తెలంగాణా నాయకులు వై.ఎస్. కు అమ్ముడుపోయారు తెలుగువన్.కామ్ ఇంటర్వ్యూలో... పాల్వాయి
Publish Date:Mar 24, 2012
Advertisement
కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుల్లో పాల్వాయి గోవర్ధన్ ఒకరు. ఏ విషయాన్నైనా కుండబద్దలు కొట్టినట్లు మాట్లాడతారు. పదవుల కోసం తానెప్పుడు వెంపర్లాడలేదని ఆయన తరచు అంటుంటారు. ఇటీవల ఆయన రాజ్యసభకు ఎన్నికయ్యారు. రాజ్యసభ సీటు కోసం కొట్లాది రూపాయలు కుమ్మరించడానికి అనేక మంది సిద్ధంగా ఉన్న పరిస్థితుల నేపథ్యంలో తమకు అప్రయత్నంగానే ఆ సీటు దక్కిందని పాల్యాయి అంటున్నారు. ఆయన తెలుగువన్.కామ్ ప్రతినిధితో మాట్లాడుతూ తాను గాని, రాపోలు ఆనంద భాస్కర్ గానీ రాజ్యసభ సీట్ల కోసం ఎటువంటి ప్రయత్నాలు, పైరవీలు చేయలేదని, కోట్లు కుమ్మరించే స్థోమత తమ ఇద్దరికీ లేదని అయినా అధిష్టానం తమ సేవలను గుర్తించి రాజ్యసభకు పంపిందని అన్నారు. కాంగ్రెస్ లో మారుతున్న పరిణామాలకు ఇది సంకేతమన్నారు. ఒకవైపు తెలుగుదేశం పార్టీ తరపున రాజ్యసభకు ఎంపికైన సి.ఎం. రమేష్, దేవేందర్ గౌడ్ లు కోటీశ్వరులు, వారు ఈ పదవుల కోసం సుమారు వంద కోట్లు కేటాయించినట్లు టి.ఆర్.ఎస్. నాయకుడు కె.టి.ఆర్ ఆరోపిస్తున్నాడు. పేదల కోసం పెట్టిన తెలుగుదేశం పార్టీ కోటీశ్వరులనే రాజ్యసభకు పంపింది. కానీ కాంగ్రెస్ పార్టీమాత్రం మాలాంటి పైసాకు ఠికానా లేని పేదోళ్ళను కూడా రాజ్యసభకు పంపింది. అదే కాంగ్రెస్ పార్టీ గొప్పతనం అన్నారు పాల్వాయి గోవర్ధన్. గతంలో కాంగ్రెస్, టి.ఆర్.ఎస్. నాయకులు అప్పటి ముఖ్యమంత్రి వై.ఎస్. రాజశేఖర్ రెడ్డికి అమ్ముడుపోయారని అందుకే తెలంగాణా ఉద్యమం బలహీన పడిందని ఆయన అభిప్రాయపడ్డారు. ఎప్పటికైనా తెలంగాణాను తెచ్చేది కాంగ్రెస్ పార్టీయేనని ఆయన అన్నారు. రాజ్యసభలో తాను తెలంగాణావాణిని గట్టిగా వినిపిస్తానని పాల్వాయి గోవర్ధన్ చెప్పారు. తాను కరడు గట్టిన తెలంగాణా వాదినని అధిష్టానానికి తెలిసినప్పటికీ తనను రాజ్యసభకు పంపిందని, దీనిని బట్టి చూస్తే తెలంగాణా అంశంపై అధిష్టానం సుముఖంగా ఉందని అర్థమవుతుందని ఆయన అభిప్రాయపడ్డారు.
http://www.teluguone.com/news/content/palvai-govardhan-reddy-24-12889.html
సుబ్రతో రాయ్ అరెస్ట్ ...
ఖరారైన రాష్ట్రపతి పాలన ...
రాష్ట్రపతి పాలనకే మొగ్గు ...
విఫలమైన 'టి' కాంగ్రెస్
చంద్రబాబు పాదయాత్ర ఈ నెల 31న పునఃప్రారంభ౦ కానుంది. ఫిబ్రవరి నాల్గోతేదీ వరకు విజయవాడలో కోనసాగనుంది. ఆరోగ్య కారణాల రీత్యా చంద్రబాబు 29, 30లలో కూడా విశ్రాంతి తీసుకోనున్నారని తెలుగుదేశం నాయకులు ప్రకటించారు.
తెలంగాణ కాంగ్రెస్ ఎంపీలు కేకే నివాసంలో భేటి అయ్యారు. తెలంగాణపై పార్టీ అధిష్టానం వైఖరిని వ్యతిరేకిస్తూ పార్టీ సభ్యత్వానికి, పదవులకు కూడా రాజీనామా చేసి అధిష్టానం పై ఒత్తిడి పెంచేందుకు రంగం సిద్దం చేస్తున్నారు. రాజీనామా లేఖలను పార్టీ అధ్యక్షురాలు శ్రీమతి సోనియా గాంధి పంపించనున్నారు. భేటి అనంతరం లేఖలను మీడియాకు విడుదల చేయనున్నారు.
తెలుగు సినీ ప్రియులను తన అందచందాలతో, అసమానమయిన నటనతో ఒక ఊపుఊపిన అందాల తార జయప్రద, ఆ తరువాత బాలీవుడ్ లోను ఒక వెలుగు వెలిగింది. తెలుగుదేశంపార్టీలో జేరి రాష్ట్ర రాజకీయాలలో పాల్గొన్నపటికీ, చంద్రబాబుతో పొసగక ఏకంగా డిల్లీ రైలెక్కి ఉత్తర ప్రదేశ్ రాష్ట్రంలో వాలిపోయింది.
జానారెడ్డికి బుద్ది ,జ్ఞానం ఉందా? తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు మీద కాంగ్రెస్ ప్రకటన కోసం ఇంకా వేచిచూద్దాం అంటాడా. కాంగ్రెస్ ప్రకటనలో ఇంకా నిజాయితీ ఉందన్న జానారెడ్డి మాటలను తెలంగాణ ప్రజలు విశ్వసించరు. ముఖ్యమంత్రి పదవికోసం జానారెడ్డి గోతికాడ నక్కలా ఎదురు చూస్తున్నాడు.
వైయస్సార్ కాంగ్రెస్ చేపట్టిన కోటి సంతకాల సేకరణపై తెలుగుదేశం పార్టీ తీవ్ర విమర్శలు గుప్పించిన ఆరు నెలలకి ఇప్పుడు తాపీగా ఆ పార్టీ నేతలు స్పందించడం చూస్తుంటే ఆ పార్టీ నాయకత్వలోపం మరోసారి బయట పడుతోంది.
చంద్రబాబు తెలంగాణా జిల్లలో పాదయాత్ర చేస్తునంత కాలం తన వైయస్సార్ కాంగ్రెస్ పార్టీని, తన నాయకుడు జగన్ మోహన్ రెడ్డిని అయన ఎంత తీవ్రంగా విమర్శించినా స్పందించని కొడాలి నాని, చంద్రబాబు ఇప్పుడు తన కృష్ణా జిల్లాలో పాదయాత్ర చేస్తూ అదే విధంగా విమర్శలు చేసినప్పుడు మాత్రం వెంటనే స్పందించారు.
రాష్ట్ర రాజధానిలోఇందిరా పార్క్ వద్ద నేటి నుండి 36గంటల సమరదీక్షను నిర్వహించాలన్న పట్టుదలతో ఉన్న తెలంగాణా జేయేసీ నేతలు, పోలీసు ఆదేశాలను
నిర్విరామంగా సాగుతూ 117వ రోజుకు జేరుకొన్నచంద్రబాబు పాదయాత్ర ఈరోజు కృష్ణా జిల్లాలో పరిటాలకు చేరుకొంది. ముందు అనుకొన్న ప్రకారం అయితే ఈ రోజుతో ఆయన పాదయాత్ర ముగించాల్సి ఉంది. అయన కుటుంబ సభ్యులు, పార్టీ నేతలు మరియు వైద్యులు కూడా పాదయాత్ర ముగించమని కోరినప్పటికీ చంద్రబాబు తన పాదయాత్రను కొనసాగించడానికే నిశ్చయించుకొన్నారు.
తెలంగాణా జేయేసీ అద్వర్యంలో సికిందరాబాద్ లో ఇందిరా పార్క్ వద్ద 36గంటల సమరదీక్షకు అనుమతి కోరుతూ జేయేసీ నేతలు హోంమంత్రి సబితా ఇంద్రరెడ్డికి వినతిపత్రం సమర్పించగా, కొద్దిసేపటిలోనే వారికి అనుమతి నిరాకరిస్తున్నట్లు పోలీసుల నుండి వెంటనే లేఖ అందడంతో తెలంగాణావాదులు కిరణ్ కుమార్ రెడ్డి మీద, పోలీసుల మీద మండిపడ్డారు.





