జమిలీ.. ఎన్నికల సంస్కరణల దిశగా తొలి మజిలీ?

Publish Date:Dec 22, 2024

Advertisement

ప్రస్తుతం దేశ వ్యాప్తంగా  జమిలి ఎన్నికలపై చర్చ జరుుగుతోంది. వన్ నేషన్ వన్ ఎలక్షన్ అంటూ కేంద్రం జమిలి ఎన్నికల బిల్లును పార్లమెంటులో ప్రవేశ పెట్టి జేపీసీకి పంపింది.  ఈ జమిలీ ఎన్నికల బిల్లును  బీజేపీ ప్రభుత్వం పార్లమెంట్లో ఆమోదింప జేసుకోగలదా అన్న సంశయం బీజేపీ నేతలతో సహా సర్వత్రా వ్యక్తం అవుతోంది. ఈ బిల్లును ఆమోదింప చేసుకోవాలంటే సభలో మూడింట రెండోంతుల మంది మద్దతు అవసరం. అయితే బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే సర్కార్ కు సభలో ఆ బలం లేదు. అయితే ప్రధాని మోడీ ఏ ధైర్యంతో ముందుకు వెడుతున్నారన్న సందేహం బీజేపీయేతర పార్టీలలో బలంగా వ్యక్తం అవుతోంది.  పార్లమెంటు ఉభయ సభల్లో జమిలి ఎన్నికలకు మద్దతు ఎలా సాధించగలదన్న  అనుమానం పార్టీ కేడర్ లో,ఇతర పార్టీల్లో,ప్రజలలో వ్యక్తం అవుతోంది.  మోదీ ధైర్యం ఏమిటనేది అర్ధం కావడం లేదు. 

అది అలా ఉంచితే.. జమిలీతో పాటు పలు ఎన్నికల సంస్కరణలను మేధావులు సూచిస్తున్నారు. ప్రస్తుతం బిల్లు సభలో ప్రవేశపెట్టడానికి కావలసిన సాధారణ మేజార్టీ వచ్చింది. డిసెంబరు 12 రెండు బిల్లులను కేంద్రమంత్రివర్గం ఆమోదించింది. డిసెంబర్ 17నన్యాయశాఖ మంత్రి పార్లమెంటులో ప్రవేశ పెట్టారు. బిల్లును జాయింట్ పార్లమెంటరీ కమిటీ (జేపీసీ)కి సమర్పించారు. ఆ జేపీసీని  21మంది లోక్ సభ సభ్యులు, 10మంది రాజ్యసభ సభ్యులతో నియమించారు.  ఈ జేపీసీ తన నివేదికను సమర్పించడానికి 90 రోజుల గడువు విధించారు.  అవసరమైతే పొడిగిస్తారు. ఈ జేపీసీ ప్రధాన బాధ్యత  ప్రజాభిప్రాయ సేకరణ. అందరి అభిప్రాయాలను సేకరించి నివేదిక సమర్పించాల్సి ఉంటుంది. అయితే జాయింట్ పార్లమెంటరీ కమిటీకి ఎలాంటి నిర్ణయాధికారం లేదు.  కేవలం అభిప్రాయాలను తెలపడానికే ఇది పరిమితం. అన్నిటికీ మించి జమిలి  బిల్లు చట్టం కావాలంటే ఐదు రాజ్యాంగ సవరణలు చేయాల్సి ఉంది.  రాజ్యాంగ సవరణ చేయాలంటే  పార్లమెంటు లో 2|3మేజార్టీ అనివార్యం. లోక్ సభలో 362, రాజ్యసభ లో 164 మంది జమిలికి అనుకూలంగా ఓటు వేయాలి. అయితే ఎన్డీఏకు లోక్ సభలో 293, రాజ్యసభ లో 125 మంది సభ్యుల బలం మాత్రమే ఉంది. ఏదో విధంగా ఆ మద్దతు కూడగట్టినా బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే సర్కర్ జమిలి ఎన్నికల నిర్వహణకు సాంకేతికంగా  2034 వరకూ ఆగాల్సిందే.  కాగా భారత్లో స్వాతంత్ర్యం అనంతరం తొలి నాలుగు సార్వత్రిక ఎన్నికలు జమిలి ఎన్నికలో. అంటే జమిలి ఎన్నికలు దేశానికి కొత్తకాదు.    1960 దశకం తరువాత మారిన రాజకీయ పరిస్థితుల కారణంగా తరచూ ఎన్నికలు వస్తున్నాయి. ఇదొక రాజకీయ అనివార్యంగా మారిపోయింది.

దీంతో .దేశంలో ఎక్కడో అక్కడ ఎన్నికలు జరుగుతూనే ఉన్న పరిస్థితి ఎర్పడింది.  అయితే ఇప్పుడు మోడీ నేతృత్వంలోని ఎన్డీయే సర్కార్ తానేదో కొత్తగా కనిపెట్టినట్లుగా జమిలి ప్రతిపాదనను తెరపైకి తీసుకువచ్చింది. కానీ బీజేపీ జమిలి నినాదంపై దేశ వ్యాప్తంగా పలు సందేహాలు వ్యక్తం అవుతున్నాయి. జమిలి పద్ధతిలో ఎన్నికల నిర్వహణలో పారదర్శకతపై సందేహాలు వ్యక్తం అవుతున్నాయి.  ఒకేసారి లోక్ సభ, అసెంబ్లీ ఎన్నికలు జరిగితే భారీగా వ్యయం తగ్గుతుంది. అలాగే ఎన్నికల కోడ్ కారణంగా అభివృద్ధి పథకాల అమలుకు అవరోధాలు చాలా వరకూ తగ్గిపోయాయి.  అలాగే జమిలి వల్ల ఖర్చు తగ్గి జీడీపీ 1.5 శాతం పెరుగుతుందని బీజేపీ వర్గాలు చెబుతున్నాయి. దీని వల్ల దేశంఆర్ధికంగా దేశం బలపడుతుందని నమ్మబలుకుతోంది.  

ఇక జమిలి వల్ల రాష్ట్రాలలో,కాని కేంద్రంలో గాని మేజార్టీ లేక ప్రభుత్వాలు పడిపోతే మళ్లీ ఎన్నికలు జరుగుతాయి, అయితే అలా మధ్యంతరంగా జరిగిన ఎన్నికలలో విజయం సాధించి అధికారంలోకి వచ్చిన ప్రభుత్వ పదవీ కాలం తరిగిపోతుంది.  జమిలి పద్ధతిలో దేశ వ్యాప్తంగా జరిగే ఎన్నికలతో పాటు మళ్లీ ఎన్నికలకు వెళ్లాల్సి ఉంటుంది.  ఇక జమిలీ జరిగిన 100 రోజుల్లోగా స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహిస్తారు.ఎవరైనా మరణిస్తే ఉప ఎన్నికలు ఎలా జరిపిస్తారనేదానిపై ఇప్పటి వరకూ క్లారిటీ లేదు. జమిలీ ప్రతిపాదన ఎన్నికల సంస్కరణలకు తొలి మజిలీగా పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. జమిలి పద్ధతి అమలులోకి వస్తే ఒక అభ్యర్థి ఒక స్థానం నుంచి మాత్రమే పోటీ చేయాలన్న నిబధనను అనివార్యంగా విధించాల్సి ఉంటుంది.  అలా కాకుండా ఒక అభ్యర్థి ఒకటి కంటే ఎక్కువ స్థానాల నుంచి పోటీ చేసి విజయం సాధిస్తు.. ఆ అభ్యర్థి రాజీనామాతో ఖాళీ అయ్యే స్థానానికి జరిగే ఉప ఎన్నిక వ్యయాన్ని ఆ అభ్యర్థే భరించేలా నిబంధన తీసుకురావాల్సి ఉంటుందని అంటున్నారు.  

అదే సమయంలో నేరచరితులను ఎన్నికలకు దూరంగా ఉంచే విధంగా కూడా స్పష్టమైన నిర్ణయం తీసుకోవలసి ఉంటుంది.  కోర్టుల్లోకేసులు తీర్పులు వచ్చేవరకూ ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం ఇవ్వకూడదన్న విషయంపై కూడా నిర్ణయం తీసుకోవలసి ఉంటుంది.   జమిలీ ఎన్నికల అధ్యయనం చేసిన మాజీ రాష్ట్రపతి రామ్ నాధ్ కోవింద్ జమిలితో పాటు ఎన్నికల సంస్కరణలు కూడా తీసుకురావాలని చేసిన సిఫారసును కేంద్రం పరిగణనలోనికి తీసుకోవాలి.   అన్నిటికంటే అతి ముఖ్యమైనది కేంద్ర ఎన్నికల సంఘం స్వేచ్ఛగా, స్వతంత్రంగా పని చేసే పరిస్థితి ఉండాలి. ఇప్పటికే కేంద్ర ఎన్నికల సంఘంపై కేంద్రం నియంత్రణ పెచ్చరిల్లిందన్న విమర్శలు ఉన్నాయి. వాటిని పూర్వపక్షం చేస్తూ ఎన్నికల సంఘానికి పూర్తి స్వయంప్రతిపత్తి ఉండేలా చర్యలు తీసుకుంటే మాత్రమే జమిలి ఎన్నికలకు సార్థకత ఉంటుంది. 

By
en-us Political News

  
స్ట్రాంగ్ రూమ్ వద్ద సిసిటివి దృశ్యాలను టీవీలో చూసినప్పుడు తనకు అనుమానం కలిగిందనీ.. అందుకే స్వయంగా తనిఖీ చేయడానికి వచ్చానని మమతా బెనర్జీ తెలిపారు. అక్కడ జరుగుతున్న పరిణామాలపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రాణాలకు తెగించి అయినా సరే ప్రజా తీర్పును కాపాడుకుంటామన్న మమతా బెనర్జీ.. ఓట్ల లెక్కింపులో ఎలాంటి అవకతవకలు జరిగినా సహించేది లేదని హెచ్చరించారు.
తెలుగువన్ వాస్తవ వేదికలో ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ రాజకీయ పరిస్థితులపై విస్తృత చర్చ జరిగింది.
తెలంగాణ రాజకీయ యవనికపై మరో కొత్త పార్టీ అధికారికంగా అడుగుపెట్టింది.
మొత్తం 140 అసెంబ్లీ స్థానాలున్న కేరళలో, ఈ నెల 23న ఒకే విడతలో ఎన్నికలు జరిగిన సంగతి తెలిసిందే. రాష్ట్రంలో అధికార పగ్గాలు అందుకోవాలంటే మ్యాజిక్ ఫిగర్ 71. బుధవారం వెలువడిన ఎగ్జిట్ పోల్స్ అన్నీ ముక్తకంఠంతో యూడీఎఫ్‌కే అధికారమని అంచనా వేశాయి.
తమిళనాట అధికారం చేపట్టడానికి అవసరమైన మ్యాజిక్ ఫిగర్ 117 కాగా.. విజయ్ టీవీకే పార్టీ 98 నుంచి 120 సీట్లు గెలిచే అవకాశం ఉందని యాక్సిస్ మై ఇండియా సర్వే అంచనా వేసింది.
ప్రకాష్ రాజ్ తన విమర్శల్లో ప్రధానంగా పవన్ కళ్యాణ్ స్పందనల్లో ఉన్న వైవిధ్యాన్ని వేలెత్తి చూపారు. తిరుమల లడ్డూ వివాదంపై జాతీయ స్థాయిలో చర్చ జరగాలని కోరుతున్న పవన్ కల్యాణ్.. గతంలో దేశాన్ని కుదిపేసిన ఇతర కీలక సంఘటనల సమయంలో ఎందుకు మౌనంగా ఉన్నారని నిలదీశారు.
యాక్సిస్ మై ఇండియాతన అంచనాలలో తృణమూల్ కాంగ్రెస్‌కు స్పష్టమైన ఆధిక్యాన్ని కట్టబెట్టింది. ఈ సంస్థ అంచనా ప్రకారం టీఎంసీ 165 నుంచి 185 స్థానాలను గెలుచుకునే అవకాశం ఉండగా.. బీజేపీ 95 నుంచి 110 స్థానాలకే పరిమితం కావచ్చని ఆ సర్వే ఫలితం పేర్కొంది. ఇక సీ-ఓటర్ సర్వే కూడా మమతా బెనర్జీపైనే బెంగాల్ ప్రజలు విశ్వాసం ఉంచారని పేర్కొంది.
పదవి వచ్చిందనే అహంకారం వద్దనీ, అందరినీ కలుపుకుని ముందుకుసాగాలని టీడీపీ నేషనల్ వర్కింగ్ ప్రెసిడెంట్ మంత్రి నారా లోకేష్ పేర్కొన్నారు
యువతను పార్టీ వైపు ఆకర్షించడంలోనూ, క్షేత్రస్థాయిలో పార్టీని బలోపేతం చేయడంలోనూ లోకేశ్ పోషించిన పాత్రకు గుర్తింపుగా ఆయనకు పార్టీలో జాతీయ కార్యనిర్వాహక అధ్యక్షుడిగా ప్రమోషన్ ఇచ్చిన సంగతి తెలిసిందే. లోకేష్ తో పాటుగా కొత్తగా ఎంపికైన కమిటీ సభ్యులందరితో చంద్రబాబు స్వయంగా ప్రమాణం చేయించారు.
బెంగాల్ ఎన్నికలలో తొలి విడతలో రికార్డు స్థాయిలో 93 శాతానికి పైగా పోలింగ్ జరగడంతో.. తుది విడతలోనూ అదే స్థాయిలో పోలింగ్ జరిగే అవకాశాలున్నాయంటున్నారు. రెండో విడతలో దక్షిణ బెంగాల్ ప్రాంతంలో మమతా బెనర్జీకి కంచుకోట వంటి కోల్‌కతా, హౌరా, నాడియా, హూగ్లీ వంటి కీలక జిల్లాల్లో పోలింగ్ జరుగుతుండటంతో రాజకీయ వాతావరణం వేడెక్కింది.
ఒడిశాకు చెందిన ఒక నిరుపేద వ్యక్తి తన సోదరి మరణానంతరం ఆమె బ్యాంకు ఖాతాలో ఉన్న ఇరవై వేల రూపాయలు విత్ డ్రా చేసుకోవడానికి బ్యాంకును సంప్రదించాడు. ఆ డబ్బుతో ఆమె అంత్యక్రియల తాలూకు ఖర్చులు లేదా ఇతర అవసరాలు తీర్చుకోవాలని చెప్పాడు.
గత ప్రభుత్వ హయాంలో సోషల్ మీడియా వేదికగా రాజకీయ ప్రత్యర్థులను లక్ష్యంగా చేసుకుని చేసిన దాడుల కేసులో వైసీపీ సోషల్ మీడియా అప్పటి ఇన్‌ఛార్జ్ సజ్జల భార్గవ్‌రెడ్డిని పులివెందుల పోలీసులు విచారించారు. సుమారు 9 గంటల పాటు సాగిన ఈ విచారణలో పోలీసులు ఆయనపై దాదాపు 70 ప్రశ్నలను సంధించారు.
బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి రాష్ట్ర స్థాయి కమిటీ మినహా అన్ని కమిటీలను పార్టీ అధ్యక్షుడు కేసీఆర్ రద్దు చేశారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.