ఆంధ్రప్రదేశ్ మద్యం కుంభకోణం కేసులో ఇంత వరకూ 11 మందిని అరెస్టు చేశారు. ఇండోర్ లో సోమవారం (జూన్ 30) చెవిరెడ్డి భాస్కరరెడ్డి ఇద్దరు పీఏలను అరెస్టు చేసి విజయవాడకు తరలించడంతో అరెస్టుల సంఖ్య పదకొండుకు చేరింది. అతి త్వరలో ఈ సంఖ్య 12కు చేరుతుందని పరిశీలకులు అంటున్నారు. ఈ 12వ వ్యక్తి చెవిరెడ్డి మోహిత్ రెడ్డేనని విశ్లేషిస్తున్నారు.
ఏపీ మద్యం కుంభకోణం కేసులో చెవిరెడ్డి మోహిత్ రెడ్డి ఏ39గా ఉన్నారు. ఆయన ఇప్పటికే ఈ కేసులో ముందస్తు బెయిలు కోసం ట్రయల్ కోర్టు, ఏపీ హైకోర్టులలో పిటిషన్లు ద ాఖలు చేశారు. అయితే ఈ రెండు కోర్టులలోనూ కూడా ఆయనకు ఎదురుదెబ్బే తగిలింది. ఇటు ట్రయల్ కోర్టు, అటు హైకోర్టూ కూడా ఆయన యాంటిసిపేటరీ బెయిల్ పిటిషన్లను కొట్టివేశాయి.
దీంతో చెవిరెడ్డి మోహిత్ రెడ్డి అరెస్టు అనివార్యమని పరిశీలకులే కాదు, న్యాయనిపుణులు కూడా అంటున్నారు. ఇలా ఉండగా లిక్కర్ కుంభకోణం కేసులో విచారణకు హాజరు కావాలంటూ సిట్ మోహిత్ రెడ్డికి సోమవారం (జూన్ 30) నోటీసులు జారీ చేసింది. గతంలో కూడా పలుమార్లు నోటీసులు జారీ చేసినప్పటికీ మోహిత్ రెడ్డి సిట్ విచారణకు హాజరు కాకుండా గైర్హాజరయ్యారు. తాజాగా యాంటిసిపేటరీ బెయిలు పిటిషన్లను కోర్టు కొట్టివేసిన నేపథ్యంలో ఇక ఆయన విచారణకు హాజరుకాకతప్పని పరిస్థితి ఏర్పడింది. ఆయన విచారణకు వస్తే విచారణ తరువాత అరెస్టు అవుతారు. లేకున్నా అరెస్టు చేస్తారు అని అంటున్నారు. తన తండ్రి చెవిరెడ్డి భాస్కరరెడ్డి అరెస్టైన నాటి నుంచీ కూడా మోహిత్ రెడ్డి అజ్ణాతంలోనే ఉన్నారు.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/mohitreddy-son-of-chevireddy-bhaskarreddy-arrest-inevitable-39-200979.html
తెలంగాణ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్కు సవాల్ విసిరారు
ప్రజాసమస్యలపై అధికారులతో చర్చిస్తారు. క్షేత్ర స్థాయిలో పరిశీలన కూడా చేస్తారు.
ఆయన సొంత నియోజకవర్గమైన పిఠాపురంలో శుక్రవారం జరగనున్న సంక్రాంతి సంబరాల్లో పవన్ కల్యాణ్ స్థానికులతో కలిసి పాల్గొంటారు.
ఈ భేటీలో చంద్రబాబు అమరావతి చట్టబద్దత, పోలవరం, బడ్జెట్ కేటాయింపులు, ఉపాధి హామీ పథకంలో వెసలుబాటు వంటి పలు అంశాలను ప్రస్తావించారు. వాటితో బాటుగా కేంద్ర మంత్రి వర్గ విస్తరణలో టీడీపీకి ఒక బెర్తు సైతం డిమాండ్ చేశారు.
తెలుగువన్ ఎండి రవిశంకర్, జమీన్ రైతు సంపాదకుడు డోలేంద్ర ప్రసాద్ లు తాజాగా వ్యవస్థల పతనం, అందుకు కారణాలపై తమ ఆవేదనను సూటిగా ఎలాంటి శషబిషలూ లేకుండా వ్యక్త పరిచారు.
మోకిల నుంచి హైదరాబాద్ వైపు వెళ్తున్న ఓ కారు మీర్జాగూడ వద్ద అదుపు తప్పి తొలుత డివైడర్ ను ఆ తరువాత చెట్టును ఢీ కొనడంతో ఈ ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో మృతులు, క్షతగాత్రులు అందరూ విద్యార్థులే.
ఇటీవల అనారోగ్యంతో మరణించిన టీడీపీ నేత అప్పలనాయుడు కుటుంబాన్ని మంత్రి లోకేష్ పరామర్శించారు.
ఐదేళ్ల పాటు ఢిల్లీలో చక్రం తిప్పారు. కవిత ఎడ్యుకేటెడ్ కావడం, హిందీ కూడా బాగానే మాట్లాడగలగడంతో జాతీయ స్థాయి ప్రతినిథిగా ఉండేవారు. అయితే కవిత రెండో సారి ఎంపీగా గెలవలేక పోయారు
ఖమ్మంలో బీఆర్ఎస్కు భారీ షాక్ తగిలింది.
పైరసీ, కాపీ రైట్ ఉల్లంఘనలు, అక్రమ ప్రసారాలు, ఆర్థిక లావాదేవీలకు సంబంధించి పలు అంశాలు విచారణలో వెలుగు చూసిన నేపథ్యంలో ఐబోమ్మ రవికి బెయిలు మంజూరు చేయవద్దంటూ పోలీసులు కోర్టుకు తెలిపారు.
ఈ విమానాశ్రయం కోసం పార్లమెంటులో తాను పలుమార్లు గట్టిగా గళమెత్తానని చెప్పుకున్నారు. ఇప్పుడూ విమానాశ్రయం దాదాపుగా పూర్తై.. త్వరలో ఆపరేషన్స్ ప్రారంభం కావడానికి రెడీ అవుతుండటం తనకు చాలా సంతోషంగా ఉందన్నారు. అంతే తప్ప ఈ విమానాశ్రయం విషయంలో జరుగుతున్న రాజకీయ రచ్చ గురించి ఒక్కటంటే ఒక్క మాట మాట్లాడలేదు. అలాగే ఈ విమానాశ్రయానికి రెండో సారి శంకుస్థాపన చేసిన జగన్ ఊసెత్తలేదు.
తెలంగాణలో మరో కొత్త పార్టీ రాబోతోంది.
ఇబ్రహీంపట్నం కాంగ్రెస్ ఎమ్మెల్యే మల్ రెడ్డి రంగారెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
ఎలాగైనా అధికారాన్ని నిలబెట్టుకోవాలని అధికార డీఎంకే, బీజేపీతో పొత్తు ఉపయోగించుకుని రాష్ట్రంలో అధికారపగ్గాలు చేజిక్కించుకోవాలని ప్రతిపక్ష అన్నాడీఎంకే వ్యూహాలు రచిస్తున్నాయి. ఇక రాజకీయ పార్టీ స్థాపించి సినీ రంగం నుంచి రాజకీయరంగంలోకి దూకిన హీరో విజయ్ తన టివీకే పార్టీ తరఫున ఒంటరిగా ఎన్నికల రణరంగంలోకి దిగనున్నారు.