పార్టీ ఏర్పాటుపై పీకే యూటర్న్.. ఏపీలో వ్యూహకర్తను దూరం పెట్టిన జగన్

Publish Date:May 5, 2022

Advertisement

ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ పార్టీ ఏర్పాటుపై యూటర్న్ తీసుకున్నారు. ప్రస్తుతానికి పాదయాత్రతోనే సరిపెట్టేయనున్నారు. స్వయంగా ఆయనే మర్మగర్భంగా చేసిన ట్వీట్ తో ప్రశాంత్ కిశోర్ కొత్త పార్టీ ఏర్పాటుపై పెద్ద ఎత్తున ఊహాగానాలు వెలువడ్డాయి. ఇన్ని రోజులూ వాటినై స్పందించని పీకే ఇప్పుడు పార్టీ ఏర్పాటు ఇప్పట్లో లేదని స్పష్టత ఇచ్చేశారు. పాట్నాలో గురువారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో పార్టీ ఏర్పాటు ఇప్పట్లో లేదని స్పష్టత ఇస్తూనే.. తన భవిష్యత్ కార్యాచరణపై వివరాలు వెల్లడించారు. గాంధీ జయంతి రోజున చంపారన్ లోని గాంధీ ఆశ్రమ్  నుంచి పాదయాత్ర  ప్రారంభించనున్నట్లు ప్రారంభించారు. దాదాపు 3వేల కిలోమీటర్లు పాదయాత్ర చేయనున్నట్లు చెప్పారు. ఈ పాదయాత్రలో అందరి సమస్యలూ తెలుసుకుంటానని చెప్పారు. అసలు ప్రశాంత్ కిశోర్ ఎన్నికల వ్యూహకర్త నుంచి రాజకీయ వేత్తగా మారాలన్న నిర్ణయం తీసుకున్నప్పటి నుంచీ వరుసగా ఆయనకు ఎదురు దెబ్బలే తగులుతున్నాయి. తెలుగు రాష్ట్రాలలో అధికార పార్టీకి ఎన్నికల వ్యూహకర్తగా పని చేస్తున్న ప్రశాంత్ కిశోర్ కాంగ్రెస్ కు దగ్గరవ్వడంతో బీజేపీ కన్నెర్రకు గురి కావలసి వస్తుందన్న బెదురుతో జగన్ పీకేను దూరం పెట్టారు. వచ్చే ఎన్నికలలో జగన్ పార్టీ తరఫున పీకే పని చేసే అవకాశాలు దాదాపు మృగ్యమని వైసీపీ వర్గాలే చెబుతున్నాయి. 

కాంగ్రెస్ లో చేరి గ్రాండ్ ఓల్డ్ పార్టీలో చక్రం తిప్పాలన్న పీకే వ్యూహం కూడా బెడిసి కొట్టింది. పార్టీలోకి ఆహ్వానించినప్పటికీ సోనియా పీకే కండీషన్స్ ను ఒప్పుకోకపోవడం వల్లనే పీకే హస్తానికి దూరంగా ఉండిపోయారని కాంగ్రెస్ వర్గాలు చెబుతున్నాయి. 

ఇంత వరకూ ఎన్నికల వ్యూహకర్తగా పీకే పయనం చూస్తే.. ఒక సారి పని చేసిన పార్టీకి ఆయన రెండో సారి పని చేసిన దాఖలాలు కనిపించవు. ఆయన పని చేయలేదనడం కంటే పార్టీలే ఆయనను దూరం పెట్టాయనడం కరెక్టుగా ఉంటుంది. గుజరాత్ లో బీజేపీని గెలిపించడానికి తన వ్యూహాలకు పదును పెట్టి సక్సెస్ అయిన పీకే.. ఆ జోరుతో ఎన్డీయేకు వ్యూహకర్తగా 2014లో పని చేశారు. ఆ ఎన్నికల్లో ఎన్డీయే కూటమి ఘన విజయం సాధించింది. ఆయితే ఆ తరువాత బీజేపీ పీకేను దూరం పెట్టింది. తరువాత పీకే జేడీయూలో చేరారు. బీహార్ లో జేడీయూ అధికారం చేపట్టిన తరువాత ఆ పార్టీ అధినేత, ముఖ్యమంత్రి నితీష్ కుమార్ ఎన్డీయేలో చేరడంతో ఆ పార్టీ నుంచి  పీకే బయటకు వచ్చేశారు. ఆ తరువాత 2019 ఎన్నికలలో జగన్ పార్టీకి వ్యూహకర్తగా మరి వైసీపీ అధికారంలోకి వచ్చేందుకు వ్యూహాలు రచించి సఫలం అయ్యారు. ఇప్పుడు కారణాలేమైతేనేం జగన్ కూడా పీకేను దూరం పెట్టినట్లు తెలుస్తున్నది. ఎన్నికల వ్యూహకర్తగానే కాకుండా పార్టీపై ఆధిపత్యం చెలాయించే పీకే ధోరణి కారణంగానే పార్టీలు ఆయనను దూరంపెడుతుంటాయని పరిశీలకులు అంటున్నారు. ఏది ఏమైనా వచ్చే  సార్వత్రిక ఎన్నికల నాటికి పీకే సొంత పార్టీ పెట్టక, వ్యూహాలు తీసుకోవడానికి పార్టీలూ ముందుకు రాక ఖాళీగా ఉండే పరిస్థితి ఏర్పడేలా ఉందని పరిశీలకులు అంటున్నారు.
 

By
en-us Political News

  
పార్టీ సిద్ధాంతాలను బలంగా ప్రజల్లోకి తీసుకెళ్ళాలని, పార్టీ సిద్ధాంతాలే నాయకత్వానికి బలం అని విద్య, ఐటి శాఖ మంత్రివర్యులు నారా లోకేష్ పిలుపునిచ్చారు.
పశ్చిమ బెంగాల్ రాజకీయాలు మరోసారి వేడెక్కాయి
జగన్ ప్రతిపాదిత మావిగన్ ప్రాంతం నుంచే అంటే మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు ప్రాంతాల ప్రజలలో అయితే మావిగన్ పట్ల తీవ్ర స్థాయిలో వ్యతిరేకత వ్యక్తం అవుతోంది. అమరావతికి చట్టబద్ధత వచ్చిందని అంతా పండుగ వాతావరణం నెలకొన్న ఈ పరిస్థితుల్లో మావిగన్ ఏమిటి అంటూ ఓ రేంజ్ లో జగన్ ప్రతిపాదనపై విమర్శలు గుప్పిస్తున్నారు.
ఇటీవల రాజ్యసభ సభ్యుడిగా ఎన్నికైన నితీశ్‌కుమార్ బీహార్ ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేశారు.
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు, వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కు లేఖ రాశారు. అలాగే ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిలకు వేర్వేరుగా లేఖలు రాశారు. ఆ లేఖల్లో ఆయన వారి మద్దతు కోరారు. ఆశ్చర్యపోవద్దు చంద్రబాబు వారి మద్దతు కోరతూ లేఖ రాశారు. అయితే ఆ మద్దతు ఏ విషయంలో అంటే మహిళల రాజకీయ సాధికారతకు కీలక మైలురాయిగా నిలిచే మహిళా రిజర్వేషన్ బిల్లుకు. ఆ బిల్లుకు మద్దతు పలకాల్సిందిగా కోరుతూ చంద్రబాబు ఈ లేఖలు రాశారు.
మాజీ మంత్రి, సీనియర్ పొలిటీషియన్ జీవన్ రెడ్డి అధికారికంగా బీఆర్ఎస్ తీర్ధం పుచ్చుకునే వేదికగా ఆ సభ జరగబోతున్నది. ఈ భారీ బహిరంగ సభలో కేసీఆర్ అఫీషియల్ గా జీవన్ రెడ్డిని బీఆర్ఎస్ లో చేర్చుకుంటారు. ఈ సభను అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్న బీఆర్ఎస్ భారీగా ఏర్పాట్లు చేస్తోంది.
బెంగాల్ అభివృద్ధి కేవలం రాజధాని కోల్‌కతా, దాని చుట్టుపక్కల ప్రాంతాలకే పరిమితమైందన్నారు. ముఖ్యంగా ముస్లిం జనాభా అధికంగా ఉన్న జిల్లాలను ప్రభుత్వం పూర్తిగా విస్మరిస్తోందని దుయ్యబట్టారు.
ఈ పర్యటనలో భాగంగా రేవంత్ రెడ్డి దక్షిణాది రాష్ట్రాల ప్రయోజనాలకు డీలిమిటేషన్ ఏ విధంగా అవరోధంగా మారుతుందన్నది ఇండియా కూటమి పార్టీలకు వివరించే అవకాశం ఉందని అంటున్నారు. ఈ నేపథ్యంలోనే రేవంత్ హస్తిన పర్యటన అత్యంత ప్రాధాన్యత సంతరించుకుంది.
రాజకీయంగా ఎదుర్కొనలేకే.. దర్యాప్తు సంస్థల ద్వారా తమ విజయాన్ని అడ్డుకోవాలని కేంద్రంలోని మోడీ సర్కార్ ప్రయత్నిస్తున్నదని తృణమూల్ అధినేత్రి మమతా బెనర్జీ ఆగ్రహం వ్యక్తం చేశారు.
జనాభా నియంత్రణ శిక్షా? బహుమతా? అని నిల‌దీస్తున్నారు సీఎం రేవంత్. కేంద్ర ప్రభుత్వం జనాభా ప్రాతిపదికన ఎంపీ సీట్లను పెంచాలని చూస్తోంది. ఆనాడు కేంద్రం పిలుపునిచ్చిందని దక్షిణాది రాష్ట్రాలైన తెలంగాణ, ఏపీ, తమిళనాడు, కేరళ, కర్ణాటక కుటుంబ నియంత్రణను పక్కాగా అమలు చేశాయి. ఫలితంగా ఇక్కడ జనాభా పెరగలేదు.
ఈ కేసులన్నీ ప్రజలకు టికెట్ లేని సినిమా చూపిస్తున్నాయన్నారు. ఈ కేసుల్లో ఎవరికి శిక్షలు పడవంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు.
పశ్చిమ బెంగాల్ రాజకీయాల్లో కీలక పరిణామం చోటు చేసుకుంది.
ఆ వ్యూహం అమరావతి విధ్వంసమేనని నొక్కి వక్కాణిస్తున్నారు. విజయవాడ మీడియాతో మాట్లాడిన ఏబీ వెంకటేశ్వరరావు జగన్ మావిగన్ ప్రతిపాదన కేవలం చంద్రబాబుపై విమర్శకే పరిమితం కాదన్నారాయణ. ఈ మావిగన్ ప్రతిపాదన వెనుక అమరావతి అస్థిత్వాన్నే ప్రశ్నార్థకం చేసే అతి బయంకరమైన కుట్ర కోణం ఉందని ఏబీ వెంకటేశ్వరరావు వివరించారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.