వైసీపీకి నేతలే కాదు.. క్యాడరూ దూరమే!.. ఇది జగన్ స్వయంకృతమే!

Publish Date:Sep 30, 2024

Advertisement

ఆంధ్రప్రదేశ్ లో  వైసీపీ ఉనికి మాత్రంగా కూడా మిగిలే అవకాశాలు లేకుండా ఆ పార్టీ అధినేత అడుగులు పడుతున్నాయా? నాయకులు, కార్యకర్తలు పార్టీని వదిలి పారిపోయే పరిస్థితులను స్వయంగా సృష్టిస్తున్నారా అంటే పరిశీలకులు ఔననే సమాధానమే ఇస్తున్నారు. పిడిక్కీ బియ్యానికీ ఒకటే మంత్రం అన్నట్లుగా జగన్ తన తప్పిదాలను, తన వైఫల్యాలను తెలుగుదేశం అధినేత చంద్రబాబుకు, ఆ పార్టీకీ ఆపాదించి చేతులు దులిపేసుకోవడానికి చేస్తున్న ప్రయత్నాలు బెడిసికొడుతున్నాయి. బూమరాంగ్ అవుతున్నాయి. వైసీపీ మనుగడనే ప్రశ్నార్థకం చేస్తున్నాయి. తిరుమల లడ్డూ ప్రసాదం తయారీలో  కల్తీ నెయ్యి వినియోగం బయటపడిన క్షణం నుంచీ జగన్ వ్యూహాలన్నీ భస్మాసుర హస్తాన్ని తలపింప చేసేలాగే ఉన్నాయి. ఈ వివాదం నుంచి బయటపడటం కోసం ఆయన ఎంచుకున్న ఎదురు దాడి వ్యూహం వైసీపీనీ, జగన్ ను నిండా ముంచేసింది. 

తిరుమల లడ్డూ ప్రసాదం తయారీలో కల్తీ నెయ్యి వినియోగం విషయం వెల్లడి కాగానే జగన్ కల్తీ జరిగితే జరిగింది.. కానీ దానికి బహిర్గతం చేయడం ఏమిటి? అంటూ ఎదురుదాడికి దిగారు. కల్తీ అబద్ధమని గట్టిగా చెప్పలేకపోయారు.  జనసేనాని పవన్ కల్యాణ్ ప్రాయశ్చిత దీక్ష అనగానే దానికి కౌంటర్ గా తాను ప్రాయశ్చిత పూజలు అంటూ ప్రకటన చేశారు. తిరుమల వెంకన్న స్వామిని దర్శించుకుని ప్రాయశ్చిత పూజలు నిర్వహిస్తానని ప్రకటించి.. ఇందుకు షెడ్యూల్ కూడా ప్రకటించేశారు. అయితే తిరుమల వేంకటేశ్వరుడిపై విశ్వాసం ఉందన్న డిక్లరేష్ ఇవ్వడానికి మాత్రం ససేమిరా అన్నారు. తన తిరుమల పర్యటనను సైతం రద్దు చేసేసుకున్నారు. దీంతో వైసీపీ నేతలు, కార్యకర్తల  పరిస్థితి అగమ్య గోచరంగా మారిపోయింది. జగన్ తన తీరుతో తమ రాజకీయ భవిష్యత్ కు సమాధి కట్టేశారని వైసీపీ నేతలు వాపోతున్నారు. ఇక పార్టీ క్యాడర్ మనో ధైర్యమైతే పాతాళానికి పడిపోయింది. 

జగన్ తన పర్యటనను తానే స్వయంగా రద్దు చేసుకుని ప్రభుత్వం అడ్డుకుందని ప్రజలను నమ్మించడానికి చేసిన ప్రయత్నాలు వృధా అయ్యాయి. ప్రజల దాకా ఎందుకు తన తిరుమల పర్యటనకు ప్రభుత్వం అనుమతి ఇవ్వలేదంటూ ఆయన చేసిన ఆరోపణలను సొంత పార్టీ నేతలూ, కార్యకర్తలే నమ్మడం లేదు. నిజంగానే ఒక వేళ ప్రభుత్వం అనుమతి ఇవ్వకపోతే పార్టీకి అంత కంటే కావలసిందేముందని, ఎందుకు అనుమతి ఇవ్వరంటూ జగన్ తిరుమల పర్యటనకు బయలు దేరి ఉండాల్సిందనీ శ్రేణులు అంటున్నాయి. అప్పుడు పోలీసులు అడ్డుకుని ఉంటే.. ప్రజలలో మంచి మైలేజ్ వచ్చి ఉండేది కదా అంటున్నారు.  అలా కాకుండా అసలు జగన్ తన తాడేపల్లి ప్యాలెస్ గేటు దాటకుండానే ప్రభుత్వం అడ్డుకుందంటూ చేతులెత్తేయడం ఏమిటి అని ప్రశ్నిస్తున్నారు.  

అయినా ఓ వైపు ప్రభుత్వం జగన్ తిరుమల పర్యటనపై ఎలాంటి ఆంక్షలూ లేవని విస్పష్టంగా ప్రకటించిన తరువాత కూడా పోలీస్ యాక్ట్ 30 ప్రకారం ఎవరో వైసీపీ కార్యకర్తకు ఇచ్చిన నోటీసును తనకు ఆపాదించుకుని జగన్ పిరికిపందలా తిరుమల పర్యటన రద్దు చేసుకున్నారని అంటున్నారు. అలా రద్దు చేసుకోవడానికి ప్రభుత్వ అనుమతి లేకపోవడం ఏ మాత్రం కారణం కాదని వైసీపీ శ్రేణులే చెబుతున్నాయి. డిక్లరేషన్ ఇవ్వడం ఇష్టం లేకనే జగన్ తన తిరుమల పర్యటన రద్దు చేసుకున్నారని ఆ శ్రేణులు నమ్ముతున్నాయి. జగన్ డిక్లరేషన్ ఇవ్వరు అంటూ టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి వ్యాఖ్యలను గుర్తు చేసుకుంటున్నాయి.  డిక్లరేషన్ ఇవ్వలేని జగన్ కు తిరుమలలో ప్రాయశ్చిత పూజలు నిర్వహించే అధికారం ఎక్కడిదని వైసీపీ శ్రేణులే అంటున్నాయి. మొత్తంగా ఓటమి తరువాత జగన్ పార్టీని నేతలు వీడుతూ వస్తున్నారు. ఇప్పుడు డిక్లరేషన్ ను నిరాకరించి పార్టీ  కార్యకర్తలూ పారిపోయే పరిస్థితి జగన్ స్వయంగా తెచ్చుకున్నారు. 

By
en-us Political News

  
తెలుగువన్ వాస్తవ వేదికలో ప్రస్తుత జాతీయ రాజకీయ పరిస్థితులపై విస్తృత చర్చ జరిగింది.
తెలంగాణ రాజకీయాల్లో ఇప్పుడు జగిత్యాల వేదికగా జరిగిన సభ తీవ్ర చర్చనీయాంశంగా మారింది.
రాజకీయ చరిత్రను పరిశీలిస్తే నాదెండ్ల భాస్కరరావుకు, చంద్రబాబు నాయుడుకు మధ్య సుదీర్ఘమైన రాజకీయ వైరం ఉంది. 1984లో ఎన్టీఆర్ అమెరికా వెళ్లిన సమయంలో జరిగిన రాజకీయ పరిణామాలు, ఆపై నాదెండ్ల ముఖ్యమంత్రి కావడం వంటి సంఘటనలు తెలుగు రాజకీయాల్లో ఒక కీలక మలుపు. ఆ సమయంలో ఎన్టీఆర్‌ను తిరిగి అధికారంలోకి తీసుకురావడంలో చంద్రబాబు కీలక పాత్ర పోషించారు.
న్టీఆర్ అమెరికాలో గుండె ఆపరేషన్ చేయించుకుని తిరిగి వచ్చేలోపు, నాదెండ్ల భాస్కరరావు కాంగ్రెస్ మద్దతుతో ముఖ్యమంత్రి అయ్యారు. ఆ క్లిష్ట సమయంలో తెలుగుదేశం పార్టీ చెల్లాచెదురు కాకుండా, ఎమ్మెల్యేలను ఏకం చేయడంలో చంద్రబాబు కీలక పాత్ర పోషించారు. పార్టీని కాపాడిన రక్షకుడి ఇమేజ్ ఆయనకు అప్పుడే వచ్చింది.
తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్, ఆయన కుమారుడు ఉదయనిథి స్టాలిన్, టీవీకే అధినేత విజయ్, బీజేపీ నాయకురాలు ఖుష్బు, కమల్ హాసన్, రజనీకాంత్ తదితరులు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు.
విజయ్ రాజకీయాల్లోకి రావడాన్ని చంద్రబాబు స్వాగతిస్తూనే.. ప్రజా సేవ చేయాలనే తపనతో రాజకీయాల్లోకి వచ్చే ఎవరినైనా ఆహ్వానించాల్సిందేనన్నారు. అయితే సినిమాల్లో ఉన్న ఇమేజ్ రాజకీయాల్లో రాణించడానికి సరిపోదనీ, రాజకీయాలలో పట్టుదల, సహనం చాలా ముఖ్యమన్న చంద్రబాబు.. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ ప్రస్తావన తీసుకువచ్చారు.
విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల్లో వైసీపీ పరిస్థితిని గమనిస్తే నేతల మధ్య సఖ్యత లేదన్న విషయం ప్రస్ఫుటంగా తెలుస్తుంది. పార్టీలో కీలక నేతలు ఉన్నప్పటికీ, వారంతా సమష్టిగా కాకుండా ఎవరికి వారే యమునా తీరే అన్న చంద్రంగా వ్యవహరిస్తున్నారు. దీంతో పార్టీ కేడర్‌ అయోమయంలో పడింది. ముఖ్యంగా ఉత్తరాంధ్ర వైసీపీ ఇన్ చార్జ్‌గా కన్నబాబు నియామకం తరువాత స్థానిక నేతల నుంచి ఆయనకు ఏ మాత్రం సహకారం అందడం లేదు.
నాదెండ్ల భాస్కరరావు 1935 జూన్ 23న పిచ్చయ్య, వెంకాయమ్మ దంపతులకు గుంటూరు జిల్లా తెనాలి డివిజన్‌లోని దోసేపూడి గ్రామంలో జన్మించారు.
తమిళనాడులో ఎన్డీయేకు పట్టం కట్టండి.. చెన్నైలో సీఎం చంద్రబాబు పిలుపు
మునీర్‌కు ఇరాన్ అగ్రశ్రేణి సైనిక వర్గాలతో ఉన్న సన్నిహిత సంబంధాలు ఒకవైపు చర్చలకు సహకరిస్తాయని భావిస్తున్నా.. అదే సమయంలో ఆయన విశ్వసనీయతపై అమెరికా నిఘా సంస్థలు అనుమానం వ్యక్తం చేస్తున్నాయి. మధ్యవర్తిత్వం పేరుతో ఆయన అమెరికా ప్రయోజనాలకు గండి కొట్టేలా వ్యవహరిస్తారా అన్న సందేహాలు వ్యక్తం అవ్వడమే కాకుండా, ఆ దిశగా హెచ్చరికలు సైతం జారీ అవుతున్నాయి.
చంద్రబాబు ప్రస్తుతం మోడీని కాపాడేందుకు ఎన్డీఏ తరపున తెలుగు ప్రజల మధ్య ప్రచారానికెళ్లడం విడ్డూరమన్నారు. నాడు తెలుగు ప్రజల ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టి, నేడు తెలుగు ప్రజల దగ్గరికి వెళ్లి ఓట్లు అడగడం సబబు కాదని నారాయణ అన్నారు.
19వ శతాబ్దంలో రూపుదిద్దుకున్న బెంగాల్ పునరుజ్జీవనం భారత ఆధునిక చరిత్రలో ఒక మలుపు. రాజా రామ్మోహన్ రాయ్, ఈశ్వరచంద్ర విద్యాసాగర్, బంకిం చంద్ర చట్టోపాధ్యాయ, రవీంద్రనాథ్ ఠాగూర్ వంటి మహనీయులు సమాజ సంస్కరణలు, విద్య, సాహిత్యం, జాతీయ చైతన్యం వంటి రంగాల్లో కొత్త దిశను చూపించారు. భారత జాతీయ కాంగ్రెస్ ఆవిర్భావ దశలోనూ బెంగాలీ నాయకుల ప్రాబల్యం స్పష్టంగా కనిపించింది.
తెలంగాణ రాజకీయాల్లో ప్రస్తుతం మాజీ మంత్రి హరీశ్ రావు ఢిల్లీ పర్యటన హాట్ టాపిక్‌గా మారింది.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.