వైసీపీ నేతల అరెస్టులను జనం పట్టించుకోవడం లేదు.. కాగడా పెట్టి వెతికినా సానుభూతి కానరావడం లేదు!వైసీపీ ఆశలపై ఆ పార్టీ సానుభూతి పరుడు, జగన్ కు వీరాభిమాని అయిన ప్రొఫెసర్ నాగేశ్వర్ నీళ్లు చల్లేశారు. ప్రొఫెసర్
నాగేశ్వర్ వైసీపీకీ, జగన్ కు సానుభూతి పరుడన్న విషయం రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలకు తెలిసిందే. ఆయన తన వీడియోలు, విశ్లేషణల ద్వారా జగన్ కు గట్టి మద్దతుదారుగా గుర్తింపు పొందారు. తాను తటస్థ విశ్లేషకుడిననీ ఎటువైపూ మొగ్గు లేదని చాటుకోవడానికి ప్రొఫెసర్ నాగేశ్వర్ ఎన్నడూ ప్రయత్నించిన దాఖలాలు
లేవు. అటువంటి కరుడుగట్టిన జగన్ మద్దతుదారు.. తాజాగా తన విశ్లేషణలో జగన్ పార్టీ గాలి తీసేశారు. ఇప్పుడు వైసీపీ తమ నేతలపై కూటమి ప్రభుత్వం తప్పుడు కేసులు బనాయించి అక్రమంగా అరెస్టులు చేస్తున్నదంటూ ఊరూ వాడా ఏకం చేసేలా గగ్గోలుపెడుతున్నారు. ఈ అక్రమ అరెస్టులతో తమ పార్టీపై ప్రజా సానుభూతి వెల్లువెత్తుతందని గంపెడాశతో ఉన్నారు. సరిగ్గా ఈ సమయంలో ఈ అరెస్టులను ప్రజలు అసలు పట్టించుకోవడం లేదనీ, కాగడా పెట్టి వెతికినా ప్రజలలో వైసీపీ పట్ల కానీ అరెస్టైన ఆ పార్టీ నేతల పట్ల కానీ సానుభూతి కనిపించడం లేదని కుండబద్దలు కొట్టేశారు.
ఆయన ఏమన్నారంటే జనం మాజీ మంత్రి జోగి రమేష్ చంద్రబాబు నివాసంపై దాడి చేయడాన్ని జనం కళ్లారా చూశారనీ, అటువంటి జోగి రమేష్ పై పోలీసులు కేసు నమోదు చేసి అరెస్టు చస్తే జనానికి సానుభూతి కలుగుతుందని వైసీపీ ఎలా భావిస్తోందని ప్రొఫెసర్ నాగేశ్వర్ ప్రశ్నించారు.
అదే విధంగా వల్లభనేని వంశీ విషయంలోనూ ప్రజలలో సానుభూతి కనిపించడం లేదని అన్నారు. నారా భువనేశ్వరిపై వంశీ అనుచిత వ్యాఖ్యలు చేశారనీ, అటువంటి వంశీపై కేసులు పెడితే తప్పేమిటని జనం భావిస్తున్నారే తప్ప అయ్యే వంశీ అరెస్టైయ్యారా, కేసుల్లో ఇరుక్కున్నారా అని సానుభూతి చూపడం లేదన్నారు. వైసీపీ ఇప్పుడు తన సొంత తప్పులకు మూల్యం చెల్లిస్తోందని, అధికారంలో ఉండగా చేసిన అరాచకాలకు ఫలితం అనుభవిస్తోందని ప్రొఫెసర్ నాగేశ్వర్ పేర్కొన్నారు. వైసీపీకి చెందిన పలువురు నాయకులు, సోషల్ మీడియా యాక్టివిస్టులు అరెస్టైన తరువాత కూడా ప్రజలలో ఇసుమంతైనా సానుభూతి కనిపించడం లేదు సరికదా.. తగిన శాస్తి జరిగిందన్న భావనే వ్యక్తమౌతోందని నాగేశ్వర్ అభిప్రాయపడ్డారు.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/no-sympathy-on-ycp-39-199535.html
ప్రజాధనం దుబారాను నియంత్రించాల్సిన బ్యూరోకాట్లు, అఖిల భారత సర్వీసు అధికారులైన ఐఏఎస్ లు ఆ దిశగా ఎటువంటి ప్రయత్నం చేయకుండా కేవలం ప్రేక్షక పాత్ర వహిస్తూ.. ఏలిన వారు అంటే అధికారంలో ఉన్న వారి అడుగులకు మడుగులొత్తుతూ.. ఎక్కడ సంతకం పెట్టమంటే అక్కడ పెట్టేయడం అధికార దుర్వినియోగమే ఔతుందన్నారు.
మెజారిటీ ఉందికదా అని ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తామంటే అంగీకరించేది లేదన్నారు. మోడీ సర్కార్ పేదల పట్ల కక్ష సాధింపుధోరణితో వ్యవహరిస్తోందనీ, అందుకే మహాత్మాగాంధీ జాతీయ ఉపాధి హామీ పథకాన్ని నీరుగారుస్తోందనీ విమర్శించారు.
సీమ లిఫ్ట్ పై ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబునాయుడు, తెలుగుదేశం కూటమి ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. సీమకు చంద్రబాబు వెన్నుపోటు పొడిచారనీ, తెలంగాణ అసెంబ్లీ సాక్షిగా రేవంత్ రెడ్డి సీమ లిఫ్ట్ పై చేసిన వ్యాఖ్యల ఆధారంగా చంద్రబాబుపై విమర్శలు గుప్పించారు.
రాష్ట్రంలోని ఇండియా పొలిటికల్ యాక్షన్ కమిటీ (ఐ-ప్యాక్) ప్రధాన కార్యాలయాంపై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) దాడులు నిర్వహించడం కలకలం రేపింది. కాగా ఈడీ దాడులపై పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఆయన పుట్టిన రోజు సందర్భంగా బహిరంగంగా జంతువులను వధించినందుకు రాష్ట్ర వ్యాప్తంగా పలువురు వైసీపీ కార్యకర్తలపై జంతు హింస చట్టం కింద కేసులు నమోదైన సంగతి విదితమే. ఇప్పుడు జగన్ తాజాగా ఈ కేసులు ఎదుర్కొంటున్న తన పార్టీ మద్దతుదారులకు పార్టీ లీగల్ సెల్ అన్ని విధాలుగా అండగా నిలుస్తుందని హామీ ఇచ్చినట్లు తెలుస్తోంది.
ఈ నెల 16న పోలింగ్ స్టేషన్ల వివరాలతోపాటు ఫొటోతో కూడిన ఓటర్ల తుది జాబితాను ఆయా వార్డుల్లోని పోలింగ్ స్టేషన్ల వారీగా ప్రచురించాలని ఆదేశాలు జారీ చేశారు. అలాగే జనాభా ప్రాతిపదికన వార్డులు, డివిజన్లు, ఆయా మున్సిపాల్టీలు, కార్పొరేషన్ల రిజర్వేషన్లను ఖరారు చేయనున్నట్లు తెలిపారు.
తెలంగాణ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్కు సవాల్ విసిరారు
ప్రజాసమస్యలపై అధికారులతో చర్చిస్తారు. క్షేత్ర స్థాయిలో పరిశీలన కూడా చేస్తారు.
ఆయన సొంత నియోజకవర్గమైన పిఠాపురంలో శుక్రవారం జరగనున్న సంక్రాంతి సంబరాల్లో పవన్ కల్యాణ్ స్థానికులతో కలిసి పాల్గొంటారు.
ఈ భేటీలో చంద్రబాబు అమరావతి చట్టబద్దత, పోలవరం, బడ్జెట్ కేటాయింపులు, ఉపాధి హామీ పథకంలో వెసలుబాటు వంటి పలు అంశాలను ప్రస్తావించారు. వాటితో బాటుగా కేంద్ర మంత్రి వర్గ విస్తరణలో టీడీపీకి ఒక బెర్తు సైతం డిమాండ్ చేశారు.
తెలుగువన్ ఎండి రవిశంకర్, జమీన్ రైతు సంపాదకుడు డోలేంద్ర ప్రసాద్ లు తాజాగా వ్యవస్థల పతనం, అందుకు కారణాలపై తమ ఆవేదనను సూటిగా ఎలాంటి శషబిషలూ లేకుండా వ్యక్త పరిచారు.
మోకిల నుంచి హైదరాబాద్ వైపు వెళ్తున్న ఓ కారు మీర్జాగూడ వద్ద అదుపు తప్పి తొలుత డివైడర్ ను ఆ తరువాత చెట్టును ఢీ కొనడంతో ఈ ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో మృతులు, క్షతగాత్రులు అందరూ విద్యార్థులే.
ఇటీవల అనారోగ్యంతో మరణించిన టీడీపీ నేత అప్పలనాయుడు కుటుంబాన్ని మంత్రి లోకేష్ పరామర్శించారు.
ఐదేళ్ల పాటు ఢిల్లీలో చక్రం తిప్పారు. కవిత ఎడ్యుకేటెడ్ కావడం, హిందీ కూడా బాగానే మాట్లాడగలగడంతో జాతీయ స్థాయి ప్రతినిథిగా ఉండేవారు. అయితే కవిత రెండో సారి ఎంపీగా గెలవలేక పోయారు