Publish Date:May 23, 2023
జార్ఖండ్ నదీ పరివాహక ప్రాంతంలోని
దామోదర్ వ్యాలీ ప్రాజెక్ట్లో పనిచేసిన బుద్నీ మెహజన్ సంతాలీ తెగకు చెందిన అమ్మాయి.వీళ్లది ప్రత్యేక కల్చర్. 1959 డిసెంబరులో అప్పటి ప్రధాన మంత్రి నెహ్రూ బుధ్ని పవర్ ప్రాజెక్ట్ను ప్రారంభించారు. నెహ్రూ బుద్నీకి పూలమాల వేసి స్వాగతం పలికారు. పూల మాలతో చేసే సన్మానం వివాహం క్రింద పరిగణిస్తారు సంతాలీలు. సంతాలీ సంప్రదాయాల ప్రకారం, ఆమెకు నెహ్రూ పూలమాల వేయగానే భార్యగా మారిపోయింది. ఇది బుద్నీకి శాపం లా పరిణమించింది. సంతాలి సంప్రదాయం ప్రకారం నెహ్రూ భార్యగా ప్రకటించబడింది, ఒక వ్యక్తి ఒక స్త్రీకి పూలమాల వేయగానే ఆమెతో అతని వివాహం అయినట్టేనని పరిగణించాల్సి వస్తుంది.. సాంప్రదాయాల ప్రకారం, సంతాలీ యేతర వ్యక్తిని వివాహం చేసుకున్నందుకు ఆమెను సంఘం నుండి బహిష్కరించారు.
నేను ప్రధాని నెహ్రూకి పూలమాల వేయలేదని సంతాలి తెగవారికి నచ్చ జెప్పే ప్రయత్నం చేసింది. నేను కేవలం అతనికి కరచాలనం ఇచ్చాను. ఈ చిన్న పొరపాటు వల్ల నేను మా గ్రామాన్ని విడిచిపెట్టవలసి వచ్చింది అని అప్పట్లో బుధ్ని స్టేట్ మెంట్ ఇచ్చింది. నేను నా సంఘం నుండి బహిష్కరించబడ్డాను. నేను డివిసి పవర్హౌస్లో వర్కర్ని. అయితే, 1962లో డివిసి నన్ను ఉద్యోగం నుండి తొలగించింది. ”
1985లో అప్పటి ప్రధాని, నెహ్రూ మనవడు రాజీవ్ గాంధీ బుధ్ని కోసం వెతికారట. ఆ తర్వాత భిలాయ్లో తనను కలవాల్సిందిగా రాజీవ్ ఆహ్వానించారని కూడా ఓ కథనం ప్రచారంలో ఉంది. జవహర్లాల్ నెహ్రూకు సంబంధించిన పత్రాలను పరిశోధిస్తున్నప్పుడు రాజీవ్ కు బుధ్ని గురించి తెలిసింది.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/nehru-mary-with-santaali-girl-25-155800.html
సీఎం పర్యటన ద్వారా ఈ కేసులోని సాక్షులను ప్రభావితం చేసే అవకాశం ఉందంటూ డీఎంకే ప్రధాన కార్యదర్శి ఆర్.ఎస్. భారతి సుప్రీంకోర్టులో అత్యవసర పిటిషన్ దాఖలు చేశారు.
రిజిస్ట్రేషన్ ప్రక్రియ మరింత ఆలస్యం కాకుండా ఉండేందుకు, తమకు అనుకూలంగా నిర్ణయం వచ్చేలా చూసేందుకు ఆమె ముందు జాగ్రత్తగా ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించినట్లు పరిశీలకులు భావిస్తున్నారు.
కోలీవుడ్లోని మరికొందరు స్టార్స్ రాజకీయాలలోకి అడుగులు వేసేందుకు ఆసక్తి చూపుతున్నారు. ఈ క్రమంలోనే స్టార్ హీరో ధనుష్ కూడా రాజకీయ అరంగేట్రం చేయబోతున్నారు.
రెండుసార్లు ఎమ్మెల్యేగా పనిచేసిన ఆయన విలువలతో కూడిన రాజకీయాలకు నిలువెత్తు రూపంగా నిలిచారు. సొంత ఇల్లు కూడా లేకుండా, ఒక పాత స్కూటర్ మినహా ఎలాంటి ఆస్తులు కూడబెట్టకుండా నిరాడంబరంగా జీవించారు.
తాడికొండ నియోజకవర్గంలో వైసీపీ తరఫున తాను పోటీ చేయడానికి దారితీసిన పరిస్థితులను గుర్తు చేసుకున్న ఉండవల్లి శ్రీదేవిరాజధాని ప్రాంత సీటును దక్కించుకుని, భారీ మెజారిటీతో విజయం సాధించానని చెప్పారు.
నిజాయితీగా పార్టీ కోసం జెండా పట్టి రోడ్లెక్కిన కార్యకర్త ఒకసారి పోలీస్ స్టేషన్ మెట్లు ఎక్కిన తర్వాత ఏ అగ్రనేత కూడా వారిని కాపాడటానికి రావడం లేదని శ్రీధర్ చెప్పారు. నాయకులు కేవలం ఫోటోలకు ఫొటోలు దిగడానికి, మీడియాలో కనిపించడానికే ప్రాధాన్యత ఇస్తారు తప్ప, లోయర్ లేదా మిడిల్ క్లాస్ కార్యకర్త ఆసుపత్రి బిల్లు ఎంత అయింది? కోర్టు ఖర్చులు ఎలా కడుతున్నాడు? అని మానవత్వంతో ఆలోచించే పరిస్థితుల్లో నేటి నాయకత్వాలు లేవని చెప్పారు.
ఈ నేపథ్యంలో ప్రస్తుత చట్టపరమైన పరిణామాలు, ఉపా చట్టం తీవ్రత, రావణ్కు కోర్టుల్లో ఎదురుకాబోయే సవాళ్లపై మాజీ న్యాయమూర్తి రామకృష్ణ తెలుగువన్ కు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో సంచలన విశ్లేషణ చేశారు.
ఆ ఎన్నికలలో జనసురాజ్ పార్టీ ఒక్కటంటే ఒక్క స్థానంలో విజయం సాధించలేదు సరికదా.. ఆ పార్టీ అభ్యర్థులెవరికీ కనీసం డిపాజిట్లు కూడా దక్కలేదు. తెరవెనుక ఉండి ఎందరో దిగ్గజాలను సీఎం గద్దెపై కూర్చోబెట్టిన పీకే.. రాజకీయ వ్యూహాలు తన సొంత పార్టీకి ఇసుమంతైనా ఉపయోగపడలేదు. దీంతో ఇక లాభం లేదనుకుని తానే స్వయంగా ఎన్నికల బరిలో నిలబడి సత్తా చాటాలని నిర్ణయించుకున్నారు.
కోల్కతాలోని కాళీఘాట్లోని మమతా బెనర్జీ అధికారిక నివాసం వద్ద భారీగా పోలీసులు, కేంద్ర బలగాలను మోహరించడం ఈ ఆరోపణలకు బలాన్ని చేకూరుస్తోంది. మమత నివాసానికి వెళ్లే అన్ని ప్రధాన మార్గాలను పోలీసులు తమ అధీనంలోకి తీసుకుని, భారీ పోలీసు వాహనాలతో పూర్తిగా దిగ్బంధించారు.
అనంతపురం జిల్లాకు ఎప్పుడూ ఒక ప్రత్యేకమైన స్థానం ఉంటుంది.
సుదీర్ఘ రాజకీయ ప్రస్థానం ఉన్న ఆమంచి కృష్ణమోహన్.. 2014 అసెంబ్లీ ఎన్నికల్లో చీరాల నియోజకవర్గం నుండి స్వతంత్ర అభ్యర్థిగా రంగంలోకి దిగి విజయం సాధించారు. ఈ తరువాత ఆయన తెలుగుదేశం పార్టీకి మద్దతు ఇచ్చారు. అయితే.. 2019 ఎన్నికలకు ముందు తెలుగుదేశం పార్టీని వీడి, వైసీపీ పంచన చేరారు.
తెలంగాణ ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి ప్రజా జీవితంలో అరుదైన మైలురాయిని చేరుకున్నారు.
ఈసీ ఆదేశాల మేరకు
కవిత తన టీఆర్ఎస్ పార్టీ పేరుకు ప్రత్యామ్నాయంగా మూడు పేర్లను ఈసీకి పక్షం రోజుల్లోగా సమర్పించాల్సి ఉంటుంది. నిర్దేశిత గడువులోగా మూడు ప్రత్యామ్నాయ పేర్లను సూచించకుంటే దరఖాస్తున్న మూసేస్తామని హెచ్చరించింది. అంతే కాకుండా టీఆర్ఎస్ పేరును కొనసాగించేందుకు అనుమతి ఉండదని విస్పష్టంగా పేర్కొంది.