క్రికెట్లో రికార్డుల కింగ్ విరాట్ కోహ్లీకి నెంబర్ 18 చాలా.. చాలా స్పెషల్. 18వ నెంబరుతో విరాట్కి ఉన్న అనుబంధం అపురూపమైంది. తాజాగా 18 ఏళ్ల నిరీక్షణకు తెరదించుతూ 18వ సీజన్లో ఆర్సీబీ ఐపీఎల్ కప్ను ముద్దాడింది. కోహ్లీ పేరు చెప్పగానే క్రికెట్ అభిమానులకు జెర్సీ నెంబరు 18 కళ్ల ముందు కదలాడుతుంది. అది ఐపీఎల్ అయినా ఇంటర్నేషనల్ క్రికెట్ అయినా కోహ్లీ ఆ జెర్సీ నెంబరుతోనే కనిపిస్తాడు. వాస్తవానికి అండర్ 19 క్రికెట్ ఆడేటప్పుడే కోహ్లీకి ఆ నెంబరుతో జెర్సీ ఇచ్చారు. ఆ తర్వత అది తన జీవితంతో ప్రత్యేకంగా మారిందని, రెండు ముఖ్యమైన క్షణాలు ఆ రోజునే జరిగాయని గతంలో కోహ్లీ భావోద్వేగానికి గురయ్యారు.
కోహ్లీ అంతర్జాతీయ క్రికెట్లో అరంగ్రేటం చేసింది 18వ తేదీనే. 18 ఆగస్టు 2008లో తొలి వన్డే ఆడాడు. అతడి తండ్రి ప్రేమ్ కోహ్లీ 2006 డిసెంబరు 18న గుండెపోటుతో మరణించారు. కోహ్లీ తండ్రి కూడా క్రికెట్ ఆడే రోజుల్లో జెర్సీ నెంబరు 18నే వేసుకున్నారంట. ఆయన గుర్తుగా కింగ్ కూడా అదే నెంబరుతో కనిపిస్తున్నారు. ఇక చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్పై కోహ్లీ సెంచరీ నమోదు చేసింది 18వ తేదీనే. 2012 మార్చి 18న ఢాకాలో పాకిస్థాన్ పై జరిగిన వన్డేలో కోహ్లీ 183 పరుగులు చేశాడు. ఇప్పుడు 18 ఏళ్ల తర్వాత ఆర్సీబీ ఐపీఎల్ కప్పు కల నెరవేరింది. 18వ సీజన్లో కప్పు దక్కించుకోవడంతో ఆ నెంబరు కోహ్లీకి మరింత ప్రత్యేకంగా మారింది. ఐపీఎల్లో ఆర్సీబీ చాంపియన్గా నిలిచిన రోజు కూడా ఆ నెంబర్ మ్యాజిక్ కొనసాగడం విశేషం. 3-6-2025 కప్ గెలిచిన రోజు. అది టోటల్ చేస్తే వచ్చేది కూడా 18 కావడం మరింత ప్రత్యేకంగా నిలిచింది.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/number-18-very-special-to-kohli-39-199288.html
మాజీ మంత్రి శిద్దారాఘవరావు ఒకప్పుడు తెలుగుదేశంలో కీలక నేత. చంద్రబాబుకి సన్నిహితుడిగా పార్టీలో పలు కీలక పదవులు కూడా అనుభవించారు. కానీ తెలుగుదేశం 2019 ఎన్నికలలో అధికారం కోల్పోయిన తరువాత వైసీపీ గూటికి చేరారు. అయితే వైసీపీ ప్రభుత్వం ఆ మాజీ మంత్రిని పెద్దగా పట్టించుకున్న దాఖలులు లేవు.
గన్నవరం మాజీ ఎమ్మెల్యే, వైసీపీ సీనియర్ నాయకుడు వల్లభనేని వంశీ ఆ పార్టీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ను గురువారం (జులై 3) భేటీ అయ్యారు.
పటాన్ చెరు లోని పాశమైలారంలోని సిగాచి ఇండస్ట్రీస్ పరిశ్రమలో జరిగిన ప్రమాదం ఆ కంపెనీ షేర్లపై తీవ్ర ప్రభావితం చూపింది. ప్రమాదం జరిగిన తరువాత ఆ కంపెనీ షేర్లు దారుణంగా పతనమయ్యాయి. 3 రోజుల్లోనే దాదాపు 24 శాతం షేర్ వాల్యూ పడిపోయింది.
ఎంతైనా ట్రంపు ట్రంపే.. ప్రపంచంలో ఉన్న ఎన్నో వివాదాలను పరిష్కరించారు. ఆయనకా క్రెడిట్ దక్కాల్సిందే... ఈ మాట అన్నది ఎలాన్ మస్క్. ఇన్నాళ్లూ ఉప్పూ- నిప్పుగా ఉన్న ఈ ఇద్దరూ ఇపుడు కలిసిపోయారా?
వరుసగా జరుగుతున్న విమాన ప్రమాదాలు బెంబేలెత్తిస్తున్నాయి. తాజాగా పుణె నుంచి గోవా వెడుతున్న ఓ విమానానికి తృటిలో పెను ప్రమాదం తప్పింది.
పరిశ్రమలలో వరుస ప్రమాదాలు భయాందోళనలను కలిగిస్తున్నాయి. సిగాచీ పరిశ్రమలో జరిగిన పేలుడు ఘటన అనంతరం మేడ్చల్ లోని ఓ పరిశ్రమలో ప్రమాదం చోటు చేసుకుంది.
తిరుపతిలో భారీ అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. తిరుపతి గోవిందరాజస్వామి ఆలయ సమీపంలోని ఓ దుకాణంలో షార్ట్ సర్క్యూట్ కారణంగా ఈ ఉదయం చెలరేగిన మంటలు ఆలయం ముందున్న చలువ పందిళ్లకు వ్యాపించాయి.
ములుగు జిల్లాలో బీఆర్ఎస్ పార్టీ పరిస్థితి నానాటికీ తీసికట్టు నాగంభోట్లు అన్నట్లుగా తయారౌతోంది. పార్టీ జిల్లా అధ్యక్షుడి అనాలోచిత నిర్ణయాలతో బీఆర్ఎస్ ములుగులో పట్టు కోల్పోతోంది.
తిరుమల అంటే కోట్లాది మంది హిందువులు మనోభావాలతో ముడిపడిన అంశం. టీటీడీ పై దుష్ప్రచారం పోయినంతగా మంచి బయటకు పోవడానికి కొంత ఆలస్యమవుతుంది.
తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది. గత రెండు రోజులుగా స్వల్పంగా తగ్గిన భక్తుల రద్దీ గురువారం (జూలై 3)న పెరిగింది.
శ్రీకాకుళం జిల్లా, ఇచ్చాపురం మండలం, టి.బరంపురం గ్రామానికి చెందిన రిటైర్డ్ ఆర్మీ ఉద్యోగి తిప్పన. పురుషోత్తం రెడ్డి గ్రామానికి విచ్చేసిన సందర్బంగా గ్రామస్తులు ఘన స్వాగతం పలికారు.
టీటీడీ హిందూ ధర్మ ప్రచార పరిషత్ పేరును దుర్వినియోగం చేస్తూ, కళాకారుల నుంచి లక్షల రూపాయలు తీసుకొని మోసగించిన కేసులో కేటుగాడిని తిరుమల వన్ టౌన్ పోలీసులు అరెస్టు చేశారు.
రంగారెడ్డి జిల్లా నార్సింగిలో రూ.1.5 కోట్ల విలువైన 650 గ్రాముల హెరాయిన్ను శంషాబాద్ ఎస్ఓటీ పోలీసులు సీజ్ చేశారు.