పీకే ఎఫెక్ట్ : తెలుగు రాష్ట్రాలలో కొత్త పొత్తులు!
Publish Date:Apr 18, 2022
Advertisement
హస్తినలో కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీతో రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ భేటీ తెలుగు రాష్ట్రాలలో కొత్త రాజకీయ సమీకరణాలకు తెర లేపుతోందా? అన్న ప్రశ్నకు అవుననే సమాధానమే వస్తుంది. ఎందుకంటే తెలుగు రాష్ట్రంలో అధికారంలో ఉన్న బీజేపీ, వైసీపీలకు రాజకీయ సలహాదారు పీకేయే కావడంతో తెలుగు రాష్ట్రాలలో అధికార పార్టీలు తెలుగుదేశంతో ఎన్నికల పోత్తు పెట్టుకునే అవకాశాలు మెండుగా ఉన్నాయని రాజకీయ శిశ్లేషకులు చెబుతున్నారు. ఇప్పటి వరకూ అయితే తెలుగు రాష్ట్రాలలో కాంగ్రెస్ పార్టీకి అధికార పార్టీతో ఎటువంటి సంబంధాలూ లేవనే చెప్పాలి. ఆంధ్రప్రదేశ్ లో కాంగ్రెస్ పార్టీ అంత ప్రభావమంతంగా లేకపోయినప్పటికీ..తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికార పార్టీకి గట్టి ప్రత్యర్థిగా ఉందనడంలో సందేహం లేదు. నిత్యం నిప్పు-ఉప్పులా విమర్శలు, ప్రతి విమర్శలు గుప్పించుకునే తెరాస, కాంగ్రెస్ మధ్య ఎన్నికల పొత్తు అన్నది వినడానికి అసంభవం అనిపించేలా ఉన్నా జాతీయ స్థాయిలో రాజకీయ పరిస్థితులు కారణంగా బీజేపీయేతర పార్టీలన్నిటినీ ఏకతాటిపైకి తీసకురావలసని అవసరం ఎంతైనా ఉందని పీకే గత కొంత కాలంగా వివిధ పార్టీల నేతలతో జరుపుతున్న సమాలోచనలలో ప్రతిపాదిస్తూనే ఉన్నారు. వాస్తవానికి పీకే సూచనలూ, సలహాలతోనే తెలంగాణ రాష్ట్ర సమితి అధినేత, ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు ఫెడరల్ ఫ్రంట్ కోసం మహారాష్ట్ర సీఎం, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ అధినేత శరద్ పవార్, డీఎంకే అధినేత, తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ తదితరులతో సమాలోచనలు జరిపారన్నది పరిశీలకుల విశ్లేషణ. ఈ నేపథ్యంలోనే పీకే సోనియాగాంధీ సహా కాంగ్రెస్ పెద్దలతో భేటీ అవ్వడం ప్రాధాన్యత సంతరించుకోవడమే కాకుండా దక్షిణాదిలో మరీ ముఖ్యంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ లలో అధికార పార్టీలు వచ్చే సార్వత్రిక ఎన్నికలలో కాంగ్రెస్ తో కలిసి పోటీ చేస్తాయన్న విశ్లేషణలు జాతీయ మీడియాలో ప్రముఖంగా వస్తున్నాయి. అయితే క్షేత్ర స్థాయిలో ఇక్కడి పరిస్థితులను బట్టి అటువంటి విశ్లేషణలు తెలుగు రాష్ట్రాల మీడియాలో అంతగా కనిపించడం లేదు. ఇప్పుడు బీజేపీ రాష్ట్రంలో అధికారం కోసం అగ్రెసివ్ గా కదులుతున్న నేపథ్యంలో బీజేపీ దూకుడును నిలువరించడానికీ, అలాగే కేంద్రంలో బీజేపీకి మరోసారి అధికార పీఠం దక్కకుండా అడ్డుకోవడానికీ బీజేపీయేతర శక్తులన్నీఏకం కావాలని కేసీఆర్ చేస్తున్న ప్రయత్నాలు, కేసీఆర్ రాజకీయ సలహాదారు పీకే కాంగ్రెస్ అధినేత్రితో భేటీ కలిపి చూస్తే తెలంగాణలో తెరాస, కాంగ్రెస్ ల మధ్య పొత్తు అసంభవమేమీ కాదనే భావించాలి. ఇక ఏపీ విషయానికి వస్తే అక్కడ కాంగ్రెస్ ప్రభావం ఏమంత లేకపోవడం వల్ల జగన్ కు ఆ పార్టీని కలుపుకు పోవడానికి పెద్దగా అభ్యంతరాలేమీ ఉండకపోవచ్చని రాజకీయ పరిశీలకులు అంటున్నారు.
మొత్తం మీద తెలంగాణలో కేసీఆర్ బీజేపీని దీటుగా ఎదుర్కోవడమే లక్ష్యంగా పావులు కదుపుతున్న నేపథ్యంలో కాంగ్రెస్ తో కలిసి ముందుకు సాగేందుకు సుముఖత చూపుతారనే భావించాలి. గతంలో కూడా కేసీఆర్ కాంగ్రెస్ తో ఎన్నికల పొత్తు పెట్టుకున్న సంగతి విదితమే. నాడు ఉద్యమ నేతగా ఉన్నప్పుడే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైఎస్ సర్కార్ లో తెరాస భాగస్వామిగా ఉన్నారు.
ఏది ఏమైనా పీకీ షేక్ హ్యాండ్ తెలుగు రాష్ట్రాలలో కొత్త సమీకరణాలకు తెరలేపే అవకాశాలే ఎక్కువగా కనిపిస్తున్నాయి.
http://www.teluguone.com/news/content/pk-meet-with-gandhis-sign-for-new-alliances-in-telugu-syates-25-134559.html





