కేరళ సర్కార్ కు కొత్త చిక్కులు!

Publish Date:Jul 7, 2022

Advertisement

 దేశంలో మిగిలిన ఏకైక కమ్యూనిస్ట్  ప్రభుత్వం .. కేరళ ప్రభుత్వం. గత సంవత్సరం (2021) ఏప్రిల్ లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో, అనూహ్యంగా, ఆనవాయితీకి భిన్నంగా వరసగా రెండవసారి, వామపక్ష ప్రజాసామ్య కూటమి ( ఎల్డీఎఫ్) అధికారంలోకి వచ్చింది. సహజంగా, కేరళలో ఎల్డీఎఫ్, యూడీఎఫ్ ( ఐక్య ప్రజాస్వామ్య కూటమి) వంతుల వారీగా అధికారంలోకి రావడం ఆనవాయతీగా వస్తోంది. అయితే. 2021 ఎన్నికల్లో అందుకు భిన్నంగా ఎల్డీఎఫ్ వరసగా రెండసారి అధికారంలోకి వచ్చింది. భారీ మెజారిటీ కూడా తెచ్చుకుంది.   వైద్య ఆరోగ్య శాఖ మంత్రి కేకే శైలజ సారధ్యంలో కొవిడ్ కట్టడికి తీసుకున్న చర్యలు మంచి ఫలితాలు ఇచ్చాయి. అయితే ముఖ్యమంత్రి వివిజయన్ ఆమెను మళ్ళీ మంత్రివర్గంలోకి తీసుకోలేదనుకొండి అది వేరే విషయం. 

అయితే, రెండవసారి అధికారంలోకి వచ్చిన తర్వాత. ఎల్డీఎఫ్ ప్రభుత్వం అడుగడుగునా అవరోధాలను ఎదుర్కుంటోంది. అవినీతి ఆరోపణలను ఎదుర్కుంటోంది, వరస చిక్కుల్లో చిక్కుకుంది. ఎన్నికలకు ముందునుంచే ఎల్డీఎఫ్ ప్రభుత్వం మెడకు చుట్టుకున్న, బంగారం కుంభకోణం కొత్త మలుపులు తిరుగుతూ నేరుగా ముఖ్యమంత్రి పినరయి విజయన్ మెడకు చుట్టుకుంటోంది. 2020 జూలై 5వ తేదీన త్రివేండ్రం విమానాశ్రయంలో 30 కిలోల బంగారం స్వాధీనం చేసుకున్న సంఘనటతో మొదలైన, బంగారం కుంభకోణం కేసును ఎన్‌ఐఏ దర్యాప్తు చేస్తోంది. ఈ కుంభకోణంలో ప్రధాన నిందితురాలు స్వప్న సురేష్, విచారణ సందర్భంగా ముఖ్యమంత్రి విజయన్ పై సంచలన ఆరోపణలు చేశారు. కోట్ల రూపాయల కుంభకోణం ముఖ్యమంత్రి  కార్యాలయం కనుసన్నల్లోనే జరిగిందని ఆమె ఆరోపించారు. కేసు విచారణ ఇంకా కొనసాగుతోంది,ఎప్పుడు ఏ మలుపు తిరుగుతుంది, ఎవరి మెడకు చుట్టుకుంటుందో అనే భయం ఎల్డీఎఫ్ ప్రభుత్వాని వెంటాడుతోంది. 

అదలా ఉంటే, కేరళ మత్స్యశాఖ మంత్రి సాజీ చెరియన్  కొత్త చిక్కులు కొని తెచ్చుకున్నారు.  రాజ్యాంగాన్ని దూషించి, చిక్కుల్లో చిక్కుకున్నారు. రాజ్యాంగాన్ని తూలనడుతూ, సాధారణ ప్రజలను దోచుకునేలా మన రాజ్యాంగాన్ని రచించారని ఆయన చేసిన వివాదాస్పద వ్యాఖ్యలు, సర్కార్ కు తలవంపులు తెచ్చాయి. అలా  విమర్శల సుడిగుండంలో చిక్కుకున్న ఆయన చివరకు మంత్రి పదవికి రాజీనామా చేశారు.

అయితే  సాజీ చెరియన్ ఇంకా ఇప్పటికీ తమ వ్యాఖ్యలను సమర్ధించుకుంటున్నారు. తాను రాజ్యాంగాన్ని దూషించలేదని.. తనకు రాజ్యాంగంపై ఎంతో గౌరవం ఉందని, అంటున్నారు. పాలనా వ్యవస్థ సరిగా లేదనే.. కోణంలో తాను మాట్లాడనన్నారు. తనకు రాజ్యాంగం అంటే అత్యంత గౌరవమని అన్నారు. రాజ్యాంగాన్ని అగౌరవపరచడం తన ఉద్దేశం కాదని చెరియన్‌ అన్నారు.. అయినా అప్పటికే జరగవలసిన నస్టం జరిగిపోయింది. సాజీ వ్యాఖ్యలు రాష్ట్ర వ్యాప్తంగా రాజకీయ కాక రేపాయి. కేరళ అంతటా నిరసనలు వెల్లువెత్తాయి. అలాగే ప్రతిపక్ష నేతలు కూడా తీవ్ర స్థాయిలో విమర్శించారు. వెంటనే సాంస్కృతిక వ్యవహారాల శాఖ మంత్రి సాజీని మంత్రి పదవి నుంచి బర్తరఫ్ చేయాలని మాండ్ చేశారు. 

సో.. ముందు కొంత బుకాయించినా చివరకు చేసేది లేక  స్వయంగా ముఖ్యమత్రి కార్యాలయానికి వెళ్లి రాజీనామా సంర్పించారు. అయితే, తన రాజీనామా తన స్వతంత్ర నిర్ణయమని సాజీ చెరియన్ అన్నారు. ఇప్పటికే  బంగారం కుంభకోణం, లైవ్ మిషన్ అవినీతి కుంభకోణం, పెరుగతున్న లవ్ జిహాదీ కేసులు, శాంతి భద్రతల పరిస్థితి, వయాలర్ ఎంపీ రాహుల్ గాంధీ, కార్యాలయంపై ఎస్ ఎఫ్ ఐ కార్యకర్తలు జరిపిన దాడి.. ఒకదాని వెంట ఒకటిగా వెంటాడుతున్నసమస్యలతో సతమతమవుతున్న ముఖ్యమత్రి, ప్రతిపక్ష పార్టీలకు మరో అస్త్రం ఇవ్వడం ఇష్ట లేక మంత్రి సాజీని రాజీనామా కోరినట్లు అధికార వర్గాల సమాచారం. అయన అడిగారా, ఈయన ఇచ్చారా, అనేది పక్కన పెడితే. మంత్రి రాజీనామా చేశారు.  లెఫ్ట్ ఫ్రంట్ ప్రభుయ్వానికి మచ్చ మిగిలింది.

By
en-us Political News

  
ఒడిశాకు చెందిన ఒక నిరుపేద వ్యక్తి తన సోదరి మరణానంతరం ఆమె బ్యాంకు ఖాతాలో ఉన్న ఇరవై వేల రూపాయలు విత్ డ్రా చేసుకోవడానికి బ్యాంకును సంప్రదించాడు. ఆ డబ్బుతో ఆమె అంత్యక్రియల తాలూకు ఖర్చులు లేదా ఇతర అవసరాలు తీర్చుకోవాలని చెప్పాడు.
గత ప్రభుత్వ హయాంలో సోషల్ మీడియా వేదికగా రాజకీయ ప్రత్యర్థులను లక్ష్యంగా చేసుకుని చేసిన దాడుల కేసులో వైసీపీ సోషల్ మీడియా అప్పటి ఇన్‌ఛార్జ్ సజ్జల భార్గవ్‌రెడ్డిని పులివెందుల పోలీసులు విచారించారు. సుమారు 9 గంటల పాటు సాగిన ఈ విచారణలో పోలీసులు ఆయనపై దాదాపు 70 ప్రశ్నలను సంధించారు.
బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి రాష్ట్ర స్థాయి కమిటీ మినహా అన్ని కమిటీలను పార్టీ అధ్యక్షుడు కేసీఆర్ రద్దు చేశారు.
బీఆర్ఎస్ 25వ వ్యవస్థాపక దినం పురస్కరించుకుని కేసీఆర్, కేటీఆర్ కవిత వ్యాఖ్యలకు దీటుగా సమాధానం ఇస్తారని ఆశించారు. అయితే అందుకు భిన్నంగా కేసీఆర్, కేటీఆర్ ల మౌనం అందరినీ విస్మయపరిచింది.
తమిళనాడులో ఎన్నికల పోలింగ్‌ ముగియడంతో.. అన్ని పార్టీలూ గెలుపు అంచనాల్లో నిమగ్నమయ్యాయి.
రాష్ట్రవ్యాప్తంగా ఎండలు మండుతుండటం, వడగాల్పుల తీవ్రత ఎక్కువగా ఉండటంతోనే బహిరంగ సభ నిర్వహించకూడదని పార్టీ అధినేత కేసీఆర్ నిర్ణయించారని కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ ఇచ్చిన వివరణ నమ్మశక్యంగా లేదని పార్టీ శ్రేణులే పెదవి విరుస్తున్నాయి.
బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు, మాజీ మంత్రి కేటీఆర్ పార్టీ జెండాను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో భారీ సంఖ్యలో పార్టీ నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు. పార్టీ జెండాను ఆవిష్కరించిన అనంతరం ప్రసంగించిన కేటీఆర్.. 14ఏళ్లపాటు పోరాటం చేసి కేసీఆర్ తెలంగాణ సాధించారన్నారు.
శాసనమండలి కార్యాలయంలో మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి ఈ ఇరువురి చేత ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క, పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు హాజరయ్యారు.
ముఖ్యంగా కవిత టీఆర్ఎస్ పార్టీ.. బీఆర్ఎస్ పార్టీని క్లిష్టపరిస్థితుల్లోకి నెట్టేసింది. బీఆర్ఎస్ అధినేత సొంత కుటుంబం నుంచే తిరుగుబాటు రావడం ఆ పార్టీ క్యాడర్ ను అయోమయంలో, గందరగోళంలో పడేసింది. పైగా కవిత.. పార్టీ పేరు టీఆర్ఎస్ కావడంతో బీఆర్ఎస్ పరిస్థితి వెంటిలేటర్ పైకి వెళ్లేలా మార్చిందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి వ్యవహారం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది.
ప్రతిపక్షాలు సమర్పించిన ఈ నోటీసులో ప్రధానంగా ఎన్నికల నిర్వహణలో పారదర్శకత లోపించిందని, నిష్పాక్షికంగా వ్యవహరించాల్సిన కేంద్ర ఎన్నికల సంఘం ఏకపక్షంగా వ్యవహరిస్తోందని ఆరోపించాయి. ఈ వ్యవహారంలో వివిధ పార్టీలకు చెందిన సభ్యులు ఏకతాటిపైకి వచ్చి నోటీసు ఇవ్వడం ప్రాధాన్యత సంతరించుకుంది.
గతంలో ఇదే 152 స్థానాల పరిధిలో బీజేపీ బలం కేవలం 59 సీట్లు మాత్రమే. అయితే ఇప్పుడు ఆ సంఖ్యను రెండింతలు చేసి 110కి చేర్చడం అంటే అది సామాన్యమైన విషయం కాదు.
గవర్నర్ కోటా ఎమ్మెల్సీల నియామక ప్రక్రియ ఎట్టకేలకు కొలిక్కి వచ్చింది. రాష్ట్ర ప్రభుత్వం సిఫార్సు చేసిన ప్రొఫెసర్ ఎం. కోదండరాం, మాజీ క్రికెటర్ మొహమ్మద్ అజారుద్దీన్ పేర్లకు గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా శనివారం ఆమోద ముద్ర వేశారు. దీనికి సంబంధించిన ఫైలుపై గవర్నర్ సంతకం చేయడంతో.. వీరిద్దరి నియామకానికి మార్గం సుగమమైంది.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.