Publish Date:Jun 30, 2025
తెలుగు న్యూస్ యాంకర్ స్వేచ్ఛ ఆత్మహత్య కేసు అనూహ్య మలుపు తిరిగింది. ఈ కేసులో ప్రధాన నిందితుడిగా ఆరోపణలు ఎదుర్కొంటున్న పూర్ణచందర్ భార్య స్వప్న తెరపైకి వచ్చి సంచలన ఆరోపణలు చేశారు. తన భర్త అమాయకుడని, అసలు బాధితురాలు తనేనంటూ ఆమె చేసిన వ్యాఖ్యలు ఈ కేసులో కొత్త కోణాన్ని ఆవిష్కరిస్తున్నాయి. స్వేచ్ఛ ఆత్మహత్య కేసులో నిందితుడైన పూర్ణచందర్ను వెనకేసుకొస్తూ ఆయన భార్య స్వప్న మాట్లాడారు. తన భర్త ద్వారానే స్వేచ్ఛ తనకు పరిచయమైందనీ, అప్పుడు వారిద్దరి మధ్య ఉన్న సంబంధం గురించి తనకు తెలియదని చెప్పిన స్వప్న, ఆ తరువాత వారి మధ్య ఎఫైర్ తెలిసి భర్తకు దూరమయ్యానని వివరించారు.
అంతేకాకుండా.. స్వేచ్ఛ తనను మానసికంగా వేధించిందని స్వప్న ఆరోపించారు. అదే విధంగా పూర్ణచందర్ను స్వేచ్ఛ బ్లాక్మెయిల్ చేసిందని, తన పిల్లలను కూడా "అమ్మా" అని పిలవాలంటూ భయపెట్టిందని చెప్పారు. స్వేచ్ఛ కుమార్తె అరణ్య తన భర్తపై చేస్తున్న ఆరోపణల్లో ఇసుమంతైనా నిజం లేదని స్వప్నచెప్పిన స్వప్న పూర్ణచందర్ అరణ్యను సొంత కూతురిలాగే చూసుకున్నాడన్నారు. నిందితుడి భార్య మృతురాలిపై ఆరోపణలు చేయడం ఈ కేసు దర్యాప్తులో ఈ వ్యాఖ్యలు కీలకంగా మారే అవకాశం ఉంది.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/new-twist-in-swetcha-sucide-case-39-200938.html
అధికారులు అంటే లెక్కలేని తనం వైసీపీ నేతల్లో ఇంకా కనిపిస్తుంది. అధికారుల పట్ల వారి దురుసు ప్రవర్తన వారి పెత్తందారి పోకడలకు అద్దం పడుతుంది. వైసీపీ నేతల్లో పెత్తందారి పోకడలు పోలేదు అనడానికి చేవిరెడ్డి భాస్కర్ రెడ్డి దురుసు ప్రవర్తనే నిదర్శనం.
సిట్టింగ్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ ఆకస్మిక మృతితో, ఉప ఎన్నిక అనివార్యమైన జూబ్లీహిల్స్, నియోజక వర్గంలో అప్పుడే ఎన్నికల సందడి మొదలైంది.
భువన విజయం సంస్థ, జెట్ యుకే మద్దతుతో నిర్వహించిన చారిత్రాత్మక కార్యక్రమంలో భాగంగా, మహా ఆచార్య శ్రీ చిన్న జీయార్ స్వామికి ఘన సంప్రదాయ స్వాగతం పలికింది.
జర్నలిస్టులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. అర్హులైన జర్నలిస్ట్లకు ఇళ్లస్థలాలు ఇవ్వాలని అధికారులకు ముఖ్యమంత్రి చంద్రబాబు నిర్ణయించారు. దీనిపై మంత్రులు అనగాని సత్యప్రసాద్, కొలుసు పార్ధ సారధి, నారాయణలతో ఉప సంఘం ఏర్పాటు చేసింది.
ఉభయ తెలుగు రాష్ట్రాలు సహా, చాలావరకు రాష్ట్రాల్లో, పార్టీ రాష్ట్ర అధ్యక్ష ఎన్నికలను పూర్తి చేసుకున్న బీజేపీ, పార్టీ జాతీయ అధ్యక్షుని ఎన్నిక ప్రక్రియను పూర్తి చేసేందుకు సమాయత్తమవుతోంది.
సాధారణ వైద్యల పరీక్షల నిమిత్తం సోమాజిగూడ యశోద ఆసుపత్రిలో చేరిన బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పార్టీ నేతలతో సమీక్ష నిర్వహించారు. పరామర్శించేందుకు పార్టీ నేతలు పలువురు వచ్చారు.
ఎర్రచందనం అక్రమ రవాణా చేస్తూ పట్టుబడిన స్మగ్లరుకు ఐదేళ్ల జైలు శిక్ష, రూ. 6లక్షల చొప్పున జరిమానా విధిస్తూ ఆర్ఎస్ఎస్ ఏడీజే కోర్టు న్యాయమూర్తి నరసింహమూర్తి తీర్పునిచ్చారు
గాంధీ భవన్లో జరిగిన తెలంగాణ ప్రదేశ్ కమిటీ సమావేశంలో కొందరి ఎమ్మెల్యేల వ్యవహార శైలిపై ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఏపీలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) ద్వారా భూ సమస్యలు పరిష్కారస్తామని రెవెన్యూ మంత్రి అనగాని సత్యప్రసాద్ తెలిపారు
వచ్చే ఏడాది తమిళనాడులో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న విషయం తెలిసిందే. ఈ నేపధ్యంలో తమిళగ వెట్రి కళగం (టీవీకే) పార్టీ తమ ముఖ్యమంత్రి అభ్యర్థిని ప్రకటించింది.
ప్యాంటు జేబులో పెట్టుకున్న స్మార్ట్ ఫోన్ పేలిన ఘటన హైదరాబాద్, అత్తాపూర్లో జరిగింది. ఈ ఘటనలో యువకుడి తొడకు గాయాలయ్యాయి.
జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక బీఆర్ఎస్ లో గుబులు పుట్టిస్తోందా? ఈ ఎన్నికలో పార్టీ అభ్యర్థి విజయంపై ఆ పార్టీ నమ్మకంగా లేదా? అంటే జరుగుతున్న పరిణామాలు, పరిశీలకులు విశ్లేషణలు గమనిస్తే ఔననే సమాధానమే వస్తుంది.
నంద్యాల జిల్లా శ్రీశైలం నియోజకవర్గ పాలన కేంద్రం ఆత్మకూరులో మాజీ మంత్రి, టీడీపీ సీనియర్ నాయకులు ఏరాసు ప్రతాపరెడ్డి పై స్థానిక తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు దాడి చేశారు.