Publish Date:Aug 27, 2022
ఎవరయినా పాట వినగానే కాస్తంత మనసూ పారేసుకుంటారు. సినిమాపాట మరీ నచ్చిన పాట ఎక్కడి నుంచి వినపడుతున్నా ఓ క్షణం ఆగి ఓ ముక్క అలా విని మరీ కదులుతారు. అదీ సంగీతం మహిమ. సంగీతానికి దేశ,ప్రాంత, జాతీ భేదాలు ఉండవు. పాట పాటే, సంగీతం సంగీతమే. వినే మనసుండాలే గాని తెలుగు, హిందీ, పంజాబీ.. మరే భాషదయినా సరే వినసొంపుగా ఉంటే చాలు. కొన్ని పాటలు దేశ విదేశాల్లో వీరాభిమానులను ఎప్పటికీ ఆకట్టుకుంటాయి. అదుగో అలాంటి ఇటీవలి పాటే బంబిహా బోలే అనే పాట. పంజాబీ సింగర్ సిద్ధు మూస్వాలా అద్భుతంగా పాడినది. దీనికి పాకిస్తాన్ పంజాబీలు ఫిదా అయ్యారు.
అది వినకుండా నిద్రపోనంతగా ఆ పాట వీరాభిమానులను సంపాదించుకుంది. అన్నట్టు భారత సైని కులు భారత్,పాక్ సరిహద్దు దగ్గర సరదాగా పాడుకుంటూంటే, అటు వేపు పాకిస్తాన్ సైనికులూ సరదాగా డాన్స్ వేస్తూ వారి అభిమానాన్నీ చాటారు. అదీ మూజ్ పాట మహత్తు! దీనికి సంబంధించి ఓ ట్విటర్ ను ఐపిఎస్ అధికారి హెచ్జి ఎస్.ధాలివాల పోస్టు చేశారు. సిద్దు పాట సరిహద్దుకి రెండు వేపులా ఎంతో యిష్టంగా వింటూ డాన్స్ చేయడం గమనార్హం. అదో అద్భుతం. పాటకు, సంగీతానికి దేశ సరిహద్దులు తుడిపేసే శక్తి ఉందనడానికి ఇదో తాజా రుజువు!
శారీరకంగా రెండు దేశాల పౌరులుగా విడపోయినప్పటికీ పంజాబీలుగా సంగీతప్రియులుగా అంతా ఒక్కటే అని ఒక నెటిజన్ టాగ్పెట్టడం మరింత ఆకట్టుకుంది. నిజమే. ఒక్క పాట, ఒక్క గాయకుడు ఎంత దారు ణాన్నయినా, విబేదాలనయినా మర్చిపోయేలా చేస్తారు. ఈ పంజాబీ పాట 2020లో విడుదల అయింది. మూజ్తో పాటు అమృత్ మాన్ కూడా గొంతు కలిపారు. 207 మిలియన్ మంది చూసి తరించారట! కానీ దురదృష్టవశాత్తూ అంత అద్బుత సింగర్ మూజ్ మే 29న మానసా జిల్లా జవహార్కె గ్రామంలో హత్యకు గురయ్యాడు.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/moose-song-envoloped-indian-25-142770.html
అతి కొద్ది మంది నేతలు జగన్ ప్రకటనను సమర్దిస్తూ.. అనుకూల ప్రకటనలు చేస్తుండగా.. మెజారిటీ లీడర్, క్యాడర్ మాత్రం జగన్ నిర్ణయంపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.
తెలుగువన్ వాస్తవ వేదికలో ప్రస్తుత జాతీయ, ప్రాంతీయ రాజకీయ పరిస్థితులపై విస్తృత చర్చ జరిగింది.
తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ఆ రాష్ట్ర రాజకీయాల్లో పెను సంచలనాన్ని సృష్టించాయి.
టీవీకే అధినేత విజయ్తో భేటీ అనంతరం రాజ్ భవన్ ఒక అధికారిక ప్రెస్ నోట్ విడుదల చేసింది. అసెంబ్లీలో ప్రభుత్వం ఏర్పాటు చేయాలంటే ఉండాల్సిన సంఖ్యాబలంపై గవర్నర్.. విజయ్కు మార్గనిర్దేశం చేశారు. కేవలం అతిపెద్ద పార్టీగా ఉండటమే కాకుండా, సభలో తగినంత మంది ఎమ్మెల్యేల మద్దతు ఉన్నట్లు ఆధారాలు చూపాలని సూచించారు.
పిఠాపురంలో ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలో చంద్రబాబు ఫొటోలేదని ఆరోపిస్తూ.. మాజీ ఎమ్మెల్యే వర్మ అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ క్రమంలో జనసేన నేత, మాజీ ఎమ్మెల్యే దొరబాబు జోక్యం చేసుకోవడంతో వాగ్వాదం చోటు చేసుకుంది. వర్మ దురుసు వ్యాఖ్యలపై పార్టీలో అంతర్గతంగా చర్చించిన అధిష్టానం.. వర్మ వ్యవహారాన్ని తప్పుబట్టింది. ఇంతలోనే వర్మను ఇంచార్జ్ పదవి నుంచి తొలగించడం చర్చనీయాంశంగా మారింది.
రాష్ట్రంలో కొత్త ప్రభుత్వ ఏర్పాటుకు డీఎంకే ఏ విధంగానూ అడ్డుపడబోదన్నారు. రాష్ట్రంలో మరోసారి ఎన్నికలు రావాలని గానీ, రాజ్యాంగ సంక్షోభం తలెత్తాలనీ కానీ తాము కోరుకోవడం లేదన్నఆయన.. ప్రజాతీర్పునకు అనుగుణంగానే డీఎంకే నడుచుకుంటున్నదన్నారు.
గతంలో విజయ్కు ఉన్న ప్రాణహాని హెచ్చరికలు.. ఆయన పాపులారిటీని దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం సాయుధ పోలీసులతో కూడిన భద్రతను ఏర్పాటు చేసింది. అయితే.. తాజాగా నిర్వహించిన భద్రతా సమీక్షలో భాగంగా ఆయనకు ఇకపై అదనపు సెక్యూరిటీ అవసరం లేదని అధికారులు భావించినట్లు తెలుస్తోంది.
తాజా ఎన్నికల ఫలితాల్లో నటుడు విజయ్ నేతృత్వంలోని తమిళగ వెట్రి కళగం (టీవీకే) 108 స్థానాలతో సింగిల్ లార్జెస్ట్ పార్టీగా అవతరించిన సంగతి తెలిసిందే. అయితే.. ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన 118 మంది ఎమ్మెల్యేల మద్దతు ఆ పార్టీకి ఇంకా లభించలేదు. కాంగ్రెస్తో కలిపి విజయ్ బలం ప్రస్తుతం 112కు చేరినప్పటికీ.. మేజిక్ ఫిగర్కు ఇంకా ఆరు అడుగుల దూరంలో ఉంది.
తమిళనాడు రాజకీయాల్లో పెను మార్పులు చోటుచేసుకుంటున్న వేళ
బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ అఖండ విజయం సాధించడంలో సువేందు కీ రోల్ పోషించారు. ఆ పార్టీ 206 స్థానాల్లో గెలిచి బెంగాల్లో తొలిసారిగా అధికారం చేపట్టబోతోంది. బీజేపీ తరఫున రెండు స్ధానాల నుంచి బరిలోకి దిగిన సువేందు అధికారి.. మరోసారి మమతా బెనర్జీని ఓడించారు. భవానిపూర్లో దీదీపై గెలిచిన ఆయన.. తన సొంత నియోజకవర్గమైన నందిగ్రామ్లోనూ గెలిచి పట్టు నిలుపుకున్నారు.
ముఖ్యంగా అస్సాం, పశ్చిమబెంగాల్ లో బీజేపీ ఎన్నికల సంఘం సహకారంతో ఫలితాలను చోరీ చేసిందన్నారు.
పశ్చిమబెంగాల్లో మూడున్నర దశాబ్దాల ఏళ్ల సీపీఎం పాలనకు బ్రేక్ వేసి 2011లో అధికార పగ్గాలు చేపట్టిన తృణముల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్టీ.. 2026 వరకు వరుస విజయాలతో ముఖ్యమంత్రిగా కొనసాగారు. ఆమె 15 ఏళ్ల ఆధిపత్యానికి ఎన్డీఏ తెర దించింది. మమతా సైతం కాంగ్రెస్లో కేంద్రమంత్రిగా, పలు కీలక పదవులు నిర్వహించి, తర్వాత సొంత కుంపటి పెట్టుకున్న నాయకురాలే కావడం గమనార్హం.
ప్రజా సమస్యలపై స్పష్టమైన అజెండాతో ఎన్నికల బరిలోకి దిగిన విజయ్ను తమిళ ప్రజలు ఆదరించడం శుభపరిణామమన్నారు.