Publish Date:May 21, 2022
తెలంగాణలో ఎన్నికల వేడి పెరుగుతున్న కొద్దీ ఆపరేషన్ ఆకర్ష్ జోరు పెరుగుతోంది. ఇందు కోసం రాష్ట్రంలోని ప్రధాన పార్టీలు మూడూ కూడా తలుపులు బార్లా తెరిచేశాయి. అయితే పరిస్థితి చూస్తుంటే మాత్రం ఆపరేషన్ ఆకర్ష్ అధికార టీఆర్ఎస్ ను బాగా దెబ్బకొట్టేటట్టు ఉంది. గత ఎనిమిదేళ్లుగా తెలంగాణ సీఎం కల్వకుంట్ల చంద్రశేఖరరావు రాష్ట్రంలో మిగిలిన పార్టీలను నిర్వీర్యం చేసే ఉద్దేశంతో ఇతర పార్టీల నాయకులకు టీఆర్ఎస్ తలుపులు తెరిచేశారు.
ఇతర పార్టీల టికెట్లతో గెలిచిన వారు కూడా కేసీఆర్ ఆపరేషన్ ఆకర్ష్ పుణ్యమా అని తెరాస తీర్థం పుచ్చేసుకున్నారు. అంతేనా ఏకంగా చట్టసభల్లో ఇతర పార్టీల సభ్యులను గంపగుత్తగా తెరాసలో చేర్చుకుని అసెంబ్లీలో, మండలిలో ఆ పార్టీల ఉనికే లేకుండా చేసిన చరిత్ర టీఆర్ఎస్ ది. అయితే ఇప్పుడు మాత్రం ఆపరేషన్ ఆకర్ష్ టీఆర్ఎస్ కు బూమరాంగ్ అయ్యే పరిస్థితి కనిపిస్తోంది. ఎనిమిదేళ్లుగా అధికారంలో ఉన్న పార్టీ కావడం, ఇతర పార్టీల నుంచి వచ్చిన వారికి టీఆర్ఎస్ లో పదవులు దక్కడం వల్ల తొలి నుంచీ ఆ పార్టీనే నమ్ముకుని ఉన్న వారిలో అసమ్మతి నివురుగప్పిన నిప్పులా ఉంది. ఇప్పుడు రాష్ట్రంలో టీఆర్ఎస్ ను దీటుగా ఎదుర్కొనేందుకు కాంగ్రెస్, బీజేపీలు బలోపేతం అయిన నేపథ్యంలో టీఆర్ఎస్ అసంతృప్తులు ఆ పార్టీల వైపు చూస్తున్నారు.
ఇదే అదునుగా ఆ పార్టీలు ఆపరేషన్ ఆకర్ష్ పేరిట తలుపులు తెరిచేశాయి. టీఆర్ఎస్ లో తగిన గుర్తింపు లభించడం లేదు, తగిన స్థానం లేదు అన్న అసంతృప్తితో ఉన్న వారికి గాలం వేస్తున్నాయి. దీంతో టీఆర్ఎస్ నుంచి వలసలు ఖాయమని రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి. ఇప్పటికే టీఆర్ఎస్ కీలక నేత, తెలంగాణ ఉద్యమంలో చురుకైన పాత్ర పోషించిన మాజీ ఎమ్మెల్యే నల్లాల ఓదెలు కాంగ్రెస్ గూటికి చేరారు. అదే దారిలో పలువురు ఉన్నారని కాంగ్రెస్ వర్గాలు ధీమాగా చెబుతున్నాయి. అలాగే బీజేపీ కూడా టీఆర్ఎస్ నుంచి తమ పార్టీలోకి వలసలు పెరుగుతాయని చెబుతోంది. పలువురు టీఆర్ఎస్ సీనియర్ నేతలు తమతో టచ్ లో ఉన్నారని బీజేపీ నేతలు చెబుతున్నారు.
ఇలా ఉండగా హరీష్ రావు, కేటీఆర్ వంటి నేతల సమక్షంలో కాంగ్రెస్, బీజేపీలకు చెందిన పలువురు ద్వితీయ శ్రేణి నాయకులు గులాబీ కండువా కప్పుకునేందుకు సిద్ధంగా ఉన్నారని టీఆర్ఎస్ నేతలు చెబుతున్నారు. మొత్తం మీద రాష్ట్రంలో రాజకీయ వేడి పెరుగుతున్న కొద్దీ రాజకీయ వలసలు జోరందుకుంటాయని పరిశీలకులు చెబుతున్నారు. ప్రధానంగా ఇంత కాలం టీఆర్ఎస్ లో నివురు గప్పిన నిప్పులా ఉన్న అసమ్మతి ఇప్పుడు రాజుకుని ఇతర పార్టల ఆపరేషన్ ఆకర్ష్ వలలో పడటం ఖాయమని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/parties-speed-up-operation-spped-up-in-telangana-25-136229.html
వేలమంది బలిదానాలతో ఏర్పడిన తెలంగాణలో ప్రాంతీయ ఆకాంక్షలను, ఉద్యమాలను జనసేన గౌరవించాలని కేటీఆర్ పవన్ కు హితవు పలికారు. అయితే, ఈ వ్యాఖ్యలపై రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చ నడుస్తోంది. కేటీఆర్ సంధించిన ప్రశ్నలనే తిరిగి కల్వకుంట్ల కుటుంబానికి గురిపెడుతూ విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
2024 ఎన్నికలలో వైనాట్ 175 అంటూ బీరాలు పలికిన జగన్.. తీరా ఎన్నికల ఫలితాలు వచ్చే సరికి కేవలం 11 స్థానాలతో సరిపెట్టుకోవలసి వచ్చింది. ఐదేళ్ల పాటు రాష్ట్రంలో అధికారాన్ని చెలాయించిన ఆయనకు, ఆయన పార్టీకీ కనీసం విపక్ష హోదా కూడా ఇవ్వడానికి జనం నిరాకరించారు.
రాష్ట్రంలో వైసీపీ పాలన అంతమై రెండేళ్లు గడిచిన సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సోషల్ మీడియా వేదికగా భావోద్వేగ పోస్ట్ పెట్టారు. రాష్ట్ర చరిత్రలో జూన్ 4ని చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయే రోజుగా అభివర్ణించారు.
భాషా ప్రయుక్త రాష్ట్రాల ఏర్పాటు కోసం ప్రాణాలర్పించిన పొట్టి శ్రీరాములు వంటి మహనీయుడిని సైతం నేడు ఒకే ఒక్క కులానికి పరిమితం చేసే దుస్థితి మన రాష్ట్రంలో నెలకొందన్న పవన్ కల్యాణ్.. కులాల పేరుతో సమాజాన్ని విడదీసే ఈ దుర్మార్గపు రాజకీయాలకు ఎక్కడో ఒకచోట చరమగీతం పాడాలని పిలుపునిచ్చారు. కులాల ఐక్యతే జనసేన పార్టీ మూల సిద్ధాంతమన్నారు.
గద్దర్ కుమార్తె వెన్నెల పవన్ కల్యాణ్ మాటలు తెలంగాణ అస్తిత్వాన్ని, ఆత్మగౌరవాన్ని, తన తండ్రి గద్దర్ వారసత్వాన్ని అవమానించేలా ఉన్నాయని మండిపడ్డారు. ఈ మేరకు ఆమె సోషల్ మీడియా వేదికగా పవన్కు గట్టి కౌంటర్ ఇచ్చారు.
తమిళనాడు రాజకీయాలు ఎప్పుడూ ఆసక్తికరమైన మలుపులతో దేశవ్యాప్తంగా అందరి దృష్టిని ఆకర్షిస్తుంటాయి.
పవన్ కళ్యాణ్పై తెలంగాణలోని కొన్ని రాజకీయ పార్టీల నేతలు చేస్తున్న వ్యాఖ్యలపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పందించారు.
చివరి గింజ ధాన్యం కొంటామన్న కాంగ్రెస్ సర్కార్ అప్పులు చేయడంలో రేవంత్ ప్రభుత్వం రికార్డులు సృష్టిస్తోందని విమర్శించిన కేటీఆర్.. రెండున్నరేళ్లలో కాంగ్రెస్ ప్రభుత్వం 4 లక్షల కోట్ల రూపాయలు అప్పులు చేసిందన్నారు.
లంగాణ ప్రజల దశాబ్దాల కల సాకారమైన రోజున ఇక్కడి సెంటిమెంట్ను దెబ్బతీసేలా మాట్లాడటం సరికాదన్నారు. గతంలో తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడినప్పుడు తాను 11 రోజుల పాటు అన్నం తినలేదని పవన్ కల్యాణే స్వయంగా చెప్పారనీ.. అలాంటి వ్యక్తి మళ్లీ ఇప్పుడు తెలంగాణకు తాను వ్యతిరేకం కాదంటూ ద్వంద్వ వైఖరి ప్రదర్శిస్తున్నారని కేటీఆర్ అన్నారు.
జగన్ ఎప్పుడెప్పుడు అధికారం నుంచి దిగిపోతారా అని దేవుళ్లకు పూజలు చేశారు, శాపనార్థాలు పెట్టారు. జగన్ అధికారంలో ఉంటే తమ అమరావతి కలలు ఎప్పటికీ ఫలించవని ఆవేదన చెందారు. అలాంటిది, ఇప్పుడు అదే అమరావతికి చెందిన రైతులు తాడేపల్లిలోని వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నివాసానికి వెళ్లి, ఆయనతో సుదీర్ఘంగా భేటీ అయ్యారనే వార్త పొలిటికల్ సర్కిల్స్ నే కాకుండా సామాన్య ప్రజలను కూడా విస్మయానికి గురి చేసింది.
దశాబ్దాలుగా కోలీవుడ్ లో సంపాదించుకున్న తన స్టార్ డమ్ ను, ఫ్యాన్ ఫాలోయింగ్ ను ఓటు బ్యాంకుగా మార్చుకోవడంలో విజయ్ సఫలమయ్యారు. వీటన్నింటికీ తోడు తమిళనాట కరుణానిధి, జయలలిత వంటి దిగ్గజ నేతల మరణాల తర్వాత ఏర్పడిన రాజకీయ శూన్యం విజయ్ కు అనుకూలంగా మారింది.
ఈ విజయం కేవలం ఒక పదవి మాత్రమే కాదని, తన దశాబ్దాల కఠిన శ్రమకు, అంకితభావానికి దక్కిన అసలైన ఫలితమని ప్రకటించారు.
గతంలో మాతో పెట్టుకుంటే తెలంగాణ రాష్ట్రం వచ్చిందని, ఇప్పుడు పెట్టుకుంటే మూతిపళ్ళు రాలుతాయని కవిత హెచ్చరించారు. అంతేకాకుండా, అక్కడ ఆంధ్రప్రదేశ్లో రాజధాని కట్టుకోవడం చేతకానివాళ్ళు, తెలంగాణ నవనిర్మాణం చేస్తారా అంటూ ఆమె ఎద్దేవా చేశారు.