జగన్ సంక్షేమం ఉట్టి మాట.. దోపిడీయే అసలు బాట!.. మదనపల్లె మినీ మహానాడులో చంద్ర నిప్పులు..

Publish Date:Jul 6, 2022

Advertisement

జగన్ సర్కార్ పై తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు నిప్పులు చెరిగారు. జగన్ చెబుతున్న సంక్షేమం అంతా ఉట్టి మాటేననీ, ఆయన అసలు బాట దోపిడీయేనని మండి పడ్డారు. మదనపల్లెలో జరిగిన మినీ మహానాడులో చంద్రబాబు చేసిన ప్రసంగానికి భారీ స్పందన లభించింది. ముఖ్యంగా స్కూళ్ల విలీనం, వ్యవసాయ మోటర్లకు మీటర్లు బిగించడం, జగన్ బ్రాండ్ మద్యం, ధరల బాదుడే బాదుడుపై ఆయన తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు.స్కూళ్ల విలీనంపై చంద్రబాబు జగన్ ను నిలదీశారు. పేద పిల్లలు చదువులకు దూరమయ్యేలా జగన్ చర్యలు ఉన్నాయని విమర్శించారు.

హేతుబద్ధీకరణ అంటూ ఏనిమిదివేల ప్రభుత్వ పాఠశాలలను మూసివేయడం రాష్ట్రంలో విద్యను సర్వనాశనం చేయడమేనని మండిపడ్డారు. తన హయాంలో కిలోమీటర్ కు ఒక స్కూలు, మండలానికో కాలేజీ ఏర్పాటు చేస్తే జగన్ ఇప్పుడు స్కూళ్లను మూసేసి రాష్ట్రంలో విద్యార్థులను చదువులకు దూరం చేస్తున్నారని మండి పడ్డారు. ప్రజలు ప్రభుత్వాన్ని నిలదీయాలనీ, తిరగబడాలనీ పిలుపునిచ్చారు.కేవలం అర్ధ శాతం అప్పుకోసం జగన్ స్కూళ్లు మూసేస్తున్నారని దుయ్యబట్టారు. జగన్ చదువుకోలేదు కనుకనే ఇతరులు చదువుకోవడాన్ని భరించలేకపోతున్నాడని చంద్రబాబు అన్నారు. గతంలో అధికారం కోసం పాదయాత్ర పేరుతో రాష్ట్రమంతా తిరిగి ప్రజలకు ముద్దులు పెట్టిన జగన్‌.. ఇప్పుడు పన్నుల పేరుతో పిడు గుద్దులు గుద్దుతున్నారని ఎద్దేవా చేశారు.  
 రైతులు వినియోగించే వ్యవసాయ మోటార్లకు మీటర్లు బిగించడాన్ని ఎట్టిపరిస్థితుల్లోనూ అంగీకరించబోమని తేల్చి చెప్పారు.    . అప్పులు తెచ్చుకోవడం కోసమే జగన్‌ ఈ నిర్ణయం తీసుకున్నారని ఆరోపించారు. రాష్ట్రంలో ఎక్కడ లేని సమస్యలూ సృష్టించి జనాలను ఇబ్బంది పెడుతున్నారని చంద్రబాబు ఆరోపించారు.   మినీ మహానాడుకు జనం రాకుండా పుంగనూరులో వైసీపీ నాయకులు అడ్డుకున్నారన్నారు. తాను కన్నెర్ర చేస్తూ ఇళ్లల్లోంచి బయటకు రాలేరని వైసీపీ నేతలను హెచ్చరించారు. 
 రాష్ట్రంలో జే బ్రాండ్‌ మద్యంతో ప్రజల ఆరోగ్యంతో జగన్‌ చెలగాటమాడుతున్నారనీ,  బూమ్‌ బూమ్‌, ప్రెసిడెంట్‌ మెడల్‌, ఆంధ్రాగోల్డ్‌ వంటి పేర్లతో ముఖ్యమంత్రి మద్యం వ్యాపారం చేస్తున్నాడనీ విమర్శించారు. జే బ్రాండ్ మద్యంలో కెమికల్స్ ఉన్నాయని   రుజువైందన్నారు.

జగన్ మూడేళ్ల పాలనలో రాష్ట్రం 30 ఏళ్లు వెనక్కు వెళ్లిందని చంద్రబాబు విమర్శించారు. తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో  అద్దాల్లా ఉన్న రోడ్లు ఇప్పుడు గుంతల మయమయ్యాయన్నారు. సోషల్‌ మీడియాలో పోస్టులపై ఎటువంటి అరెస్టులు చేయకూడదని సుప్రీంకోర్టు  స్పష్టంగా చెప్పినా రాష్ట్రంలో 600 కేసులు పెట్టారు. 180 మందిని అరెస్టు చేశారన్న చంద్రబాబు కొందరు పోలీసులు వైసీపీ కార్యకర్తల్లా వ్యవహరిస్తున్నారన్నారు. అటువంటి వారిపై మేం అధికారంలోకి వచ్చాకా చర్యలు తీసుకుంటామని చెప్పారు.

 ఆర్టీసీ ధరలు మన రాష్ట్రంలోనే ఎక్కువగా ఉన్నాయి. నేను దీపం పథకం ప్రవేశపెడితే జగన్‌ దానిని ఆర్పివేస్తూ గ్యాస్‌ ధరలు పెంచారు. ప్రస్తుతం వంట గ్యాస్‌ కొనే స్థితిలో మహిళలు లేరు, మళ్లీ కట్టెల పొయ్యిలే దిక్కయ్యేలా ఉన్నాయి. కోడిగుడ్లు, చికెన్‌ ధరలు కూడా సామాన్యులకు అందనంత దూరంలో ఉన్నాయి. ముస్లిం మైనారిటీల పెళ్లి ఖర్చులకు మేం దుల్హన్‌ పథకాన్ని ప్రవేశపెడితే జగన్‌ రద్దు చేశాడు. అన్న క్యాంటీన్లు,  చంద్రన్న బీమా, సంక్రాంతి కానుక.. అన్నింటినీ తీసేశాడు. జగన్ ది రద్దుల, విధ్వంసాల పాలన అని చంద్రబాబు అన్నారు.

By
en-us Political News

  
గత ప్రభుత్వ హయాంలో సోషల్ మీడియా వేదికగా రాజకీయ ప్రత్యర్థులను లక్ష్యంగా చేసుకుని చేసిన దాడుల కేసులో వైసీపీ సోషల్ మీడియా అప్పటి ఇన్‌ఛార్జ్ సజ్జల భార్గవ్‌రెడ్డిని పులివెందుల పోలీసులు విచారించారు. సుమారు 9 గంటల పాటు సాగిన ఈ విచారణలో పోలీసులు ఆయనపై దాదాపు 70 ప్రశ్నలను సంధించారు.
బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి రాష్ట్ర స్థాయి కమిటీ మినహా అన్ని కమిటీలను పార్టీ అధ్యక్షుడు కేసీఆర్ రద్దు చేశారు.
బీఆర్ఎస్ 25వ వ్యవస్థాపక దినం పురస్కరించుకుని కేసీఆర్, కేటీఆర్ కవిత వ్యాఖ్యలకు దీటుగా సమాధానం ఇస్తారని ఆశించారు. అయితే అందుకు భిన్నంగా కేసీఆర్, కేటీఆర్ ల మౌనం అందరినీ విస్మయపరిచింది.
తమిళనాడులో ఎన్నికల పోలింగ్‌ ముగియడంతో.. అన్ని పార్టీలూ గెలుపు అంచనాల్లో నిమగ్నమయ్యాయి.
రాష్ట్రవ్యాప్తంగా ఎండలు మండుతుండటం, వడగాల్పుల తీవ్రత ఎక్కువగా ఉండటంతోనే బహిరంగ సభ నిర్వహించకూడదని పార్టీ అధినేత కేసీఆర్ నిర్ణయించారని కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ ఇచ్చిన వివరణ నమ్మశక్యంగా లేదని పార్టీ శ్రేణులే పెదవి విరుస్తున్నాయి.
బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు, మాజీ మంత్రి కేటీఆర్ పార్టీ జెండాను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో భారీ సంఖ్యలో పార్టీ నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు. పార్టీ జెండాను ఆవిష్కరించిన అనంతరం ప్రసంగించిన కేటీఆర్.. 14ఏళ్లపాటు పోరాటం చేసి కేసీఆర్ తెలంగాణ సాధించారన్నారు.
శాసనమండలి కార్యాలయంలో మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి ఈ ఇరువురి చేత ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క, పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు హాజరయ్యారు.
ముఖ్యంగా కవిత టీఆర్ఎస్ పార్టీ.. బీఆర్ఎస్ పార్టీని క్లిష్టపరిస్థితుల్లోకి నెట్టేసింది. బీఆర్ఎస్ అధినేత సొంత కుటుంబం నుంచే తిరుగుబాటు రావడం ఆ పార్టీ క్యాడర్ ను అయోమయంలో, గందరగోళంలో పడేసింది. పైగా కవిత.. పార్టీ పేరు టీఆర్ఎస్ కావడంతో బీఆర్ఎస్ పరిస్థితి వెంటిలేటర్ పైకి వెళ్లేలా మార్చిందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి వ్యవహారం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది.
ప్రతిపక్షాలు సమర్పించిన ఈ నోటీసులో ప్రధానంగా ఎన్నికల నిర్వహణలో పారదర్శకత లోపించిందని, నిష్పాక్షికంగా వ్యవహరించాల్సిన కేంద్ర ఎన్నికల సంఘం ఏకపక్షంగా వ్యవహరిస్తోందని ఆరోపించాయి. ఈ వ్యవహారంలో వివిధ పార్టీలకు చెందిన సభ్యులు ఏకతాటిపైకి వచ్చి నోటీసు ఇవ్వడం ప్రాధాన్యత సంతరించుకుంది.
గతంలో ఇదే 152 స్థానాల పరిధిలో బీజేపీ బలం కేవలం 59 సీట్లు మాత్రమే. అయితే ఇప్పుడు ఆ సంఖ్యను రెండింతలు చేసి 110కి చేర్చడం అంటే అది సామాన్యమైన విషయం కాదు.
గవర్నర్ కోటా ఎమ్మెల్సీల నియామక ప్రక్రియ ఎట్టకేలకు కొలిక్కి వచ్చింది. రాష్ట్ర ప్రభుత్వం సిఫార్సు చేసిన ప్రొఫెసర్ ఎం. కోదండరాం, మాజీ క్రికెటర్ మొహమ్మద్ అజారుద్దీన్ పేర్లకు గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా శనివారం ఆమోద ముద్ర వేశారు. దీనికి సంబంధించిన ఫైలుపై గవర్నర్ సంతకం చేయడంతో.. వీరిద్దరి నియామకానికి మార్గం సుగమమైంది.
బీఆర్ఎస్ పార్టీ, దాని నాయకత్వంపై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. బీఆర్ఎస్ అధినేత, తన కన్న తండ్రి కేసీఆర్ పై సంచలన వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్ ఇప్పుడు మన మనిషి కాదన్నారు. ఆయనను మరమనిషిగా అభివర్ణించారు. గుంటనక్కల చేతిలో బందీ అయ్యారంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. బీఆర్ఎస్ తెలంగాణ ఆత్మను పూర్తిగా కోల్పోవడం వల్లే తాను కొత్త పార్టీ పెట్టాల్సి వచ్చిందన్న కవిత.. ఉద్యమ నాయకుడైన కేసీఆర్ అభివృద్ధి రథం గాడి తప్పిందన్నారు. గతంలో జరిగిన కొన్ని తప్పుల్లో భాగస్వామినేనని అంగీకరిస్తూనే.. ఆ తప్పులను సరిదిద్దుకునే ప్రయత్నం చేస్తున్నానన్నారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.