పరిటాల శ్రీరామ్ ఎంట్రీకి చంద్రబాబు బాబు గ్రీన్‌ సిగ్నల్‌

Publish Date:Oct 15, 2012

Advertisement

 

 

అనంతపురం జిల్లా రాప్తాడు అసెంబ్లీ నియోజకవర్గం రాష్ట్రంలో అతిపెద్ద గుర్తింపును అందుకున్నది. రాష్ట్రంలో ఎక్కడ విభేదాలు భగ్గుమన్నా దాని వెనుక ఎవరు ఉన్నారు అన్న ప్రశ్న లేచిందో ఈ నియోజకవర్గ నేతను గుర్తు చేసుకునేవారు. దివంగత ఎమ్మెల్యే పరిటాల రవి పేరు రాష్ట్రంలో తెలియని వారు ఉండరు. గొడవలు, అల్లర్లు అన్నింటినీ నియంత్రించగలిగిన నేతగా ఈయన ఎదిగిన తీరు రామ్‌గోపాల్‌వర్మ వంటి ప్రముఖ దర్శకుడు, నిర్మాత చిత్రీకరించాక ఈ నియోజకవర్గం పేరు ఇంకా పాపులర్‌ అయింది. ఈ పాపులార్టీని రవి వ్యతిరేక గ్రూపు కూడా సొమ్ము చేసుకోవాలని ప్రయత్నించింది. అయితే పరిటాల రవి కుటుంబమే ఆ ఫేమ్‌ నిలబెట్టుకుంటోంది. ఈ నేపథ్యంలో ఏళ్లు గడిచేకొద్ది మార్పులు సహజం కాబట్టి పరిటాల రవి హత్యానంతరం సునీత ఈ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. రవి పెద్దకుమారుడు పరిటాల శ్రీరామ్‌ తాజా ఆకర్షణ అయ్యారు. ఈయనే భవిష్యత్తు ఎమ్మెల్యే అని పరిటాల అభిమానులు భావిస్తున్నారు. పైగా పరిటాల కుటుంబం ఏర్పాటు చేసిన ట్రస్టులో కీలకమైన బాధ్యతలు శ్రీరామ్‌ ఇటీవలే చేపట్టారు. దీంతో రవి అభిమానులు తమ ఆశ నెరవేరే సమయం వచ్చేసిందని భావిస్తున్నారు. అయితే, తన కుమారుడు పరిటాల శ్రీరామ్‌ రాజకీయాల్లోకి వస్తాడని, 2014 ఎన్నికల్లో మాత్రం పోటీలో ఉండడని తల్లి, ఎమ్మెల్యే పరిటాల సునీత వెల్లడిరచారు. సునీత ఈ ప్రకటన చేయటం ద్వారా అభిమానులు ఎంత వరకూ తన కుమారుడు రాజకీయాల్లోకి రావాలని కోరుకుంటున్నారో అంచనా వేసుకునేందుకు అవకాశం తీసుకున్నారు. ఇప్పటికే ట్రస్టు కార్యక్రమాల్లో చురుకుగా పాల్గంటూ క్రీయాశీలకంగా వ్యవహరిస్తున్న శ్రీరామ్‌ తాజాగా తల్లితో పాటు తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు మీకోసం వస్తున్నా పాదయాత్రకు హాజరయ్యారు. దీంతో అభిమానులు ఉండబట్టలేక చంద్రబాబును శ్రీరామ్‌తో మాట్లాడిరచమని అభిమానులు కోరారు. దీనికి సునీత నవ్వుతూ దానికి ఇప్పుడు కాదు అన్నారు. అంటే సునీత ముందుగా శ్రీరామ్‌కు రాజకీయానుభవం తెలియజేశాక కానీ, రంగంలో దించకూడదని ఆలోచించి ఉండవచ్చని పరిశీలకులు భావిస్తున్నారు. అయితే, చంద్రబాబు గ్రీన్‌సిగ్నల్‌ ఇస్తే వెంటనే శ్రీరామ్‌ను దించేస్తానని గతంలో రవి అభిమానులకు సునీత మాట ఇచ్చారు. చంద్రబాబు కూడా పాదయాత్ర సమయంలో తెలివిగా త్వరలో శ్రీరామ్‌ క్రియాశీలకంగా వ్యవహరిస్తారని అభిమానులకు భరోసా ఇచ్చారు. అంటే చంద్రబాబు, సునీత ఇద్దరూ కూడా శ్రీరామ్‌కు రాజకీయ అవగాహన పెంచేందుకు నిర్ణయించుకున్నారని అభిమానులు భావిస్తున్నారు. అయితే సునీత వైఖరి ఊరించేదిలా ఉందని అభిమానులు అంటున్నారు. ఇలా ఊరించి ఊరించి ఒక్కసారిగా రంగంలోకి దించితే గెలుపు ఖాయం అవుతుందని సునీత, చంద్రబాబు భావిస్తున్నారేమో? అయి ఉండొచ్చు కదా!

By
en-us Political News

  
కేరళ స్టోరీలో 32,000 హిందూ అమ్మాయిలు కనిపించకుండాపోయి టెర్రరిస్ట్ గ్రూప్ అయిన ఐసిస్ లో చేరతారు. తెలంగాణలో 119 నియోజకవర్గాల్లో ఎన్నికలు జరగనున్నాయి. బిఆర్ఎస్, బిజెపి, కాంగ్రెస్, ఎంఐఎం పార్టీలు అభ్యర్థులను నిలబెట్టనున్నాయి.
మునుగోడు అసెంబ్లీ నియోజకవర్గం నుంచే వచ్చే ఎన్నికలలో పోటీ చేస్తానని బీజేపీ నాయకుడు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి స్పష్టం చేశారు.
గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్‌పై బీజేపీ సస్పెన్షన్ నుఎత్తివేయనుంది.
ఇప్పట్లో క్యాసినో నిర్వహించే ఆలోచన లేదని చీకోటి ప్రవీణ్ కుమార్ అన్నారు.
 అమెరికాలో మళ్లీ కాల్పుల కలకలం రేగింది.  న్యూ మెక్సికో  లోని పాఠశాలలో  ఒక సాయుధుడు విచక్షణారహితంగా జరిపిన కాల్పుల్లో ముగ్గురు మరణించారు
పెట్టుబడుల ఆకర్షణే ధ్యేయంగ  తెలంగాణ ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్‌  నేటి నుంచి  రెండు వారాల పాటు అమెరికాలో పర్యటించనున్నారు.  ఈ పర్యటనలో ఆయన అక్కడి ప్రముఖ కంపెనీల ఛైర్మన్లు, సీఈఓలు, ప్రతినిధులతో  సమావేశమవుతారు.
తెలుగు రాష్ట్రాలలో ఎండలు మండిపోతున్నాయి. గత రెండు రోజలుగా పలు ప్రాంతాలలో 40 డిగ్రీలకు మించి ఉష్ణోగ్రతలు నమోదౌతున్నాయి.
తనకు రాజకీయ జీవితాన్నిఇచ్చిన ఒంగోలును వదిలే ప్రసక్తే లేదని మాజీ మంత్రి బాలినేని కుండబద్దలు కొట్టేశారు.
 రోడ్డు ప్రమాదంలో తెలుగుదేశం నాయకుడు ఒకరు తీవ్రంగా గాయపడ్డారు.  మార్కాపురం తెలుగుదేశం ఇన్‌చార్జ్, మాజీ ఎమ్మెల్యే కందుల నారాయణ రెడ్డి ప్రయాణిస్తున్న కారు యర్రగొండపాలెం సమీపంలోని గురిజేపల్లి మూలమలుపు బోల్తా పడింది.
కర్ణాటక సిఎం కోసం ఢిల్లీలో కసరత్తు కర్ణాటకలో సీఎం ఎవరన్న విషయంపై కాంగ్రెస్ హైకమాండ్ సీరియస్ గా కసరత్తు చేస్తోంది. ఈ విషయంపై చర్చించేందుకు అధిష్ఠానం పిలుపు మేరకు మాజీ ముఖ్యమంత్రి సిద్దరామయ్య నిన్ననే హస్తిన చేరుకోగా.. కర్నాటక కాంగ్రెస్ అధ్యక్షుడు డీకే శివకుమార్ బుధవారం ఉదయం ఢిల్లీకి బయలుదేరి వెళ్లారు.
ఉత్తర ప్రదేశ్ లోని కాన్ఫూర్ లో భారీ అగ్నిప్రమాదం సంభవించింది.
తెలంగాణలో వైద్య విద్యార్థి బలవన్మరణానికి పాల్పడ్డారు. నిజామాబాద్‌ ప్రభుత్వ మెడికల్ కాలేజీలో మూడో సంవత్సరం చదువుతున్న సనత్ తన హాస్టల్ గదిలో ఉరి వేసుకుని ఆత్మహత్యకు చేసుకున్నాడు.
నెల్లూరు జిల్లా ఉదయగిరి ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి తీవ్ర అస్వస్థతకు గురయ్యారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.