు. 100 ఏళ్ల అవసరాలను దృష్టిలో ఉంచుకుని తెలంగాణ కొత్త సచివాలయం నిర్మించినట్లు  కేసీఆర్ చెబుతున్నారు. ఇదంతా బాగానే ఉన్నా.. ఒక్క వర్షానికే నీరు చేరడం, ఫిల్లర్ బీటలు వారడం, సచివాలయం వ్యయంపై విపక్షాలు చేస్తున్న విమర్శలకు సమాధానం ఇవ్వకపోవడంతో  కేసీఆర్ చెబుతున్నంత హైప్ కొత్త సచివాలయానికి రావడం లేదు.  

ఇక అన్నిటికీ మించి తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి సోమవారం నాడు సచివాలయంలోకి ప్రవేశించకుండా పోలీసులు అడ్డుకోవడం కూడా విమర్శలకు తావిస్తోంది. ఔటర్ రింగ్ రోడ్డు టెండర్లకు సంబంధించిన సమాచారాన్ని తెలుసుకునేందుకు రేవంత్ సచివాలయానికి బయలు దేరగా ఆయనను పోలీసులు టెలిఫోన్ భవన్ వద్దే అడ్డుకున్నారు.   ఎంపీనైన తననే అడ్డుకుంటున్నారంటే ఇక సామాన్యులను అసలు సచివాలయం వైపు కన్నెత్తి చూడనిస్తారా అని ప్రశ్నించారు. రేవంత్ సచివాలయానికి బయలుదేరడం, ఆయనను పోలీసులు నిలువరించడం అటుంచి.. ఏకంగా సచివాలయ విజిటర్స్ గేటునే ప్రారంభం జరిగిన మరుసటి రోజునే మూసి వేయడం విమర్శలకు తావిస్తోంది.    

By
en-us Political News

  
బినెట్ నుంచి ఉద్వాసనకు గురైన కొండా సురేఖకు కేబినెట్ హోదాతో కీలక పదవిని అప్పగించే అవకాశాలున్నాయన్న ప్రచారం జరుగుతోంది.  ఈ విషయమై కొండా సురేఖకు పార్టీ హైకమాండ్ నుంచి స్పష్టమైన హామీ లభించినట్లు చెబుతున్నారు.
బీసీలపై కపట ప్రేమ ఎందుకు? కేసీఆర్‌ను నిలదీసిన పీసీసీ చీఫ్..!
మాజీ మంత్రి కొండా సురేఖకు మద్దతుగా అభిమానులు, కాంగ్రెస్ కార్యకర్తలు పెద్ద సంఖ్యలో వరంగల్‌కు తరలివచ్చారు.
తెలంగాణ రాజకీయాల్లో ప్రస్తుతం తీవ్ర చర్చనీయాంశంగా మారిన కొండా సురేఖ ఉదంతంలో కీలక పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి.
ఎర్రవల్లి ఘటన నుండి ఫ్లాష్ సర్వే వరకు..బయటపడ్డ అసలు నిజాలు..?
చంద్రబాబు అక్రమ అరెస్ట్ మూడేళ్లు పూర్తవుతున్న సందర్భంగా ప్రతి ఒక్కరూ తమ ఇళ్ల వద్ద,  పార్టీ కార్యాలయాల్లో యాభై మూడు దీపాలను వెలిగించాలని  కోరారు.
తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్‌పై అనుచిత, అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారన్న ఆరోపణలతో అరెస్టయిన ఇద్దరు బీఆర్ఎస్ ఎమ్మెల్సీలకు నాంపల్లి న్యాయస్థానం బెయిల్ మంజూరు చేసింది
టీడీపీ కేంద్ర కార్యాలయంలో రెండో రోజు నిర్వహిస్తున్న లీడర్‌షిప్ కాంక్లేవ్‌లో పొలిటికల్ కమ్యూనికేషన్ అండ్ పబ్లిక్ ఓరియంటేషన్ అంశంపై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మంత్రి నారా లోకేష్ మాట్లాడారు.
అసలాయన రాజకీయ పార్టీ ఏర్పాటు ఉద్దేశమేంటో? లక్ష్యమేంటో ఆయనకైనా స్పష్టత ఉందా అనిపించేలా ఆయన మీడియా సమావేశం సాగింది.  
ఇటు రాష్ట్రంలోనూ, అటు కేంద్రంలోనూ కూడా తెలుగుదేశం పార్టీ ఎన్డీయేలో కీలకమైన భాగస్వామ్య పక్షంగా ఉన్న నేపథ్యంలో తన పోరాటాలకు ఇండియా కూటమి అండ అవసరమని భావిస్తున్నారని చెబుతున్నారు
తన రాజకీయ విజయానికి మహిళలే ప్రధాన కారణమని ఉద్ఘాటించిన  విజయ్, మహిళలకు తగిన గౌరవం ఇవ్వాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు.  మన ఇంట్లోనూ తల్లులు, చెల్లెళ్లు ఉంటారు. మహిళలను ఎవరైనా అవమానిస్తే చట్టం చూస్తూ ఊరుకోదని విజయ్ హెచ్చరించారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.