వైసీపీ పరిస్థితి రోజు రోజుకూ దిగజారుతోంది. ఆ పార్టీ అధికారం కోల్పోయిన తరువాత చాలా మంది నేతలు పార్టీకి దూరం జరగడమో, రాజీనామా చేసి బయటకు వెళ్లిపోవడమో చేశారు. ఇక వేరే మార్గం లేని పలువురు పార్టీలో ఉన్నా తామరాకు మీద నీటిబొట్టు మాదిరి పార్టీ వ్యవహారలలో ఇసుమంతైనా జోక్యం లేకుండా మౌనాన్ని ఆశ్రయించారు.
గతంలో జగన్ పై చిన్న పాటి విమర్శను కూడా సహించలేమంటూ ప్రత్యర్థులపై బూతుల వర్షం కురిపించిన నేతలు కూడా ఇప్పుడు నోటికి తాళం వేసుకున్నట్లుగా మౌనాన్ని ఆశ్రయించారు. గతంలోలా జగన్ తాడేపల్లి ప్యాలెస్ నుంచి స్క్రిప్ట్ పంపితే దానికి మీడియా ముందు చదివేయడానికి రెడీగా ఉన్న నాయకులు వైసీపీలో వేళ్ల మీద లెక్కించవచ్చు. అదే గతంలో అయితే ఇలాంటి వారి సంఖ్య లెక్కకు మించి ఉండేది.
సరే ప్రస్తుతానికి వస్తే రాజ్యసభలో జగన్ పార్టీ బలం రోజురోజుకూ పడిపోతోంది. ఉన్న 13 మందిలో నలుగురు ఇప్పటికే తమ రాజ్యసభ సభ్యత్వానికి, వైసీపీ ప్రాథమిక సభ్యత్వానికీ రాజీనామా చేసేశారు. గతంలోనే ముగ్గురు ఎంపీలు రాజీనామా చేయగా, ఇటీవలే ఆ పార్టీ కీలక నేత, జగన్ అక్రమాస్తుల కేసులో ఏ2 అయిన విజయసాయిరెడ్డి రాజీనామా చేసి పార్టీని వీడారు.
ఈ నేపథ్యంలోనే జగన్ గురువారం (ఫిబ్రవరి 6) మీడియాతో మాట్లాడుతూ పార్టీ వీడి వెళ్లిన వారికి క్యారెక్టర్ లేదంటూ విమర్శించారు. దీనిపై అనూహ్యంగా విజయసాయిరెడ్డి నుంచి స్ట్రాంగ్ రిటార్డ్ వచ్చింది. తనకు క్యారెక్టర్ ఉంది కనుకనే మీ పార్టీ ద్వారా వచ్చిన రాజ్యసభ సభ్యత్వానికి కూడా రాజీనామా చేశాను అని ట్వీట్ చేశారు. నా క్యారెక్టర్ సరే మీకు క్యారెక్టర్ ఉందా అని జగన్ ను నిలదీసినట్లుగా విజయసాయి ట్వీట్ ఉంది.
ఇక విజయసాయి ట్వీట్ చేసిన గంటల వ్యవధిలోనే వైసీపీకి, రాజ్యసభ సభ్యత్వానికీ రాజీనామా చేసిన మరో నాయకుడు మోపిదేవి వెంకటరమణ స్పందించారు. ఆయన కూడా తన క్యారెక్టర్ గురించి మాట్లాడే అర్హత జగన్ కు లేదని పేర్కొన్నారు. జగన్ తో పాటు ఆయన అక్రమాస్తుల కేసులో తాను కూడా జైలుకు వెళ్లి వచ్చానని పేర్కొన్న మోపిదేవి.. నిజంగా ఒత్తిళ్లకు లొంగిపోయే విడినైతే జగన్ అక్రమాస్తుల కేసులో ఇరుక్కునే వాడినే కాదు అంటూ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. ఈ ఇద్దరూ జగన్ కు స్ట్రాంగ్ కౌంటర్ ఇవ్వడాన్ని ప్రస్తావిస్తూ నెటిజనులు జగన్ క్యారెక్టర్ గురించి మాట్లాడటం అడిగి మరీ తిట్టించుకోవడానికే అన్నట్లుగా ఉందంటూ సెటైర్లు వేస్తున్నారు.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/mopidevi-venkataramana-stromg-counter-to-jagan-39-192516.html
జలయజ్ణం పేరుతో వైఎస్ చేసింది ధనయజ్ణమని విక్రమ్ పూల అన్నారు. ప్రాజెక్టుల అంచనా వ్యయం పెరగడం, ప్రాంతీయ సమతుల్యత లోపించడం, హెడ్ వర్క్స్ కంటే ముందుగా కాలువల తవ్వకం వంటి వాటికే వైఎస్ జలయజ్ణం పరిమితమైందని విక్రమ్ పూల వివరించారు.
కాంగ్రెస్ హైకమాండ్ మీనాక్షీ నటరాజన్ పై వేటు వేయాలని భావిస్తున్నట్లు చెబుతున్నారు. రాహుల్ గాంధీ నేతృత్వంలోని జాతీయ నాయకత్వం రాష్ట్రంలో కాంగ్రెస్ వ్వవహారాలను చక్కదిద్దేందుకు భూపేష్ బగెల్ సమర్ధంగా పని చేయగలరని భావించి ఆ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు చెబుతున్నారు.
తాను పూర్తిగా రాజకీయాల నుంచి తప్పుకుంటున్నాననీ, వచ్చే ఎన్నికలలో పోటీ చేయననీ ఆయన చేసిన ప్రకటన పొలిటికల్ సర్కిల్స్ లో హాట్ టాపిక్ గా మారింది. తెలుగుదేశం ఆవిర్భావం నుంచీ కూడా ప్రజా ప్రతినిథిగా, పొలిటికల్ లీడర్ గా సేవలందించిన అయ్యన్న పాత్రుడు హఠాత్తుగా రాజకీయాలకు రిటైర్మెంట్ అంటూ చేసిన ప్రకటన రాజకీయవర్గాలలో సంచలనం సృష్టించింది.
2019 ఎన్నికలలో వైసీపీ విజయంలో అప్పటి జగన్ పాదయాత్ర కీలక పాత్ర పోషించిన సంగతి తెలిసిందే. అయితే అప్పట్లో.. జగన్ వాగ్దానాలపై ప్రజలలో నమ్మకం ఉండేది. ప్రజలతో ఆయన మమేకమయ్యేవారు.
రాష్ట్ర విభజన తరువాత తెలంగాణలో తెలుగుదేశం పార్టీ అధికార రేసులో లేకపోయినప్పటికీ.. రాష్ట్ర రాజకీయాలను ప్రభావితం చేస్తూనే ఉంది. అందుకే రాష్ట్రంలో రాజకీయ వేడ రగిలిన ప్రతి సందర్భంలోనూ తెలుగుదేశం ప్రస్థావన వస్తూనే ఉంటుంది.
తెలంగాణ రాజకీయాల్లో గత కొన్ని రోజులుగా తీవ్ర దుమారం రేపుతున్న పరిణామాలు ఇప్పుడు అత్యంత ఆసక్తికర మలుపు తిరిగాయి.
తాజాగా ఆమె చేసిన వ్యాఖ్యలు ఆమె చూపు బీఆర్ఎస్ వైపు మళ్లిందా అన్న అనుమానాలకు తావిచ్చింది. కేబినెట్ నుంచి తనకు ఉద్వాసన పలికిన తరువాత మీడియాకు వరుస ఇంటర్వ్యూలు ఇస్తూ సంచలన వ్యాఖ్యలు చేస్తున్న కొండా సురేఖ.. తాజాగా బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావుపై ప్రశంసల వర్షం కురిపించారు.
పిడిక్కీ బియ్యానికీ ఒకే మంత్రం అన్నట్లుగా ఆమె తన బర్త్ రఫ్ కూ తెలుగుదేశం పార్టీకీ ముడి పెట్టారు. సీఎం రేవంత్ రెడ్డిది తెలుగుదేశం రక్తం కనుకనే తనకు కేబినెట్ నుంచి బర్త్ రఫ్ చేశారంటూ మీడియా సమావేశంలో కొండా సురేఖ చేసి కామెంట్స్ రాజకీయవర్గాలలో సంచలనంగా మారాయి.
ఈ ప్రాజెక్టుల నిర్మాణంలో తమ పాత్రే కీలకమని పేర్కొంటూ వైసీపీ క్రెడిట్ వార్ కు తెరతీసింది. సోషల్ మీడియా వేదికగా వైసీపీ వారు పోలవరం ప్రాజెక్టును దివంగత వైఎస్ రాజశేఖరరెడ్డి కలల ప్రాజెక్ట్గా అభివర్ణిస్తూ పోస్టులు షేర్ చేస్తోంది.
కోమటిరెడ్డి కుటుంబానికి నల్గొండ జిల్లాలో గట్టి పట్టు ఉంది. ఈ నేపథ్యంలో తాను కేవలం మంత్రి పదవిని మాత్రమే ఆశించే నాయకుడిని కాననీ.. వైఎస్ ఆశయాలను ముందుకు తీసుకువెళ్లే నాయకుడిననీ ఆయన అంటున్నారు.
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో అధికార కూటమి భాగస్వామ్య పక్షాలైన తెలుగుదేశం, జనసేన మధ్య సంబంధాలు పైకి కనిపించేంత సజావుగా లేవనే సంకేతాలు స్పష్టమవుతున్నాయి.
తెలంగాణ రాజకీయాల్లో ఒక్కసారిగా తీవ్ర కలకలం రేగింది
దివంగత సీఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డి వర్ధంతి సందర్భంగా బుధవారం (సెప్టెంబర్ 2) నిర్వహించిన ఒక ర్యక్రమంలో పాల్గొన్న కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి.. తాము ఏనాడు కూడా పదవుల కోసం సిద్ధాంతాలను తాకట్టు పెట్టలేదంటూ.. వైఎస్ రాజశేఖరరెడ్డి ఆశయాల బాటలో నడిచేందుకు రాజకీయాల్లోకి ప్రవేశించామన్నారు.