Publish Date:Sep 26, 2024
మాజీ మంత్రి, ఒంగోలు మాజీ ఎమ్మెల్యే బాలినేని రాజకీయ అడుగులు తడబడుతున్నాయి. ఆయన ఒకటి తలిస్తే మరోటి జరుగుతోంది. వైసీపీలో ఓ మూడేళ్ల పాటు ఓ వెలుగు వెలిగిన బాలినేని.. అప్పట్లో జగన్ మంత్రివర్గాన్ని పునర్వ్యవస్థీకరించిన సమయంలో మంత్రి పదవి కోల్పోయారు. అప్పటి నుంచీ ఆయన జగన్ తో టామ్ అండ్ జెర్రీ ఆట ఆడుతూ వస్తున్నారు. అలకలు, అసంతృప్తులతో జగన్ కు చెవిలో జోరీగలా, చెప్పులో రాయిలా మారారు.
అయితే జగన్ అధికారం కోల్పోయే వరకూ వైసీపీతో, జగన్ తో తన బంధం తెగకుండా అన్ని జాగ్రత్తలూ తీసుకున్నారు. ఎప్పుడూ కూడా ఆయన తెగే వరకూ లాగలేదు. జగన్ నుంచి చిన్న పాటి పిలుపుకు, బుజ్జగింపులకు మెత్తబడిపోయారు. అయితే జగన్ అధికారం కోల్పోయాకా.. ఇంకా ఎందుకు అనుకు న్నారేమో వైసీపీకి రాజీనామా చేసేసి జనసేన గూటికి చేరడానికి రెడీ అయిపోయారు. అయితే ఒంగోలులో తెలుగుదేశం, జనసేన శ్రేణులు ఆయన చేరికను తీవ్రంగా వ్యతిరేకించాయి. అయినా కూడా జనసేనాని బాలినేని చేరికకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారు. దీంతో ఆయన గురువారం (సెప్టెంబర్26)న జనసేన తీర్ధం పుచ్చుకోవడానికి రెడీ అయిపోయారు. జనసేనాని పవన్ కల్యాణ్ సమక్షంలో అట్టహాసంగా, మందీ మార్బలంతో పెద్ద ఎత్తున బలప్రదర్శనతో ఆయన జనసేన తీర్థం పుచ్చుకోవడానికి రెడీ అయిపోయారు. అయితే ఇక్కడే పవన్ కల్యాణ్ ఆయనకు ఊహించని ఝలక్ ఇచ్చారు.
బాలినేని బలప్రదర్శనకు ఆయన అంగీకరించలేదు. మంది మార్బలంతో, అనుచరగణంలో జనసేనలో చేరాలన్న బాలినేని ఆశలను పవన్ కల్యాణ్ మొగ్గలోనే తుంచేశారు. బాలినేని చేరిక సందర్భంగా ర్యాలీకి కూడా జనసేన అధిష్ఠానం అనుమతించలేదు. దీంతో తాను జనసేనలో చేరేది లేదంటూ అలగడానికి ప్రయత్నించినా.. జనసేన అధినేత స్పందించలేదు.
దీంతో గత్యంతరం లేక ఒంటరిగానే అంటే ఒక్కడుగానే పార్టీలో చేరేందుకు సిద్ధమైపోయారు బాలినేని. చేరాలనుకుంటే ఒక్కడివే మంగళగిరి వచ్చి జనసేన కండువా కప్పుకో.. అంతే కానీ ఒంగోలులో సభ, భారీ ర్యాలీ అంటే కుదరదని జనసేన అధినేత కుండబద్దలు కొట్టినట్లు బాలినేనికి చెప్పేశారని తెలుస్తోంది.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/pawankalyan-no-to-balineni-rally-39-185624.html
తమిళనాడు రాజకీయాల్లో పెను మార్పులు చోటుచేసుకుంటున్న వేళ
బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ అఖండ విజయం సాధించడంలో సువేందు కీ రోల్ పోషించారు. ఆ పార్టీ 206 స్థానాల్లో గెలిచి బెంగాల్లో తొలిసారిగా అధికారం చేపట్టబోతోంది. బీజేపీ తరఫున రెండు స్ధానాల నుంచి బరిలోకి దిగిన సువేందు అధికారి.. మరోసారి మమతా బెనర్జీని ఓడించారు. భవానిపూర్లో దీదీపై గెలిచిన ఆయన.. తన సొంత నియోజకవర్గమైన నందిగ్రామ్లోనూ గెలిచి పట్టు నిలుపుకున్నారు.
ముఖ్యంగా అస్సాం, పశ్చిమబెంగాల్ లో బీజేపీ ఎన్నికల సంఘం సహకారంతో ఫలితాలను చోరీ చేసిందన్నారు.
పశ్చిమబెంగాల్లో మూడున్నర దశాబ్దాల ఏళ్ల సీపీఎం పాలనకు బ్రేక్ వేసి 2011లో అధికార పగ్గాలు చేపట్టిన తృణముల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్టీ.. 2026 వరకు వరుస విజయాలతో ముఖ్యమంత్రిగా కొనసాగారు. ఆమె 15 ఏళ్ల ఆధిపత్యానికి ఎన్డీఏ తెర దించింది. మమతా సైతం కాంగ్రెస్లో కేంద్రమంత్రిగా, పలు కీలక పదవులు నిర్వహించి, తర్వాత సొంత కుంపటి పెట్టుకున్న నాయకురాలే కావడం గమనార్హం.
ప్రజా సమస్యలపై స్పష్టమైన అజెండాతో ఎన్నికల బరిలోకి దిగిన విజయ్ను తమిళ ప్రజలు ఆదరించడం శుభపరిణామమన్నారు.
తన పార్టీ స్థాపించిన నాటి నుండి నేటి వరకు ఆయన సాగించిన ప్రయాణం ఒక అద్భుతమైన రాజకీయ థ్రిల్లర్ను తలపిస్తుంది. ఎన్నికల ప్రచార సమయంలో విజయ్ అనేక ఆటంకాలను ఎదుర్కొన్నారు. ప్రత్యర్థి పార్టీల నుండి వచ్చిన తీవ్ర విమర్శలు, అధికార యంత్రాంగం విధించిన ఆంక్షలు ఆయనను ఉక్కిరిబిక్కిరి చేశాయి. వ్యక్తిగత జీవితంపై జరిగిన దుష్ప్రచారం విజయ్ ఇమేజ్ను దెబ్బతీస్తుందని అందరూ భావించారు.
తమిళనాడులో టీవీకే పార్టీ విజయాన్నిస్వాగతిస్తూ.. వైసీపీ సోషల్ మీడియా వేదికగా సంబరాలు మొదలు పెట్టింది. విజయ్ సాధించిన ఈ అద్భుత విజయం వెనుక వైసీపీ అధినేత జగన్ సహకారం ఉందంటూ వైసీపీ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున పోస్టులు వెల్లువెత్తుతున్నాయి. ముఖ్యంగా గతంలో ఒక వివాహ వేడుకలో వైఎస్ జగన్, విజయ్ ఇద్దరూ కలిసి దిగిన ఒక ఫోటోను ఇప్పుడు వైసీపీ నెట్టింట వైరల్ చేస్తోంది.
ఈ ఎన్నికల ఫలితాల్లో విజయ్ టవీకే పార్టీ స్పష్టమైన ఆధిక్యత కనబరిచింది. ప్రభుత్వ వ్యతిరేకతతో పాటు, కూటమి పక్షాల మధ్య సరైన సమన్వయం లేకపోవడం కూడా ఈ ఓటమికి ప్రధాన కారణాలుగా కనిపిస్తున్నాయి.
1982లో తెలుగువారి ఆత్మగౌరవం నినాదంతో తెలుగుదేశం పార్టీని స్థాపించిన ఎన్టీఆర్, కేవలం 9 నెలల కాలంలోనే రాష్ట్రమంతటా పర్యటించి ప్రభంజనం సృష్టించారు. 1983 ఎన్నికల్లో కాంగ్రెస్ వంటి బలమైన పార్టీని మట్టికరిపించి, తొలి ప్రయత్నంలోనే ముఖ్యమంత్రి పీఠాన్ని అధిష్టించి రికార్డ్ సృష్టించారు.
భారత రాజకీయ యవనికపై భారతీయ జనతా పార్టీ తన ఉనికిని మరింత శక్తివంతం చేస్తోంది.
చారిత్రాత్మక విజయం ఖాయమని తేలడంతో.. విజయం అభిమానుల సంబరాలు మిన్నంటాయి. అయితే.. ఈ నేపథ్యంలో సినీ నటి త్రిష పేరు సోషల్ మీడియాలో విపరీతంగా ట్రెండ్ అవుతోంది.
ఈ నియోజకవర్గం నుంచిఎన్డీయూ కూటమి అభ్యర్థి మల్లాడి కృష్ణారావు విజయం సాధించారు. తన సమీప ప్రత్యర్థి, కాంగ్రెస్ అభ్యర్థి గొల్లపల్లి అశోక్ పై నాలుగువేల ఐదు వందల ఓట్ల పైచిలుకు మెజారిటీతో గెలుపొందారు.
ఎన్నికల ఫలితాల్లో ఎన్డీయే కూటమి సాధించిన ఘన విజయంపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు హర్షం వ్యక్తం చేశారు.