పిఠాపురం ఈ సారి పవన్ కళ్యాణ్ దే... కొనసాగుతున్న సెంటిమెంట్

Publish Date:Apr 4, 2024

Advertisement

పిఠాపురం... 
40 ఏళ్ళ రాజకీయ చరిత్ర చూస్తే ఒకసారి గెలిచిన పార్టీ రెండోసారి గెలవలేదు.. గ‌త ఎన్నిక‌ల్లో వైసీపీ అభ్య‌ర్థి గెలిచాడు. మరి ఈ సారి వైసీపీ అభ్యర్థి గెలిచే అవకాశం ఏ కోశానా లేదు.విభిన్నతీర్పును ఇచ్చే పిఠాపురం ప్రజలు.. 2024 ఎన్నికల్లో ఏ పార్టీకి జై కొడతారు అనేది ఉత్కంఠగా మారింది. 
ఒకప్పుడు జమిందారులు  పిఠాపురం సంస్థానాన్ని  పాలించారు. సంగీతం, సాహిత్య, ఆధ్యాత్మికతను పెంచిపోషించి ప్రత్యేకతను చాటుకుంది ఈ సంస్థానం. ప్రస్తుతం పవన్‌ కల్యాణ్‌ పోటీ చేస్తుండడంతో పిఠాపురం పోరు ఉత్కంఠ రేపుతోంది.రాష్ట్రంలో ఏ పార్టీ అధికారంలోకి వస్తుంది అనేదానికన్నా పిఠాపురం నుంచి పోటీచేస్తున్న పవన్ కల్యాణ్ గెలుస్తాడా? లేదా? అనేదే  ఉత్కంఠ అని చెప్పవచ్చు. రెండు తెలుగు రాష్ట్రాల్లో ఈ ఉత్కంఠ నెలకొందంటే ఫిఠాపురంలో  రాజకీయ వాతావరణం ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు.పవన్ క‌ళ్యాణ్‌ను అసెంబ్లీ గేటు తాకనివ్వకూడదనేది వైసీపీ సిద్దాంతం.  
ఆరు నూరైనా అసెంబ్లీలో అడుగుపెట్టాలని  జనసేనాని పట్టుబడుతున్నారు. అటు జ‌గ‌న్‌, ఇటు ప‌వ‌న్ ఇద్ద‌రూ  మాంచి క‌సి మీద ఉన్నారు. 
అస‌లు పిఠాపురం రాజ‌కీయం ఎలా వుంది అనేది  ఎపి ప్రజలు ఆసక్తిగా గమనిస్తున్నారు. పేపర్లు తిరగేస్తున్నారు. టీవీలకు అతుక్కుపోతున్నారు.   మొత్తం రాష్ట్రం పిఠాపురం వైపే చూస్తోంది. ఎందుకంటే పవన్ రాజ‌కీయ భ‌విష్య‌త్‌ ను ఈ  ఎన్నిక‌లు నిర్దేశించ‌నున్నాయి.
ప‌వ‌న్ క‌ళ్యాణ్ - వంగా గీత ఎవ‌రి బ‌లం ఏమిటో చూద్దాం.
ముందుగా ప‌వ‌న్ క‌ళ్యాణ్ గురించి  పరిశీలిద్దాం. టీడీపీ నేత‌ వ‌ర్మ‌తో ఉన్న త‌ల‌నొప్పి సెట్ అయింది. ఎందుకంటే 
చంద్ర‌బాబునాయుడే వ‌ర్మ‌కు  హామీ ఇచ్చారు.  అధికారంలోకి వ‌చ్చిన త‌రువాత  మొద‌టి విడ‌త‌లో ఎమ్మెల్సీ ఇచ్చి మంత్రి చేస్తాన‌ని హామీ దొర‌క‌డంతో వ‌ర్మ కూల్ అయ్యారు.
 దీంతో 91 వేల మంది కాపులు. వారి ఓట్ల‌న్నీ అనుకూలంగా మారుతాయి.
 కుప్పం, పులివెందుల త‌ర‌హాలో  పిఠాపురంను స్వంత‌ నియోజ‌క‌వ‌ర్గం చేసుకుని నియోజ‌క‌వ‌ర్గ రూపురేఖ‌ల్ని మార్చివేస్తానంటూ ప‌వ‌న్ చేస్తున్న ప్ర‌చారానికి పిఠాపురం ఓట‌ర్లు ప‌డిపోయారు. 
 యూత్ ఓట‌ర్లు ప‌వ‌న్‌కు అనుకూలంగా వున్నారు. సినిమాల్లో పవన్ కు ఉన్న క్రేజు యూత్ ఓటర్లు ఆకట్టుకునేలా చేస్తోంది. 
గ‌తంలో ప్ర‌జారాజ్యంకు ప‌ట్టు వున్న నియోజ‌క‌వ‌ర్గం కాబ‌ట్టి  ప‌వ‌న్ కు ఈ ఓటు బ్యాంక్ క‌లిసివ‌స్తోంది. పిఠాపురం ప‌వ‌న్‌కు క్యాట్ వాక్ అని చెప్ప వ‌చ్చు. 
 అంతే కాదు ఇక్క‌డి ఓట‌ర్ల స్వ‌భావం  ఏమిటంటే  గ‌తంలో గెలిపించిన‌ పార్టీని మ‌ళ్ళీ గెలిపించ‌రు. కాబ‌ట్టి ఈ సారి జ‌న‌సేన‌కు అవ‌కాశం ఇస్తారు అని పలు సర్వేలు వెల్లడిస్తున్నాయి. 
1978 నుంచి చూస్తే అసెంబ్లీ ఎన్నికల్లో ఏ పార్టీ కూడా వరుసగా గెలిచిన సందర్భాలు లేవు.. 
1978లో కాంగ్రెస్‌ తరుపున కొప్పున మోహన్‌రావు గెలిస్తే.. 
1983లో తెలుగుదేశం వేవ్‌లోనూ స్వతంత్ర అభ్యర్థి నాగేశ్వరరావు విజయం సాధించారు. 
1985లో టీడీపీ నుంచి నాగేశ్వరరావు, 
1989లో కాంగ్రెస్‌ నుంచి కొప్పన మోహనరావు, 
1994లో టీడీపీ తరపున నాగేశ్వరరావు, 
1999లో ఇండిపెండెంట్‌ అభ్యర్థి సంగిశెట్టి వీరభద్రరావు విజయం సాధించారు.. 
2004లో బీజేపీ అభ్యర్థి పెండెం దొరబాబు, 
2009లో ప్రజారాజ్యం తరపున వంగా గీత, 
2014లో ఇండిపెండెంట్‌ అభ్యర్థి వర్మ గెలుపొందారు.. 
2019లో వైసీపీ అభ్యర్థి పెండెం దొరబాబు విజయం సాధించారు. 
అయితే, 40 ఏళ్ళ రాజకీయ చరిత్రలో ఒకసారి గెలిచిన పార్టీ రెండోసారి గెలవలేదు.. 
ఈ సారి గెలుపు పవన్‌ కల్యాణ్‌దే అని జనసేన లెక్కలు వేస్తోంది. 
ప్రతీ ఎన్నికల్లో విభిన్నతీర్పును ఇచ్చే పిఠాపురం ప్రజలు.. 
2024 ఎన్నికల్లో ఏ పార్టీకి జై కొడతారు అనేది ఉత్కంఠ రేపుతోంది..

వైసీపీ అభ్య‌ర్థి వంగా గీతకున్న బ‌లం ఏమిటో చూద్దాం
ఆమె కూడా కాపు సామాజిక వ‌ర్గానికి చెందిన నాయ‌కురాలే. 
సుదీర్ఘ రాజకీయ ఆనుభ‌వం వుంది. ఆమె రాజ‌కీయ ప్రస్థానంలో  పలు పదువులు చేపట్టారు. 
చిరంజీవి స్థాపించిన ప్రజారాజ్యం పార్టీ నుంచి 2009లో ఎమ్మెల్యేగా గెలుపొందారు. 
ఆ తర్వాత కాంగ్రెస్, వైసీపీలోకి వెళ్లారు. 
గత ఎన్నికల్లో వైసీపీ నుంచే కాకినాడ ఎంపీగానూ గెలిచారు. 
అంతకు ముందు టీడీపీ నుంచి రాజ్యసభ కు ప్రాతినిధ్యం వహించారు. 
ఇలా అసెంబ్లీ, లోక్ సభ, రాజ్య సభ మూడు చట్ట సభలకూ ప్రాతినిధ్యం వహించిన ప్రత్యేకత ఆమె సొంతం.
 10 వేల రెడ్డి ఓట్లు వున్నాయి. అవి కూడా ఆమెకు ప‌డ‌వ‌చ్చు. లోకల్ ఫ్యాక్టర్ తీసుకువ‌చ్చి ప‌వ‌న్ నాన్ లోక‌ల్ అనే ముద్ర వేయ‌డానికి ప్ర‌య‌త్నం. ఆయన సెలిబ్రిటీ. ఒకసారి గెలిచిన తరువాత అందుబాటులో వుండ‌ర‌నే ప్ర‌చారం బలంగా ఉంది. 
పవన్ ఏ కుల ఓట్లపై ఎక్కువ ఆధారపడ్డారో అక్క‌డే జ‌గ‌న్ దెబ్బ కొట్టాల‌నుకుంటున్నారో,  అదే సామాజికవర్గానికి చెందిన కీలక నేత ముద్రగడ వైసీపీలో చేర్చుకున్నారు. ముద్రగడ పద్మనాభం వైసీపీలో చేరడం వైసీపీకి కలసి వచ్చే అంశమే అని చెప్పొచ్చు. 
 దాంతో పాటు వంగా గీతకు కూడా అక్కడ సొంత ఇమేజ్ పలుకుబడి ఉన్నాయి.
 ఇక్క‌డున్న 3 మండలాలు. గొల్లప్రోలు, పిఠాపురం, యు.కొత్తపల్లి.
పిఠాపురం, ద్వారంపుడి చంద్ర‌శేఖ‌ర్ 
యు.కొత్తపల్లి, దాడిశ‌ట్టి  రాజా
గొల్లప్రోలు  కుర‌సాల క‌న్న‌బాబు ల‌ను ఇంఛార్జ్‌లుగా పెట్టి ముద్రగడ పద్మనాభం కో ఆర్డినేష‌న్ చేసుకుంటూ
పవన్‌కల్యాణ్‌ను ఓడించేందుకు బాధ్య‌త‌ను అప్పజెప్పినట్లు సమాచారం.
వీరికి అనుబంధంగా ఐప్యాక్ టీం 
ప్ర‌భుత్వ సంక్షేమం పొందిన ల‌బ్దిదారుల ఓట్లు వైసీపీకి ప‌డేలా చేయ‌డంతో పాటు,
కాపు ఓట్ల చీల్చ‌డం వార్తలు వస్తున్నాయి. 
బీసీ, ఎస్సీ ఓట్లు క‌లుపుకునే వెళ్ళాలా వైసీపీ వ్యూహం వుంది.
గ్రామీణ ప్రాంత ఓట‌ర్లు వైసీపీకి అనుకూలంగా వుండ‌టం కూడా ఆమెకు క‌లిసి వ‌చ్చే అంశం.

ఈ సారి ఎలాగైనా గెలిచి అసెంబ్లీలో అడుగుపెట్టాలని పవన్‌ కల్యాణ్ ప్లాన్‌ చేస్తున్నారు.. 
అయితే, పవన్‌ కల్యాణ్‌కు చెక్ పెట్టేందుకు అధికార వైసీపీ పావులు కదుపుతోంది.. 

By
en-us Political News

  
టీవీకే అధినేత విజయ్‌కు కాంగ్రెస్ మద్దతు తెలపడంపై ఆగ్రహంగా ఉన్న డీఎంకే.. కాంగ్రెస్‌కు కటీఫ్ చెప్పేసింది. మారిన రాజకీయ పరిస్థితుల దృష్ట్యా, లోక్‌సభలో తమ పార్టీ సభ్యులకు కాంగ్రెస్ ఎంపీలతో కాకుండా విడిగా సీటింగ్ కేటాయించాలని డీఎంకే ఎంపీ కనిమొళి స్పీకర్ ఓం బిర్లాకు లేఖ రాశారు.
తాజా సమాచారం ప్రకారం.. విజయ్ తన పార్టీకి ఉన్న బలానికి తోడుగా మరో మూడు పార్టీల మద్దతును కూడగట్టుకున్నారు. ఆ పార్టీల మద్దతుతో అధికారం చేపట్టడానికి అవసరమైన మ్యాజిక్ ఫిగర్ 118ని ఆయన సాధించారు.
తమిళనాడులో ఇటీవల జరిగిన ఎన్నికల తర్వాత, విజయ్ నేతృత్వంలోని టీవీకే పార్టీ ప్రభుత్వ ఏర్పాటుకు సిద్ధమవ్వగా.. మెజారిటీ నిరూపణ విషయంలో రాజేంద్ర విశ్వనాథ్ అర్లేకర్ కచ్చితమైన నిబంధనలు పాటించాలని పట్టుబడుతున్నారు. విజయ్ కు తన పార్టీ ఎమ్మెల్యేలు 107 మందికి అదనంగా కాంగ్రెస్ నుంచి గెలిచిన ఐదుగురు ఎమ్మెల్యేల మద్దతు కూడా ఉంది.
పదవి నుంచి తొలగించిన అనంతరం ఎస్వీఎస్ఎన్ వర్మ తీవ్ర భావోద్వేగానికి లోనయ్యారు. పార్టీ తీసుకున్న ఈ నిర్ణయం తనకు ముందే తెలుసని, నాయకత్వం నుంచి సమాచారం అందిందని చెప్పారు. అయితే పార్టీ కోసం ఎన్నో ఏళ్లుగా కష్టపడి.. క్షేత్రస్థాయిలో కేడర్‌ను కాపాడుకుంటూ వచ్చిన తనకు ఈ పరిణామం మనస్తాపానికి గురిచేసిందన్న ఆవేదన కూడా వ్యక్తం చేశారు.
బాబు కూటమిని ఎందుకంత విలువైన‌దిగా భావిస్తున్నారంటే.. కారణం వైసీపీ. ఆ పార్టీ కూట‌మి ఎప్పుడెప్పుడు చీలిపోతుందాని కాచుకుని కూర్చుని ఉంది. ఏ అవ‌కాశం వ‌చ్చినా వారు వ‌దిలిపెట్టినట్టే క‌నిపించ‌దు. మొన్న కోట వినుత ఘ‌ట‌న‌, నిన్న అర‌వ శ్రీధ‌ర్ వ్య‌వ‌హారం, ఇవాళ వ‌ర్మ ఇష్యూ.. ఇలా స‌మ‌యం దొరికిన‌పుడ‌ల్లా ఆయా అంశాల‌ను బాగా హైలెట్ చేసి.. కూట‌మిలో ఏదో ఒక చిచ్చు రాజేయాల‌ని చూస్తోంది వైసీపీ అధినాయ‌క‌త్వం.
అతి కొద్ది మంది నేతలు జగన్ ప్రకటనను సమర్దిస్తూ.. అనుకూల ప్రకటనలు చేస్తుండగా.. మెజారిటీ లీడర్, క్యాడర్ మాత్రం జగన్ నిర్ణయంపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.
తెలుగువన్ వాస్తవ వేదికలో ప్రస్తుత జాతీయ, ప్రాంతీయ రాజకీయ పరిస్థితులపై విస్తృత చర్చ జరిగింది.
తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ఆ రాష్ట్ర రాజకీయాల్లో పెను సంచలనాన్ని సృష్టించాయి.
టీవీకే అధినేత విజయ్‌తో భేటీ అనంతరం రాజ్ భవన్ ఒక అధికారిక ప్రెస్ నోట్ విడుదల చేసింది. అసెంబ్లీలో ప్రభుత్వం ఏర్పాటు చేయాలంటే ఉండాల్సిన సంఖ్యాబలంపై గవర్నర్.. విజయ్‌కు మార్గనిర్దేశం చేశారు. కేవలం అతిపెద్ద పార్టీగా ఉండటమే కాకుండా, సభలో తగినంత మంది ఎమ్మెల్యేల మద్దతు ఉన్నట్లు ఆధారాలు చూపాలని సూచించారు.
పిఠాపురంలో ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలో చంద్ర‌బాబు ఫొటోలేద‌ని ఆరోపిస్తూ.. మాజీ ఎమ్మెల్యే వ‌ర్మ అధికారుల‌పై ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. ఈ క్ర‌మంలో జ‌న‌సేన నేత‌, మాజీ ఎమ్మెల్యే దొర‌బాబు జోక్యం చేసుకోవ‌డంతో వాగ్వాదం చోటు చేసుకుంది. వ‌ర్మ దురుసు వ్యాఖ్య‌ల‌పై పార్టీలో అంత‌ర్గ‌తంగా చ‌ర్చించిన అధిష్టానం.. వ‌ర్మ వ్య‌వ‌హారాన్ని త‌ప్పుబ‌ట్టింది. ఇంతలోనే వర్మను ఇంచార్జ్ పదవి నుంచి తొలగించడం చర్చనీయాంశంగా మారింది.
రాష్ట్రంలో కొత్త ప్రభుత్వ ఏర్పాటుకు డీఎంకే ఏ విధంగానూ అడ్డుపడబోదన్నారు. రాష్ట్రంలో మరోసారి ఎన్నికలు రావాలని గానీ, రాజ్యాంగ సంక్షోభం తలెత్తాలనీ కానీ తాము కోరుకోవడం లేదన్నఆయన.. ప్రజాతీర్పునకు అనుగుణంగానే డీఎంకే నడుచుకుంటున్నదన్నారు.
గతంలో విజయ్‌కు ఉన్న ప్రాణహాని హెచ్చరికలు.. ఆయన పాపులారిటీని దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం సాయుధ పోలీసులతో కూడిన భద్రతను ఏర్పాటు చేసింది. అయితే.. తాజాగా నిర్వహించిన భద్రతా సమీక్షలో భాగంగా ఆయనకు ఇకపై అదనపు సెక్యూరిటీ అవసరం లేదని అధికారులు భావించినట్లు తెలుస్తోంది.
తాజా ఎన్నికల ఫలితాల్లో నటుడు విజయ్ నేతృత్వంలోని తమిళగ వెట్రి కళగం (టీవీకే) 108 స్థానాలతో సింగిల్ లార్జెస్ట్ పార్టీగా అవతరించిన సంగతి తెలిసిందే. అయితే.. ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన 118 మంది ఎమ్మెల్యేల మద్దతు ఆ పార్టీకి ఇంకా లభించలేదు. కాంగ్రెస్‌తో కలిపి విజయ్ బలం ప్రస్తుతం 112కు చేరినప్పటికీ.. మేజిక్ ఫిగర్‌కు ఇంకా ఆరు అడుగుల దూరంలో ఉంది.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.