ఈ రోజుల్లో వాహనాల రొద ఎక్కువైంది. వయసుతో సంబంధం లేకుండా మోటార్ వాహనాలు తెగ వుపయో గిస్తున్నారు. పని వున్నా లేకపోయినా, బడికి వెళ్లే వారూ చిన్నపాటి మోటార్సైకిల్ పైనే వెళుతున్నారు. వేగానికి అతి ప్రాధాన్యతనిస్తున్నారేగాని దాని వల్ల వాతావరణ కాలుష్యానికి అంతే కారకులవుతున్నారన్న ధ్యాస మాత్రం వుండడం లేదు. చాలాకాలం క్రితం మన దేశంలో సైక్లింగ్ కీ ప్రాధాన్యత వుండేది.
కాల క్రమంలో వేగానికి పెద్ద పీట వేయడం జరిగింది. అన్ని పనులు సత్వరం కావాలంటే మోటార్ వాహ నాల ప్రయాణమే సుఖం అన్న అభిప్రాయానికి వచ్చేయడంతో వాటినే ఎక్కడికి వెళ్లాలన్న వుపయోగిం చడం అలవాటైపోయింది. ప్రస్తుతం మన దేశంలో సైక్లింగ్ కేవలం ఆరోగ్య సూత్రాల్లో ఒకటిగా మిగిలి పోయింది. ఇది వూహించని మార్పు.
మనం నెదర్లాండ్స్ ప్రభుత్వాన్ని చూసి ఎంతో నేర్చుకోవాలి. అక్కడ ప్రభుత్వ కార్యాలయాలకు వెళ్లేవారు సైకిల్ మీద వెళితే కిలోమీటర్కి 15 డాలర్లు ప్రభుత్వం ఇస్తోందిట! దేశంలో సైక్లింగ్కు ప్రాధాన్యతనీయా లని అక్కడ ప్రభుత్వం ఆలోచన చేసింది. అంతేకాక, పర్యావరణ పరిరక్షణకు కాసింత వారివంతు తోడ్ప డటంలో ఇదో మార్గం ఎంచుకుంది. అంటే సైక్లింగ్ ద్వారా అక్కడి వారు వారానికి మన లెక్కల్లో రూ.300 సంపాదించే అవకాశం ప్రభుత్వం కల్పించింది. అది టాక్స్ ఫ్రీ!
సైకిలువాడకం ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. వొత్తిడిని తగ్గిస్తుంది. నగరాల్లో వాతావరణ కాలుష్యాన్ని బాగా తగ్గిస్తుంది. ఈ కారణాలవల్లనే సైక్లింగ్ను ప్రమోట్ చేస్తున్నామని నెదర్లాండ్స్ ప్రభుత్వ మౌలిక సదుపాయాల మంత్రి వాల్దువెన్ అన్నారు. సైక్లింగ్ను ఉత్సాహపరచడం ద్వారా సంవత్సరానికి వందల యూరోలు మిగులుతాయన్నారు. ప్రభుత్వానికి కూడా ఎంతో మేలు చేసినట్లేనని ఆయన అన్నారు. ప్రభుత్వం ఈ పరమైన గట్టి నిర్ణయాలను అమలు చేయడంలో ప్రజల ఆరోగ్య సంరక్షణ పట్ల వారి వున్న ప్రత్యేక దృష్టిని తెలియజేస్తుంది.
ఇలాంటి ఆలోచనలు మన దేశంలో అమలుచేయడానికి ప్రభుత్వాలకు ఎవరుచెప్పగలుగుతారు. రోజు రోజుకూ పెరిగిపోతున్న కాలుష్యానికి ఫుల్స్టాప్ పెట్టడానికి సైక్లింగ్ విధానాన్ని మన ప్రభుత్వాలూ చేపడితే మేలు. కాలుష్య నివారణ, ప్రమాదాల నివారణకూ సైక్లింగ్ని ఉత్సాహపరచాలి. నెలలో కనీసం కొన్ని రోజులు కార్యాలయాలకు సైకిల్ మీద రావాలని గట్టి నిబంధనను అమలుచేయడానికి పూనుకోవాలి. అపుడు నెదర్లాండ్స్ వలె మన దేశంలోనూ ప్రజారోగ్యం, పర్యావరణపరిరక్షణ పట్ల ప్రత్యేక శ్రద్ధ పెరుగు తుంది.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/nederlands-encouraging-cycling-39-139131.html
తెలుగువన్ వాస్తవ వేదికలో ప్రస్తుత జాతీయ, ప్రాంతీయ రాజకీయ పరిస్థితులపై విస్తృత చర్చ జరిగింది.
తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ఆ రాష్ట్ర రాజకీయాల్లో పెను సంచలనాన్ని సృష్టించాయి.
టీవీకే అధినేత విజయ్తో భేటీ అనంతరం రాజ్ భవన్ ఒక అధికారిక ప్రెస్ నోట్ విడుదల చేసింది. అసెంబ్లీలో ప్రభుత్వం ఏర్పాటు చేయాలంటే ఉండాల్సిన సంఖ్యాబలంపై గవర్నర్.. విజయ్కు మార్గనిర్దేశం చేశారు. కేవలం అతిపెద్ద పార్టీగా ఉండటమే కాకుండా, సభలో తగినంత మంది ఎమ్మెల్యేల మద్దతు ఉన్నట్లు ఆధారాలు చూపాలని సూచించారు.
పిఠాపురంలో ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలో చంద్రబాబు ఫొటోలేదని ఆరోపిస్తూ.. మాజీ ఎమ్మెల్యే వర్మ అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ క్రమంలో జనసేన నేత, మాజీ ఎమ్మెల్యే దొరబాబు జోక్యం చేసుకోవడంతో వాగ్వాదం చోటు చేసుకుంది. వర్మ దురుసు వ్యాఖ్యలపై పార్టీలో అంతర్గతంగా చర్చించిన అధిష్టానం.. వర్మ వ్యవహారాన్ని తప్పుబట్టింది. ఇంతలోనే వర్మను ఇంచార్జ్ పదవి నుంచి తొలగించడం చర్చనీయాంశంగా మారింది.
రాష్ట్రంలో కొత్త ప్రభుత్వ ఏర్పాటుకు డీఎంకే ఏ విధంగానూ అడ్డుపడబోదన్నారు. రాష్ట్రంలో మరోసారి ఎన్నికలు రావాలని గానీ, రాజ్యాంగ సంక్షోభం తలెత్తాలనీ కానీ తాము కోరుకోవడం లేదన్నఆయన.. ప్రజాతీర్పునకు అనుగుణంగానే డీఎంకే నడుచుకుంటున్నదన్నారు.
గతంలో విజయ్కు ఉన్న ప్రాణహాని హెచ్చరికలు.. ఆయన పాపులారిటీని దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం సాయుధ పోలీసులతో కూడిన భద్రతను ఏర్పాటు చేసింది. అయితే.. తాజాగా నిర్వహించిన భద్రతా సమీక్షలో భాగంగా ఆయనకు ఇకపై అదనపు సెక్యూరిటీ అవసరం లేదని అధికారులు భావించినట్లు తెలుస్తోంది.
తాజా ఎన్నికల ఫలితాల్లో నటుడు విజయ్ నేతృత్వంలోని తమిళగ వెట్రి కళగం (టీవీకే) 108 స్థానాలతో సింగిల్ లార్జెస్ట్ పార్టీగా అవతరించిన సంగతి తెలిసిందే. అయితే.. ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన 118 మంది ఎమ్మెల్యేల మద్దతు ఆ పార్టీకి ఇంకా లభించలేదు. కాంగ్రెస్తో కలిపి విజయ్ బలం ప్రస్తుతం 112కు చేరినప్పటికీ.. మేజిక్ ఫిగర్కు ఇంకా ఆరు అడుగుల దూరంలో ఉంది.
తమిళనాడు రాజకీయాల్లో పెను మార్పులు చోటుచేసుకుంటున్న వేళ
బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ అఖండ విజయం సాధించడంలో సువేందు కీ రోల్ పోషించారు. ఆ పార్టీ 206 స్థానాల్లో గెలిచి బెంగాల్లో తొలిసారిగా అధికారం చేపట్టబోతోంది. బీజేపీ తరఫున రెండు స్ధానాల నుంచి బరిలోకి దిగిన సువేందు అధికారి.. మరోసారి మమతా బెనర్జీని ఓడించారు. భవానిపూర్లో దీదీపై గెలిచిన ఆయన.. తన సొంత నియోజకవర్గమైన నందిగ్రామ్లోనూ గెలిచి పట్టు నిలుపుకున్నారు.
ముఖ్యంగా అస్సాం, పశ్చిమబెంగాల్ లో బీజేపీ ఎన్నికల సంఘం సహకారంతో ఫలితాలను చోరీ చేసిందన్నారు.
పశ్చిమబెంగాల్లో మూడున్నర దశాబ్దాల ఏళ్ల సీపీఎం పాలనకు బ్రేక్ వేసి 2011లో అధికార పగ్గాలు చేపట్టిన తృణముల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్టీ.. 2026 వరకు వరుస విజయాలతో ముఖ్యమంత్రిగా కొనసాగారు. ఆమె 15 ఏళ్ల ఆధిపత్యానికి ఎన్డీఏ తెర దించింది. మమతా సైతం కాంగ్రెస్లో కేంద్రమంత్రిగా, పలు కీలక పదవులు నిర్వహించి, తర్వాత సొంత కుంపటి పెట్టుకున్న నాయకురాలే కావడం గమనార్హం.
ప్రజా సమస్యలపై స్పష్టమైన అజెండాతో ఎన్నికల బరిలోకి దిగిన విజయ్ను తమిళ ప్రజలు ఆదరించడం శుభపరిణామమన్నారు.
తన పార్టీ స్థాపించిన నాటి నుండి నేటి వరకు ఆయన సాగించిన ప్రయాణం ఒక అద్భుతమైన రాజకీయ థ్రిల్లర్ను తలపిస్తుంది. ఎన్నికల ప్రచార సమయంలో విజయ్ అనేక ఆటంకాలను ఎదుర్కొన్నారు. ప్రత్యర్థి పార్టీల నుండి వచ్చిన తీవ్ర విమర్శలు, అధికార యంత్రాంగం విధించిన ఆంక్షలు ఆయనను ఉక్కిరిబిక్కిరి చేశాయి. వ్యక్తిగత జీవితంపై జరిగిన దుష్ప్రచారం విజయ్ ఇమేజ్ను దెబ్బతీస్తుందని అందరూ భావించారు.