కాంగ్రెస్ గూటికి ప్రవీణ్ ప్రకాష్.!

Publish Date:Aug 21, 2026

Advertisement

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లోనూ, ఐఏఎస్ వ్యవస్థలోనూ అత్యంత ప్రభావమంతమైన అధికారిగా గుర్తింపు పొందిన 1994 బ్యాచ్ ఏపీ కేడర్ ఐఏఎస్ అధికారి ప్రవీణ్ ప్రకాష్ జగన్ హయాంలో వ్యవహరించిన తీరు కారణంగా ప్రతిష్ఠను మసకబార్చుకున్నారు. చివరికి స్వచ్ఛంద విరమణ తీసుకున్నారు. జగన్ హయాంలో తన పరిధులను మరిచి వ్యవహరించిన ఆయన తీరా వైసీపీ 2024 ఎన్నికల్లో పరాజయాన్ని మూటగట్టుకు అధికారం కోల్పోయిన తరువాత.. తప్పులను గ్రహించి.. ఆ తప్పులకు శిక్ష తప్పదన్న భయంతో వీఆర్ఎస్ తీసుకున్నారు.  

సెప్టెంబర్ 30, 2024న ఆయన ఇలా రాజీనామా చేయగానే తెలుగుదేశం కూటమి ప్రభుత్వం అలా  ఆమోదించేసింది. అప్పుడు గానీ ఆయనకు తాను చేసినది తొందరపాటు చర్య అని గ్రహింపునకు రాలేదు. రాజీనామాను వెనక్కు తీసుకుని తిరిగి సర్వీసులో చేరుదామని ఆయన చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. దీంతో చేసేదేమీ లేక ఆయన తన స్వరాష్ట్రమైన యూపీకి చేరుకున్నారు. ఇప్పుడు తాజాగా ఆయన కాంగ్రెస్ తీర్ధం పుచ్చుకున్నారు.  

 ఏపీలో   2019 నుండి 2021 వరకు ప్రవీణ్ ప్రకాష్  అప్పటి ముఖ్యమంత్రి జగన్ కు ముఖ్య కార్యదర్శిగా వ్యవహరించారు. ఆ సమయంలో ఆయన ముఖ్యమంత్రి సీఎంవోలో  క్రియాశీల  అధికారిగా, ప్రభుత్వ నిర్ణయాల్లో కీలక పాత్ర పోషించిన  మోస్ట్ పవర్ ఫుల్ బ్యూరోక్రాట్‌గా పేరొందారు. జగన్‌ హయంలో ఆయన ఓ సమర్ధుడైన ఐఏఎస్ అధికారిగా కంటే జగన్‌కు, వైసీపీ నమ్మకస్తుడైన ఓ పొలిటికల్ అసిస్టెంట్ గా గుర్తింపు తెచ్చుకున్నారు.  ఆయన పాఠశాల విద్యాశాఖ ముఖ్య కార్యదర్శిగా ఉన్నప్పుడు రాష్ట్రంలో ఉపాధ్యాయులు, ప్రధానోపాధ్యాయులతో వ్యవహరించిన తీరుతో తీవ్ర విమర్శల పాలయ్యారు.   ఆ తరువాత వారికి క్షమాపణ చెప్పారు.

ఇలా ఒకటనేంటి ఆయన తన చర్యలతో చేష్టలతో బోలెడంత అపఖ్యాతి మూటగట్టుకున్నారు. ఏపీ అసెంబ్లీ ఎన్నికల అనంతరం రాష్ట్రంలో  వైసీపీ ప్రభుత్వం దిగిపోయి తెలుగుదేశం కూటమి ప్రభుత్వం వచ్చిన తరువాత ప్రవీణ్ ప్రకాష్ కు ఎటువంటి పోస్టింగ్ ఇవ్వలేదు. దాదాపు మూడు నెలలు వేచి చూసి ప్రవీణ్ ప్రకాష్ చేసిన రాజీనామాను తెలుగుదేశం కూటమి ప్రభుత్వం ఆమోదించింది.  అటువంటి ప్రవీణ్ ప్రకాష్ తాజాగా కాంగ్రెస్ గూటికి చేరి ప్రత్యక్ష రాజకీయాలలోకి అడుగుపెట్టారు.  

Praveen Prakash join Congress, Ex IAS Praveen Prakash, Andhra Pradesh IAS VRS, UP Congress Politics, contravarsies, Ap Politics  

By
en-us Political News

  
ఇప్పటికే టీడీపీ తరఫున సీనియర్ నాయకుడు అశోక్ గజపతి రాజుకు గవర్నర్ పదవి దక్కిన సంగతి తెలిసిందే. సామాజిక, ప్రాంతీయ సమీకరణాలతో పాటు  రాజకీయ అనుభవాన్ని పరిగణనలోకి తీసుకుని ఆయనకు ఆ అవకాశం కల్పించారు.
ఈ ఫ్లెక్సీల్లో  జగన్ తో పాటు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్, కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్‌ల ఫోటోలు కూడా ఉన్నాయి బేగంపేట, పంజాగుట్ట, రాజ్‌భవన్ రోడ్డు, ఖైరతాబాద్ తదితర కీలక కూడళ్లలో ఇవి దర్శనమిస్తున్నాయి.
యితే లోకేష్ తనను తాను మేకోవర్ చేసుకోవడానికి ఆ ట్రోలింగ్ ను ఉపయోగించుకున్నారు. ఇప్పుడు వైసీపీయులకు లోకేష్ విషయంలో పన్నెత్తి మాట్లాడే అవకాశం కూడా దొరకడం లేదు. అందుకు భిన్నంగా వైసీపీ అధినేత జగన్ తన ప్రెస్ మీట్లలో అడ్డంగా దొరికిపోతూ విపరీతంగా ట్రోల్ అవుతున్నారు.
తమిళనాడు సీఎం విజయ్ కి   సన్నిహితుడు,  ఆయన వ్యక్తిగత జ్యోతిష్యుడు అయిన  రికీ రాధన్ పండిట్ వెట్రివేట్ తో భేటీ అయ్యారు. హైదరాబాద్ వచ్చిన ఆయన  కవితతో భేటీ అయ్యారు.
ఈ క్రమంలోనే జనసేన అధినేత, ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పార్టీ శ్రేణులకు దిశా నిర్దేశం చేస్తూ సీట్ల సర్దుబాటుపై  కీలక  వ్యాఖ్యలు చేశారు. పొత్తు ధర్మాన్ని కాపాడుకుంటూనే, జనసేన పార్టీకి తగిన ప్రాధాన్యం దక్కేలా  సీట్ల పంపకాల వ్యూహాన్ని అమలు చేయాలని పవన్  నిర్ణయించారు. 
మాజీ సీఎం జగన్‌కు ఏపీపీఎస్సీ అంటే తెలియదు, డీఎస్సీ అంటే ఏంటో అసలు తెలియదు.. రెండూ ఒకటే అంటున్నారని ఎద్దేవా చేశారు.    పరీక్షా విధానంపై ఆయనకు ఉన్న ఈ స్థాయి జ్ఞానం వల్లే ఆయన ఐదేళ్ల పాలనా కాలంలో ఒక్కటంటేఒక్క డీఎస్సీ కూడా నిర్వహించలేకపోయారని ఎద్దేవా చేశారు.
సుస్మిత పటేల్ కంటే ముందు పార్టీ సీనియర్ నాయకులు చిన్నారెడ్డి, మాజీ ముఖ్యమంత్రి పోచారం శ్రీనివాస్ రెడ్డి వంటి నేతలు కూడా రేవంత్  ప్రభుత్వ పనితీరు, హామీల అమలుపై బహిరంగంగానే తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసిన విషయాన్నిగుర్తు చేశారు.
దేవినేని ఉమాకు కూటమి సర్దుబాట్లలో భాగంగ 2024 ఎన్నికలలో పార్టీ టికెట్ దక్కలేదు. పార్టీ క్లిష్ట సమయాల్లో ముందుండి పోరాడిన దేవినేని ఉమాకు ఈ సారి ఎమ్మెల్సీ ఖాయమన్న భావన ఆయన అనుచరుల్లో బలంగా వ్యక్తమౌతోంది. మరోవైపు వంగవీటి రాధా పరిస్థితి కూడా దాదాపు ఇలాగే ఉంది. ఇటీవలి ఎన్నికల రాజకీయంలో ప్రత్యక్షంగా పోటీ చేసే అవకాశం రాని ఆయనకు, ఈసారి ఎమ్మెల్సీ స్థానం దక్కుతుందని ఆయన అనుచరులు ఆశిస్తున్నారు.
విద్యాహక్కు చట్టం  నిబంధనల ప్రకారం ప్రైవేట్ పాఠశాలల్లో బలహీన వర్గాలు, పేద కుటుంబాలకు చెందిన విద్యార్థులకు పాతిక శాతం సీట్లను తప్పనిసరిగా కేటాయించే ప్రక్రియను రాష్ట్రంలో   సమర్థవంతంగా అమలు చేస్తున్నామన్నారు.
బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి తర్వాత మమతా బెనర్జీ రాజకీయ భవిష్యత్తు మరియు టీఎంసీ   బలంపై  అనుమానాలు వ్యక్తమైన నేపథ్యంలో.. తాజాగా జరిగిన  బార్ కౌన్సిల్ ఎన్నికల టీఎంసీ విజయం మమతా బెనర్జీ, తృణమూల్ కాంగ్రెస్ శ్రేణుల్లోనూ ఆత్మవిశ్వాసాన్ని నింపిందనడంలో సందేహం లేదు.  
రాష్ట్ర రాజకీయాల్లో ఇప్పటికే పలు  కుటుంబాలు రాజకీయ ప్రాతినిధ్యం వహిస్తుండగా, ఆ జాబితాలోకి ఇప్పుడు  వర్ల కుటుంబం  చేరింది.వర్ల రామయ్య కుమారుడు వర్ల కుమార్ రాజా  పామర్రు ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తున్న సంగతి తెలిసిందే.  
జక్కిడి ప్రభాకర్ రెడ్డి పార్టీ క్రమశిక్షణను ఉల్లంఘించారన్న ఆరోపణలపై ఆయనను  పార్టీ  నుంచి  సస్పెండ్ చేస్తూ టీపీసీసీ క్రమశిక్షణ కమిటీ   ఆదేశాలు జారీ చేసింది. ఎల్బీ నగర్ లో  కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటూ, క్షేత్రస్థాయిలో బలమైన అనుచరవర్గం ఉన్న   సీనియర్ నేతపై సస్పెన్షన్ వేటు కాంగ్రెస్ లో కలకలం సృష్టించింది. 
ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్, రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడిని ఉద్దేశించి తీవ్ర అనుచిత వ్యాఖ్యలు చేశారు. మంత్రిని "ఆంబోతు" అని సంబోధిస్తూ ఆయన చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం రాజకీయ వర్గాల్లో పెద్ద దుమారాన్ని రేపుతున్నాయి.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.