ప్రజల గుండెల్లో కొలువున్న పెద్దన్నకు 90 ఏళ్ళు

Publish Date:May 28, 2013

Advertisement

 

తెలుగు చిత్ర సీమకి, తెలుగు జాతికి, రాష్ట్ర రాజకీయాలకి పెద్దన్నగా అరుదయిన గౌరవం స్వంతం చేసుకొన్నస్వర్గీయ నందమూరి తారక రామారావుగారి 90వ జయంతి నేడు. తీయనయిన తెలుగుకు పర్యాయపదంగా, తెలుగు వారి ఆత్మగౌరవానికి నిలువెత్తు రూపంగా నిలచిన యన్టీఆర్ తెలుగు ప్రజల హృదయాలలో శాశ్వితంగా కొలువయ్యుంటారు.

 

యన్టీఆర్ కృష్ణా జిల్లా నిమ్మకూరులో 1923, మే 28న జన్మించారు. 1949లో ‘మన దేశం’ అనే సినిమాతో చిత్ర సీమలోకి ప్రవేశించిన యన్టీఆర్ చివరిగా 1993లో ‘శ్రీనాథ కవిసార్వభౌమ’తో తన 43 ఏళ్ల సుదీర్గ సినీ ప్రస్థానం ముగించారు. ఈ సుదీర్గ యాత్రలో ఆయన నటుడిగా, దర్శకుడిగా, నిర్మాతగా, రచయితగా తన బహుముఖ ప్రజ్ఞ కనబరిచి ప్రజల మెప్పు పొందారు.అనేక విశిష్ట గౌరవ పురస్కారాలను కూడా అందుకొన్నారు.

 

ఆయన మొత్తం 320 సినిమాలలో నటించారు. అంతే కాకుండా దేశంలో మరే ఇతర నటుడు చేయలేనన్ని విభిన్న పాత్రలు పోషించారు. ఆయన చేసిన సినిమాలలో ఎక్కువ సాంఘిక చిత్రాలే అయినప్పటికీ, ఆయనకు ఆచంద్రార్కం నిలిచిపోయే కీర్తి ప్రతిష్టలు ఆర్జించిపెట్టినవి మాత్రం ఆయన చేసిన పౌరాణిక సినిమాలేనని చెప్పవచ్చును. అలాగని ఆయన చేసిన కన్యాశుల్కంలో గిరీశం పాత్రను, రాముడు భీముడు సినిమాలో భీముడి పాత్రను, బడిపంతులు సినిమాలో బడిపంతులు పాత్రను తెలుగు ప్రజలు ఎవరూ ఎన్నటికీ మరిచిపోలేరు.

 

ఇక పౌరాణికాల్లో ఆయన చేసిన శ్రీకృష్ణుని పాత్ర గురించి తెలుగు వారికి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. 27 ఏళ్లలో నిర్మించిన 25పౌరాణిక సినిమాలలో ఆయన శ్రీకృష్ణుని పాత్ర పోషించారు. శ్రీకృష్ణుడు అంటే ఇలాగే ఉంటాడు అని ప్రజలు కూడా నమ్మేంతగా ఆయన ఆ పాత్రను పండించారు. రావణుడు, దుర్యోధనుడు వంటి దుష్టపాత్రలకు కూడా తన అభినయంతో ప్రాణ ప్రతిష్ట చేసి ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చిన ఘనత ఆయనకే చెల్లు.

 

కేవలం ద్విపాత్రాభినయం చేయడమే గొప్ప అనుకొంటున్న సమయంలో దాన వీర శూర కర్ణ సినిమాలో ఏకంగా మూడు పాత్రలు పోషించి ప్రజల చేత జేజేలందుకొన్నారాయన. ఇక, విజయవంతమయిన నిర్మాతగా, ప్రతిభగల దర్శకుడిగా, కధకుడిగా తెలుగు చిత్ర సీమలో ఆయన విజయకేతనం ఎగురవేశారు.

 

ఆయన నటించిన సినిమాలలో150కి పైగా శతదినోత్సవాలు, 50కి పైగా రజతోత్సవాలు, 7 స్వర్ణోత్సవాలు జరుపుకొన్నాయి. ఆయన మన దేశంలోనే తొలి వంద, రెండు వందల చిత్రాలు చేసిన హీరోగా, తొలి మూడొందల చిత్రాలు చేసిన తొలి తెలుగు హీరోగా నెలకొల్పిన రికార్డును ఇంతవరకు ఎవరూ అధిగమించలేకపోయారు. ఆయన తన స్వీయ దర్శకత్వంలో 18 సినిమాలలో నటించడమే కాకుండా వాటిలో అనేక సినిమాలు శతదినోత్సవాలు కూడా జరుపుకొన్నాయి.

 

ఒకవైపు ముఖ్యమంత్రిగా రాష్ట్రాన్ని పాలిస్తూనే, మరో వైపు సినిమాలలో నటించిన ఘనత కూడా ఆయనకే చెల్లింది. ఆయన ప్రతిభకు పట్టం కడుతూ అనేక అవార్డులు, సన్మానాలు పొందారు. కేంద్ర ప్రభుత్వం ఆయనకు ప్రతిష్టాత్మకమయిన పద్మశ్రీ అవార్డును 1968లోనే ఇవ్వడం జరిగింది. అయితే, చిత్రసీమకి ఇంతగా సేవలందించిన ఆయనకి జాతీయ స్థాయిలో తగిన గుర్తింపు దక్కలేదనే భావన తెలుగు ప్రజలలో ఉంది. అందుకే ఆయనకు ప్రతిష్టాత్మకమయిన ‘భారత రత్న’బిరుదు ఇవ్వాలని ప్రజలు కోరుకొంటున్నారు. ఇటీవలే ఆయన విగ్రహం పార్లమెంటులో అవిష్కరింపబడటం యావత్ తెలుగు జాతికి గర్వ కారణం.

 

రాష్ట్రంలో ముఖ్యమంత్రులను ఆట బొమ్మలుగా చేసి ఆడుకొంటున్న కాంగ్రెస్ పార్టీ పద్ధతి చూసి చాలా బాధ పడిన ఆయన తెలుగు ప్రజల ఆత్మ గౌరవం కోసం 1982లో తెలుగుదేశం పార్టీ స్థాపించారు. పార్టీ స్థాపించిన 9నెలలలోనే ఆయన తిరుగులేని మెజార్టీతో రాష్ట్రంలో తొట్టతొలి కాంగ్రెసేతర ప్రభుత్వం నెలకొల్పారు. మూడు సార్లు ముఖ్యమంత్రిగా రాష్ట్రాన్ని పాలించిన ఆయన రాజకీయాలను, అధికార పద్దతులను పక్కన బెట్టి తన అంతరాత్మకే ఎక్కువ ప్రాదాన్యమిస్తూ ప్రజల సమస్యలకు మనసుతో స్పందిస్తూ పరిపాలన చేసిన ఏకైక ముఖ్యమంత్రిగా నిలిచిపోయారు.

 

బహుశః ఆ కారణంగానే, టంగుటూరి ప్రకాశం పంతులు గారి తరువాత ఇంతవరకు మరే ముఖ్యమంత్రి ప్రజలకి చేరువకానంతగా ఆయన చేరువకాగలిగారు. కానీ, ఆయనలో రాజకీయాలకు అసలు నప్పని నిరాడంబరత, అధికారం దర్పం, రాజకీయాలు పక్కన బెట్టి మనసుతో స్పందించే తీరు, కపటమెరుగని భోళతనం, ముక్కు సూటితనం వంటి లక్షణాలే ఆయన వ్యక్తిగత, రాజకీయ జీవితానికి అత్యంత విషాదకర ముగింపునిచ్చాయని మన అందరికీ తెలిసిన విషయమే. ఆయన 1996, జనవరి 18న గుండె పోటుతో మరణించారు. అయినప్పటికీ ఆయన తెలుగు చిత్ర సీమకు, తెలుగుజాతికి చేసిన మహోపకారం వల్ల ‘తెలుగు’ పదం సజీవంగా ఉన్నంతవరకూ ఆయన కూడా తెలుగు ప్రజల హృదయాలలో సజీవుడిగానే ఉంటారు. .

By
en-us Political News

  
రేవంత్ కేటీఆర్ పై చేసిన విమర్శలు జగన్ కు కూడా వర్తిస్తాయంటూ నెటిజనులు వ్యాఖ్యానిస్తున్నారు. రేవంత్ విమర్శలు అటు కేటీఆర్, ఇటు జగన్ లకు దిమ్మదిరిగేలా చేశాయని అంటున్నారు.
ఐటీ రంగం సాధించబోయే అభివృద్ధిని, సాంకేతికత ఆధారంగా సంక్షేమ, అభివృద్ధి పథకాలను ఆయన రెండు దశాబ్దాల కిందటే రూపొందించారు. ఆయన విజన్ ఫలితమే ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా తెలుగు యువత ఐటీ రంగంలో దూసుకుపోతున్నది. ఆ కారణంగానే చంద్రబాబును దేశం విజనరీ నేతగా గుర్తించింది.
వాజ్ పేయి తొలిసారి ఒక నాన్ కాంగ్రెస్ ప్రధానిగా ఐదేళ్లు కాంగ్రెస్సేతర ప్రభుత్వాన్ని నడిపి చరిత్ర సృష్టిస్తే.. పీవీ నాన్ గాంధీ కాంగ్రెస్ అధ్యక్షుడిగా, ప్రధానిగా ఐదేళ్లు మైనారిటీ ప్రభుత్వాన్ని విజయవంతంగా నడిపి ఏలి రికార్డు సృష్టించారు.
ప్రజాస్వామ్య విలువలతో కూడిన పాలనకు, సంకీర్ణ ప్రభుత్వాన్ని ఎలాంటి అరమరికలూ లేకుండా మిత్రధర్మాన్ని తప్పకుండా నడపిన వాజ్ పేయి స్ఫూర్తిగా ముందుకు సాగాలన్న సంకేతాన్ని ఈ విగ్రహావిష్కరణ ద్వారా చంద్రబాబు ఇచ్చారని అంటున్నారు.
బెంగ‌ళూరు టు ఢిల్లీ అన్నట్లుగా ప్ర‌త్యేక ఎపిసోడ్లు న‌డిచాయి. రాహుల్ గాంధీ డీకేకి స్పెష‌ల్ మెసేజీలు పెట్టారు. క‌ట్ చేస్తే ఏదో అనుకుంటే ఏమీ కాలేదు అన్నట్లుగా క‌ర్ణాట‌క‌లో సీఎం మార్పు జరగలేదు. కన్ఫ్యూజన్ కంటిన్యూ అవుతోంది.
2022 నవంబర్ లో అప్పటి వైసీపీ సర్కార్ రోడ్డు విస్తరణ పేరుతో మంగళగిరి నియోజకవర్గ పరిధిలోని ఇప్పటం అనే కుగ్రామంలో ఇళ్ల ను కూల్చివేసింది. ఆ సమయంలో పవన్ కల్యాణ్ ఇప్పటం గ్రామంలో పర్యటించి బాధితులకు అండగా నిలిచారు. అధికారంలోకి వచ్చిన తరువాత మళ్లీ గ్రామాన్ని సందర్శిస్తానని అప్పట్లో మాట ఇచ్చారు.
పార్లమెంటరీ ప్రజాస్వామ్య వ్యవస్థను ఇంత కాలం వ్యతిరేకిస్తూ వచ్చిన లొంగిపోయిన మావోయిస్టు నేతలు ఇప్పుడు అదే వ్యవస్థ ద్వారా సమాజంలో మార్పు తీసుకురావాలని భావిస్తున్నారు. ఇందుకు తాజాగా మావోయిస్టు మాజీ అగ్రనేత మల్లోజుల ఇక ఆయుధాలు చేపట్టబోమంటూ చేసిన ప్రకటనే సాక్ష్యంగా నిలుస్తోంది.
దానం విషయంలో మాత్రం ఆయన అధికారికంగా కాంగ్రెస్ కండువా కప్పుకోవడం, ఆ పార్టీ తరఫున ఎంపీగా పోటీలోకి దిగడంతో.. ఇవే కోర్టులో , అలాగే స్పీకర్ ఎదుట తిరుగులేని ఆధారాలుగా నిలిచాయి. ఈ నేపథ్యంలో దానంపై అనర్హత వేటు పడటం ఖాయమన్న అభిప్రాయం వ్యక్తం అవుతోంది.
మొత్తం మీద ఆ కేసులో కీలక మలుపునకు ఈ పెన్ డ్రైవ్ ఆధారం అయ్యే అవకాశాలే మెండుగా ఉన్నాయని దర్యాప్తు అధికారులు అంటున్నారు. ఈ కేసును త్వరితగతిన దర్యాప్తు చేసి నివేదికను కోర్టుకు సమర్పించాలన్న ఉద్దేశంతో హైదరాబాద్ సిపి సజ్జనార్ ఆధ్వర్యంలో 9 మంది అధికారులతో కలిసి ప్రత్యేక సిట్ ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే.
పార్టీ పగ్గాలు చేపట్టడానికీ, ప్రధాని మంత్రి పదవిని అధిష్టించడానికి కాంగ్రెస్ లో సమర్థత ఉన్న నేత తన సతీమణి ప్రియాంక వధేరా గాంధీ మాత్రమేనంటూ రాబర్ట్ వధేరా చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు రాజకీయంగా అత్యంత ప్రాధాన్యత సంతరించుకున్నాయి.
ఈ కార్యక్రమానికి ఏపీ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి హాజరయ్యారు. అలాగే వైఎస్ కుటుంబీకులంతా హాజరయ్యారు. అయితే ఈ వేడుకలకు వైఎస్ తనయ వైఎస్ షర్మిల మాత్రం హాజరు కాలేదు.
తెలుగు రాష్ట్రాల్లోనూ పొలిటికల్ పార్టీలకు ఫండ్స్ బాగానే గిట్టుబాటయ్యాయి. అయితే.. ఏపీలో పవర్‌లో ఉన్న టీడీపీ, జనసేన కంటే వైసీపీ కలెక్షన్లే ఎక్కువగా ఉండడం హాట్‌టాపిక్‌గా మారింది.
అంబటి ఏమన్నారంటే.. 2024 ఫలితాలను అర్ధం చేసుకోవడంలో తెలుగుదేశం కూటమి పార్టీలు విఫలమయ్యాయట. చంద్రబాబు మోసపూరిత వాగ్దానాల కారణంగానే కూటమి ఆ ఎన్నికలలో అధికారంలోకి వచ్చిందట.. ఇప్పుడు ఈ ఏడాదిన్న కాలంలో జనానికి తత్వం బోధపడి.. జగన్ పాలన మళ్లీ రావాలని కోరుకుంటున్నారట. అంబటి భాష్యం విన్న వైసీపీయులే ఆశ్చర్యపోతున్నారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.