తెలుగు విషయంలో టాలీవుడ్ వ్యవహరిస్తున్న తీరు పై అసహనం వ్యక్తం చేశారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్. రాయలసీమలో పర్యటస్తూ.. ఆయన తిరుపతిలో తెలుగు భాషాభిమానుల ఆత్మీయ సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా తెలుగు చిత్ర పరిశ్రమ తీరు పై విమర్శలు గుప్పించారు. తెలుగు సినిమా సాహిత్యం రానురాను దిగజారిపోతోందని ఆవేదన వ్యక్తం చేశారు. తెలుగు హీరోలకు తెలుగు రాయడం, మాట్లాడటం రాదన్నారు. తెలుగు సినిమాలతో వచ్చే డబ్బులు మాత్రమే హీరోలకు కావాలని మండిపడ్డారు. ఏపిలో తెలుగు మీడియం రద్దు పై తెలుగు చిత్ర పరిశ్రమ నుంచి ఒక్కరు కూడా స్పందించలేదన్నారు. తెలుగు సినిమాలు తీస్తూ ఎవరూ మాట్లాడకపోవటం పై విభిన్న వర్గాల నుంచి విమర్శలు కూడా వచ్చాయి. ఏపీ ప్రభుత్వ నిర్ణయం పై విమర్శలు చేసి లేనిపోని చిక్కులు తెచ్చుకోవడం ఎందుకని నోరు విప్పలేదని కూడా అనుకుంటున్నారు. ఇప్పుడు చిత్ర పరిశ్రమలో స్టార్ హీరోగా ఉండి రాజకీయాల్లోకి వచ్చిన పవన్ కళ్యాణ్ ఈ తీరు పై పరోక్షంగా విమర్శలు ఎక్కుపెట్టారని అంచనా వేస్తున్నారు. అందులోనూ తాను ఒక హీరోగా ఉన్నవారే.. అయినా కూడా తోటి హీరోలపై గురి పెట్టడమే చాలామందిని ఆశ్చర్యానికి గురిచేస్తోంది.
ఇప్పుడున్న యువతరం హీరోల్లో ఎక్కువ మంది వారసులే ఉన్నారు. వాళ్లలో చెన్నైలో పుట్టి పెరిగినవారే ఎక్కువ. ఇంగ్లీష్ మీడియంలో తమిళం ఒక సబ్జెక్టుగా చదువుకుని ఉంటారు కానీ తెలుగు చాలామందికి తెలియదు. మాట్లాడ్డం మాత్రమే ఎక్కువ మంది హీరోలకి వచ్చు. చదవడం, రాయడం రాదు. హీరోల్లో ఎవరెవరికి తెలుగు చదవడం రాయడం వచ్చో టాలీవుడ్ లో చాలా మందికి క్లారిటీ వుంది కానీ ఎవరూ నేరుగా చెప్పరు. స్టార్ హీరోల్లో టాప్ రేంజ్ లో వున్న ఓ నటుడు నిజాయితీగా తన తెలుగు గురించి చెబుతూ ఉంటారు. తనకు తెలుగు మాట్లాడడమే వచ్చని చదవడం రాయడం రాదని చాలా సందర్భాల్లో చెప్పారు. తెలుగు విషయంలో టాలీవుడ్ తీరును పవన్ కళ్యాణ్ సూటిగానే విమర్శించారు. ఇందులో ఇతర హీరోల ప్రస్తావన కూడా తీసుకువచ్చారు. అందుకే టాలీవుడ్ లో ఈ విమర్శల హాట్ టాపిక్ అయ్యాయి. ఎన్నికల ప్రచార సమయంలో కొంత మంది టాలీవుడ్ నటులు పవన్ పై ఘాటు విమర్శలు చేశారు. వారిని మళ్లీ వైసీపీ తెరమీదక తెచ్చే అవకాశం ఉందటున్నారు. మరోవైపు ఏ పార్టీలతో సంబంధం లేని వారు మాత్రం ఈ విషయం పై స్పందించకపోతేనే బెటర్ అని అనుకుంటున్నట్లు చెప్తున్నారు.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/pawan-kalyan-shocking-comments-on-tollywood-heros-39-91856.html
ఇటీవల అనారోగ్యంతో మరణించిన టీడీపీ నేత అప్పలనాయుడు కుటుంబాన్ని మంత్రి లోకేష్ పరామర్శించారు.
ఐదేళ్ల పాటు ఢిల్లీలో చక్రం తిప్పారు. కవిత ఎడ్యుకేటెడ్ కావడం, హిందీ కూడా బాగానే మాట్లాడగలగడంతో జాతీయ స్థాయి ప్రతినిథిగా ఉండేవారు. అయితే కవిత రెండో సారి ఎంపీగా గెలవలేక పోయారు
ఖమ్మంలో బీఆర్ఎస్కు భారీ షాక్ తగిలింది.
పైరసీ, కాపీ రైట్ ఉల్లంఘనలు, అక్రమ ప్రసారాలు, ఆర్థిక లావాదేవీలకు సంబంధించి పలు అంశాలు విచారణలో వెలుగు చూసిన నేపథ్యంలో ఐబోమ్మ రవికి బెయిలు మంజూరు చేయవద్దంటూ పోలీసులు కోర్టుకు తెలిపారు.
ఈ విమానాశ్రయం కోసం పార్లమెంటులో తాను పలుమార్లు గట్టిగా గళమెత్తానని చెప్పుకున్నారు. ఇప్పుడూ విమానాశ్రయం దాదాపుగా పూర్తై.. త్వరలో ఆపరేషన్స్ ప్రారంభం కావడానికి రెడీ అవుతుండటం తనకు చాలా సంతోషంగా ఉందన్నారు. అంతే తప్ప ఈ విమానాశ్రయం విషయంలో జరుగుతున్న రాజకీయ రచ్చ గురించి ఒక్కటంటే ఒక్క మాట మాట్లాడలేదు. అలాగే ఈ విమానాశ్రయానికి రెండో సారి శంకుస్థాపన చేసిన జగన్ ఊసెత్తలేదు.
తెలంగాణలో మరో కొత్త పార్టీ రాబోతోంది.
ఇబ్రహీంపట్నం కాంగ్రెస్ ఎమ్మెల్యే మల్ రెడ్డి రంగారెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
ఎలాగైనా అధికారాన్ని నిలబెట్టుకోవాలని అధికార డీఎంకే, బీజేపీతో పొత్తు ఉపయోగించుకుని రాష్ట్రంలో అధికారపగ్గాలు చేజిక్కించుకోవాలని ప్రతిపక్ష అన్నాడీఎంకే వ్యూహాలు రచిస్తున్నాయి. ఇక రాజకీయ పార్టీ స్థాపించి సినీ రంగం నుంచి రాజకీయరంగంలోకి దూకిన హీరో విజయ్ తన టివీకే పార్టీ తరఫున ఒంటరిగా ఎన్నికల రణరంగంలోకి దిగనున్నారు.
రండవాణేలోని కల్మాడీ హౌస్లో ఆయన భౌతికకాయాన్ని ప్రజల సందర్శనార్థం ఉంచుతారు. ఆ తరువాత సాయంత్రం మూడున్నర గంటలకు పుణెలోని వైకుంఠ శ్మశానవాటికలో అంత్యక్రియలు నిర్వహించనున్నారు.
ఫోన్ ట్యాపింగ్ ఎక్విపిమెంట్ కొనుగోలుకు అవసరమైన డబ్బును సమకూర్చింది నవీన్ రావే అని సిట్ విచారణలో తేలింది. అంతే కాకుండా, పాల్ రవి కుమార్ ద్వారా ట్యాపింగ్ ఎక్విపిమెంట్ను సమకూర్చినట్లు సిట్ నిర్ధారణకు వచ్చింది. పోన్ ట్యాపింగ్ కు ఒక ప్రైవేటు వ్యవహారంగా కాకుండా అది వ్యవస్థీకృతంగా పని చేసిందని నవీన్ రావు విచారణలో బయటపడినట్లు తెలుస్తోంది.
ఈ కేసుకు సంబంధించి తెలంగాణ ప్రభుత్వం దాఖలు చేసిన స్పెషల్ లీవ్ పిటిషన్ ను సుప్రీం ధర్మాసనం డిస్మిస్ చేసింది. ఫోన్ ట్యాపింగ్ కేసులో హరీష్ రావును విచారించేందుకు అనుమతి ఇవ్వాలంటూ తెలంగాణ ప్రభుత్వం సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. ప్రభుత్వం తరఫున సీనియర్ న్యాయవాది సిద్ధార్థ్ లూథ్రా వాదనలు వినిపించారు.
రద్దు చేసిన కమిటీల స్థానంలో నెల రోజుల పాటు ఉండేలా అడ్ హాక్ కమిటీలను నియమిస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ కమిటీలు రాష్ట్ర వ్యాప్తంగా క్షేత్రస్థాయిలో పర్యటించి అందజేసే నివేదిక ఆధారంగా కొత్త కమిటీలను ప్రకటించనున్నట్లు పేర్కొన్నారు.
తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కవిత మరోసారి హరీష్ రావుపై హాట్ కామెంట్స్ చేశారు.