వాట్సాప్ గవర్నెన్స్ వినియోగంపై ప్రజల్లో అవగాహన కల్పించండి : మంత్రి లోకేష్

Publish Date:Jun 26, 2026

Advertisement

 

రాష్ట్రంలో మనమిత్ర వాట్సాప్ గవర్నెన్స్ వినియోగంపై ప్రజల్లో మరింత‌గా అవగాహన కల్పించేందుకు అధికారులు చర్యలు చేపట్టాలని విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్, ఆర్జీజీ శాఖల మంత్రి నారా లోకేష్ ఆదేశించారు. శుక్రవారం స‌చివాల‌యంలోని ఆర్టీజీఎస్ క‌మాండ్ కంట్రోల్ సెంటర్ లో ఆర్టీజీఎస్‌పై మంత్రి స‌మీక్ష నిర్వ‌హించారు. ఈ సందర్భంగా ఆర్టీజీఎస్ ల‌క్ష్యాలు, ప్రాజెక్టుల ప్ర‌గ‌తిపై ఆ శాఖ కార్య‌ద‌ర్శి కాటంనేని భాస్క‌ర్ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివ‌రించారు. ప్రభుత్వ శాఖల సమాచారాన్ని క్రోడీకరించేందుకు చేపట్టిన డేటాలేక్ ప‌నుల‌న్నీ జులై నాటికి పూర్తికావాలని మంత్రి ఆదేశించారు. 

కుల, ఆదాయ ధృవీకరణ పత్రాల మంజూరులో అడ్డంకులు తొలగించాలి. రేషన్ కార్డుల విభజన, కుటుంబ సభ్యుల పేర్లు చేర్చడం, తొలగించే ప్రక్రియను మరింత సులభతరం చేయాలి. సంజీవని కార్యక్రమాన్ని కూడా డేటా లేక్ తో అనుసంధానించాలి. పాఠశాలల్లో  డ్రాప్ అవుట్ల‌ను డేటా లేక్ ద్వారా విశ్లేషించి, త‌గ్గించ‌డానికి గ‌ల‌ మార్గాలను అన్వేషించాలి. విద్యారంగంలో సమగ్ర సమాచారాన్ని ట్రాక్ చేస్తున్నాం. అన్ని శాఖల సమాచారం డేటా లేక్ ద్వారా అనుసంధానం కావాలని మంత్రి సూచించారు. 

మనమిత్ర ప్ర‌జ‌ల‌కు మ‌రింత చేరువ కావాలి

ప్రజల్లో మనమిత్ర వాట్సాప్ గవర్నెన్స్ వినియోగంపై మరింతగా అవగాహన కలిగేలా నెలరోజుల పాటు కార్యక్రమాలు నిర్వ‌హించాల‌న్నారు. మ‌న‌మిత్ర వాట్సాప్ గ‌వ‌ర్నెన్స్ ప్ర‌జ‌ల‌కు క‌లిగే ఉప‌యోగం, వినియోగం, సుల‌భంగా ప్ర‌భుత్వ సేవ‌లు ఎలా పొంద‌వచ్చో ప్ర‌జ‌లకు వివరించాలన్నారు. 

స‌ర్టిఫికెట్ల వెర్ఫికేష‌న్‌కు ఆధార్‌

విద్యార్థులు, అభ్య‌ర్థులకు విద్యా-క్రీడా సంస్థ‌లు ఇచ్చే స‌ర్టిఫికెట్లు, స్పోర్ట్స్ స‌ర్టిఫికెట్ల‌న్నీ అభ్య‌ర్థి ఆధార్ నెంబర్ ఆధారంగా పార‌ద‌ర్శ‌కంగా ప‌రిశీలించేలా చ‌ర్య‌లు తీసుకోవాలని సూచించారు. అభ్య‌ర్థి ఆధార్ నంబ‌ర్ కొడితే ఆ విద్యార్థి లేదా అభ్య‌ర్థికి ఆ సర్టిఫికెట్లు ఏ సంస్థ‌, ఎప్పుడు, ఎవరు జారీ చేశార‌నే వివ‌రాలు కూడా రియ‌ల్ టైమ్‌లో తెలిసేలా డీజీ వెరిఫైని ప‌క‌డ్బందీగా తీర్చిదిద్దాల‌ని ఆదేశించారు. దీనివ‌ల్ల 99 శాతం అధికారుల ప‌ని కూడా సుల‌భ‌త‌రం అవుతుందన్నారు. రాబోయే రోజుల్లో  ఇచ్చే వేలాది పోస్టుల నోటిఫికేష‌న్ల‌కు, ల‌క్షల సంఖ్య‌లో అభ్య‌ర్థులు ద‌ర‌ఖాస్తు చేసుకుంటార‌ని, వీరంద‌రి స‌ర్టిఫికెట్లు పొందుప‌ర‌చ‌డంలో ఇబ్బందులు లేకుండా డీజీ వెరిఫైని స‌మర్థ‌వంతంగా వినియోగించుకునేలా చ‌ర్య‌లు చేప‌ట్టాలని ఆదేశించారు.

వ‌ర్షాభావ ప‌రిస్థితుల‌ను స‌మర్థంగా ఎదుర్కొందాం

రాష్ట్రంపై ఎల్‌నినో ప్రభావంపైనా మంత్రి నారా లోకేష్ సమీక్షించారు. ఎల్‌నినో ప్ర‌భావంతో ఎదుర‌య్యే వ‌ర్షాభావ ప‌రిస్థితుల‌ను జ‌ల‌వ‌నరుల శాఖ‌, వ్య‌వ‌సాయ శాఖ‌, ఇత‌ర శాఖ‌ల‌న్నీ కూడా స‌మ‌న్వ‌యంతో, ప్ర‌ణాళికాబ‌ద్ధంగా ప‌నిచేసి స‌మ‌ర్థ‌వంతంగా ఎదుర్కొందామ‌న్నారు. నీరు వృథాను అరిక‌ట్టి, త‌క్కువ నీటితో ఎక్కువ పంట‌లు  పండించే దిశ‌గా రైతులను ప్రోత్స‌హించాల‌ని సూచించారు. జ‌లాశ‌యాల్లో నీటి ల‌భ్య‌త ఎంత ఉంది, భూగ‌ర్భజ‌ల మ‌ట్టాలు ఏ స్థాయిలో ఉన్నాయ‌నేది ఆర్టీజీఎస్‌లోని అవేర్ విభాగం ద్వారా రియ‌ల్ టైమ్‌లో ఎప్ప‌టిక‌ప్పుడు తెలుసుకుని ఆ దిశ‌గా అధికారులు కార్యాచ‌ర‌ణ చేప‌ట్టాలి. రాయ‌లసీమ‌లో నీటి ఎద్ద‌డి లేకుండా ప‌టిష్ట‌మైన చ‌ర్య‌లు తీసుకోవాలి. యూరియా సరఫరాపైనా మంత్రి ఆరా తీశారు. 

 విద్యుత్ డిమాండ్ పైనా దృష్టి కేంద్రీకరించాలి 

వ‌ర్షాభావ ప‌రిస్థితుల నేప‌థ్యంలో జ‌ల విద్యుత్ ఉత్ప‌త్తి త‌గ్గడంతో ఎదుర‌య్యే స‌మ‌స్య‌లు అధిగ‌మించేందుకు ప్రణాళికాబ‌ద్ధంగా ప‌నిచేయాల‌ని మంత్రి సూచించారు. జ‌లాశ‌యాల్లో నీటి మ‌ట్టాలు, పెరుగుతున్న విద్యుత్తు వినియోగం, భూగ‌ర్భ జ‌లాలు వీటన్నిటినీ క్రోడీక‌రించి ఆర్టీజీఎస్‌లోని అవేర్ విభాగం విశ్లేషించి అధికారుల‌కు ఎప్ప‌టిక‌ప్పుడు స‌మాచారం అందజేయాలి. విద్యుత్తు స‌ర‌ఫ‌రాకు ఎక్క‌డా ఎలాంటి అంతరాయం లేకుండా ప‌టిష్ట‌ చ‌ర్య‌లు తీసుకోవాలని మంత్రి ఆదేశించారు.

ఈ స‌మీక్ష స‌మావేశంలో సీసీఎల్ఏ ప్ర‌త్యేక ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి జ‌య‌ల‌క్ష్మి, ఆర్టీజీఎస్ సీఈవో ప్ర‌ఖ‌ర్ జైన్‌,  సంయుక్త కార్య‌ద‌ర్శి మాలిక గార్గ్‌, ఆర్టీఐహెచ్ సీఈవో ధాత్రి రెడ్డి, ఫైబ‌ర్‌నెట్ ఎండీ గీతాంజ‌లి శ‌ర్మ‌, సివిల్ స‌ప్లైస్ క‌మిష‌న‌ర్ క‌న్న‌బాబు, ఉన్న‌త విద్యాశాఖ క‌మిష‌న‌ర్ నారాయణ భ‌ర‌త్ గుప్త‌, పాఠ‌శాల విద్యా శాఖ డైరెక్ట‌ర్ త‌మీమ్ అన్సారియా, వ్య‌వ‌సాయ శాఖ డైరెక్ట‌ర్ మన్జీర్ జిలానీ పాల్గొన్నారు.

By
en-us Political News

  
దశాబ్దాలుగా దక్షిణ భారతదేశంలో, ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల మధ్య మరియు పొరుగున ఉన్న కర్ణాకటతో నదీ జలాల పంపకాల వ్యవహారం
అంతర్జాతీయ వేదికపై సత్తాచాటిన కడప బిడ్డ...
హైదరాబాద్‌లోని సనత్‌ నగర్‌లో ఉన్న కల్ట్ ఫిట్ జిమ్‌లో మహిళలకు లైంగిక వేధింపులు జరిగిన ఘటన తీవ్ర సంచలనం రేపింది.
రాష్ట్రంలో సీఎం చంద్రబాబు నాయుడు ప్రజా ప్రభుత్వం టీచర్లను లీడర్లు భావిస్తోంది, కష్టపడి మంచి ఫలితాలు సాధించే ఉపాధ్యాయులకు ప్రత్యేక గుర్తింపు
సంచలన కేసుగా మారిన పుణే కేతన్ అగర్వాల్ హత్య కేసులో మహారాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.
దేశవ్యాప్తంగా వేలాది మంది పెట్టుబడిదారులను భారీ రాబడుల పేరుతో ఆకర్షించి మోసానికి పాల్పడిన హీరా గ్రూప్ ఆఫ్ కంపెనీస్ కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది.
సోషల్ మీడియా వేదికగా కిలోల కొద్దీ బంగారు ఆభరణాలు ధరిస్తూ, హల్ చల్ చేసిన హైదరాబాద్‌ గోల్డ్ మ్యాన్ సూర్య భాయ్ అసలు రంగు ఎట్టకేలకు బయటపడింది.
తెలంగాణ ప్రభుత్వం కీలక ఐఏఎస్ అధికారుల బదిలీలు, నియామకాలకు సంబంధించిన ఉత్తర్వులు జారీ చేసింది.
విజయవాడ నగరంలో సంచలనం సృష్టించిన గాదె సాయికృష్ణ లాకప్ డెత్ కేసు దర్యాప్తు రోజుకో మలుపు
తెలంగాణ నూతన ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా (చీఫ్ సెక్రటరీ) సీనియర్ ఐఏఎస్ అధికారి సంజయ్ జాజు నియమితులయ్యారు.
అయోధ్య శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్‌లో అత్యంత నాటకీయ పరిణామాలు చోటుచేసుకున్నాయి.
మహారాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన పుణే పారిశ్రామికవేత్త కేతన్ విశాల్ అగర్వాల్ మరణం కేసు రోజుకో మలుపు తిరుగుతోంది.
మహీంద్రా యూనివర్సిటీలో బీబీఏ కోర్సు చదివిన భగీరథ్ నాలుగు సబ్జెక్టుల్లో ఫెయిల్ కావడంతో.. వాటికి సంబంధించిన స్పెషల్ సప్లిమెంటరీ పరీక్షలను యూనివర్సిటీ ఇటీవల నిర్వహించింది. గత మే నెలలో జరిగిన సాధారణ సప్లిమెంటరీ పరీక్షల సమయంలో ఆయన పోక్సో కేసులో జైలులో ఉండటం తో పరీక్షలు రాయలేకపో యాడు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.