మంత్రి కొండా సురేఖ‌పై నాగార్జున కేసు.. వాంగ్మూలాల్లో తేడాలున్నాయా?

Publish Date:Oct 8, 2024

Advertisement

మంత్రి కొండా సురేఖ వ్యాఖ్య‌లు తెలంగాణ రాజ‌కీయాల్లో ర‌చ్చ రేపుతున్నాయి. తాను ఒక‌టి అనుకుంటే దైవం మ‌రొక‌టి త‌ల‌చిద‌న్న‌ట్లుగా.. కొండా సురేఖ బీఆర్ఎస్ నేత కేటీఆర్‌ను టార్గెట్ గా వ్యాఖ్య‌లు చేయ‌బోయి నాగార్జున ఫ్యామిలీని వివాదంలోకి లాగేశారు. అప్ప‌టికే కాంగ్రెస్ ప్ర‌భుత్వం ఆధ్వ‌ర్యంలోని హైడ్రా త‌న ఎన్ క‌న్వెన్ష‌న్ హాల్ ను కూల్చేసింద‌ని ర‌గిలిపోతున్న నాగార్జు.. కొండా సురేఖ వ్యాఖ్య‌ల‌ను సీరియ‌స్ గా తీసుకున్నారు. నాగార్జునే రిక్వెస్ట్ చేశారో ఏమో కానీ గతంలో ఎన్నడూ లేని విధంగా  సినీ ఇండ‌స్ట్రీ మొత్తం  ఏక‌మైంది. మంత్రి కొండా సురేఖ వ్యాఖ్య‌ల‌ను దాదాపు సినీ ప్ర‌ముఖులు అందరూ ఖండించారు. ప‌నిలో ప‌నిగా కొంద‌రు నాగార్జున హార్డ్ కోర్ ఫ్యాన్స్ కాంగ్రెస్ ప్ర‌భుత్వంపైనా దుమ్మెత్తిపోశారు.  హైడ్రా, రైతు రుణ‌మాఫీ విష‌యంలో వ‌స్తున్న‌ విమ‌ర్శ‌ల‌తో అసలే ఉక్కిరిబిక్కిరి అవుతున్నరేవంత్ ప్ర‌భుత్వానికి కొండా సురేఖ వ్యాఖ్య‌లు పెద్ద తలనొప్పిగా పరిణమించాయి. దీంతో కాంగ్రెస్ అధిష్టానం న‌ష్ట నివార‌ణ చ‌ర్య‌ల‌ను  చేప‌ట్టింది. కాంగ్రెస్ పెద్ద‌లు కొండా సురేఖ‌ను మంద‌లించ‌డంతో ఆమె ప‌ది మెట్లు దిగొచ్చి నాగార్జున ఫ్యామిలీకి, స‌మంత‌కు  క్ష‌మాప‌ణ‌లు చెప్పారు. దీంతో వివాదం స‌మ‌సిపోయింద‌ని అంద‌రూ భావించారు. కానీ, కాంగ్రెస్ ప్ర‌భుత్వంపైన కోప‌మో.. నాగ‌చైత‌న్య‌, స‌మంత వ్య‌వ‌హారంపై ప్ర‌తి ఒక్క‌రూ కామెంట్స్ చేస్తున్నార‌న్న ఆగ్రహమో మొత్తం మీద కొండా సురేఖ వ్యాఖ్య‌ల‌ను నాగార్జున సీరియ‌స్ గా తీసుకున్నారు. ఎట్టి ప‌రిస్థితుల్లో వ‌దిలేద‌ని లేద‌ని శ‌పధం చేసిన‌ట్లుగా ప్ర‌వ‌ర్తిస్తున్నారు.

 అస‌లేం జ‌రిగింద‌నే విష‌యాన్ని ప‌రిశీలిస్తే.. మంత్రి కొండా సురేఖ‌, బీజేపీ ఎంపీ ర‌ఘునంద‌న్ రావుపై ఓ కార్య‌క్ర‌మంలో పాల్గొన్నారు. దీంతో వీరిద్ద‌రి ఫొటోల‌తో కేటీఆర్‌, హ‌రీశ్ రావు డీపీలు పెట్టుకున్న వ్య‌క్తులు సోష‌ల్ మీడియాలో వీరి గురించి అస‌భ్య‌క‌ర పోస్టులు పెట్టారు. ఈ పోస్టుల‌పై కొండా సురేఖ తీవ్ర స్థాయిలో ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. అయితే, హ‌రీశ్ రావు సురేఖ‌పై పెట్టిన పోస్టుల‌ను తీవ్రంగా ఖండించారు. కానీ, కేటీఆర్ మాత్రం స్పందించ‌లేదు. దీంతో మంత్రి సురేఖ మీడియాతో మాట్లాడుతూ కేటీఆర్‌పై ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. ఈ క్ర‌మంలో నాగ‌చైత‌న్య‌, స‌మంత‌లు విడిపోవ‌టానికి కేటీఆర్ కార‌ణ‌మంటూ పేర్కొన్నారు. ఈ వ్యాఖ్య‌ల‌ను నాగార్జున, ఆయ‌న కుటుంబ స‌భ్యుల‌తోపాటు స‌మంత కూడా తీవ్రంగా ఖండించారు. దీంతో టాలీవుడ్ ఇండ‌స్ట్రీ ప్ర‌ముఖులు నాగార్జున‌, స‌మంత వైపు నిలిచి సోష‌ల్ మీడియా వేదిక‌గా మంత్రి చేసిన వ్యాఖ్య‌ల‌ను ఖండించారు. నాగార్జున మంత్రి వ్యాఖ్య‌ల‌ను సీరియ‌స్‌గా తీసుకున్నారు. దీంతో ఆమెపై నాంప‌ల్లి కోర్టులో క్రిమిన‌ల్‌ ప‌రువు న‌ష్టం దావా వేశారు.   ఈ పిటిష‌న్‌పై కోర్టులో విచార‌ణ జ‌ర‌గ్గా..  త‌మ ఎదుట హాజ‌రై వాంగ్మూలం  ఇవ్వాల్సిందిగా నాగార్జున‌ను కోర్టు ఆదేశించింది. దీంతో మంగ‌ళ‌వారం నాగార్జున‌, అమ‌ల‌, నాగ‌చైత‌న్య‌తోపాటు సుప్రియ‌ కూడా కోర్టుకు హాజ‌ర‌య్యారు. కోర్టు నాగార్జున ఇచ్చిన స్టేట్‌మెంట్ ను రికార్డు చేసింది. అలాగే మొద‌టి సాక్షిగా సుప్రియ వాంగ్మూలాన్ని కూడా తీసుకుంది. అక్టోబ‌రు 10న మ‌రో సాక్షికి సంబంధించిన వాంగ్మూలం రికార్డు చేయ‌నున్న‌ట్లు చెప్పి.. త‌దుప‌రి విచార‌ణ వాయిదా వేసింది.

నాగార్జున మంత్రి కొండా సురేఖ‌పై ప‌రువు న‌ష్టం దావా వేయ‌డంతో కొంద‌రు బీసీ వ‌ర్గానికి చెందిన వారు ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తున్నారు. బీసి వ‌ర్గానికి చెందిన మ‌హిళా మంత్రిపై ఇలా వ్య‌వ‌హ‌రించ‌డం స‌రి కాద‌ని అంటున్నారు. పొర‌పాటు జ‌రిగింద‌ని, త‌న వ్యాఖ్య‌ల‌ను వెన‌క్కు తీసుకుంటున్నాన‌ని కొండా సురేఖ చెప్పినా నాగార్జు ఇంత మొండి వైఖ‌రితో వ్య‌వ‌హ‌రించ‌డం ఏమిట‌ని ప్ర‌శ్నిస్తున్నారు. అదే అగ్ర‌ కులానికి చెందిన మంత్రి అయితే నాగార్జున ఇలానే వ్య‌వ‌హ‌రించేవారా అంటూ బీసీ వ‌ర్గానికి చెందిన కొంద‌రు ప్ర‌శ్నిస్తున్నారు. ఈ విష‌యంపై సోష‌ల్ మీడియాలో పెద్ద చ‌ర్చ జ‌రుగుతోంది. మ‌రోవైపు బీఆర్ఎస్ వెన‌కుండి నాగార్జున‌ను న‌డిపిస్తున్నద‌ని.. బీఆర్ ఎస్ రాజ‌కీయాల్లో నాగార్జున పావుగా మారారని కాంగ్రెస్ నేత‌లు పేర్కొంటున్నారు. అయితే, మంత్రి సురేఖ పై ప‌రువు న‌ష్టం దావా కోర్టులో నిల‌వ‌ద‌ని కొంద‌రు వాదిస్తున్నారు. నాగార్జున ఒకటి చెప్ప‌గా.. సుప్రియ త‌న వాగ్మూలంలో మ‌రొకొటి చెప్పింద‌ని దీంతో కోర్టు నాగార్జున పిటిష‌న్ ను కొట్టేసే అవ‌కాశాలు ఎక్కువ‌గా ఉన్నాయ‌న్న చ‌ర్చ జ‌రుగుతుంది. ఈ విష‌యంపై మంత్రి కొండా సురేఖ త‌ర‌పున న్యాయ‌వాది మీడియాతో మాట్లాడాడు. 

మంత్రి కొండా సురేఖ‌పై సినీ న‌టుడు నాగార్జున దాఖ‌లు చేసిన కేసు నిల‌బ‌డ‌ద‌ని అనుకుంటున్నామ‌ని ఆమె త‌ర‌పున న్యాయ‌వాది పేర్కొన్నారు. ఈ కేసు విచార‌ణ‌లో ముగ్గురు వ్య‌క్తుల వాంగ్మూలాల్లో తేడాలున్నాయి. నాగార్జున పిటిష‌న్ లో ఒక‌టి చెప్పారు. వాంగ్మూలంలో మ‌రొక‌టి చెప్పారు.  సుప్రియ వాంగ్మూలంలో ఇంకొక‌టి చెప్పారు. సుప్రియను సాక్షిగా కోర్టు ఎంత వ‌ర‌కు ప‌రిగ‌ణ‌లోకి తీసుకుంటుందో చూడాలి. ఈ నెల 10న మ‌రొక సాక్షి వాంగ్మూలం కూడా కోర్టు రికార్డు చేస్తుంది. ఒక‌వేళ సాక్షులు ఇచ్చిన వాంగ్మూలాన్ని ప‌రిగ‌ణ‌లోకి తీసుకొని న్యాయ‌స్థానం మంత్రికి నోటీసులు జారీ చేస్తే దాన్ని న్యాయ‌ప‌రంగానే ఎదుర్కొంటామ‌ని కొండా సురేఖ త‌ర‌పు లాయ‌ర్ చెప్పారు. అయితే, మంత్రి కొండా సురేఖ‌పై కొంద‌రు సోష‌ల్ మీడియాలో పెడుతున్న పోస్టుల‌పై డీజీపీకి ఫిర్యాదు చేసేందుకు ఆమె అనుచ‌రులు సిద్ధ‌మ‌య్యారు. మొత్తానికి నాగార్జున‌, కొండా సురేఖ ఎపిషోడ్‌కు ఇప్ప‌ట్లో తెర‌ప‌డే ప‌రిస్థితులు క‌నుచూపు మేర క‌నిపించ‌డం లేదు.

By
en-us Political News

  
న్ని ఎన్నికలలో విచిత్రాలు జరగవు. ప్రతిసారీ ఒకటే జరిగితే, దాన్ని విచిత్రం అనరు కదా? ఎన్నికలు జరిగి నిండా రెండేళ్లు కాకముందే నెల్లూరు జిల్లాలో తెలుగుదేశం పార్టీకి ఓటి పలుకు వినపడుతున్నది. కొందరు ప్రముఖులు పక్కదారులు చూస్తున్నారని, పక్క పార్టీతో బేరసారాలు జరుపుతున్నారని కూడా వినపడుతున్నది.
అమరావతికి చట్టబద్ధత కల్పిస్తూ కేంద్రం నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో.. వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి తన పంథాను మార్చుకోలేదనేది స్పష్టమవుతోంది. ఐదేళ్ల పాలనలో మూడు రాజధానుల మంత్రం జపించిన జగన్.. ఇప్పుడు మచిలీపట్నం-విజయవాడ-గుంటూరును కలిపి ఒక మెగా సిటీగా మార్చాలనే సరికొత్త ప్రతిపాదనను ముందుకు తెచ్చారు.
మూడు రాజధానుల అంశం గత ఎన్నికల్లో వైసీపీ ఘోర పరాజయానికి ప్రధాన కారణాలలో ఒకటి అన్న విషయాన్ని విస్మరించి.. మళ్ళీ అదే తరహా ప్రత్యామ్నాయ వాదనలు వినిపించడం పట్ల రాజకీయవర్గాలలో విస్మయం వ్యక్తమౌతోంది. పార్టీ కేడర్ సైతం మావిగన్ ఏంటి అదేదో పంటకు పట్టే తెగుల్లా ఉందని నెత్తీ నోరూ బాదుకుంటోంది.
ఆ రోజు సభలో ఓ మంత్రి తనపై చెయ్యి చేసుకున్నారని పేర్కొన్నారు. మరో మంత్రి ఏకవచనంతో తిట్టిపోశారు, కులం పేరుతో దూషిస్తూ తన పుట్టుకను నిందించారన్నారు. శాసనమండలిలో తన సిబ్బందినీ దగ్గరికి రాకుండా వైసీపీ సభ్యులు అడ్డుపడ్డారని, తన చుట్టూ చేరి బెదిరింపులు, ప్రలోభాలతో రకరకాలుగా ఇబ్బంది పెట్టారన్నారు.
ప్రధాని నరేంద్ర మోడీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షాలకు 5 కోట్ల మంది ప్రజల తరఫున కృతజ్ణతలు తెలిపారు. దేశం మొత్తానిది ఒక దారైతే... తమదో దారి అన్నట్లు వైసీపీ వ్యవహరించిందని దుయ్యబట్టారు. రాష్ట్రం, దేశం నాశనమైనా పర్వాలేదు.. మాకు స్వార్థ రాజకీయమే ముఖ్యమన్నట్లుగా వైసీపీ వ్యవహరించిందని విమర్శించారు.
ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో డ్రగ్స్ సంస్కృతి ఒక పెను సవాలుగా మారింది. ఇటీవలి కాలంలో రాజకీయ నాయకులు, ప్రముఖుల పేర్లు డ్రగ్స్ కేసుల్లో వినిపిస్తుండటం సమాజంలో తీవ్రసంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. వాస్తవ వేదిక చర్చలో డోలేంద్ర ప్రసాద్, కంఠంనేని రవిశంకర్ లు ఇది కేవలం శాంతిభద్రతల సమస్య మాత్రమే కాదనీ, సమాజ భవిష్యత్తుకు పెనుముప్పుగా పరిణమించిన ఒక సామాజిక రుగ్మత అని పేర్కొన్నారు.
ప్రస్తుతం ఎన్నికల ప్రచారంలో విజయ్ రాష్ట్రంలో విస్తృతంగా పర్యటిస్తున్నారు. ఈ క్రమంలోనే జననాయగన్‌ సినీమా విడుదలపై నెలకొన్న అనిశ్చితిని ఆయన ప్రజల ముందు ఉంచారు. అలాగే.. కరూర్ ప్రాంతంలో చోటుచేసుకున్న విషాద ఘటనను ప్రస్తావిస్తూ.. అది యాధృచ్ఛికంగా జరిగింది కాదని, దాని వెనుక కూడా లోతైన కుట్ర దాగి ఉందన్న అనుమానాలున్నాయన్నారు.
నిజానికి తాను రాజ‌కీయ స‌న్యాసం చేసిన‌ట్టు చెబుతూనే ఉన్నా.. ఇప్ప‌టికీ ఆయ‌న‌ త‌న టీం ద్వారా అకౌంట్ స‌ర్వీసెస్ అందిస్తూనే ఉన్నారు. ఆపై జ‌గ‌న్ కి లోపాయికారిగా సహకరించేందుకే ఈ రాజీనామా డ్రామాల‌ని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. బేసిగ్గా విజ‌య‌సాయిరెడ్డి కామెంట్ చేయాల్సింది ఏదైనా ఉందంటే.. ఇటీవ‌ల జ‌గ‌న్ అర్ధంప‌ర్దం లేకుండా చేసిన మావిగ‌న్ అనే ప్ర‌తిపాద‌న‌ మీదే. కానీ రేణుక చౌద‌రి స‌భ‌లో లేవ‌నెత్తిన క‌మ్మ‌రావ‌తిని ప‌ట్టుకుని.. పోస్టులు పెట్ట‌డం స‌రికాద‌ంటున్నారు.
రాజ్యసభలో అమరావతి చట్టబద్ధత బిల్లుకు కాంగ్రెస్, బీజేపీ, టీడీపీ, టీఎంసీ, ఆప్, బీజేడీ, ఆర్జేడీ, బీఆర్ఎస్, జేడీ(యూ), శివసేన మద్దతు ఇచ్చాయి. రాజ్యసభలో అమరావతి చట్టబద్ధతపై జరిగిన చర్చలో 11 పార్టీలు పాల్గొన్నాయి.
గురువారం సాయంత్రం రాష్ట్ర వ్యాప్తంగా సంబరాలు జరుపుకోవాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు పిలుపునిచ్చారు. ఇక 2015లో దేశంలోని వివిధ పుణ్యక్షేత్రాల నుంచి తెచ్చిన పవిత్ర జలాలు, మట్టిని ఉంచిన ఉద్దండరాయునిపాలెంలో పర్యటించి, రాజధాని సంకల్పంలో పాల్గొన్నారు.
కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి నిత్యానంద రాయ్ ఈ బిల్లును రాజ్యసభలో సభలో ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా ఏపీ రాజధాని విషయంలో ఉన్న చట్టపరమైన అస్పష్టతను తొలగించేందుకు ఈ సవరణ అత్యవసరమని పేర్కొన్నారు. బిల్లుపై జరిగిన చర్చ అనంతరం, సభాపతి సి.పి. రాధాకృష్ణన్ క్లాజ్ వారీగా ఓటింగ్‌ నిర్వహించగా సభ్యులు అనుకూలంగా ఓటు వేశారు. దీంతో అమరావతిని రాజధానిగా ఖరారు చేస్తూ కేంద్రం తీసుకున్న నిర్ణయానికి రాజ్యసభ ఆమోదం లభించింది.
. తాము అమరావతిని వ్యతిరేకించడం లేదనీ, అయితే రాజధాని పేరుతో సాగుతున్న పరిణామాలు, ఆర్థిక భారాలనే ప్రశ్నిస్తున్నామన్నారు. రైతుల నుంచి భూములు సేకరించి ఇన్నాళ్లు గడుస్తున్నా ఆశించిన స్థాయిలో అభివృద్ధి జరగలేదని ఆయన విమర్శించారు.
అమరావతికి చట్టబద్ధత అమరావతి రైతుల నైతిక విజయంగా అభివర్ణించారు. సుదీర్ఘకాలం పాటు మొక్కవోని దీక్షతో రైతులు చేసిన పోరాటం వల్లే ఇది సాధ్యమైందన్నారు. రాజధాని ఉద్యమ సమయంలో పాలకులు ప్రయోగించిన అణచివేత చర్యలను ఈ సందర్భంగా రేణుకా చౌదరి గుర్తు చేశారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.