ప్రజల పక్షాన విధివిధానాలను రూపొందించేందుకు, అర్థవంతమైన ప్రజాస్వామ్యం కోసం పనిచేసేందుకు 10 ఏళ్లుగా ఒడుదొడుకుల ప్రయాణం చేశాను. ఇప్పుడు ఈ ప్రయాణంలో కొత్త పేజీ తిప్పుతున్నాను. నిజమైన మాస్టర్లయిన ప్రజల సమస్యలను మరింత అర్థం చేసుకునేలా వారి వద్దకు నేరుగా వెళ్లాల్సిన సమయం వచ్చింది. ఈ ప్రయాణాన్ని బిహార్ నుంచి ఆరంభిస్తాను.
పీకే ట్వీట్
మూడు నాలుగు ఫ్రంట్ లతో లాభం లేదు రెండో ఫ్రంటే ముద్దు అంటూ చెప్పుకొచ్చిన రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ అలియాస్ పీకే..ఇప్పుడు సొంతంగా పార్టీ పెట్టాలన్న నిర్ణయానికి వచ్చేశారు. బీజేపీని అధికారం నుంచి దూరం చేయడానికి బీజేపీయేతర పార్టీల ఐక్యతకు చేసిన ప్రయత్నాలు ఫలితాన్నివ్వలేదన్న కారణంగానే ఆయన సొంతంగా పార్టీ పెట్టాలని నిర్ణయించుకున్నారన్న అనుమానాన్ని పరిశీలకులు వ్యక్తం చేస్తున్నారు.
అయినా ప్రశాంత్ కిశోర్ సొంతంగా రాజకీయ పార్టీ స్థాపించాలన్న నిర్ణయం పెద్దగా ఆశ్చర్యం కలిగించదు. ఎందుకంటే వచ్చే సార్వత్రిక ఎన్నికల నాటికి తన పాత్ర రాజకీయ వ్యూహకర్తగా కాకుండా రాజకీయ నాయకుడిగానే ఉంటుందని ఇప్పటికే ఆయన ప్రకటించిన సంగతి విదితమే. మూడు నాలుగు రోజుల కిందట రాజకీయ నాయకుడి పాత్ర గురించి చెప్పిన ప్రశాంత్ కిశోర్ అంతలోనే కొత్త రాజకీయ పార్టీ ప్రకటన చేశారు. ఈ రోజు ఉదయమే కొత్త పార్టీపై ప్రకటించిన ప్రశాంత్ కిశోర్, తన సొంత రాష్ట్రమైన బీహార్ నుంచే పార్టీ ప్రరంభిస్తానని స్పష్టం చేశారు. గతంలో ప్రశాంత్ కిశోర్ నతీష్ కుమార్ నేతృత్వంలోని జనతాదళ్ యూలో చేరారు. కొద్ది కాలానికి ఆ పార్టీ నుంచి బయటకు వచ్చారు. ఆ తరువాత ఇటీవల కాంగ్రెస్ గూటికి చేరే యత్నాలు చేశారు. అయితే అవి ఫలించక స్వయంగా సోనియా గాంధీ ఆహ్వానాన్ని కూడా తిరస్కరించి కాంగ్రెస్ కు కావలసింది తాను కాదనీ, సమర్ధ నాయకత్వమని చెప్పారు.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/pk-to-launch-new-political-party-25-135319.html
ఆంధ్రప్రదేశ్ రాజకీయం ఎల్లప్పుడూ అత్యంత ఆసక్తికరమైన సంక్లిష్టమైన మలుపులకు వేదికగా నిలుస్తుంది.
ఉప్పల్లో ఈ రోజు తెలంగాణ ఉద్యమకారులు, మహిళల రక్తం చిందిందని ఆవేదన వ్యక్తం చేశారు. మహిళలు, ఉద్యమకారులపై పోలీసులు విచక్షణారహితంగా లాఠీఛార్జ్ చేశారని ఆరోపించారు.
ఈ అరెస్టు పై బీఆర్ఎస్ శ్రేణులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాయి. హరీష్ రావు అరెస్టు సందర్భంగా పోలీసులకు, బీఆర్ఎస్ శ్రేణులకు మధ్య తోపులాట జరిగింది. గురుకులాల్లో అవినీతి, రాష్ట్ర అప్పులపై గన్ పార్క్ వద్ద బహిరంగ చర్చకు సిద్ధమని మంత్రులు పొన్నం ప్రభాకర్, అడ్లూరి లక్ష్మణ్, అజారుద్దీన్.. బీఆర్ఎస్ నేతలు హరీశ్రావు, కేటీఆర్లకు సవాల్ విసిరారు.
జగన్ ప్రసంగాలు, మీడియా సమావేశాలు... ట్రోలింగ్కు, మీమ్స్కు కేరాఫ్ అడ్రస్గా మారుతున్నాయి. నెటిజనులు, తెలుగుదేశం, జనసేన సోషల్ మీడియా యాక్టివిస్టులు జగన్ ప్రెస్ మీట్ కోసం వేయి కళ్లతో ఎదురు చూస్తుంటారంటే ఇసుమంతైనా అతిశయోక్తి కాని పరిస్థితి ఉంది.
గతంలో ప్రభుత్వ పనుల కాంట్రాక్టులు దక్కించుకోవాలంటే కేవలం రాజకీయ పలుకుబడి, కమిషన్లు మాత్రమే ప్రాధాన్యత సంతరించుకునేవనే విమర్శలు బలంగా ఉన్నాయి. ఈ విధానాన్ని మార్చి విజయ్ ఇప్పుడు ప్రతిభ, పారదర్శకత ఆధారంగానే టెండర్లు లభించే కొత్త విధానాన్ని తీసుకువచ్చారు.
ఇటువంటి ఉత్కంఠభరిత రాజకీయ వాతావరణంలో.. ఇద్దరు బద్ద రాజకీయ ప్రత్యర్థులు అకస్మాత్తుగా ఒ ముఖాముఖి ఎదురైతే.. అసలా ఊహే ఎవరికీ రాదు అన్నట్లుగా ప్రస్తుతం ఏపీ రాజకీయ పరిస్థితి ఉంది. కానీ అనూహ్యంగా రఘురామకృష్ఫం రాజు, అంబటి రాంబాబు ఓ వివాహ వేడుకలో ఎదురు పడ్డారు.
రాజధాని వంటి అత్యంత కీలకమైన, సున్నితమైన విషయంలో జగన్ పదే పదే తన స్టాండ్ మార్చుకోవడం పరిశీలకులను సైతం విస్మయానికి గురి చేస్తున్నది. స్థిరత్వం లేని జగన్ తీరు వెనుక ఎవరి సలహాలు ఉన్నాయన్న చర్చ ఇప్పుడు ఏపీ రాజకీయవర్గాలలో జోరుగా సాగుతోంది.
పాత చరితను పునరావృతం చేస్తున్న డిప్యూటీ స్పీకర్!
తమిళనాడులో నటుడు విజయ్ నేతృత్వంలో టీవీకే ప్రభుత్వాన్ని కూల్చేందుకు జరిగిన కుట్రను పోలీసులు భగ్నం చేశారు.
వైసీపీ అధికారంలో ఉన్న సమయంలో నోటికి హద్దూ పద్దూ లేదన్నట్లుగా, జనసేనాని పవన్ కల్యాణ్, తెలుగుదేశం నేతలపై అనుచిత వ్యాఖ్యలతో దువ్వాడ రెచ్చిపోయిన సంగతి తెలిసిందే. ఈ అనుచిత వ్యాఖ్యలపై దువ్వాడ శ్రీనివాస్ పై కొత్తూరు పోలీస్ స్టేషన్లో నమోదైన ఒక కేసుకు సంబంధించి వివరణ ఇచ్చేందుకు బయలుదేరిన దువ్వాడ శ్రీనివాస్.. పోలీసు స్టేషన్ కు చేరకుండానే మిస్సయ్యారు.
దేశంలో నిష్పాక్షికంగా ఎన్నికలు జరగాలంటే న్యాయవ్యవస్థ జోక్యం అనివార్యమని పేర్కొన్నాయి. ఈ లేఖపై ఇండియా కూటమికి చెందిన 23 పార్టీల నాయకులు సంతకాలు చేశారు.
దీంతో తిరుచిరాపల్లి నియోజకవర్గానికి రాజీనామా చేయడంతో ఆ నియోజకవర్గానికి ఉప ఎన్నిక అనివార్యమైంది. ఆయన రాజీనామాతో ఖాళీ అయిన స్థానం నుంచి విజయ్ కు సన్నిహితుడు, సినీ నటుడు, దర్శకుడు, నిర్మాత కూడా అయిన రాఘవ లారెన్స్ టీవీకే అభ్యర్థిగా పోటీ చేస్తారని గత కొన్ని రోజులుగా విస్తృతంగా ప్రచారం జరుగుతోంది.
Publish Date:Jun 30, 2026
జూనియర్ ఎన్టీఆర్ సినిమాలు ఒకే రోజున విడుదలైతే.. ఆ రెండింటిలో మీరు ముందుగా ఏ సినిమా అంటే ఎవరి సినిమా చూస్తారన్న ప్రశ్నకు.. లోకేష్ చాకచక్యంగా ఇద్దరి సినిమాలనూ ఒకే రోజు చూస్తానని బదులిచ్చారు.