Publish Date:May 22, 2022
వైసీపీ ఎమ్మెల్యసీ అనంత ఉదయ బాస్కర్ ( అనంతబాబు) డ్రైవర్ సుబ్రహ్మణ్యంది హత్యేనని పోలీసులు ఎట్టకేలకు కనిపెట్ట గలిగారు. పోస్టు మార్టం నివేదికలో సుబ్రహ్మణ్యంను కొట్టి చంపినట్లు తేలడంతో గత్యంతరం లేని పరిస్థితుల్లో సుబ్రహ్మణ్యంది హత్యేనని ప్రకటిస్తూ.. అనుమానాస్పద మృతి కేసును హత్య కేసుగా మార్చారు.
ఎ1గా అనంతబాబును చేర్చి హత్య కేసు నమోదు చేశారు. సుబ్రహ్మణ్యం మృతదేహం చూడగానే ఎవరికైరా ఆయన హత్యకు గురయ్యారని ఇట్టే అర్ధమైపోతుంది. ఘనత వహించిన పోలీసులకు మాత్రం అలా అనిపించలేదు. అందుకే అనుమానాస్పద మృతి కేసుగా తొలుత నమోదు చేశారు. హతుడి భార్య, విపక్షాలు మూడు రోజుల పాటు రాష్ట్రం మొత్తం అట్టుడికేలా ఆందోళనలు చేయడంతో ఇక తప్పదన్నట్లుగా పోలీసులు సుబ్రహ్మణ్యంది హత్యేనని ప్రకటించారు.
మామూలుగా అయితే సుబ్రహ్మణ్యం మృతదేహాన్ని కారులో హతుడి ఇంటి వద్దకు తీసుకువచ్చి కారును వదిలేసి వెళ్లిన రోజే ఎమ్మెల్సీ అనంతబాబును అరెస్టు చేసి ఉండాల్సింది. కానీ అధికార పార్టీ ఎమ్మెల్సీ కావడంతో పోలీసులు ఆ పని చేయలేదు. కళ్లెదుటే దర్జాగా తిరుగుతూ, వివామ కార్యక్రమాలకు హాజరౌతున్నా.. పోలీసులు మాత్రం పరారీలో ఉన్నాడంటూ అరెస్టు చేయడానికి ముందుకు రాలేదు. చివరికి హత్య కేసుగా నమోదు చేసే సమయానికి ఎమ్మెల్సీ నిజంగానే పరారీలో ఉన్నాడు. ఆచూకీ తెలియడం లేదు గాలిస్తున్నామంటూ మరో కథారచన ప్రారంభించారు.
ఘటన జరిగిన తరువాత ఎమ్మెల్సీ తన అధికార, అంగ బలంతో బాధిత కుటుంబ సభ్యులను నోరు తెరవద్దని బెదరింపులకు దిగినా, ఆ విషయాన్ని పోలీసులకు బాధిత కుటుంబ సభ్యులు ఫిర్యాదు చేసినా పోలీసులు పట్టించుకోలేదని విపక్షాలు విమర్శిస్తున్నాయి. అధికార పక్ష ఎమ్మెల్సీ కావడంతోనే పోలీసులు ఆయనను అరెస్టు చేయలేదనీ, చట్టం అధికార పక్షానికి చుట్టం అన్నట్లుగా పోలీసుల తీరు ఉందన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
పరారీలో ఉన్నాడంటూ చెబుతున్న పోలీసులు ఎమ్మల్సీ అనంతబానుబు అరెస్టు విషయంలో ఎలా వ్యవహరిస్తారో చూడాలి. ఇప్పటికే అనంతబాబు వర్గీయులు, ప్రభుత్వ పెద్దల నుంచి బాధిత కుటుంబానికి ప్రలోభాల పర్వం మొదలైంది. హతుడి భార్యకు ఆర్థిక సాయం, ప్రభుత్వ ఉద్యోగం అంటూ హామీల మీద హామీలు గుప్పిస్తూ, సుబ్రహ్మణ్యం హత్య విషయంలో ఆందోళనలకు ఫుల్ స్టాప్ పెట్టాలంటూ కండీషన్లు పెడుతున్నారు.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/police-declare-anantababu-a1-in-subrahmanyam-murder-case-25-136283.html
తమిళనాడు రాజకీయాలు ఎప్పుడూ ఆసక్తికరమైన మలుపులతో దేశవ్యాప్తంగా అందరి దృష్టిని ఆకర్షిస్తుంటాయి.
పవన్ కళ్యాణ్పై తెలంగాణలోని కొన్ని రాజకీయ పార్టీల నేతలు చేస్తున్న వ్యాఖ్యలపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పందించారు.
చివరి గింజ ధాన్యం కొంటామన్న కాంగ్రెస్ సర్కార్ అప్పులు చేయడంలో రేవంత్ ప్రభుత్వం రికార్డులు సృష్టిస్తోందని విమర్శించిన కేటీఆర్.. రెండున్నరేళ్లలో కాంగ్రెస్ ప్రభుత్వం 4 లక్షల కోట్ల రూపాయలు అప్పులు చేసిందన్నారు.
లంగాణ ప్రజల దశాబ్దాల కల సాకారమైన రోజున ఇక్కడి సెంటిమెంట్ను దెబ్బతీసేలా మాట్లాడటం సరికాదన్నారు. గతంలో తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడినప్పుడు తాను 11 రోజుల పాటు అన్నం తినలేదని పవన్ కల్యాణే స్వయంగా చెప్పారనీ.. అలాంటి వ్యక్తి మళ్లీ ఇప్పుడు తెలంగాణకు తాను వ్యతిరేకం కాదంటూ ద్వంద్వ వైఖరి ప్రదర్శిస్తున్నారని కేటీఆర్ అన్నారు.
జగన్ ఎప్పుడెప్పుడు అధికారం నుంచి దిగిపోతారా అని దేవుళ్లకు పూజలు చేశారు, శాపనార్థాలు పెట్టారు. జగన్ అధికారంలో ఉంటే తమ అమరావతి కలలు ఎప్పటికీ ఫలించవని ఆవేదన చెందారు. అలాంటిది, ఇప్పుడు అదే అమరావతికి చెందిన రైతులు తాడేపల్లిలోని వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నివాసానికి వెళ్లి, ఆయనతో సుదీర్ఘంగా భేటీ అయ్యారనే వార్త పొలిటికల్ సర్కిల్స్ నే కాకుండా సామాన్య ప్రజలను కూడా విస్మయానికి గురి చేసింది.
దశాబ్దాలుగా కోలీవుడ్ లో సంపాదించుకున్న తన స్టార్ డమ్ ను, ఫ్యాన్ ఫాలోయింగ్ ను ఓటు బ్యాంకుగా మార్చుకోవడంలో విజయ్ సఫలమయ్యారు. వీటన్నింటికీ తోడు తమిళనాట కరుణానిధి, జయలలిత వంటి దిగ్గజ నేతల మరణాల తర్వాత ఏర్పడిన రాజకీయ శూన్యం విజయ్ కు అనుకూలంగా మారింది.
ఈ విజయం కేవలం ఒక పదవి మాత్రమే కాదని, తన దశాబ్దాల కఠిన శ్రమకు, అంకితభావానికి దక్కిన అసలైన ఫలితమని ప్రకటించారు.
గతంలో మాతో పెట్టుకుంటే తెలంగాణ రాష్ట్రం వచ్చిందని, ఇప్పుడు పెట్టుకుంటే మూతిపళ్ళు రాలుతాయని కవిత హెచ్చరించారు. అంతేకాకుండా, అక్కడ ఆంధ్రప్రదేశ్లో రాజధాని కట్టుకోవడం చేతకానివాళ్ళు, తెలంగాణ నవనిర్మాణం చేస్తారా అంటూ ఆమె ఎద్దేవా చేశారు.
అరవ శ్రీధర్పై ఓ మహిళా ప్రభుత్వ ఉద్యోగి లైంగిక వేధింపుల ఆరోపణలు చేసిన నేపథ్యంలో జనసేన నాయకత్వం దీనిపై త్రిసభ్య కమిటీని ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే.
పోలీసులు జనసేన సభకు నో చెప్పారు. వేలాది మంది అభిమానులు, వందలాది మంది ముఖ్య నాయకులు హాజరయ్యే ఇటువంటి కీలక సభకు చివరి నిమిషంలో పర్మిషన్ నిరాకరించడంపై జనసేన తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తోంది.
అసెంబ్లీ ఎన్నికల్లో ఎదురైన ఘోర పరాజయం నుంచి కోలుకోకముందే.. పార్టీ అధినేత్రి మమతా బెనర్జీకి సొంత పార్టీ ఎమ్మెల్యేలు భారీ షాక్ ఇచ్చారు. ఎన్నికల్లో ఘోర పరాజయం పాలైన తర్వాత.. భవిష్యత్తు కార్యాచరణను చర్చించేందుకు ఏర్పాటు చేసిన కీలక సమావేశానికి పార్టీకి ఉన్న 80 మంది ఎమ్మెల్యేలలో ఏకంగా 60 మంది ఎమ్మెల్యేలు గైర్హాజరు అయ్యారు.
ప్రస్తుతం పవన్ కళ్యాణ్ ఎదుర్కొంటున్న ఈ రాజకీయ ఒత్తిడి, ప్రత్యర్థుల వ్యూహాలపై సీనియర్ రాజకీయ విశ్లేషకుడు భరద్వాజ తో తెలుగువ్ న్యూస్ చానల్ ప్రత్యేక ఇంటర్వూలో పలు ఆసక్తికర విషయాలు వెల్లడించారు. పవన్ కళ్యాణ్ను మానసికంగా, రాజకీయంగా దెబ్బతీసి కూటమి స్పిరిట్ను దెబ్బతీయడమే లక్ష్యంగా ఈ వ్యూహాత్మక దాడులు జరుగుతున్నాయని ఆయన అన్నారు.
తెలుగువన్ వేదికగా జరిగిన ప్రత్యేక విశ్లేషణా కార్యక్రమంలో రవిశంకర్ కంఠంనేని, డోలేంద్ర ప్రసాద్.. ప్రజాస్వామ్య దేశంలో రాజ్యాంగ రక్షకుడిగా ఉండాల్సిన స్థానంలో కూర్చున్న ఒక న్యాయమూర్తి, పౌరులను ముఖ్యంగా దేశ యువతను పారసైట్లు, కాక్రోచ్లు అనడం అత్యంత దురదృష్టకరమని అభిప్రాయపడ్డారు.