గణితంతో ప్రపంచాన్ని విస్మయపరిచిన శీనివాస రామానుజన్..!

Publish Date:Dec 20, 2023

Advertisement

మనిషి జీవితం మొత్తం గణితం పై ఆధారపడింది. ఉదయం లేచింది మొదలు సమయం చూడటం నుండి ప్రతి పనిలోనూ గణితాన్ని ఉపయోగిస్తాము. ఈ గణిత శాస్త్రానికి సంబంధించి భారతీయులు గర్వంగా చెప్పుకోదగినవారు శ్రీనివాస రామానుజన్.  భారతదేశంలో గణిత దినోత్సవాన్ని శ్రీనివాస రామానుజన్ పుట్టినరోజు సందర్బంగా జరుపుకుంటారు. శ్రీనివాస రామానుజన్   రచనలు దేశవ్యాప్తంగా,  ప్రపంచవ్యాప్తంగా చాలా మందిని ప్రభావితం చేశాయి. శ్రీనివాస రామానుజన్  1887, డిసెంబర్ 22న తమిళనాడులోని ఈరోడ్‌లో అయ్యంగార్ బ్రాహ్మణ కుటుంబంలో జన్మించారు. ఈయన జన్మదినం అయిన డిసెంబర్ 22వ తేదీను గణిత దినోత్సవంగా జరుపుకుంటున్నాం. ఈ సందర్బంగా శ్రీనివాస రామానుజన్ గురించి, ఆయన జీవితం గురించి తెలుసుకుంటే..

1887, డిసెంబర్ 22వ తేదీన తమిళనాడులోని ఈరోడ్ లో అయ్యంగార్ బ్రాహ్మణ కుటుంబంలో జన్మించిన శ్రీనివాస రామానుడన్ తన 12 సంవత్సరాల వయస్సులో అధికారిక విద్య లేకపోయినా త్రికోణమితిలో రాణించాడు. ఆయనే సొంతంగా   అనేక సిద్ధాంతాలను అభివృద్ధి చేశాడు.

1904లో మాధ్యమిక పాఠశాలను పూర్తి చేసిన తర్వాత, రామానుజన్ కుంభకోణంలోని ప్రభుత్వ ఆర్ట్స్ కళాశాలలో చదవడానికి స్కాలర్‌షిప్‌కు అర్హత సాధించాడు.  కాని అతను ఇతర సబ్జెక్టులలో రాణించలేకపోవడం వల్ల స్కాలర్షిప్ కోల్పోయాడు.  14 సంవత్సరాల వయస్సులో రామానుజన్ ఇంటి నుండి పారిపోయాడు. ఆయన  మద్రాసుకు చేరుకుని, మద్రాసులోని  పచ్చయ్యప్ప కాలేజీలో చేరాడు.  అక్కడ  కూడా ఇతర సబ్జెక్టులలో కాకుండా  గణితంలో మాత్రమే రాణించాడు. తన చదువును  ఫెలో ఆఫ్ ఆర్ట్స్ డిగ్రీతో పూర్తి చేయలేకపోయాడు. దీంతో ఆయన అధికారిక చదువు ప్రశ్నార్థకంగా మారింది. అప్పటికే  భయంకరమైన పేదరికంలో ఉన్న శ్రీనివాస  రామానుజన్  గణితంలో తనకున్న అభిరుచి కారణంగా  స్వతంత్ర పరిశోధనను కొనసాగించారు.

తన పరిశోధనల ఫలితంగా తొందరలోనే  వర్ధమాన గణిత శాస్త్రజ్ఞుడిగా  చెన్నైలోని గణిత శాస్త్ర వర్గాల్లో ఒకరిగా  గుర్తించబడ్డాడు. 1912లో  ఇండియన్ మ్యాథమెటికల్ సొసైటీ స్థాపకుడు  అయిన రామస్వామి అయ్యర్  శ్రీనివాస రామానుజన్ కు  మద్రాసు పోర్ట్ ట్రస్ట్‌లో క్లర్క్ ఉద్యోగం రావడంలో   సహాయం చేశాడు. ఒకవైపు ఉద్యోగం చేస్తూనే మరొకవైపు గణిత శాస్త్రానికి చెందిన తన పరిశోధన ఫలితాలను   బ్రిటిష్ గణిత శాస్త్రజ్ఞులకు పంపేవాడు.  1913లో కేంబ్రిడ్జ్‌కు చెందిన GH హార్డీ రామానుజన్ సిద్ధాంతాలకు ముగ్ధుడై అతనిని లండన్‌కు పిలిపించాడు. అప్పుడే శ్రీనివాస రామానుజన్ జీవితంలోనూ,  శాస్త్రవేత్తగానూ  పురోగతిని అందుకున్నాడు.

రామానుజన్ 1914లో బ్రిటన్‌కు వెళ్లాడు. అక్కడ హార్డీ అతన్ని కేంబ్రిడ్జ్‌లోని ట్రినిటీ కాలేజీలో చేర్చాడు. 1917లో రామానుజన్ లండన్ మ్యాథమెటికల్ సొసైటీకి సభ్యునిగా ఎన్నికైన తర్వాత విజయపథంలో దూసుకెళ్లాడు.   1918లో రాయల్ సొసైటీకి ఫెలో అయ్యాడు. ఇలా  రాయల్ సొసైటీలో గౌరవనీయమైన స్థానాన్ని సాధించిన అతి పిన్న వయస్కులలో ఒకరిగా నిలిచారు.

తన పరిశోధనలు, తన జీవితం అభివృద్ది చెందుతున్న సమయంలోనే  రామానుజన్ 1919లో బ్రిటన్‌లో ఆహారాన్ని అలవాటు చేసుకోలేక భారతదేశానికి తిరిగి వచ్చాడు. ఆయన ఆరోగ్యం చాలా క్షీణించిపోయింది.  1920లో 32 సంవత్సరాల వయస్సులో మరణించాడు. అయినప్పటికీ, గణిత శాస్త్ర రంగంలో ఆయన విజయాలు ఇప్పటికీ ప్రపంచవ్యాప్తంగా ఎంతో గౌరవించబడుతున్నాయి.  1729 సంఖ్య ప్రత్యేకత కావచ్చు, మ్యాక్స్- తీటా ఫంక్షన్స్ పై చేసిన పరిశోధనలు కావచ్చు, నంబర్ థియరీ పరిశోధనలు కావచ్చు.. ప్రతి ఒక్కటీ ప్రపంచానికి విస్మయాన్ని కలిగించాయి. ఎంతో టెక్నాలజీ అభివృద్ది చెందినా ఇప్పటికీ రామానుజన్ సూత్రాలు, ఫలితాలను చూసి విస్మయం చెందాల్సిందే.  రామానుజన్ ప్రచురించని ఫలితాలను కలిగి ఉన్న  మూడు నోట్‌బుక్‌లను విడిచిపెట్టాడు.  గణిత శాస్త్రజ్ఞులు వీటికోసం పని చేస్తూనే ఉన్నారు. రామానుజన్ గొప్పదనాన్ని గుర్తించిన భారత ప్రభుత్వం 2012లో, అప్పటి  ప్రధాని మన్మోహన్ సింగ్ డిసెంబర్ 22ని - రామానుజన్ పుట్టిన రోజును  దేశవ్యాప్తంగా జాతీయ గణిత దినోత్సవంగా జరుపుకోవాలని ప్రకటించారు.

                                               *నిశ్శబ్ద.

By
en-us Political News

  
ఎన్ని గొడవలు వచ్చినా, ఎన్ని అపార్థాలు ఎదురైనా, ఎంత అరుచుకున్నా.. బంధాలు విడిపోకుండా వాటిని కలిపి ఉంచేది ప్రేమ మాత్రమే.  ప్రేమ లేనప్పుడు అన్ని ఉన్నా ఏమీ లేనట్టే ఉంటుంది...
పెళ్లయ్యాక భార్యభర్తల మద్య గొడవలు అనేవి చాలా సహజం.  చాలా మంది భార్యాభర్తల మధ్య జరిగే గొడవలు ఇంటి గొడవలు అని చెబుతారు. అవి ఇద్దరు వ్యక్తుల మధ్య జరిగే గొడవలే అయినా,  ఇంటికి, కుటుంబానికి సంబంధించినవి అయినా టోటల్ గా ప్రతి భార్యభర్త జంట..
నేటి కాలంలో అమ్మాయిలు అబ్బాయిలతో సహా అన్ని రంగాలలో రాణిస్తున్నారు.  అన్ని పనులు చేయగలుగుతున్నారు. కొన్ని సందర్బాలలో అబ్బాయిల కంటే ధైర్యాన్ని చూపగలుగుతున్నారు. అయినా సరే అమ్మాయిల విషయంలో సమాజం నుండి ఇంటి వరకు ప్రతి చోట ఒక చిన్నతనం కనిపిస్తుంది....
ఉద్యోగం చేస్తున్నాం అయినా సంపాదన సరిపోవడం లేదు.. ఈ మాట చాలామంది చెబుతూ ఉంటారు.  ముఖ్యంగా మధ్యతరగతి కుటుంబాలలో అవసరాలు,  ఖర్చు,  కలలు ఎక్కువ.. కానీ సంపాదన మాత్రం అరకొరగానే ఉంటుంది. వచ్చే సంపాదన సరిపోక మెరుగైన సంపాద వచ్చే  ఉద్యోగాల కోసం వెతుకుతూ ఉంటారు.
తల్లిదండ్రులను, తోడబుట్టిన వారిని ఎవరూ ఎంచుకోలేరు.  అవి దేవుడు ఇచ్చే బందాలు.  కానీ ప్రతి వ్యక్తి స్నేహితులను ఎంచుకునే వెసులుబాటు ఉంటుంది. మంచి స్నేహితులు ఉన్న వారి జీవితం చాలా బాగుంటుంది. ముఖ్యంగా క్లిష్ట పరిస్థితులు...
ప్రతి మనిషి వేర్వేరు వ్యక్తిత్వం కలిగి ఉంటాడు.  ఒకే ఇంట్లో, ఒకే తల్లి కడుపున పుట్టిన వ్యక్తులే వేర్వేరు స్వభావాలను కలిగి ఉన్నప్పుడు బయటి వ్యక్తుల స్వభావం ఒకే విదంగా ఉండటం అనేది జరగదు.  అయితే బయట కొందరిని చూస్తే వీళ్లు అచ్చు మనలాగే ఉన్నారే...
ప్రేమ,  భార్యాభర్తల బంధం,  సహజీవనం.. ఏదైనా సరే.. మనసులు ఇచ్చిపుచ్చుకోవడం అనేది కీ పాయింట్ గా ఉంటుంది. నేటికాలంలో బంధాలు చాలా పెళుసుగా మారాయి.  చాలా తొందరగా బ్రేకప్ లు  జరుగుతున్నాయి...
పెళ్లి ప్రపంచంలో ప్రజలందరూ సాగించే ఒక పవిత్రమైన  బంధం. భారతీయులు పెళ్లికి అధిక ప్రాధాన్యత ఇస్తారు.  సాధారణంగా వయసు రాగానే పెళ్లి వయసు వచ్చింది అని అంటుంటారు.  దానికి తగ్గట్టే పెళ్ళిళ్లు చేస్తుంటారు....
గొడవలు లేని భార్యాభర్తల బంధం అంటూ ఉండదు. వాస్తవానికి భార్యాభర్తల మధ్య  జరిగే గొడవలు చాలా వరకు వారి బంధాన్ని మరింత బలంగా మార్చడంలో సహాయపడతాయి.  భార్యాభర్తల మధ్య జరిగే చిన్న చిన్న గొడవలు  ఒకరి మీద ఒకరికి ఉండే ప్రేమను స్పష్టం చేస్తాయి...
అత్తాకోడలు ఇద్దరూ వేరే ఇంట్లో తమ తల్లిదండ్రుల మధ్య గారాభంగా పెరిగి వివాహం పేరుతో ఒక ఇంటిని చేరే వారు.  అయితే ఏ ఇంట్లో చూసినా అత్తాకోడళ్లు అంటే ఒకానొక శత్రుత్వమే కనిపిస్తుంది, వినిపిస్తుంది...
కష్టాలు, సమస్యలు ఎదురైనప్పుడు, ఇతరుల నుండి అన్యాయాన్ని ఎదుర్కుంటున్నప్పుడు, ఇతరుల తప్పులకు తాము నష్టాన్ని  అనుభవిస్తున్నప్పుడు చాలా మంది న్యాయం కోసం న్యాయ స్థానాన్ని ఆశ్రయిస్తారు.
మోసపోవడం,  మోసం చేయడం,  తప్పు చేయడం,  తప్పించుకు తిరగడం,  చట్టానికి విరుద్దంగా, న్యాయానికి వ్యతిరేకంగా ప్రవర్తించడం..  ఒకటి రెండు కాదు..
ఏ సంబంధానికైనా నమ్మకం పునాది.  కానీ నేటి డిజిటల్ యుగంలో ఈ నమ్మకం కొన్ని విషయాల చుట్టూనే తిరుగుతుంది. వాటిలో ఫోన్ చాలా ముఖ్యమైనది. భార్యాభర్తలు ఒకరి ఫోన్ మరొకరు చెక్ చేయడంలో తప్పేముందని చాలా మంది అంటుంటారు....
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.