వై.ఎస్.ఆర్.కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు ఇద్దరు నానిల ఆతృత!
Publish Date:Jun 17, 2012
Advertisement
ఉపఎన్నికల్లో విజయఢంకా మోగించిన వై.ఎస్.ఆర్.కాంగ్రెస్ పార్టీలోకి చేరేందుకు నానిలు ఇద్దరూ ఆతృతపడుతున్నారు. ఇంకా ఆలస్యం చేయకూడదని నిర్ణయించుకున్న వీరిద్దరూ తమ పదవులకు రాజీనామా చేసేందుకు తొందరపడుతున్నారు. ముందుగా జగన్ తో మాట్లాడి నిర్ణయం తీసుకోవాలని వీరిద్దరూ రాజధానికి వెళ్ళారు. చెంచల్ గూడ జైలులో జగన్ ను కలిగిన తరువాత తమ రాజీనామాలను సమర్పించేందకు సిద్ధపడ్డారు. తెలుగుదేశంపార్టీ కృష్ణాజిల్లా గుడివాడ ఎమ్మెల్యే కొడాలి శ్రీవెంకటేశ్వరరావు (నాని) ఇక తన ఆతృతను ఆపుకోలేక అభిమానుల పేరిట తానే స్వయంగా చేయించిన ఫ్లెక్సీలను లింగవరం ప్రాంతంలో ప్రదర్శించారు. ఈ ఫెక్సీల్లో వై.ఎస్. రాజశేఖరరెడ్డి, జగన్ లతో నాని ఉన్న చిత్రం కనిపిస్తోంది. పేరుకు మాత్రం అభిమానుల ఫోటోలు, పేర్లు మాత్రం ఆ ఫ్లెక్సీల్లో కిందభాగాన రాయించారు. ఇలా ప్రచారం జరిగాక ఆయన రాజధాని బయలుదేరి వెళ్ళారు. ఇక మరో ఎమ్మెల్యే ఆళ్ళ నాని విషయానికి వస్తే తనతోపాటు వెనుక వచ్చే కాంగ్రెస్ ద్వితీయశ్రేణి నాయకులను లెక్కించే పనిలో మొన్నటివరకూ బిజీగా ఉన్నారు. తన వెనుక వచ్చేవారందరినీ సిద్ధం చేసుకున్న ఈ ఏలూరు ఎమ్మెల్యే ఫలితాలు వచ్చిన దగ్గరనుంచి జగన్ ను కలిసి తన సంతోషాన్ని పంచుకోవాలని ఆరాటపడ్డారు. అంతేకాకుండా తన రాజీనామా సమయం గురించి చర్చించాలని ఉత్సాహంగా రాజధానికి బయలుదేరుతున్నారని ఆయన సన్నిహితులు తెలిపారు.
http://www.teluguone.com/news/content/nani-eager-to-join-ysr-cong-party-24-14936.html
సుబ్రతో రాయ్ అరెస్ట్ ...
ఖరారైన రాష్ట్రపతి పాలన ...
రాష్ట్రపతి పాలనకే మొగ్గు ...
విఫలమైన 'టి' కాంగ్రెస్
చంద్రబాబు పాదయాత్ర ఈ నెల 31న పునఃప్రారంభ౦ కానుంది. ఫిబ్రవరి నాల్గోతేదీ వరకు విజయవాడలో కోనసాగనుంది. ఆరోగ్య కారణాల రీత్యా చంద్రబాబు 29, 30లలో కూడా విశ్రాంతి తీసుకోనున్నారని తెలుగుదేశం నాయకులు ప్రకటించారు.
తెలంగాణ కాంగ్రెస్ ఎంపీలు కేకే నివాసంలో భేటి అయ్యారు. తెలంగాణపై పార్టీ అధిష్టానం వైఖరిని వ్యతిరేకిస్తూ పార్టీ సభ్యత్వానికి, పదవులకు కూడా రాజీనామా చేసి అధిష్టానం పై ఒత్తిడి పెంచేందుకు రంగం సిద్దం చేస్తున్నారు. రాజీనామా లేఖలను పార్టీ అధ్యక్షురాలు శ్రీమతి సోనియా గాంధి పంపించనున్నారు. భేటి అనంతరం లేఖలను మీడియాకు విడుదల చేయనున్నారు.
తెలుగు సినీ ప్రియులను తన అందచందాలతో, అసమానమయిన నటనతో ఒక ఊపుఊపిన అందాల తార జయప్రద, ఆ తరువాత బాలీవుడ్ లోను ఒక వెలుగు వెలిగింది. తెలుగుదేశంపార్టీలో జేరి రాష్ట్ర రాజకీయాలలో పాల్గొన్నపటికీ, చంద్రబాబుతో పొసగక ఏకంగా డిల్లీ రైలెక్కి ఉత్తర ప్రదేశ్ రాష్ట్రంలో వాలిపోయింది.
జానారెడ్డికి బుద్ది ,జ్ఞానం ఉందా? తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు మీద కాంగ్రెస్ ప్రకటన కోసం ఇంకా వేచిచూద్దాం అంటాడా. కాంగ్రెస్ ప్రకటనలో ఇంకా నిజాయితీ ఉందన్న జానారెడ్డి మాటలను తెలంగాణ ప్రజలు విశ్వసించరు. ముఖ్యమంత్రి పదవికోసం జానారెడ్డి గోతికాడ నక్కలా ఎదురు చూస్తున్నాడు.
వైయస్సార్ కాంగ్రెస్ చేపట్టిన కోటి సంతకాల సేకరణపై తెలుగుదేశం పార్టీ తీవ్ర విమర్శలు గుప్పించిన ఆరు నెలలకి ఇప్పుడు తాపీగా ఆ పార్టీ నేతలు స్పందించడం చూస్తుంటే ఆ పార్టీ నాయకత్వలోపం మరోసారి బయట పడుతోంది.
చంద్రబాబు తెలంగాణా జిల్లలో పాదయాత్ర చేస్తునంత కాలం తన వైయస్సార్ కాంగ్రెస్ పార్టీని, తన నాయకుడు జగన్ మోహన్ రెడ్డిని అయన ఎంత తీవ్రంగా విమర్శించినా స్పందించని కొడాలి నాని, చంద్రబాబు ఇప్పుడు తన కృష్ణా జిల్లాలో పాదయాత్ర చేస్తూ అదే విధంగా విమర్శలు చేసినప్పుడు మాత్రం వెంటనే స్పందించారు.
రాష్ట్ర రాజధానిలోఇందిరా పార్క్ వద్ద నేటి నుండి 36గంటల సమరదీక్షను నిర్వహించాలన్న పట్టుదలతో ఉన్న తెలంగాణా జేయేసీ నేతలు, పోలీసు ఆదేశాలను
నిర్విరామంగా సాగుతూ 117వ రోజుకు జేరుకొన్నచంద్రబాబు పాదయాత్ర ఈరోజు కృష్ణా జిల్లాలో పరిటాలకు చేరుకొంది. ముందు అనుకొన్న ప్రకారం అయితే ఈ రోజుతో ఆయన పాదయాత్ర ముగించాల్సి ఉంది. అయన కుటుంబ సభ్యులు, పార్టీ నేతలు మరియు వైద్యులు కూడా పాదయాత్ర ముగించమని కోరినప్పటికీ చంద్రబాబు తన పాదయాత్రను కొనసాగించడానికే నిశ్చయించుకొన్నారు.
తెలంగాణా జేయేసీ అద్వర్యంలో సికిందరాబాద్ లో ఇందిరా పార్క్ వద్ద 36గంటల సమరదీక్షకు అనుమతి కోరుతూ జేయేసీ నేతలు హోంమంత్రి సబితా ఇంద్రరెడ్డికి వినతిపత్రం సమర్పించగా, కొద్దిసేపటిలోనే వారికి అనుమతి నిరాకరిస్తున్నట్లు పోలీసుల నుండి వెంటనే లేఖ అందడంతో తెలంగాణావాదులు కిరణ్ కుమార్ రెడ్డి మీద, పోలీసుల మీద మండిపడ్డారు.





