గడ్కరీ చుట్టూ బిగుస్తున్న ఉచ్చు
Publish Date:Oct 24, 2012
Advertisement
బిజెపి జాతీయ అధ్యక్షుడు గడ్కరీ మెడకు స్కామ్ ల ఉచ్చు గట్టిగా బిగుసుకుంటోంది. కేజ్రీవాల్ చేసిన ఆరోపణలపై శోధించి ఆధారాలు సాధించిన మీడియా.. గడ్కరీ కంపెనీల వ్యవహారాన్ని బైటపెట్టడంతో ఇప్పుడు యూపీఏ నేతలు చెలరేగి అస్త్రాల్ని సంధిస్తున్నారు. గడ్కరీ ఆధ్వర్యంలోని పూర్తి పవర్ అండ్ షుగర్స్ లిమిటెడ్ కి నిధులు ఎక్కడినుంచొచ్చాయో తేల్చమంటూ యూపీఏ నేతలు డిమాండ్ చేస్తున్నారు. రిజిస్ట్రార్ ఆఫ్ కంపెనీస్ ఈ వ్యవహారాన్ని పరిశీలిస్తుందని కార్పొరేట్ వ్యవహారాల మంత్రి వీరప్పమొయిలీ చెప్పారు. వెబ్ సైట్ నుంచి సేకరించిన సమాచారం ఆధారంగా చూపిస్తూ గడ్కరీ మోసాలపై సీరియస్ ఫ్రాడ్ ఇన్వెస్టిగేషన్ టీమ్ కార్యాలయంతో దర్యాప్తు జరిపించాలని కోరుతూ దిగ్విజయ్ సింగ్ ప్రథానికి ఓ లేఖకూడా రాశారు. ఆరోపణలు వెల్లువెత్తుతున్న నేపధ్యంలో బీజేపీ జాతీయ అధ్యక్ష పదవినుంచి తప్పుకోవడం మంచిదని బిజెపి ఎంపి రామ్ జెత్మలానీ గడ్కరీకి సలహా ఇచ్చారు. గడ్కరీ ఇరిగేషన్ మినిస్టర్ గా పనిచేసిన రోజుల్లో పూర్తిలో భారీ స్థాయిలో పెట్టుబడులుపెట్టిన ఐడియల్ రోడ్ బిల్డర్స్ గ్రూప్ చాలా కాంట్రాక్టుల్ని సొంతం చేసుకుంది. గడ్కరీమాత్రం తనపై వస్తున్న ఆరోపణలన్నీ అవాస్తవాలని కొట్టిపారేస్తున్నారు. ఎలాంటి విచారణకైనా సిద్ధమంటున్నారు.
http://www.teluguone.com/news/content/nitin-gadkari-31-18475.html





