Publish Date:Aug 11, 2022
బీహార్ పరిణామాల నేపథ్యంలో తాజాగా మళ్లీ ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ మళ్లీ తెరపైకి వచ్చారు. ఎన్నికల వ్యూహకర్తగా ఓ వెలుగు వెలిగిన పీకే.. రాజకీయ నేతగా మాత్రం ఎవరికీ పట్టకుండా పోయారు. ఇప్పుడు ఇటు ఎన్నికల వ్యూహాలూ పారక.. అటు రాజకీయంగానూ గుర్తింపు లేక రెంటికీ చెడ్డ రేవడగా మిగిలిపోయారు. బీహార్ లో ఎన్డీయే ప్రభుత్వం కుప్ప కూలి మహాఘట్ బంధన్ సర్కార్ కొలువుదీరిన పరిణామాలలో ప్రశాంత్ కిశోర్ ప్రమేయమే లేకుండా పోయింది.
నితీష్ వ్యూహాలను పసిగట్టడంలో పీకే టోటల్ గా జీరో అయ్యారు. బీహార్ పరిణామాలు 2024 సార్వత్రిక ఎన్నికలలో బీజేపీయేతర పక్షాల ఐక్యతకు నాందిగా పరిశీలకులు విశ్లేషిస్తున్న వేళ ఎవరూ అడగకుండానే.. నితీష్ కు అంత సీన్ లేదంటూ ప్రశాంత్ కిషోర్ చేసిన వ్యాఖ్యలపై సామాజిక మాధ్యమంలో నెటిజెన్లు పెద్ద ఎత్తున ట్రోల్ చేస్తున్నారు. బీహార్ లో బీజేపీకి షాకిస్తూ.. కొత్త మిత్రులతో చేరి బిహార్ లో కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన నితీశ్ కుమార్ వ్యూహ చతురతపై దేశ వ్యాప్తంగా పెద్ద ఎత్తున విశ్లేషణలు వస్తున్నాయి. దాదాపు అన్ని విశ్లేషణలూ ఈ పరిణామం వచ్చే సార్వత్రిక ఎన్నికలలో మోడీకి చేదు అనుబవాన్ని మిగిల్చే అవకాశాలు మెండుగా ఉన్నాయనే చెప్పాయి.
బీజేపీకి మిత్రపక్షాలన్నీ దూరం కావడం వచ్చే సార్వత్రిక ఎన్నికలు మోడీ హ్యాట్రిక్ ఆశలకు గండి కొడతాయనే విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. అయితే ప్రశాంత్ కిశోర్ మాత్రం ఈ విశ్లేషణలను కొట్టి పారేస్తూ.. నితీష్ కు అంత సీన్ లేదని వ్యాఖ్యనించారు. బీహార్ పరిణామాలు జాతీయ స్థాయిలో రాజకీయాలను ఇసుమంతైనా ప్రభావితం చేయవని తేల్చేశారు. కేవలం నితీష్ స్వార్థం వల్లనే బీహార్ పరిణామాలు సంభవించాయని సూత్రీకరించారు. అంతే కాకుండా నితీష్ వ్యూహాలపై, వ్యవహార శైలిపై విమర్శలు చేశారు.
గత పదేళ్లుగా ఆయన బీహార్ లో చేస్తున్న రాజకీయ ప్రయోగాలన్నీ కుప్పిగంతులేనని ప్రశాంత్ కిషోర్ అభివర్ణించారు. గత పదేళ్లుగా తాను ముఖ్యమంత్రిగా కొనసాగడమే లక్ష్యంగా ఇలాంటి రాజకీయ జంపిగ్ లను ఆయన గతంలో ఐదు సార్లు చేశానపీ, ఇది ఆరోసారనీ విమర్శించారు. కేవలం సీఎంగా కొనసాగడమే లక్ష్యంగా ఆయన తీరు ఉందనీ, ఆయన వల్ల బీహార్ కు జరిగిన మేలేమీ లేదని విమర్శించారు. ఏ విషయంలోనూ సైద్ధాంతిక సారూప్యత లేని జేడీయూ, ఆర్జీడీలు కలిసి బీహార్ ను ఏం చేస్తారోనని భయంగా ఉందని పీకే వ్యాఖ్యానించారు. అయితే పీకే వ్యాఖ్యలను పరిశీలకులు కొట్టి పారేస్తున్నారు. నితీష్ పై ఉన్న వ్యక్తిగత వైరానికి తోడు తెలంగాణ ముఖ్యమంత్రిపై ఉన్న వ్యక్తిగత ప్రేమ కూడా పీకే వ్యాఖ్యలకు కారణమని విశ్లేషిస్తున్నారు.
పీకే వచ్చే సార్వత్రిక ఎన్నికల నాటికి తెలంగాణ సీఎంను జాతీయ నేతగా నిలబెట్టే పనిని అంగీకరించారనీ, ఆ దిశగా ఆయన టీమ్ తెలంగాణలో పని చేస్తున్నదనీ, ఈ పరిస్థితుల్లో మోడీకి వ్యతిరేకంగా బీజేపీయేతర పార్టీలను ఏకం చేసే బలమైన నేతగా నితీష్ ఆవిర్బవిస్తే తెలంగాణ తనకు ఇచ్చిన ఉద్యోగం కోల్పోతుందన్న భయంతోనే బీహార్ పరిణామాలు జాతీయస్థాయిలో చూపే ప్రభావం ఏమీ ఉండదంటూ విశ్లేషణలు చేస్తున్నారని విమర్శకులు అంటున్నారు. అదీ కాక మోడీ వ్యతిరేకతను పూర్తిగా తగ్గించుకుని మరీ పీకే మాట్లాడటంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమౌతున్నాయి.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/pk-analysis-on-bihar-developements-attrats-criticism-from-all-fronts-25-141739.html
వైసీపీలోని కాపు సామాజికవర్గానికి చెందిన నేతలు అంబటి రాంబాబు, పేర్ని నాని మీడియా ముందుకొచ్చి బోండా ఉమా మద్దతుగా గళమెత్తారు. అయితే.. తాజాగా వైసీపీ నిరసనలను ప్రశ్నిస్తూ ఆ పార్టీ నేతలను బోండా ఉమా గట్టిగా నిలదీయడంతో వైసీపీ ఆశలు నీరుగారిపోయాయి.
న్నికల ఖర్చుల విషయానికి వస్తే వైసీపీ దేశంలోనే అత్యధికంగా వ్యయం చేసిన ప్రాంతీయ పార్టీగా నిలిచింది. ఆ ఆర్థిక సంవత్సరంలో వైసీపీ ఆదాయం 140.4 కోట్ల రూపాయలు కాగా, చేసిన వ్యయం 340.2 కోట్ల రూపాయలు. తమ వార్షిక రాబడి కంటే 142 శాతం అదనంగా, అంటే దాదాపు 199.8 కోట్ల మేర ఎక్కువ వ్యయం చేసింది.
దేశవ్యాప్తంగా విద్యా వ్యవస్థను వేధిస్తున్న ప్రశ్నాపత్రాల లీకేజీలు, నిరుద్యోగం, యువత భవిష్యత్తుపై రాహుల్ గాంధీ ప్రత్యక్షంగా విద్యార్థులతో ముఖాముఖి నిర్వహించేందుకు ఉద్దేశించిన ఈ సదస్సు ఈనెల 8న. ప్రయాగ్రాజ్లోని ప్రసిద్ధ కేపీ కాలేజీ మైదానంలో నిర్వహించేందుకు కాంగ్రెస్ భారీ ఏర్పాట్లు చేసింది.
పరామర్శల పేరిట పోలీసుల ఆంక్షలను ఉల్లంఘిస్తూ, శాంతి భద్రతల సమస్య ఉత్పన్నమయ్యేలా సాగుతున్న ఆయన పర్యటనల తీరు నేపథ్యంలో జగన్ భద్రత అంశం మరోసారి చర్చకు వచ్చింది. అంతటితో ఆగకుండా, జగన్కు రక్షణ తగ్గించారంటూ వైసీపీ ఎంపీల బృందం కేంద్ర హోంమంత్రి అమిత్ షాను కలవడం, దీనిపై రాష్ట్ర ప్రభుత్వం వెంటనే వివరణ ఇవ్వడంతో జగన్ భద్రత అంశం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.
అయోధ్య రామమందిరం పేరిట సేకరించిన విరాళాల విషయంలో అక్రమాలు జరిగాయనే అంశాన్ని వ్యంగ్యంగా, నాటకీయంగా చూపించేందుకు వారు చేపట్టిన ఈ వినూత్న నిరసన రాజకీయ వివాదానికి దారి తీసింది. రామాలయాన్ని, పూజారి వ్యవస్థను, భక్తుల నమ్మకాలను హేళన చేసేలా ఈ నిరసన ఉందంటూ.. బీహార్లోని జమూయి సివిల్ కోర్టులో ఓ సీనియర్ న్యాయవాది పిటిషన్ దాఖలు చేశారు.
రిజర్వేషన్ల విధానాన్ని అంబేడ్కర్ ఆశయాలు, దృక్పథానికి అనుగుణంగా అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉందన్న మోహన్ భగవత్.. విద్యా, ఉద్యోగ రంగాల్లో రిజర్వేషన్ల విధానం ఎంతకాలం కొనసాగాలనే ప్రశ్నకు సమాధానమిస్తూ.. రిజర్వేషన్లు కేవలం రాజకీయ ప్రాతిపదిక కాదనీ సామాజిక అనివార్యత అన్నారు.
గడిచిన దశాబ్ద కాలంలో కేంద్రంలో తిరుగులేని శక్తిగా ఎదిగిన బీజేపీ, ప్రస్తుతం కొన్ని సవాళ్లను ఎదుర్కొంటోందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.
జగన్ పర్యటనలలో జరిగిన పలు సంఘటనలకు సంబంధించిన వీడియో ఆధారాలను వంగలపూడి అనిత ఈ సందర్భంగా ప్రదర్శించారు. సాధారణంగా ఎవరైనా పరామర్శకు వెళ్తే బాధితులను ఓదార్చడం, వారికి అండగా నిలవడం ఆనవాయితీ అనీ, కానీ జగన్ మాత్రం నిజమైన బాధితులను వదిలేసి నిందితులను పరామర్శించడానికి వెడుతున్నారనీ మండిపడ్డారు.
యూపీలో భారీ వర్షాలు, శాంతిభద్రతల పరిస్థితి, కోర్టు ఆదేశాలు కారణంగా చూపుతూ కాయస్థ పాఠశాల ట్రస్ట్ అనుమతిని ఉపసంహరించుకుంది. అయితే ఈ వివరణ సంతృప్తికరంగా లేదని కాంగ్రెస్ చెబుతోంది. అధికార యంత్రాంగం, బీజేపీ ప్రభుత్వ ఒత్తిడి కారణంగానే రాహుల్ సభకు అనుమతి ఇవ్వడం లేదని ఆరోపిస్తోంది.
కనీసం తనతో సంప్రదించకుండా ఏకపక్షంగా అంబటి రాంబాబు పాదయాత్ర ప్రకటన చేయడంపై జగన్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేయడంతో గత్యంతరం లేక అంబటి పాదయాత్ర విరమించుకున్నారని పార్టీ వర్గాల సమాచారం.
వైసీపీకి కోర్టులు, న్యాయమూర్తులు, చట్టం, న్యాయం వంటి విషయాలలో పెద్దగా పట్టింపు లేదని గతంలో పలుమార్లు రుజువైంది. అలాగే ఇప్పుడు కూడా కోర్టు తీర్పులు కోర్టువే, మా దారి మాదే అన్న చందంగా విజయవాడ వేదికగా వైసీపీ విద్యార్థి, యువజన విభాగాలు రాష్ట్రవ్యాప్తంగా నిరసనలకు దిగాయి.
ఇప్పటి వరకూ గ్రామ పంచాయతీ స్థాయిలో సర్పంచులను మాత్రమే ప్రజలు నేరుగా ప్రత్యక్ష ఓటింగ్ ద్వారా ఎన్నుకుంటున్నారు. అయితే, మండల స్థాయిలో ఎంపీపీలు, జిల్లా స్థాయిలో జడ్పీ ఛైర్మన్లతో పాటు మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో ఛైర్మన్లు, మేయర్ల ఎంపిక పరోక్ష పద్ధతిలోనే జరుగుతోంది.