ఫోటోలు, వీడియోలు సాక్ష్యాలుగా పరిగణించలేం: ఢిల్లీ హైకోర్టు
Publish Date:Jun 9, 2024
Advertisement
భారతీయ చట్టాలు ప్రధానంగా ఈ మూడింటిని ఆధారంగా చేసుకుని రూపుదిద్దారు. బ్రిటీషు కాలం నుంచి ఇదే విధానం కొనసాగుతుంది. ఒకటి ఇండియన్ పినల్ కోడ్ రెండు ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ , మూడు క్రిమినల్ ప్రొసీజర్ కోడ్. ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ అంటే భారతీయ సాక్ష్యాధార చట్టం. సాక్ష్యం బట్టి నేరం రుజువు అవుతుంది. దేన్ని సాక్ష్యం తీసుకోవాలి అనే విషయంలో ఢిల్లీ హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. అయితే, తన భార్యకు వివాహేతర సంబంధం ఉంది కాబట్టి తాను ఎలాంటి మనోవర్తి చెల్లించాల్సిన అవసరంలేదని భర్త వాదించారు. ఫ్యామిలీ కోర్టు తీర్పును హైకోర్టులో సవాల్ చేశాడు. భార్య వివాహేతర సంబంధానికి సాక్ష్యంగా ఫొటోలను కోర్టుకు సమర్పించాడు. ఈ కేసును జస్టిస్ రాజీవ్ షక్దర్, జస్టిస్ అమిత్ బన్సల్ ల ధర్మాసనం విచారించింది. భార్యకు వివాహేతర సంబంధం ఉందంటూ భర్త సమర్పించిన ఫొటోలు స్పష్టంగా లేవని ధర్మాసనం అభిప్రాయపడింది. అంతేకాదు, డీప్ ఫేక్ ఫొటోల బెడద నేపథ్యంలో ఆ ఫొటోలను సాక్ష్యంగా పరిగణించలేమని స్పష్టం చేసింది. మరింత స్పష్టమైన ఫొటోలు, అవి నిజమైనవేననే ఆధారాలతో కోర్టుకు అందజేస్తే పరిశీలిస్తామని పేర్కొంది.
సాంకేతిక పరిజ్ఞానం రోజురోజుకూ పెరిగిపోతోంది.. డీప్ ఫేక్ ఫొటోలే అసలైన ఫొటోలుగా చలామణి అవుతున్న రోజుల్లో ఫొటోలు, వీడియోలను సాక్ష్యాలుగా పరిగణించలేమని ఢిల్లీ హైకోర్టు పేర్కొంది. కేవలం ఫొటోలు, వీడియోలు ఇస్తే సరిపోదు.. అవి నిజమైనవేననే ఆధారాలను కూడా ఇవ్వాల్సిందేనని తేల్చిచెప్పింది. ఈమేరకు ఓ జంట విడాకుల కేసులో ఢిల్లీ హైకోర్టు ధర్మాసనం ఈ వ్యాఖ్యలు చేసింది. ఢిల్లీకి చెందిన ఓ జంటకు ఫ్యామిలీ కోర్టు విడాకులు మంజూరు చేసింది. భార్య, ఐదేళ్ల కూతురుకు కలిపి నెలనెలా రూ.75 వేలు భరణం కింద చెల్లించాలని భర్తను ఆదేశించింది.
http://www.teluguone.com/news/content/photos-and-videos-cannot-be-considered-as-evidence-25-178195.html





