పేర్ని నానివి దిగజారుడు విమర్శలు!
Publish Date:Jun 18, 2026
Advertisement
రాజకీయాల్లో విమర్శలు, ప్రతివిమర్శలు సాధారణమే అయినా.. ఒక మంచి పనీ, మానవత్వంతో వేసిన అడుగును కూడా రాజకీయం చేయడం తగదంటూ పేర్ని నాని తీరుపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇంతకూ జరిగిందేంటంటే.. ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి తెలంగాణకు చెందిన నిరంజన్ అనే పవన్ కల్యాణ్ అభిమాని తీవ్ర అనోరోగ్యంతో బాధపడుతూ.. తన జీవితంలో పవన్ కళ్యాణ్ను ఒక్కసారైనా కలవాలని ఆశపడ్డాడు. ఈ విషయం తెలుసుకున్న పవన్ కళ్యాణ్.. మానవత్వంతో స్వయంగా వెళ్లి ఆ 17 ఏళ్ల కుర్రాడిని కలిసి, అతనితో కొంత సమయం గడిపారు. వైద్యం కోసం ఆర్థిక సహాయం అందించారు. పవన్ కల్యాణ్ మానవత్వంతో స్పందించిన తీరు పట్ల రాజకీయాలకు అతీతంగా అన్ని వర్గాల నుంచీ ప్రశంసలు వెల్లువెత్తాయి. అయితే.. వైసిపి నేత పెర్ని నాని ఈ విషయంపై చేసిన వ్యాఖ్యలపై సర్వత్రా ఆగ్రహం వ్యక్తం అవుతోంది. పవన్ కళ్యాణ్ ఆంధ్రా ప్రజల సమస్యలను పట్టించుకోవడం లేదనీ.. కానీ తెలంగాణలో ఎవడో ఒంట్లో బాలేదు అంటే వస్తున్నా తమ్ముడూ అంటూ వెళ్ళిపోయారంటూ చేసిన వ్యాఖ్యల పట్ల సర్వత్రా ఆగ్రహం వ్యక్తం అవుతోంది. పేర్ని నానివి దిగజారుడు వ్యాఖ్యలను విమర్శలు వెల్లువెత్తుతుననాయి. ప్రాణాంతక వ్యాధితో పోరాడుతున్న ఒక బాలుడిని కూడా రాజకీయాల్లోకి లాగడం, ఆనారోగ్యంతో ఉన్న వ్యక్తిని వాడు అంటూ అనుచితంగా పేర్కొనడం దారుణమని నెటిజనులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మంచిని మంచిగా చూడలేని ఇలాంటి సంకుచిత రాజకీయాలు సమాజానికి చెడు సంకేతాలు ఇస్తాయని దుయ్యపడతున్నారు.
http://www.teluguone.com/news/content/perni-nanis-cheapcriticisms-39-223364.html





