సీఎం రేవంత్‌కు చురకలంటించిన ప్రధాని మోదీ

Publish Date:May 10, 2026

Advertisement

 

సీఎం రేవంత్ రెడ్డి గారు నా మాటలు జాగ్రత్తగా వినండి మోదీ చురకలు...

గుజరాత్‌తో సమానంగా తెలంగాణకు నిధులు ఇస్తామని ప్రధాని మోదీ అన్నారు. హైదరాబాద్ పర్యటనలో భాగంగా సుమారు రూ.9,500 కోట్ల విలువైన వివిధ అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు మరియు ప్రారంభోత్సవాలు చేశారు. ఉమ్మడి ఏపీకి రైల్వే బడ్జెట్ల్‌లో రూ.1000 కోట్లు కూడా దక్కేవి కావు. ఇప్పుడు ఒక్క తెలంగాణకే రూ.5,500 కోట్లు కేటాయించం..సీఎం రేవంత్ రెడ్డి గారు ఇది వింటున్నారా అని మోదీ చురకలంటించారు. తెలంగాణ అభివృద్ధికి కేంద్రం భరోసా ఇస్తుందని తెలిపారు. హైవేలకు లక్షల కోట్లు ఖర్చు చేస్తోందని తెలిపారు. హైటెక్ సిటీలోని హెచ్‌ఐసీసీలో జరిగిన ఈ అధికారిక కార్యక్రమంలో రాష్ట్ర ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి, గవర్నర్ శివప్రతాప్ శుక్లాతో పాటు పలువురు కేంద్ర, రాష్ట్ర మంత్రులు పాల్గొన్నారు.

ఈ పర్యటనలో ప్రధానంగా రవాణా, పరిశ్రమలు, మరియు ఆరోగ్య రంగాలకు సంబంధించిన ప్రాజెక్టులపై ప్రధాని దృష్టి సారించారు. ఇందులో భాగంగా వరంగల్‌లో ప్రతిష్టాత్మకంగా నిర్మించనున్న 'పీఎం మిత్ర మెగా టెక్స్‌టైల్ పార్క్'ను మోదీ ప్రారంభించారు. ఇది రాష్ట్రంలోని చేనేత మరియు జౌళి రంగానికి గ్లోబల్ గుర్తింపు తీసుకువస్తుందని ప్రభుత్వం భావిస్తోంది. అలాగే జహీరాబాద్‌ పారిశ్రామిక ప్రాంత విస్తరణకు సంబంధించి కీలక శంకుస్థాపనలు చేశారు.

రహదారి మార్గాల అభివృద్ధిలో భాగంగా హైదరాబాద్‌-పనాజీ ఆర్థిక కారిడార్‌లో నేషనల్ హైవే-167 పనులకు మోదీ పునాది వేశారు. సుమారు రూ.3,180 కోట్లతో చేపట్టనున్న ఈ రహదారి పనులు పూర్తిస్థాయిలో అందుబాటులోకి వస్తే తెలంగాణ, కర్ణాటక మరియు గోవా రాష్ట్రాల మధ్య రవాణా వ్యవస్థ మెరుగుపడనుంది. వీటితో పాటు మల్కాపూర్‌లో ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ వారి గ్రీన్‌ఫీల్డ్ టెర్మినల్ మరియు కాజీపేట-విజయవాడ మధ్య ట్రిపులింగ్ రైల్వే పనులకు కూడా పచ్చజెండా ఊపారు. ఆరోగ్య రంగంపై ప్రత్యేక శ్రద్ధ చూపుతూ, హైటెక్ సిటీ ప్రాంతంలో అత్యాధునిక సౌకర్యాలతో కూడిన మల్టీ-సూపర్ స్పెషాలిటీ క్యాన్సర్ ఆసుపత్రిని ప్రధాని మోదీ దేశానికి అంకితం చేశారు. 
 

By
en-us Political News

  
 దేశ ప్రధాని నరేంద్ర మోదీ ఆదివారం భాగ్యనగరంలో పర్యటించారు
తెలంగాణ రాష్ట్ర సమగ్ర అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం పెద్ద మనసుతో సహకరించాలని ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి ప్రధానమంత్రి నరేంద్ర మోదీని కోరారు.
నేపాలీ పనిమనిషి కల్పన హత్యానంతరం నాగపూర్ రైలెక్కి పారిపోతూ, మార్గమధ్యంలోనే దిగిపోయిన పోలీసులకు టోకరా ఇచ్చింది.
తెలంగాణ పర్యటనలో భాగంగా దేశ ప్రధాని నరేంద్ర మోదీ ఆదివారం మధ్యాహ్నం హైదరాబాద్‌కు చేరుకున్నారు.
త‌మిళ మార్కు ద్ర‌విడ సంప్ర‌దాయాల‌కు టీవీకే విజ‌య్ చెక్ పెట్టేశారా?
తమిళనాడు నూతన ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన దళపతి విజయ్‌కు ప్రముఖ హీరోయిన్ త్రిష శుభాకాంక్షలు తెలిపారు.
తమిళనాడు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన విజయ్‌కి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శుభాకాంక్షలు తెలిపారు.
హైదరాబాద్ నగరం ప్రధాని నరేంద్ర మోదీ పర్యటన నేపథ్యంలో హై అలర్ట్‌లోకి వెళ్లింది.
కర్ణాటక రాష్ట్ర రాజకీయాల్లో తీవ్ర విషాదం చోటుచేసుకుంది.
తమిళనాడు ముఖ్యమంత్రిగా విజయ్ ప్రమాణ స్వీకారం చేసిన జోసెఫ్ విజయ్ 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్‌పై ఫైలుపై తన మొట్టమొదటి సంతకాన్ని చేశారు.
తమిళనాడు రాజకీయ చరిత్రలో నేడు ఒక చారిత్రాత్మక ఘట్టం ఆవిష్కృతమైంది.
చెన్నై నగరం ఆదివారం ఉదయం నుంచి రాజకీయ, సినీ వర్గాల కదలికలతో కిక్కిరిసింది.
తమిళనాడు రాజకీయ చరిత్రలో ఆదివారం ఒక సువర్ణ అధ్యాయం లిఖించబడింది.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.