ఏపీలో 10 జాతీయ రహదారుల విస్తరణ..డీపీఆర్‌కు కేంద్రం ఆదేశాలు

Publish Date:Jun 29, 2025

Advertisement

 

ఆంధ్రప్రదేశ్‌లో పది జాతీయ రహదారులు విస్తరణకు నోచుకోనున్నాయి. రోడ్లపై వాహన రద్దీతో పాటు మున్ముందు మరింత ట్రాఫిక్‌ పెరిగే అవకాశం ఉందని గుర్తించడంతో వాటి విస్తరణపై కేంద్రం దృష్టిపెట్టింది. ఆయా జాతీయ రహదారులను 988 కిలోమీటర్ల మేర విస్తరించేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేయాలని ఆదేశించింది.

988 కిలోమీటర్ల విస్తరణకు డీపీఆర్‌ తయారీకి కేంద్రం ఆదేశాలు - 2025-26 వార్షిక ప్రణాళికలో చేర్చిన మోర్త్‌ కత్తిపూడి నుంచి ఒంగోలు వరకు 380 కిలోమీటర్ల NH-216ని నాలుగు వరుసలుగా విస్తరించనున్నారు. ఇందులో కత్తిపూడి నుంచి కాకినాడ వరకు 27 కిలోమీటర్లు ఇప్పటికే నాలుగు వరుసలుగా ఉంది. దీనిని ఆరు వరుసలు చేయనున్నారు. మిగిలిన భాగం ప్రస్తుతం రెండు వరుసలు ఉండగా నాలుగు వరుసలుగా విస్తరిస్తారు. 

కర్నూలు నుంచి నంద్యాల, కడప, రాయచోటి, పీలేరు, చిత్తూరు మీదుగా తమిళనాడులోని రాణీపేట వరకు ఉన్న NH-40ని కడప నుంచి చిత్తూరు జిల్లాలోని రంగంపేట క్రాస్‌ వరకు 148 కిలోమీటర్లు 4 వరుసలుగా విస్తరించనున్నారు శ్రీ సత్యసాయి జిల్లాలోని కొడికొండ చెక్‌పోస్ట్‌ నుంచి సిర వరకు 99 కిలోమీటర్లు 4వరుసలు చేస్తారు. ఏపీ, కర్ణాటక సరిహద్దు నుంచి కదిరి, ముదిగుబ్బ మీదుగా అనంతపురం వరకు 86 కిలోమీటర్లు 4 వరుసలుగా విస్తరిస్తారు. ఇందులో కదిరి, ముదిగుబ్బల వద్ద బైపాస్‌లు కూడా ఉన్నాయి. పలమనేరు నుంచి కుప్పం మీదుగా తమిళనాడులోని కృష్ణగిరి సరిహద్దు వరకు 97 కిలోమీటర్ల విస్తరిస్తున్నారు
 

By
en-us Political News

  
బిహార్ సమస్తిపూర్లోని సింధియా ఘాట్‌లో వందల మంది యువకులు నాగుపాములను మెడలో వేసుకొని ఊరేగింపుగా వెళ్లిన వీడియో వైరలవుతోంది.
రాష్ట్రానికి పెట్టుబడులు ఆకర్షించేందుకు మంత్రి నారా లోకేష్ ప్రయత్నాలు ముమ్మరం చేశారు. మహీంద్రా గ్రూప్ ఏపీలో ట్రక్కుల తయారీ పరిశ్రమను నెలకొల్పాలని ఆనంద్ మహీంద్రాను ఆహ్వానించారు.
కొందరు సోషల్ మీడియాలో కుట్రలు చేస్తున్నారు. ఆ కుట్రలను తిప్పికొట్టాలి అని ఈటల రాజేందర్ కార్యకర్తలకు పిలుపునిచ్చారు.
వందే భారత్‌ రైలు బయల్దేరే 15 నిమిషాలు ముందు రిజర్వేషన్‌ చేసుకునేలా కొత్త సదుపాయం కల్పించారు. ఈ విషయమై దక్షిణ రైల్వే విడుదల చేసిన ప్రకటనలో వెల్లడించింది.
నా చావుకు టీడీపీ ఎమ్మెల్యే కొలిక‌పూడి కార‌ణం అంటూ నీటిపారుదల శాఖ ఏఈ సూసైడ్ నోట్ కలకలం రేపుతుంది
ఏపీ సీఎం చంద్ర‌బాబు.. వైసీపీ అధినేత జ‌గ‌న్‌ పై సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. వైసీపీ హ‌యాంలో జ‌రిగిన మ‌ద్యం కుంభ‌కోణంపై ఆయ‌న స్పందించారు.
ఏపీ సీఎం చంద్రబాబు తిరుపతిలో పర్యటించారు. స్వర్ణాంధ్ర- స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో భాగంగా.. రేణిగుంట మండలం తూకివాకం వద్ద ఇంటిగ్రేటెడ్ వేస్ట్ ప్రాసెసింగ్ ప్లాంట్‌ను ముఖ్యమంత్రి చంద్రబాబు పరిశీలించారు.
టీమ్ ఇండియా మజీ కెప్టెన్, కాంగ్రెస్ నాయకుడు అజారుద్దీన్ ఇంట్లో దొంగలు పడ్డారు. హైదరాబాద్‌లో కాదులేండి.. మహారాష్ట్రలోని నివాసంలో. ఆయన భార్య సంగీత బిజిలానీ పేరిట మహారాష్ట్రలోని లోనావాలాలో ఓ బంగ్లా ఉంది.
తెలంగాణ రాష్ట్ర బోనాల పండుగ సందర్బంగా ఈ నెల 21న సోమవారం రాష్ట్ర ప్రభుత్వం పబ్లిక్ హాలీడేగా ప్రభుత్వం ప్రకటించింది. దీంతో ఆది, సోమవారం విద్యార్థులకు సెలవులు రానున్నాయి.
ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో రాజంపేట వైసీపీ ఎంపీ మిథున్‌రెడ్డి విజయవాడలో సిట్‌ ఎదుట విచారణకు హాజరయ్యారు. ఈ మేరకు ఢిల్లీలో ఉన్న ఆయన కాసేపటి క్రితం గన్నవరం ఎయిర్‌పోర్టుకు చేరుకుని అక్కడి నుంచి విజయవాడలోని సిట్ కార్యాలయానికి వెళ్లనున్నారు.
తెలంగాణ హైకోర్టు కొత్త ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ అపరేశ్ కుమార్ సింగ్ ప్రమాణ స్వీకారం చేశారు. రాజ్ భవన్ లో మధ్యాహ్నం జస్టిస్ ఏకే సింగ్ తో గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ ప్రమాణం చేయించారు.
టీటీడీ దేవస్థానంలో పని చేస్తున్ననలుగురు అన్యమత ఉద్యోగులను సస్పెండ్ చేశారు.
కాంగ్రెస్ లో మరీ ముఖ్యంగా తెలంగాణ కాంగ్రెస్ లో ఐక్యత అన్నది ఎండమావే అన్న విషయం ఇప్పటికే పలుమార్లు రుజువైంది. తాజాగా రేవంత్ రెడ్డి మరో పదేళ్లు తానే సీఎం అంటూ చేసిన వ్యాఖ్యలపై కోమటిరెడ్డి సంచలన కౌంటర్ ఇచ్చారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.