జనసేనలో పవన్ ప్రక్షాళన...ప్రకాశం జిల్లా పార్టీ కమిటీ రద్దు

Publish Date:May 25, 2026

Advertisement

 

జనసేన పార్టీ బలోపేతంపై దృష్టి సారించిన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పార్టీ అంతర్గత వ్యవహారాల్లో సంచలన నిర్ణయాలు తీసుకోవడం ప్రారంభించారు. పార్టీలో ఎట్టిపరిస్థితుల్లోనూ క్రమశిక్షణారాహిత్యాన్ని సహించేది లేదని ఆయన తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు. ఇందులో భాగంగానే ప్రకాశం జిల్లా జనసేన కమిటీని పూర్తిగా రద్దు చేస్తున్నట్లు ఆయన ప్రకటించారు.

రాజమండ్రి వేదికగా నిర్వహించిన పార్లమెంటరీ స్థాయి కీలక ప్రతినిధులు, క్రియాశీలక కార్యకర్తల సదస్సులో పవన్ కళ్యాణ్ ఈ వ్యాఖ్యలు చేశారు. గత పన్నెండేళ్లుగా తాను చూపిస్తూ వస్తున్న ఓపికకు ఇక ముగింపు పలికే సమయం ఆసన్నమైందని వ్యాఖ్యానించారు. పార్టీని మరింత పటిష్ఠమైన సైనిక క్రమశిక్షణ గల వ్యవస్థగా రూపాంతరం చెందించేందుకు కఠిన నిర్ణయాలకు వెనుకాడబోనని స్పష్టం చేశారు.

ప్రకాశం జిల్లా కమిటీ పరిధిలో చోటుచేసుకుంటున్న గ్రూపు రాజకీయాల పట్ల పవన్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. కేవలం పాతిక మంది సభ్యులు ఉన్న చోట ఏకంగా యాభైకి పైగా అంతర్గత వివాదాలు తలెత్తడంపై ఆయన ఆవేదన చెందారు. ఇలాంటి వర్గ విభేదాల కారణంగా ఒకరిని ఒకరు తొక్కేస్తూ, పార్టీ ప్రతిష్ఠను మసకబారుస్తున్నారని నేతల తీరును తప్పుబట్టారు.

సమావేశంలో నాయకులకు దిశానిర్దేశం చేస్తూ.. ఇప్పటివరకు పార్టీ శ్రేణులకు పూర్తి స్వేచ్ఛను ఇచ్చానని, కానీ ఇకపై నిబంధనల ప్రకారమే నడుచుకోవాల్సి ఉంటుందని తేల్చిచెప్పారు. "పార్టీ నిర్దేశించిన మార్గంలో కలిసి నడవండి, లేదంటే తప్పుకోండి" (ఫాల్ ఇన్ లైన్ ఆర్ ఫాల్ అవుట్ ఆఫ్ లైన్) అంటూ గట్టి సంకేతాలు పంపారు.

ఈ నిర్ణయంతో పార్టీలో పదవులు అనుభవిస్తూ గ్రూపు రాజకీయాలను ప్రోత్సహించే ఏ స్థాయి నేతలకైనా కఠిన చర్యలు తప్పవనే స్పష్టమైన హెచ్చరిక వెళ్ళింది. కేవలం ఎన్నికల విజయాలతో సరిపెట్టుకోకుండా, సంస్థాగతంగా పార్టీని పటిష్ఠం చేయడమే తన లక్ష్యమని ఆయన నిరూపించారు.

ప్రస్తుతం ప్రకాశం జిల్లా వ్యాప్తంగా ఈ నిర్ణయం జనసేన శ్రేణుల్లో పెను సంచలనంగా మారింది. పార్టీ అధినేత తీసుకున్న ఈ కఠిన నిర్ణయం తర్వాత జిల్లా రాజకీయ సమీకరణాలు వేగంగా మారే అవకాశం ఉంది. రాబోయే రోజుల్లో ఎలాంటి వర్గపోరుకు తావులేకుండా సరికొత్త నాయకత్వంతో ప్రకాశం జిల్లాకు సరికొత్త కార్యవర్గాన్ని ప్రకటించేందుకు కసరత్తులు ప్రారంభమైనట్లు తెలుస్తోంది.
 

By
en-us Political News

  
ఆయనను బీజేపీ హైకమాండ్ ఆ రాష్ట్ర పార్టీ అధ్యక్ష పదవి నుంచి తప్పించింది. ఎన్నికలలో పోటీ చేసే అవకాశం కూడా ఇవ్వలేదు. అప్పటి నుంచీ పార్టీ హైకమాండ్ పై అసంతృప్తితో ఉన్న అన్నామలై సొంతంగా రాజకీయ పార్టీ ఏర్పాటు చేసే ఉద్దేశంలో ఉన్నారంటూ, గత కొంత కాలంగా వార్తలు వినవస్తున్నాయి.
అత్యంత ప్రతిష్ఠాత్మకమైన బెంగళూరు నగరాభివృద్ధి శాఖ తనకు కేటాయించకపోవడమే ఆయన అసంతృప్తికి కారణమని తెలుస్తోంది. మీడియా ఎదుటే ఆయన తన రాజీనామా లేఖపై సంతకం చేసి తన అసంతృప్తిని వ్యక్తం చేశారు.
కాంగ్రెస్ తమకు వెన్నుపోటు పొడిచిందని డీఎంకే నేత ఇలంగోవన్ బహిరంగంగానే ఆరోపించారు. తమ మద్దతుతోనే రాజ్యసభ నామినేషన్లు దక్కించుకుని.. కూటమి ద్వారానే సీట్లు గెలుచుకున్న కాంగ్రెస్, ఇప్పుడు స్వార్థం రాజకీయంతో వేరే పార్టీతో ప్రభుత్వం ఏర్పాటు చేయడం దారుణమన్నారు.
దేశవ్యాప్తంగా విద్యా రంగంలో చోటుచేసుకుంటున్న ప్రశ్నపత్రాల లీకేజీలు, పరీక్షల నిర్వహణలో లోపాలు, మూల్యాంకన వ్యవస్థ వైఫల్యాలపై తీవ్ర ఆందోళన వ్యక్తమవుతోంది.
వేలమంది బలిదానాలతో ఏర్పడిన తెలంగాణలో ప్రాంతీయ ఆకాంక్షలను, ఉద్యమాలను జనసేన గౌరవించాలని కేటీఆర్ పవన్ కు హితవు పలికారు. అయితే, ఈ వ్యాఖ్యలపై రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చ నడుస్తోంది. కేటీఆర్ సంధించిన ప్రశ్నలనే తిరిగి కల్వకుంట్ల కుటుంబానికి గురిపెడుతూ విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
2024 ఎన్నికలలో వైనాట్ 175 అంటూ బీరాలు పలికిన జగన్.. తీరా ఎన్నికల ఫలితాలు వచ్చే సరికి కేవలం 11 స్థానాలతో సరిపెట్టుకోవలసి వచ్చింది. ఐదేళ్ల పాటు రాష్ట్రంలో అధికారాన్ని చెలాయించిన ఆయనకు, ఆయన పార్టీకీ కనీసం విపక్ష హోదా కూడా ఇవ్వడానికి జనం నిరాకరించారు.
రాష్ట్రంలో వైసీపీ పాలన అంతమై రెండేళ్లు గడిచిన సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సోషల్ మీడియా వేదికగా భావోద్వేగ పోస్ట్ పెట్టారు. రాష్ట్ర చరిత్రలో జూన్ 4ని చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయే రోజుగా అభివర్ణించారు.
భాషా ప్రయుక్త రాష్ట్రాల ఏర్పాటు కోసం ప్రాణాలర్పించిన పొట్టి శ్రీరాములు వంటి మహనీయుడిని సైతం నేడు ఒకే ఒక్క కులానికి పరిమితం చేసే దుస్థితి మన రాష్ట్రంలో నెలకొందన్న పవన్ కల్యాణ్.. కులాల పేరుతో సమాజాన్ని విడదీసే ఈ దుర్మార్గపు రాజకీయాలకు ఎక్కడో ఒకచోట చరమగీతం పాడాలని పిలుపునిచ్చారు. కులాల ఐక్యతే జనసేన పార్టీ మూల సిద్ధాంతమన్నారు.
గద్దర్ కుమార్తె వెన్నెల పవన్ కల్యాణ్ మాటలు తెలంగాణ అస్తిత్వాన్ని, ఆత్మగౌరవాన్ని, తన తండ్రి గద్దర్ వారసత్వాన్ని అవమానించేలా ఉన్నాయని మండిపడ్డారు. ఈ మేరకు ఆమె సోషల్ మీడియా వేదికగా పవన్‌కు గట్టి కౌంటర్ ఇచ్చారు.
తమిళనాడు రాజకీయాలు ఎప్పుడూ ఆసక్తికరమైన మలుపులతో దేశవ్యాప్తంగా అందరి దృష్టిని ఆకర్షిస్తుంటాయి.
పవన్ కళ్యాణ్‌పై తెలంగాణలోని కొన్ని రాజకీయ పార్టీల నేతలు చేస్తున్న వ్యాఖ్యలపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పందించారు.
చివరి గింజ ధాన్యం కొంటామన్న కాంగ్రెస్ సర్కార్  అప్పులు చేయడంలో రేవంత్ ప్రభుత్వం రికార్డులు సృష్టిస్తోందని విమర్శించిన కేటీఆర్..  రెండున్నరేళ్లలో కాంగ్రెస్ ప్రభుత్వం  4 లక్షల కోట్ల రూపాయలు అప్పులు చేసిందన్నారు.
లంగాణ ప్రజల దశాబ్దాల కల సాకారమైన రోజున ఇక్కడి సెంటిమెంట్‌ను దెబ్బతీసేలా మాట్లాడటం సరికాదన్నారు. గతంలో తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడినప్పుడు తాను 11 రోజుల పాటు అన్నం తినలేదని పవన్ కల్యాణే స్వయంగా చెప్పారనీ.. అలాంటి వ్యక్తి మళ్లీ ఇప్పుడు తెలంగాణకు తాను వ్యతిరేకం కాదంటూ ద్వంద్వ వైఖరి ప్రదర్శిస్తున్నారని కేటీఆర్ అన్నారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.