వైకాపా హటావ్ సీమాంద్రా బచావ్: పవన్ కళ్యాణ్

Publish Date:Apr 30, 2014

Advertisement

 

బుదవారం సాయంత్రం తిరుపతిలో తెదేపా-బీజేపీలు నిర్వహించిన ఎన్నికల ప్రచార సభలో పవన్ కళ్యాణ్ చాలా ఉద్వేగంగా, ప్రజలను ఆక్కటుకొనే విధంగా ప్రసంగించారు. “మాజీ ముఖ్యమంత్రి స్వర్గీయ వైయస్స్ రాజశేఖర్ రెడ్డి, ఆయన మంత్రులు, కుటుంబ సభ్యులు కలిసి విచ్చలవిడిగా రాష్ట్రాన్ని ముఖ్యంగా తెలంగాణా ప్రాంతాన్ని , వారి భూములను దోచుకొన్నారు. అప్పటి నుండే తెలంగాణా ప్రజలలో తాము దోచుకోబడుతున్నామనే భావన పెరగసాగింది. ఆ అవకాశాన్ని కేసీఆర్ చాలా తెలివిగా ఉపయోగించుకొని, ప్రజలలో విద్వేషాలు రెచ్చగొడుతూ చివరికి రాష్ట్ర విభజనకి కారకులయ్యారు.

 

కేసీఆర్, రాజశేఖర్ రెడ్డి ఇద్దరూ చేస్తున్న అన్యాయం చూస్తున్న నాకు చాలా ఆవేశం కలిగేది. కానీ, నావల్ల ఈ సమస్య మరింత జటిలం కాకూడదనే ఆలోచనతోనే నేను ఇంతకాలంగా నోరు విప్పలేదు. కానీ, అత్యంత అవమానకరంగా తెలుగుజాతిని విభజించిన తరువాత నేను ఇక సహించలేక రాజకీయాలలో ప్రవేశించాను. నాకు అధికారం, పదవులు సంపాదించుకోవాలనే తపన ఎంత మాత్రం లేదు. కేవలం దేశ సమగ్రతను కాపాడుకోవాలనే తపనతోనే నేను రాజకీయాలలోకి వచ్చేను. అందువల్ల ఈ కేసీఆర్, తెరాస నేతల బెదిరింపులకి, వారు నాపై పెడుతున్న కేసులకి బయపడేది లేదు, జైలుకి వెళ్లేందుకు కూడా భయపడను. కేసీఆర్ దేశానికి ప్రధాని కాబోతున్న వ్యక్తి పట్ల చాలా అవమానకరంగా మాట్లాడారు. ముందు ఆయన మోడీ గారికి క్షమాపణ చెపితే అప్పుడు నేనేమి చేస్తానో చెపుతాను.

 

సర్దార్ వల్లబ్ భాయ్ పటేల్ వంటి మహానుభావులు దేశాన్ని సమగ్రంగా నిలిపి ఉంచేందుకు ప్రయత్నిస్తే, కేసీఆర్, సోనియా, రాహుల్ గాంధీ వంటి వారు తమ స్వార్ధ ప్రయోజనాల కోసం దేశసమగ్రతకు భంగం కలిగించడానికి కూడా వెనుకాడటం లేదు.అందుకే ప్రజలు కాంగ్రెస్, తెరాసలకు బుద్ధి చెప్పాలని కోరుకొంటున్నాను. అందుకే ‘కాంగ్రెస్ హటావ్ దేశ్ బచావ్’ అని నినదిస్తున్నాను.

 

ఇప్పుడు ఇక్కడ “వైకాపా హాటావ్ సీమాంధ్ర బచావ్” అని పిలుపునిస్తున్నాను. ఎందుకంటే ఆ రెండు పార్టీలు దొందుకు దొందే. కేసీఆర్ సీమాంద్రా ప్రజలను అంత ఘోరంగా అవమానిస్తుంటే, సీమాంద్రాకు ముఖ్యమంత్రి అవుదామని కలలుగంటున్న జగన్మోహన్ రెడ్డి ఏనాడు ఎందుకు అభ్యంతరం చెప్పలేదు? ఎందుకు అతనిని ఎదుర్కొనేందుకు ప్రయత్నించలేదు? అతనిని చూసి ఎందుకు భయపడుతున్నారు? అంటే వారిరువురూ కూడా కాంగ్రెస్ అధిష్టానంతో రహస్య అవగాహన కలిగినవారే గనుక. అందుకే వారు ఒకరినొకరు విమర్శించుకోరు. తెలుగు ప్రజల ఆత్మగౌరవం కాపాడలేని జగన్మోహన్ రెడ్డి ఏవిధంగా వారికి ముఖ్యమంత్రి అవుదామని ఆశిస్తున్నారు? అతని ఆ అర్హతే లేదు.

 

నేను తెలంగాణా పల్లె పల్లెలో కూడా తిరిగి వచ్చాను. కానీ జగన్మోహన్ రెడ్డి దైర్యంగా తెలంగాణాలో తిరగగలరా? అక్కడి ప్రజలకి సీమాంధ్ర ప్రజలపై ఎటువంటి ద్వేష భావనలు లేవు. వారు కేవలం తమను దోపిడీ చేసిన రాజశేఖర్ రెడ్డి వంటి వారిని మాత్రమే వారు ద్వేషిస్తున్నారు. అటువంటి వారికి అధికారం కట్టబెడితే మళ్ళీ భూ కబ్జాలు, దోపిడీ రాజ్యమే వస్తుంది. వైకాపాకి ఓటేస్తే అది కాంగ్రెస్ పార్టీకి వేసిన ఓటే అవుతుంది. సమైక్యంగా ఉన్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్నే దోచేసిన వారికి విడిపోయిన చిన్న రాష్ట్రాన్నిదోచేయడం పెద్ద కష్టమేమీ కాదు. గుడిని మింగిన వారికి ధ్వజస్థంభం మింగేయడం కష్టమా? అందువల్ల వైకాపా ‘హటావ్ సీమాంద్రా బచావ్’ అని పిలుపునిస్తున్నాను.

 

ఇటువంటి క్లిష్ట పరిస్థితుల్లో ఉన్న మన రాష్ట్రాన్ని, దేశాన్ని కాపాడుకోవడానికి మనం తెలుగుదేశం, బీజేపీ అభ్యర్ధులకే ఓటేసి గెలిపించు కోవలసిన అవసరం ఉంది. రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు, కేంద్రంలో నరేంద్ర మోడీ అధికారం చేపడితే మన రాష్ట్రం దేశం రెండూ కూడా సత్వర అభివృద్ధి సాధిస్తాయని నేను దృడంగా నమ్ముతున్నాను. అందుకే మిమ్మల్ని కూడా తెదేపా-బీజేపీ అభ్యర్ధులకే ఓటేసి గెలిపించమని కోరుతున్నాను,” అని పవన్ కళ్యాణ్ తన ప్రసంగం ముగించారు.

By
en-us Political News

  
నగర ప్రజల చిరకాల స్వప్నమైన హైదరాబాద్ మెట్రో విస్తరణ, నిధుల విడుదలే లక్ష్యంగా వీరిద్దరూ కలిసి కేంద్ర రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్‌తో భేటీ అయ్యారు. దాదాపు రెండు గంటల పాటు సాగిన ఈ భేటీ చాలా సానుకూల వాతావరణంలో జరిగిందనీ, మెట్రో ప్రాజెక్టుకు ఎదురవుతున్న ఆర్థిక అవరోధాలను అధిగమించడానికి ఇదొక కీలక ముందడుగని సీఎం రేవంత్ రెడ్డి భేటీ అనంతరం పేర్కొన్నారు.
స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ విధానాన్ని సమర్ధంగా, ఎఫెక్టివ్ గా అమలు చేయగలుగుతున్నామని చెప్పారు. ఇప్పుడు సీఎం నారా చంద్రబాబు నాయుడు దీనిని మరొక మెట్టు పైకి తీసుకువెళ్లి ముందుకు తీసుకెళ్లి ఈజ్ ఆఫ్ లివింగ్ అనే భావనను తీసుకొచ్చారనీ, ప్రజలు, ప్రభుత్వానికి మధ్య సంబంధాలలో ఎప్పటినుంచో అనేక అంతరాలు, ఘర్షణలు ఉన్నాయనీ, సాంకేతికత ద్వారా ఆ అవరోధాలను తొలగించాలనేదే మా ఆలోచన అన్నారు.
ఎక్స్‌ప్రెస్ అడ్డా వేదికపైకి విప్లవాత్మక మార్పులకు, పాలనా విధానాలకు కేంద్ర బిందువులుగా నిలిచే అత్యున్నత ప్రముఖులను మాత్రమే ఆహ్వానిస్తారు. గతంలో ఈ వేదికపై కేంద్ర మంత్రులు ఎస్. జైశంకర్, నితిన్ గడ్కరీ, నోబెల్ బహుమతి గ్రహీత అమర్త్య సేన్ వంటి దిగ్గజాలు పాల్గొని ప్రసంగించారు. ఇప్పుడు ఆ లీగ్‌లో నారా లోకేష్ నిలవడం ఆయన స్థాయిని రుజువు చేస్తోంది.
తెలుగువన్ ఎండీ కంఠంనేని రవిశంకర్ తో కలిసి తెలుగువన్ వాస్తవవేదికలో మాట్లాడిన ఆయన మోదీ, అమిత్ షా రాజకీయ చాణక్యాన్ని తట్టుకోవడంలో ప్రాంతీయ పార్టీలు పూర్తిగా విఫలమవుతున్నాయని, వ్యూహాత్మక ఒంటరితనం లేదా అంతర్గత బలహీనతలు ఆయా పార్టీలను దెబ్బతీస్తున్నాయని విశ్లేషించారు.
గత ప్రభుత్వ హయాంలో దాదాపు 1.25 లక్షల సచివాలయ పోస్టుల భర్తీ కోసం నిర్వహించిన పరీక్షకు 19 లక్షల మందికి పైగా నిరుద్యోగులు హాజరయ్యారు. నిబంధనల ప్రకారం జనరల్ కేటగిరీకి 60 మార్కులు, బీసీలకు 52.5 మార్కులు, ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులకు 45 మార్కులను కనీస అర్హతగా నిర్ణయించారు. అయితే.. అధికారిక వెబ్‌సైట్‌లో ఎక్కడా అభ్యర్థుల పేర్లు, వయసు, సాధించిన మార్కులతో కూడిన పూర్తి స్థాయి మెరిట్ జాబితాను బహిర్గతం చేయకుండా కేవలం మొబైల్ ఫోన్లకు సమాచారం పంపి నాటకీయంగా ప్రక్రియ ముగించారని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
బీఆర్‌ఎస్ కార్యకర్తలను వేధించిన ఏ ఒక్కరినీ వదిలిపెట్టబోనని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హెచ్చరించారు.
బిజెపి ఏపీలో తన బలాన్ని మరింత పెంచుకోవడానికి ఆపరేషన్ ఆకర్ష్ కు తెరలేపింది. అందులో భాగంగానే వైసిపికి చెందిన ముగ్గురు లోక్‌సభ సభ్యులతో బిజెపి అగ్రనాయకత్వం ఇప్పటికే సంప్రదింపులు జరిపినట్లు రాజకీయవర్గాలలో గట్టిగా వినిపిస్తోంది.
తెలంగాణ రాజకీయాల్లో విమర్శలు, ప్రతివిమర్శలు ఎప్పుడూ ఆసక్తికరంగానే సాగుతుంటాయి.
వైకాపాకు చెందిన కొందరు రౌడీ మూకలు రక్తం పారిస్తాం, నరికేస్తాం అంటూ కెమెరాల ముందు ప్రగల్భాలు పలుకుతున్నారని, అలాంటి పిచ్చి చేష్టలు తమ వద్ద సాగవని పవన్ కళ్యాణ్ గట్టి హెచ్చరికలు జారీ చేశారు.
లాకర్లలో సుమారు రెండున్నర కిలోల బంగారు ఆభరణాలను ఏసీబీ స్వాధీనం చేసుకుంది. మరో లాకర్‌లో సుమారు రూ.1.50 కోట్ల నగదు లభ్యమైనట్లు అధికారులు వెల్లడించారు. ఇప్పటికే నరహరి నివాసంలో నిర్వహించిన సోదాల్లో రూ.1.50 కోట్ల నగదును స్వాధీనం చేసుకున్న ఏసీబీ, ఇప్పుడు లాకర్ల నుంచి మరో రూ.1.50 కోట్ల నగదును స్వాధీనం చేసుకోవడంతో మొత్తం నగదు రూ.3 కోట్లకు పైగా చేరింది.
కేంద్రకేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలనే ఏకైక డిమాండ్‌తోనే ఈ కాక్రోచ్ ఉద్యమకారులు ముందుకు వెళ్తున్నారన్న డోలేంద్ర ప్రసాద్.. దీనికి ఆర్గనైజ్డ్ పద్ధతి లేకపోవడం వల్ల ఆశించిన స్థాయిలో ప్రభావం చూపలేకపోతోందన్నారు. విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలనే ఏకైక డిమాండ్‌తోనే ఈ కాక్రోచ్ ఉద్యమకారులు ముందుకు వెళ్తున్నారన్న డోలేంద్ర ప్రసాద్.. అయితే దీనికి నిర్దిష్టమైన ఆర్గనైజ్డ్ పద్ధతి లేకపోవడం వల్ల ఆశించిన స్థాయిలో ప్రభావం చూపలేకపోతోందన్నారు.
జగన్మోహన్ రెడ్డి చేస్తున్న ఈ హడావిడి వెనుక సాయికృష్ణ కుటుంబంపై ప్రేమ ఎంతమాత్రం లేదని తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి అప్పసాని రాజేష్ స్పష్టం చేశారు. జగన్ అసలు టార్గెట్ సీఐ నాగరాజు కాదనీ.. ఆయన ప్రధాన లక్ష్యం విజయవాడ పోలీస్ కమిషనర్ రాజశేఖర్ బాబు అని విశ్లేషించారు.
అధికార కూటమికి చెందిన నాయకులు, చివరికి హోం మంత్రి సైతం క్షేత్రస్థాయికి వెళ్లి బాధితులను పరామర్శించకపోవడం, సరైన క్లారిటీ ఇవ్వకపోవడంపై సీఎం చంద్రబాబు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. ప్రభుత్వ ప్రతిష్టను మసకబార్చేలా ప్రవర్తిస్తున్న అధికారుల తీరుపై ఆయన మండిపడ్డారు. తప్పు చేసిన వారు ఎంతటి వారైనా చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకోవాలని పోలీస్ బాస్ ను ఆదేశించారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.