బీఆర్ఎస్ రాజ‌కీయ క్రీడ‌లో పావు నాగార్జున?

Publish Date:Oct 6, 2024

Advertisement

తెలుగు రాష్ట్రాల్లో అక్కినేని కుటుంబం గురించి తెలియ‌నివారు ఉండ‌రు. టాలీవుడ్‌లో సీనియ‌ర్ ఎన్టీఆర్ గురించి ప్ర‌స్తావ‌న వ‌చ్చిన‌ప్పుడ‌ల్లా అక్కినేని నాగేశ్వ‌ర‌రావు గురించి కూడా ప్ర‌స్తావిస్తుంటారు. టాలీవుడ్‌కు, తెలుగు రాష్ట్రాల ప్ర‌జ‌ల‌కు వీరు ఎన్నో సేవ‌లు అందించారు.   అక్కినేని నాగేశ్వ‌ర‌రావు అంటే అన్నివ‌ర్గాల ప్ర‌జ‌ల్లో మంచి అభిప్రాయం ఉంది. ఆయ‌న వార‌స‌త్వాన్ని కొన‌సాగిస్తూ అక్కినేని నాగార్జున‌ సైతం అంతే స్థాయిలో పేరుతెచ్చుకున్నారు. టాలీవుడ్‌లో ప‌లు విధాలుగా ఎంతో మందికి ఉపాధి క‌ల్పించిన.. క‌ల్పిస్తున్న వ్య‌క్తిగా నాగార్జున‌కు మంచి పేరుంది. రాజ‌కీయాల జోలికి వెళ్ల‌కుండా అన్ని పార్టీల నేత‌ల‌తో నాగార్జున స‌త్సంబంధాల‌ను క‌లిగి ఉంటారు. రేవంత్ రెడ్డి సీఎంగా బాధ్య‌త‌లు చేప‌ట్టిన త‌రువాత ఆయ‌న్ను నాగార్జున ప్ర‌త్యేకంగా క‌లిసి అభినంద‌న‌లు  తెలిపారు. అయితే, ఇటీవ‌ల కాలంలో రేవంత్ స‌ర్కార్ తీసుకొచ్చిన హైడ్రాలో భాగంగా నాగార్జున‌కు చెందిన‌ ఎన్ క‌న్వెన్ష‌న్ కొంత‌భాగం చెరువు భూమిని ఆక్ర‌మించి నిర్మించార‌ని గుర్తించి అధికారులు కూల్చివేశారు. ఈ విష‌యంపై ఆయ‌న కోర్టుకు వెళ్లారు. ఆ స‌మ‌యంలో బీఆర్ఎస్ నాగార్జున‌కు మ‌ద్ద‌తు ప‌లికేందుకు ముందుకు రాలేదు. కేటీఆర్, నాగార్జున‌కు మంచి సంబంధాలు ఉన్న విష‌యం తెలిసిందే. ఒక‌వేళ నాగ్‌కు మ‌ద్ద‌తుగా మాట్లాడితే.. పేద‌, మ‌ధ్య త‌ర‌గ‌తి వ‌ర్గాల ప్ర‌జ‌ల నుంచి వ్య‌తిరేక‌త వ‌స్తుంద‌ని బీఆర్ఎస్ అధిష్టానం ఎన్ ఎన్వెన్ష‌న్ కూల్చివేత విష‌యంలో నోరు మెద‌ప‌లేదు.

 ఇటీవ‌ల మంత్రి కొండా సురేఖ చేసిన వ్యాఖ్య‌లు తెలంగాణ రాజ‌కీయాల్లో దుమారం రేపిన విష‌యం తెలిసిందే. ఓ ప్ర‌భుత్వ కార్యక్ర‌మంలో మంత్రి కొండా సురేఖ‌, బీజేపీ ఎంపీ ర‌ఘునంద‌న్ రావు పాల్గొన్నారు. అయితే, హ‌రీశ్ రావు, కేటీఆర్‌ డీపీతో ఉన్న బీఆర్ఎస్ మ‌ద్ద‌తుదారులు  సోష‌ల్ మీడియాలో సురేఖ‌, ర‌ఘునంద‌న్ రావుపై అస‌భ్య‌క‌ర పోస్టులు చేశారు. దీనిపై  హ‌రీశ్‌రావు స్పందించి తీవ్రంగా ఖండించారు. కేటీఆర్ మాత్రం స్పందించ‌లేదు. కొండా సురేఖ ఈ అంశంపై తీవ్ర ఆవేద‌న‌కు గుర‌య్యారు. ఈ క్ర‌మంలో ఆమె మాట్లాడుతూ.. కేటీఆర్ ఎందుకు స్పందించ‌లేదంటూ ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. అంతేకాదు, ఓ అడుగు ముందుకేసి స‌మంత‌, నాగ‌చైత‌న్య విడిపోవ‌టానికి కార‌ణం కేటీఆర్ అని, కేటీఆర్ కార‌ణంగా చాలామంది హీరోయిన్లు పెళ్లిళ్లు చేసుకుని కెరీర్ కు అర్ధంతరంగా ఫుల్ స్గాప్ పెట్టేశారనీ అన్నారు. డ్ర‌గ్స్ విష‌యంలోసైతం కేటీఆర్‌పై కొండా సురేఖ తీవ్ర వ్యాఖ్య‌లు చేశారు. స‌మంత, నాగ‌చైత‌న్య విష‌యాన్ని ప్ర‌స్తావించ‌డంతో హీరో నాగార్జున నాగచైత‌న్య‌, అమ‌ల‌తో పాటు చిరంజీవి, జూనియర్ ఎన్టీఆర్‌, నాని, వెంక‌టేశ్‌, మ‌హేశ్ బాబు, ప్ర‌భాస్ వంటి టాలీవుడ్ ప్ర‌ముఖులు కొండా సురేఖ వ్యాఖ్య‌ల‌ను త‌ప్పుబ‌ట్టారు. స‌మంత సైతం మంత్రి హోదాలో ఉండి ఇలాంటి వ్యాఖ్య‌లు చేయ‌డం సిగ్గుచేట‌ని అన్నారు. త‌మను మీ అవ‌స‌రాల‌కోసం రాజ‌కీయాల్లోకి లాగొద్ద‌ని  ఆవేద‌న వ్య‌క్తం చేశారు. సినీ ఇండ‌స్ట్రీతో పాటు బీఆర్ఎస్ నేత‌లు  కొండా సురేఖ వ్యాఖ్య‌ల‌పై తీవ్ర స్థాయిలో మండిప‌డ్డారు. దీంతో కాంగ్రెస్ పెద్ద‌లు అల‌ర్ట్ కావ‌టంతో ఆమె దిగొచ్చి.. త‌న వ్యాఖ్య‌లను వెన‌క్కు తీసుకున్నారు. స‌మంత‌కు క్ష‌మాప‌ణ‌లు చెప్పారు. కానీ, కేటీఆర్ ను మాత్రం వ‌దిలేది లేద‌ని హెచ్చ‌రించారు. అయితే,  స‌మంత‌, నాగ‌చైత‌న్య విష‌యంలో వివాదం స‌మ‌సిపోయింద‌ని అంద‌రూ భావించారు. 

హీరో నాగార్జున మాత్రం కొండా సురేఖ‌ను వ‌దిలేది లేద‌న్న‌ట్లుగా వ్య‌వ‌హ‌రిస్తున్నారు. తమ కుటుంబ గౌరవాన్ని, ప్రతిష్టను దెబ్బతీసేలా కొండా సురేఖ తీవ్ర వ్యాఖ్యలు చేశారంటూ నాంపల్లి కోర్టులో నాగార్జున పిటిషన్ దాఖలు చేశారు. అయితే న్యాయమూర్తి సెల‌వులో ఉండ‌టంతో నాంప‌ల్లి కోర్టు విచార‌ణ‌ను సోమ‌వారానికి వాయిదా వేసింది. దీనికి తోడు సురేఖ‌పై 100కోట్ల ప‌రువు న‌ష్టం దావా వేస్తాన‌ని నాగార్జున చెప్పారు. పరువు నష్టం దావాలు కోర్టుల్లో ఏళ్ల తరబడి కొనసాగుతాయన్న విషయం తెలుసని.. అయినా, ఆ పోరాటానికి సిద్ధంగా ఉన్నానని స్పష్టం చేశారు. తమకు సత్వర న్యాయం జరుగుతుందన్న నమ్మకం ఉందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ ఏడాది తనకు ఒకదాని వెనుక ఒకటిగా సమస్యలు వస్తున్నాయన్న నాగార్జున.. అయినా ఇబ్బంది లేదని, తానొక బలమైన వ్యక్తినని, కుటుంబాన్ని రక్షించుకునే విషయంలో సింహంలా ఉంటానని ధీమా వ్యక్తం చేశారు. తెలుగు చిత్ర పరిశ్రమ మొత్తం మద్దతుగా వచ్చిందని.. తన తండ్రికున్న గౌరవం, ఆయన ఆశీస్సులే కారణమని అభిప్రాయపడ్డారు. అయితే, కొండా సురేఖ విష‌యంలో నాగార్జున అతిగా వ్య‌వ‌హ‌రిస్తున్నార‌న్న‌ వాద‌న కాంగ్రెస్ వ‌ర్గాల నుంచి వినిపిస్తోంది. బీఆర్ఎస్ రాజ‌కీయ క్రీడ‌లో నాగార్జున పావుగా మారుతున్నారని, ఈ అంశంపై మంత్రి వెన‌క్కు త‌గ్గినా నాగార్జున అదే విష‌యాన్ని ప‌ట్టుకొని రాద్దాంతం చేయాల‌ని చూస్తున్నార‌ని కాంగ్రెస్ నేత‌లు ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తున్నారు. నాగార్జున తీరుపై టాలీవుడ్ లోని కొంద‌రు ప్ర‌ముఖుల‌ు సైతం విస్మయం వ్య‌క్తం చేస్తున్నారు. 

నాగార్జున‌కు కేటీఆర్‌, కేసీఆర్ ల‌తో మంచి సంబంధాలు ఉన్న విష‌యం అంద‌రికీ తెలిసిందే. వారి ప్రోద్భ‌లంతోనే నాగార్జున అతిగా ప్ర‌వ‌ర్తిస్తున్నార‌న్న చర్చ రాజ‌కీయ వ‌ర్గాల్లో జోరుగా సాగుతోంది. బీఆర్ఎస్  రాజ‌కీయ అవ‌స‌రాల‌కోసం టాలీవుడ్ హీరోల‌ను వాడుకోవ‌టం కొత్తేమీ కాద‌ని కాంగ్రెస్ నేత‌లు అంటున్నారు. ఇదే స‌మ‌యంలో నాగార్జునపై కేసు న‌మోదైంది. తుమ్మిడికుంట చెరువును కబ్జా చేశారని జనం కోసం అనే స్వచ్చంద సంస్థ అధ్యక్షుడు కసిరెడ్డి భాస్కర్ రెడ్డి పోలీసులకు ఫిర్యాదు చేశారు. హైటెక్ సిటీ ప్రాంతంలోని తమ్మిడికుంటను కబ్జా చేసి ఎన్-కన్వెన్షన్ నిర్మించి లాభాలు ఆర్జించారని వెంటనే క్రిమినల్ చర్యలు నమోదు చేయాలంటూ భాస్కర్ రెడ్డి ఫిర్యాదులో పేర్కొన్నారు. న్యాయసలహా తీసుకున్న పోలీసులు నాగార్జున‌పై కేసు నమోదు చేశారు. కొండా సురేఖ త‌న వ్యాఖ్య‌ల‌ను ఉపసంహరించుకుని క్ష‌మాప‌ణ‌లు చెపపినా, నాగార్జున మాత్రం కేటీఆర్ సూచ‌న‌ల‌తో ముందుకెళ్తూ అన‌వ‌స‌రంగా చిక్కుల్లోపడుతున్నారని కాంగ్రెస్ నేత‌లు అభిప్రాయ‌ప‌డుతున్నారు. బీఆర్ఎస్  ఆడుతున్న రాజ‌కీయ క్రీడ‌లో నాగార్జున పావుగా మారొద్ద‌ని వారు సూచిస్తున్నారు. కొండా సురేఖ తన వ్యాఖ్య‌ల‌ను వెన‌క్కు తీసుకున్నందున నాగార్జున ఇప్పటికైనా  ఈ విష‌యాన్ని ఇంత‌టితో వ‌దిలేయడం మంచిదని పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు. 

By
en-us Political News

  
పిఠాపురంలో ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలో చంద్ర‌బాబు ఫొటోలేద‌ని ఆరోపిస్తూ.. మాజీ ఎమ్మెల్యే వ‌ర్మ అధికారుల‌పై ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. ఈ క్ర‌మంలో జ‌న‌సేన నేత‌, మాజీ ఎమ్మెల్యే దొర‌బాబు జోక్యం చేసుకోవ‌డంతో వాగ్వాదం చోటు చేసుకుంది. వ‌ర్మ దురుసు వ్యాఖ్య‌ల‌పై పార్టీలో అంత‌ర్గ‌తంగా చ‌ర్చించిన అధిష్టానం.. వ‌ర్మ వ్య‌వ‌హారాన్ని త‌ప్పుబ‌ట్టింది. ఇంతలోనే వర్మను ఇంచార్జ్ పదవి నుంచి తొలగించడం చర్చనీయాంశంగా మారింది.
రాష్ట్రంలో కొత్త ప్రభుత్వ ఏర్పాటుకు డీఎంకే ఏ విధంగానూ అడ్డుపడబోదన్నారు. రాష్ట్రంలో మరోసారి ఎన్నికలు రావాలని గానీ, రాజ్యాంగ సంక్షోభం తలెత్తాలనీ కానీ తాము కోరుకోవడం లేదన్నఆయన.. ప్రజాతీర్పునకు అనుగుణంగానే డీఎంకే నడుచుకుంటున్నదన్నారు.
గతంలో విజయ్‌కు ఉన్న ప్రాణహాని హెచ్చరికలు.. ఆయన పాపులారిటీని దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం సాయుధ పోలీసులతో కూడిన భద్రతను ఏర్పాటు చేసింది. అయితే.. తాజాగా నిర్వహించిన భద్రతా సమీక్షలో భాగంగా ఆయనకు ఇకపై అదనపు సెక్యూరిటీ అవసరం లేదని అధికారులు భావించినట్లు తెలుస్తోంది.
తాజా ఎన్నికల ఫలితాల్లో నటుడు విజయ్ నేతృత్వంలోని తమిళగ వెట్రి కళగం (టీవీకే) 108 స్థానాలతో సింగిల్ లార్జెస్ట్ పార్టీగా అవతరించిన సంగతి తెలిసిందే. అయితే.. ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన 118 మంది ఎమ్మెల్యేల మద్దతు ఆ పార్టీకి ఇంకా లభించలేదు. కాంగ్రెస్‌తో కలిపి విజయ్ బలం ప్రస్తుతం 112కు చేరినప్పటికీ.. మేజిక్ ఫిగర్‌కు ఇంకా ఆరు అడుగుల దూరంలో ఉంది.
తమిళనాడు రాజకీయాల్లో పెను మార్పులు చోటుచేసుకుంటున్న వేళ
బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ అఖండ విజయం సాధించడంలో సువేందు కీ రోల్ పోషించారు. ఆ పార్టీ 206 స్థానాల్లో గెలిచి బెంగాల్‌లో తొలిసారిగా అధికారం చేపట్టబోతోంది. బీజేపీ తరఫున రెండు స్ధానాల నుంచి బరిలోకి దిగిన సువేందు అధికారి.. మరోసారి మమతా బెనర్జీని ఓడించారు. భవానిపూర్‌లో దీదీపై గెలిచిన ఆయన.. తన సొంత నియోజకవర్గమైన నందిగ్రామ్‌లోనూ గెలిచి పట్టు నిలుపుకున్నారు.
ముఖ్యంగా అస్సాం, పశ్చిమబెంగాల్ లో బీజేపీ ఎన్నికల సంఘం సహకారంతో ఫలితాలను చోరీ చేసిందన్నారు.
పశ్చిమబెంగాల్‌లో మూడున్నర దశాబ్దాల ఏళ్ల సీపీఎం పాలనకు బ్రేక్ వేసి 2011లో అధికార పగ్గాలు చేపట్టిన తృణముల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్టీ.. 2026 వరకు వరుస విజయాలతో ముఖ్యమంత్రిగా కొనసాగారు. ఆమె 15 ఏళ్ల ఆధిపత్యానికి ఎన్డీఏ తెర దించింది. మమతా సైతం కాంగ్రెస్‌లో కేంద్రమంత్రిగా, పలు కీలక పదవులు నిర్వహించి, తర్వాత సొంత కుంపటి పెట్టుకున్న నాయకురాలే కావడం గమనార్హం.
ప్రజా సమస్యలపై స్పష్టమైన అజెండాతో ఎన్నికల బరిలోకి దిగిన విజయ్‌ను తమిళ ప్రజలు ఆదరించడం శుభపరిణామమన్నారు.
తన పార్టీ స్థాపించిన నాటి నుండి నేటి వరకు ఆయన సాగించిన ప్రయాణం ఒక అద్భుతమైన రాజకీయ థ్రిల్లర్‌ను తలపిస్తుంది. ఎన్నికల ప్రచార సమయంలో విజయ్ అనేక ఆటంకాలను ఎదుర్కొన్నారు. ప్రత్యర్థి పార్టీల నుండి వచ్చిన తీవ్ర విమర్శలు, అధికార యంత్రాంగం విధించిన ఆంక్షలు ఆయనను ఉక్కిరిబిక్కిరి చేశాయి. వ్యక్తిగత జీవితంపై జరిగిన దుష్ప్రచారం విజయ్ ఇమేజ్‌ను దెబ్బతీస్తుందని అందరూ భావించారు.
తమిళనాడులో టీవీకే పార్టీ విజయాన్నిస్వాగతిస్తూ.. వైసీపీ సోషల్ మీడియా వేదికగా సంబరాలు మొదలు పెట్టింది. విజయ్ సాధించిన ఈ అద్భుత విజయం వెనుక వైసీపీ అధినేత జగన్ సహకారం ఉందంటూ వైసీపీ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున పోస్టులు వెల్లువెత్తుతున్నాయి. ముఖ్యంగా గతంలో ఒక వివాహ వేడుకలో వైఎస్ జగన్, విజయ్ ఇద్దరూ కలిసి దిగిన ఒక ఫోటోను ఇప్పుడు వైసీపీ నెట్టింట వైరల్ చేస్తోంది.
ఈ ఎన్నికల ఫలితాల్లో విజయ్ టవీకే పార్టీ స్పష్టమైన ఆధిక్యత కనబరిచింది. ప్రభుత్వ వ్యతిరేకతతో పాటు, కూటమి పక్షాల మధ్య సరైన సమన్వయం లేకపోవడం కూడా ఈ ఓటమికి ప్రధాన కారణాలుగా కనిపిస్తున్నాయి.
1982లో తెలుగువారి ఆత్మగౌరవం నినాదంతో తెలుగుదేశం పార్టీని స్థాపించిన ఎన్టీఆర్, కేవలం 9 నెలల కాలంలోనే రాష్ట్రమంతటా పర్యటించి ప్రభంజనం సృష్టించారు. 1983 ఎన్నికల్లో కాంగ్రెస్ వంటి బలమైన పార్టీని మట్టికరిపించి, తొలి ప్రయత్నంలోనే ముఖ్యమంత్రి పీఠాన్ని అధిష్టించి రికార్డ్ సృష్టించారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.