పాకిస్థాన్ నీటి కొరతతో విలవిలలాడుతోంది. ఇంత కాలంగా జలవనరుల విషయంలో భారత్ ఉదారతపై ఆధారపడి ఉన్న పాకిస్థాన్.. ఉగ్రవాదానికి, ఉగ్రవాదులకు అండదండలు అందిస్తూ భారత్ లో హింసను ప్రేరేపిస్తూ వచ్చింది. పహల్గాం ఉగ్రదాడితో భారత్ ఇక అమీతుమీ తేల్చుకోవాలని డిసైడ్ అయ్యింది. ఆపరేషన్ సిందూర్ తో పాకిస్థాన్ సైనిక పాటవానికి ఆయువుపట్టులాంటి వైమానిక స్థావరాలను ధ్వంసం చేయడమే కాకుండా, ఆ దేశ భూభాగంలోని ఉగ్ర స్థావరాలను సైతం లేపేసింది. అంతే కాకుండా సింధు జలాల ఒప్పందం నుంచి వైదొలగింది. దీంతో పాకిస్థాన్ ఇప్పుడు నీటి కొరతతో పహల్గాం ఉగ్రదాడి అనంతరం భారత్ వ్యూహాత్మకంగా తీసుకున్న నిర్ణయం పాకిస్థాన్ ను దిక్కుతోచని స్థితిలోకి నెట్టేసింది. సింధు జలాల ఒప్పందాన్ని రద్దు చేసుకుంటున్నట్లు భారత్ ప్రకటించిన సమయంలో అదే జరిగితే నదిలో పారేది నీరు కాదు నెత్తురు అంటూ ప్రగల్భాలు పలగిన పాకిస్థాన్ ఇప్పుడు నీటి చుక్కకోసం అల్లల్లాడాల్సిన పరిస్థితిలో పడింది. ఇప్పుడు పాకిస్థాన్ లో తాగునీరు, సాగునీరు కోసం వెంపర్లడాల్సిన పరిస్థితి ఉంది. ఆ దేశ వ్యవసాయరంగం కుదేలైంది. ప్రధానంగా మంగ్లా, తర్బేలా డ్యామ్లలో నీటి నిల్వలు ప్రమాదకర స్థాయికి పడిపోయాయి.
ఇప్పటికే పంజాబ్, సింధ్ రాష్ట్రాల్లో ఖరీఫ్ సాగు ప్రశ్నార్థకంగా మారింది. పాకిస్థాన్ ఐఆర్ఎస్ఏ తాజా నివేదిక ప్రకారం, మొత్తం ప్రవాహంలో 21 శాతం నీటి కొరత ఏర్పడింది. రెండు ప్రధాన డ్యామ్లైన మంగ్లా, తర్బేలాలలో ప్రవాహ శాతం 50 శాతం వరకూ పడిపోయింది. ఇది వేసవి పంటల సాగుపై అత్యంత తీవ్ర ప్రభావం చూపుతుందనడంలో సందేహం లేదు. చీనాబ్ నదిలో ప్రవాహం కూడా గణనీయంగా తగ్గిపోయింది.
ఈ విషయాన్ని పాకిస్థాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ స్వయంగా అంగీకరించారు. న్యూయార్క్ వేదికగా జరిగిన హిమానీనదాల సదస్సులో మాట్లాడిన ఆయన భారత్ సింధు జలాల ఒప్పందాన్ని ఉల్లంఘిం చిందని ఆక్రోశం వెలిబుచ్చారు. అయితే ఆయన ఆరోపణలను, ఆక్రోశాన్ని భారత్ సమర్ధంగా తిప్పి కొట్టింది. వాస్తవానికి ఒప్పందాన్ని ఉల్లంఘించినది పాకిస్థానే అని స్పష్టం చేసింది. ఉగ్రవాదాన్ని ప్రోత్స హిస్తూ.. ఒప్పందానికి నైతికత లేకుండా చేసిందని ఘాటుగా రిటార్డ్ ఇచ్చింది. ఉగ్రవాదానికి తోడ్పాటు నిచ్చి, ఉగ్రవాదులకు రక్షణఏ కవచంగా నిలిచినందుకు పాకిస్థాన్ ఇప్పుడు మూల్యం చెల్లించు కుంటోందన్న భావన ప్రపంచ దేశాలలో వ్యక్తం అవుతోంది.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/pakistan--struggling-with-water-shortages-25-199176.html
తమిళనాడు రాజకీయాల్లో పెను మార్పులు చోటుచేసుకుంటున్న వేళ
బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ అఖండ విజయం సాధించడంలో సువేందు కీ రోల్ పోషించారు. ఆ పార్టీ 206 స్థానాల్లో గెలిచి బెంగాల్లో తొలిసారిగా అధికారం చేపట్టబోతోంది. బీజేపీ తరఫున రెండు స్ధానాల నుంచి బరిలోకి దిగిన సువేందు అధికారి.. మరోసారి మమతా బెనర్జీని ఓడించారు. భవానిపూర్లో దీదీపై గెలిచిన ఆయన.. తన సొంత నియోజకవర్గమైన నందిగ్రామ్లోనూ గెలిచి పట్టు నిలుపుకున్నారు.
ముఖ్యంగా అస్సాం, పశ్చిమబెంగాల్ లో బీజేపీ ఎన్నికల సంఘం సహకారంతో ఫలితాలను చోరీ చేసిందన్నారు.
పశ్చిమబెంగాల్లో మూడున్నర దశాబ్దాల ఏళ్ల సీపీఎం పాలనకు బ్రేక్ వేసి 2011లో అధికార పగ్గాలు చేపట్టిన తృణముల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్టీ.. 2026 వరకు వరుస విజయాలతో ముఖ్యమంత్రిగా కొనసాగారు. ఆమె 15 ఏళ్ల ఆధిపత్యానికి ఎన్డీఏ తెర దించింది. మమతా సైతం కాంగ్రెస్లో కేంద్రమంత్రిగా, పలు కీలక పదవులు నిర్వహించి, తర్వాత సొంత కుంపటి పెట్టుకున్న నాయకురాలే కావడం గమనార్హం.
ప్రజా సమస్యలపై స్పష్టమైన అజెండాతో ఎన్నికల బరిలోకి దిగిన విజయ్ను తమిళ ప్రజలు ఆదరించడం శుభపరిణామమన్నారు.
తన పార్టీ స్థాపించిన నాటి నుండి నేటి వరకు ఆయన సాగించిన ప్రయాణం ఒక అద్భుతమైన రాజకీయ థ్రిల్లర్ను తలపిస్తుంది. ఎన్నికల ప్రచార సమయంలో విజయ్ అనేక ఆటంకాలను ఎదుర్కొన్నారు. ప్రత్యర్థి పార్టీల నుండి వచ్చిన తీవ్ర విమర్శలు, అధికార యంత్రాంగం విధించిన ఆంక్షలు ఆయనను ఉక్కిరిబిక్కిరి చేశాయి. వ్యక్తిగత జీవితంపై జరిగిన దుష్ప్రచారం విజయ్ ఇమేజ్ను దెబ్బతీస్తుందని అందరూ భావించారు.
తమిళనాడులో టీవీకే పార్టీ విజయాన్నిస్వాగతిస్తూ.. వైసీపీ సోషల్ మీడియా వేదికగా సంబరాలు మొదలు పెట్టింది. విజయ్ సాధించిన ఈ అద్భుత విజయం వెనుక వైసీపీ అధినేత జగన్ సహకారం ఉందంటూ వైసీపీ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున పోస్టులు వెల్లువెత్తుతున్నాయి. ముఖ్యంగా గతంలో ఒక వివాహ వేడుకలో వైఎస్ జగన్, విజయ్ ఇద్దరూ కలిసి దిగిన ఒక ఫోటోను ఇప్పుడు వైసీపీ నెట్టింట వైరల్ చేస్తోంది.
ఈ ఎన్నికల ఫలితాల్లో విజయ్ టవీకే పార్టీ స్పష్టమైన ఆధిక్యత కనబరిచింది. ప్రభుత్వ వ్యతిరేకతతో పాటు, కూటమి పక్షాల మధ్య సరైన సమన్వయం లేకపోవడం కూడా ఈ ఓటమికి ప్రధాన కారణాలుగా కనిపిస్తున్నాయి.
1982లో తెలుగువారి ఆత్మగౌరవం నినాదంతో తెలుగుదేశం పార్టీని స్థాపించిన ఎన్టీఆర్, కేవలం 9 నెలల కాలంలోనే రాష్ట్రమంతటా పర్యటించి ప్రభంజనం సృష్టించారు. 1983 ఎన్నికల్లో కాంగ్రెస్ వంటి బలమైన పార్టీని మట్టికరిపించి, తొలి ప్రయత్నంలోనే ముఖ్యమంత్రి పీఠాన్ని అధిష్టించి రికార్డ్ సృష్టించారు.
భారత రాజకీయ యవనికపై భారతీయ జనతా పార్టీ తన ఉనికిని మరింత శక్తివంతం చేస్తోంది.
చారిత్రాత్మక విజయం ఖాయమని తేలడంతో.. విజయం అభిమానుల సంబరాలు మిన్నంటాయి. అయితే.. ఈ నేపథ్యంలో సినీ నటి త్రిష పేరు సోషల్ మీడియాలో విపరీతంగా ట్రెండ్ అవుతోంది.
ఈ నియోజకవర్గం నుంచిఎన్డీయూ కూటమి అభ్యర్థి మల్లాడి కృష్ణారావు విజయం సాధించారు. తన సమీప ప్రత్యర్థి, కాంగ్రెస్ అభ్యర్థి గొల్లపల్లి అశోక్ పై నాలుగువేల ఐదు వందల ఓట్ల పైచిలుకు మెజారిటీతో గెలుపొందారు.
ఎన్నికల ఫలితాల్లో ఎన్డీయే కూటమి సాధించిన ఘన విజయంపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు హర్షం వ్యక్తం చేశారు.