ఎన్సీపీలో ... ఎన్సీపీ విలీనం?

Publish Date:May 10, 2025

Advertisement

ఓ వంక దాయాది దేశాలు భారత్ , పాకిస్థాన్ మధ్య యుద్ధం నడుస్తోంది. మరో వంక  మహారాష్ట్రలో విడిపోయిన దాయాది పార్టీలు మళ్ళీ ఏకమయ్యేందుకు రాయబారాలు, దౌత్య చర్చలు జరుగుతున్నాయి. అవును ఏప్రిల్  22 న పాక్ ప్రేరేపిత ఉగ్రవాదులు పహల్గాంలో 26 మంది హిందూ పర్యాటకులను అత్యంత కిరాతకంగా కాల్చి చంపిన నేపధ్యంలో..  ఉగ్రవాదులను, ఉగ్రవాదాన్ని మట్టు పెట్టే లక్ష్యంతో  భారత ప్రభుత్వం, భారత సైన్యం ప్రారంభించిన ‘ఆపరేషన్ సిందూర్  భారత – పాకిస్థాన్ దేశాల మధ్య మరో యుద్ధానికి తెర తీసింది. 

ఆదే సమయంలో మహా రాష్ట్రలో రెండేళ్ళ క్రితం రెండుగా విడిపోయిన నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎన్సీపీ) మళ్ళీ ఒకటయ్యే దిశగా అడుగులు వేస్తున్నట్లు తెలుస్తోంది. నిజానికి,  2024  నవంబర్ లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ సారథ్యంలోని మహాయుతి తిరిగి అధికారంలోకి వచ్చినప్పటి నుంచి రాష్ట్రంలో రాజకీయ పునరేకీకరణ గురించిన చర్చ జరుగుతోంది.  ముఖ్యంగా  అధికార కూటమిలోని బీజేపీ,శివసేన,ఎన్సీపీల మధ్య సయోధ్య కొంత దెబ్బ తిన్న నేపధ్యంలో శివసేన, ఎన్సీపీలలో అంతర్మథనం మొదలైంది. అలాగే ఉప మఖ్యమంత్రి అజిత్ పవార్ సారధ్యంలోని ఎన్సీపీ  శరద్ పవార్ సారధ్యంలోని ఎన్సీపీ(ఎస్పీ) పునః ఏకీకరణ గురించిన చర్చ తరచూ తెరపైకి వస్తూనే వుంది. అయితే.. కారణాలు ఏమైనా,ఇంతవరకు ముడిపడలేదు.   

అయితే ఇప్పడు స్వయంగా శరద్ పవార్  రెండు ఎన్సీపీలు ఒకటయ్యే అంశాన్ని మరో మారు తెర పైకి తెచ్చారు. అయితే.. ఆ నిర్ణయం ఏదో తన తదుపరి తరం మరీ ముఖ్యంగా తన రాజకీయ వారసురాలు, బారామతి ఎంపి సుప్రియా సులే తీసుకుంటారని శరద్ పవార్ పరోక్షంగానే  తనకు అభ్యంతరం లేదని చెప్పకనే చెప్పారని  అంటున్నారు. మరో వంక అజిత్ పవార్  సారథ్యంలోని ఎన్‌సిపి రాష్ట్ర అధ్యక్షుడు సునీల్ తత్కరే  శరద పవార్ అభిప్రాయాలను తాము గౌరవిస్తామని ఆయన నుంచి అటువంటి ప్రతిపాదన వస్తే పార్టీ కోర్  గ్రూప్ లో చర్చించి నిర్ణయం తీసుకుంటుంటామని, సానుకూల సంకేతాలు ఇచ్చారు. 

అయితే.. ఇరు పార్టీలకు ఇష్టమే అయినా, రాజకీయ పరిశీలకులు మాత్రం ఆ రెండు పార్టీల కలయిక కష్టమే అంటున్నారు. ముఖ్యంగా  ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ బీజేపీ సారథ్యంలోని మహాయుతి నుంచి బయటకు వచ్చేందుకు ఏ మాత్రం సుముఖంగా లేరు. నిజానికి  తత్కరే కూడా  మేము మహాయుతిలో కొనసాగాలని నిర్ణయించుకున్నాం.  మా నిర్ణయం మారదు. మహాయుతి నుంచి బయటకు వచ్చే ప్రశ్నే లేదు  అని స్పష్టం చేశారు. నిజానికి  ఉభయ పార్టీల విలీనం గురించి చాలా కాలంగా చర్చ జరుగుతున్నా.. శరద్ పవర్ బీజేపీతో చేతులు కలిపేందుకు అంగీకరించక పోవడం వల్లనే  విలీనం జరగ లేదని, ఇప్పడు కూడా ఉభయ పార్టీల విలీనానికి బీజేపీనే అడ్డుగా నిలిచిందని అంటున్నారు. 

అయితే..  అధికార కూటమిలో చేరాలని పార్టీలో ముఖ్యంగా యువ నాయకుల నుంచి వత్తిడి పెరుగతునందునే పవార్  నిర్ణయాధికారాన్ని కుమార్తె  రాజకీయ వారసురాలు సుప్రియ సులే చేతిలో పెట్టారని అంటున్నారు. అందుకే ఆయన  గురువారం(మే 8) మీడియా సమవేశంలో మాట్లడుతూ.. రెండు ఎన్సీపీ వర్గాల మధ్య సిద్ధాంత విభేదాలు ఏమీ లేవు. అయితే  పార్టీలో  ఒక వర్గం నాయకులు, కొందరు ఎమ్మెల్యేలు,ఇతర ముఖ్య నాయకులు తమ నియోజక వర్గాల్లో అభివృద్ధి పనులు అమలు కావాలంటే  అజిత్ పవార్ పార్టీతో చేతులు కలపాలని అంటున్నారు. మరి కొందరు అందుకు అంగీకరించడం లేదు  అంటూ  పవార్ మనసులో మాటను మనసులోనే దాచుకున్నారు. అలాగే..  నిర్ణయం తీసుకునే అధికారం ప్రస్తుతం తనకు లేదనీ అన్నారు.  అందుకే నిర్ణయాన్ని నెక్స్ట్ జనరేషన్  కు వదిలేశారని శరద్ పవార్ అన్నారు. 

అజిత్ పవార్ 2023లో 40 మంది ఎమ్మెల్యేలతో కలిసి ఎన్సీపీని రెండుగా చీల్చారు.  అయితే ఈ మధ్య కాలంలో  బాబాయి – అబ్బాయి (పవార్’లు ఇద్దరు) దగ్గరవుతున్నారనే ఉహాగానాలు వినిపిస్తున్నాయి. ముఖ్యంగా గడచిన రెండు నెలల కాలంలో ఇద్దరు నేతలు మూడు నాలుగుసార్లు కలవడంతో ఉహాగానాలు మరింతగా ఊపందుకున్నాయి. 

అదలా ఉంటే..  శరద్ పార్టీ నాయకులలో చాలా మంది నాయకులు అజిత్  పవార్ తో చేతులు కలిపేందుకు సిద్దంగా ఉన్నారని, ఎన్సీపీ యువజన విభాగం అధ్యక్షుడు సూరజ్ చవాన్   అంటున్నారు. పార్టీలు విలీనం అయినా  కాకున్నా  శరద్ పవార్ పార్టీ నాయకులు పెద్ద సంఖ్యలో ఎన్సీపీలో చేరేందుకు సిద్దంగా ఉన్నారని అంటున్నారు. అలాగే.. మహాయుతిలో కొనసాగాలనే అజిత్ పవర్ నిర్ణయంతో ఏకీభవిస్తే సుప్రియా సులే  ఇతర నాయకులకు స్వాగతం పలికేందుకు ఎన్సీపీకి అభ్యంతరం లేదని స్పష్టం చేశారు. ఈ నేపధ్యంలో రెండు పార్టీలు ఒకటయ్యే అవకాశాలే ఎక్కువ ఉన్నాయనీ ఉభయ పార్టీల నాయకులూ అంటున్నారు. అయితే..  అదే జరిగితే బీజేపీ  పొడ గిట్టని సీనియర్ నాయకులు కొందరు వేరే దారులు వెతుక్కోవచ్చని అంటున్నారు.

By
en-us Political News

  
గతంలో ఇదే 152 స్థానాల పరిధిలో బీజేపీ బలం కేవలం 59 సీట్లు మాత్రమే. అయితే ఇప్పుడు ఆ సంఖ్యను రెండింతలు చేసి 110కి చేర్చడం అంటే అది సామాన్యమైన విషయం కాదు.
గవర్నర్ కోటా ఎమ్మెల్సీల నియామక ప్రక్రియ ఎట్టకేలకు కొలిక్కి వచ్చింది. రాష్ట్ర ప్రభుత్వం సిఫార్సు చేసిన ప్రొఫెసర్ ఎం. కోదండరాం, మాజీ క్రికెటర్ మొహమ్మద్ అజారుద్దీన్ పేర్లకు గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా శనివారం ఆమోద ముద్ర వేశారు. దీనికి సంబంధించిన ఫైలుపై గవర్నర్ సంతకం చేయడంతో.. వీరిద్దరి నియామకానికి మార్గం సుగమమైంది.
బీఆర్ఎస్ పార్టీ, దాని నాయకత్వంపై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. బీఆర్ఎస్ అధినేత, తన కన్న తండ్రి కేసీఆర్ పై సంచలన వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్ ఇప్పుడు మన మనిషి కాదన్నారు. ఆయనను మరమనిషిగా అభివర్ణించారు. గుంటనక్కల చేతిలో బందీ అయ్యారంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. బీఆర్ఎస్ తెలంగాణ ఆత్మను పూర్తిగా కోల్పోవడం వల్లే తాను కొత్త పార్టీ పెట్టాల్సి వచ్చిందన్న కవిత.. ఉద్యమ నాయకుడైన కేసీఆర్ అభివృద్ధి రథం గాడి తప్పిందన్నారు. గతంలో జరిగిన కొన్ని తప్పుల్లో భాగస్వామినేనని అంగీకరిస్తూనే.. ఆ తప్పులను సరిదిద్దుకునే ప్రయత్నం చేస్తున్నానన్నారు.
ఢిల్లీ, పంజాబ్ ప్రభుత్వాలపై అవినీతి ఆరోపణలు వ‌స్తుండ‌టంతో ఈ టాపిక్ డైవ‌ర్ష‌న్ డ్రామాను ఆప్ తెర‌పైకి తెచ్చింద‌ని అంటారు రాఘ‌వ్ చ‌ద్దా. ఇది కేవలం చద్దా వ్యక్తిగత నిర్ణయం కాదు, ఒక పెద్ద రాజకీయ వ్యూహం. రాజ్యసభలో ఆప్ కి ఉన్న 10 మంది ఎంపీల్లో ఏడుగురు.. అంటే 2/3 వంతు బీజేపీలో చేరడానికి సిద్ధమయ్యారు. ఇందులో ఉన్న కీలక వ్యక్తులు.. రాఘ‌వ్ చ‌ద్దా, సందీప్ పాఠ‌క్, అశోక్ మిట్ట‌ల్, మాజీ క్రికెట‌ర్ హర్భజన్ సింగ్, స్వాతి మలివాల్, రాజేంద్ర గుప్తా, విక్రమ్ సాహ్ని ఉన్నారు.
పార్టీ పేరు తెలంగాణ రాష్ట్ర సేన (టీఆర్ఎస్)గా ప్రకటించారు. రాష్ట్రంలోని అట్టడుగు వర్గాల సంక్షేమం, సామాజిక సమానత్వమే ధ్యేయంగా ఈ పార్టీ పనిచేస్తుందని కవిత ఈ సందర్భంగా స్పష్టం చేశారు.
ఉద్యోగం అడిగిన యువకుడికి చంద్రబాబు ఆటో ఇస్తానని చెప్పినట్లుగా రెండు వేర్వేరు సందర్భాలను కలిపి ఎడిట్ చేశారు. ఉద్యోగం అడిగితే ఆటోతో సరిపెట్టుకోమన్నారనే అర్థం వచ్చేలా ఈ వీడియోను సృష్టించి వైరల్ చేస్తున్నారు. ఈ అంశంపై స్పందించిన మంత్రి లోకేశ్ వైసీపీ తన పాత అలవాట్లను మానుకోవడం లేదనీ.. బురదజల్లే రాజకీయాలే పరమావధిగా పెట్టుకుందని దుయ్యబట్టారు.
జాతీయ రాజకీయాల్లో అనూహ్య పరిణామం చోటుచేసుకుంది.
గత ఎన్నికలకు ముందు వైనాట్ 175 అంటూ ధీమా వ్యక్తం చేసిన వైసీపీ అధినేత జగన్.. ఇప్పుడు ఎట్ లీస్ట్ 11 అనాల్సిన పరిస్థితి వచ్చేలా ఉందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. సిట్టింగ్ ఎమ్మెల్యేలు ప్రజల మధ్యకు రాకపోవడం, ప్రజాసమస్యలను పట్టించుకోకపోవడం, అన్నిటికీ మించి అసెంబ్లీకి గైర్హాజర్ కావడం వంటి అంశాలు పార్టీని జనాలను దూరం చేస్తున్నాయని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.
ఏమాట‌కామాట నాదెండ్ల‌, ల‌క్ష్మీపార్వ‌తి ఎన్టీఆర్ జీవితాన్ని మ‌లుపు తిప్పిన వారే.
కార‌ణం విజ‌య్ టీవీకే పార్టీ పెట్టి ఆ పార్టీని ప్ర‌స్తుతం ఎన్నిక‌ల ప‌రీక్ష‌కు నిల‌ప‌డంతో.. ఇతర న‌టుల పార్టీలు, అవి తొలి సారి ఎన్నిక‌ల్లో పాల్గొన్న‌పుడు సాధించిన ఓట్ల శాతం ఎంత‌? అన్న ఆస‌క్తిక‌ర‌మైన చ‌ర్చ‌కు తెర‌లేచింది.
ప‌సుపు ఒక మ‌హిళ‌కు ఎంత ముఖ్య‌మో తెలిసిందే. ఆపై నీలం అంటే ద‌ళిత సందేశం ఇస్తుంది. ఇక పోతే ఆకుప‌చ్చ అంటే అది భార‌త జెండాలో ఒక భాగం. ముస్లీం మైనార్టీల‌ను ఏకం చేసేది. కాబ‌ట్టి క‌విత జెండా రంగుల్లో ఇవి ప్ర‌ముఖంగా ఉండొచ్చ‌ని తెలుస్తోంది. దీంతో క‌విత ప్ర‌క‌టించ‌బోయే పార్టీ జెండా రంగులు, గుర్తు ఆల్రెడీ సోష‌ల్ మీడియాలో చ‌క్క‌ర్లు కొడుతున్నారు.
బెంగాల్ ఎన్నికల చరిత్రను పరిశీలిస్తే, ఓటింగ్ శాతం క్రమంగా పెరుగుతూ వస్తోంది. 1969లో కేవలం 70 శాతంగా ఉన్న ఓటింగ్, 1987 నాటికి 78 శాతానికి చేరింది. ఆ తర్వాత 1996లో 80 శాతం, 2011లో 84 శాతంగా నమోదైంది. గత 2021 ఎన్నికల్లో 82 శాతానికి పరిమితమైన ఓటింగ్.. ఇప్పుడు 2026లో ఏకంగా 92 శాతాన్ని దాటి సరికొత్త రికార్డును సృష్టించింది.
తెలుగువన్ వాస్తవ వేదికలో ప్రస్తుత జాతీయ రాజకీయ పరిస్థితులపై విస్తృత చర్చ జరిగింది.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.