యథా భర్త.. తథా భార్య ఏపీపై మంత్రి హరీష్ సతీమణి అవమానకర వ్యాఖ్యలు!

Publish Date:Nov 28, 2023

Advertisement

అదేంటో ఏపీ ప్రస్తావన లేకుండా తెలంగాణ ఎన్నికలు పూర్తి కావడం లేదు. గతంలో జరిగిన రెండు అసెంబ్లీ ఎన్నికలలో కూడా ఏపీ ప్రస్తావన వచ్చినా.. అప్పుడు మరో రకంగా ప్రభావం కనిపించేది. ఆంధ్రా పాలకుల పేరిట తెలంగాణ పార్టీలు సెంటిమెంట్ రగిలించే ప్రయత్నం చేసేవారు. కానీ, ఈసారి రాష్ట్రంలో అసమర్దులకు పట్టం కడితే ఎలా ఉంటుందో  చెప్పడానికి తెలంగాణ పాలకులు ఏపీని ఉదాహరణగా చూపిస్తున్నారు. ఏపీలో వైసీపీ ప్రభుత్వం ఏర్పాటయ్యాక ఒకటీ రెండుసార్లు బీఆర్ఎస్ నేతలు ఇలాంటి వ్యాఖ్యలే చేయగా.. ఎన్నికల సమయం వచ్చాక  ఇటువంటి మాటలు తరచుగా వినిపిస్తున్నాయి. ఏపీలో రోడ్ల పరిస్థితిని వివరిస్తూ సీఎం కేసీఆర్ డబుల్ రోడ్డు ఉంటే తెలంగాణ.. సింగిల్ రోడ్డయితే ఆంధ్రా, ఏపీ రోడ్లెక్కితే మంచాన పడుడే, తెలంగాణలో ఎకరం అమ్మితే ఇప్పుడు ఆంధ్రాలో యాభై ఎకరాలు కొనొచ్చనే వ్యాఖ్యలు చేశారు. అలాగే వెలుగులు ఉంటే తెలంగాణ.. అంధకారం కనిపిస్తే ఆంధ్ర అని కూడా ఏపీలో విద్యుత్ కోతలను ఎగతాళి చేశారు.  పాలన చేతకాదన్న వాళ్ళే ఇప్పుడు దివాళా తీశారని.. తెలంగాణ విడిపోతే చీకటైతది అంటే ఇప్పుడు ఏపీనే అంధకారమైందని, ఆంధ్రా వాళ్లే ఇప్పుడు తెలంగాణ వచ్చి ధాన్యం అమ్ముకుంటున్నారని కేసీఆర్ పలుమార్లు సెటైర్లు వేశారు. 

ఇక మంత్రి కేటీఆర్ అయితే.. ఆంధ్రా వాళ్ళు పరిశ్రమలను పొమ్మంటే మేము వారిని ఆహ్వానించామని, పండగకో, శుభకార్యానికో ఏపీకి వెళ్లినా ఉండలేని పరిస్థితి ఉందని మాట్లాడారు. మరో మంత్రి హరీష్ రావు అయితే ఏపీలో పనితనం లేదు కానీ పగతనం ఉందని మనకి అలాంటి పరిస్థితులు తెచ్చుకోవద్దని ప్రజలను కోరారు. కాగా, భర్తకు తగ్గ భార్యగా మంత్రి హరీష్ రావు సతీమణి కూడా ఇప్పుడు ఏపీపై సెటైర్లు వేస్తూ ప్రచారం సాగిస్తున్నారు. కనీసం రాజధాని కూడా లేని రాష్ట్రం అంటూ ఏపీ ప్రజలపై సానుభూతి చూపిస్తూనే జగన్ మోహన్ రెడ్డి పాలనపై సెటైర్లు వేశారు. ఏపీలో పరిస్థితిని పోలుస్తూ తెలంగాణలో అభివృద్ధిని వివరించే ప్రయత్నం చేశారు. తెలంగాణలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఎంత గొప్పగా పాలించిందో చెప్పేందుకు ఏపీలో వైసీపీ పాలనను వేలెత్తి చూపించారు.  కేసీఆర్ పాలనలో తెలంగాణ దేశంలోనే నంబర్ వన్ అనే స్థాయికి ఎదిగితే , జగన్ మోహన్ రెడ్డి పాలనతో ఏపీలో పరిస్థితి దిగాజారిపోయిందని హరీష్ సతీమణి శ్రీనిత వ్యాఖ్యానించారు. 

తెలంగాణలో ఎన్నికల ప్రచారం మంగళవారం(నవంబర్ 28)తో  ముగిసింది. ఈ క్రమంలోనే అన్ని పార్టీల అభ్యర్థులు ప్రచారాన్ని హోరెత్తిస్తున్నారు. ఒక్కో అభ్యర్థి తరపున ఇంటిల్లిపాది అందరూ ప్రజల మధ్యకి వచ్చి ఇంటింటికి తిరుగుతూ సందడి చేస్తున్నారు. ఈ క్రమంలోనే మంత్రి హరీష్ రావు సతీమణి శ్రీనిత కూడా భర్త తరపున ప్రచారం నిర్వహించారు. సిద్ధిపేటలో ఎన్నికల ప్రచారం నిర్వహించిన శ్రీనిత.. ఏపీకి కనీసం రాజధాని కూడా లేదని.. రాజధాని లేని రాష్ట్రంగా ఏపీ మిగిలిందని.. వాళ్లకు కావాల్సినన్ని వనరులు ఉన్నా అక్కడ అభివృద్ది జరగలేదని పేర్కొన్నారు. ఏపీలో ఉత్పత్తి అవుతున్న పంటను.. తెలంగాణలో ఉత్పత్తి అవుతున్న పంటను  బేరీజు వేసుకొని చూడాలని ప్రజలను కోరారు. అన్నీ ఉన్నా అక్కడ అభివృద్ధి లేదంటే.. మనం గొప్పనా? వాళ్లు గొప్పనా? మీరే నిర్ణయించుకోవాలన్నారు. కేసీఆర్ పాలనలో తెలంగాణ అద్భుత ప్రగతి సాధించిందనే దానికి ఏపీలో పరిస్థితులే నిదర్శనమనేలా ఆమె మాట్లాడారు.

దీంతో సహజంగానే మరోసారి రెండు రాష్ట్రాల రాజకీయ వర్గాలలో ఈ వ్యాఖ్యలపై చర్చ మొదలైంది. ముఖ్యంగా ఏపీలో శ్రీనిత వ్యాఖ్యలు హాట్ టాపిక్ అయ్యాయి. ఏపీపై ఈ తరహా వ్యాఖ్యలు వైసీపీ ప్రభుత్వం వైఫల్యమే అనడంలో ఎలాంటి సందేహం లేదు. కాగా, బీఆర్ఎస్ నేతలు ఎంతగా ఇలాంటి వ్యాఖ్యలు చేసినా   వైసీపీ నేతలలో చలనం ఉండడం లేదు. దాన్నే అలుసుగా తీసుకుని జగన్ వైఫల్యాన్ని బీఆర్ఎస్ నేతలు తమ ప్రచారానికి వాడుకుంటున్నారు. ఏపీలో ప్రతిపక్ష పార్టీల నేతలు ఒక్క మాట మాట్లాడినా కట్టకట్టుకుని ఎదురుదాడికి దిగే వైసీపీ నేతలు.. పొరుగు రాష్ట్రం నేతలు ఇలా ప్రతిసారి ఎగతాళిగా మాట్లాడినా నోరు మెదపడం లేదు. ఏపీ ప్రజలకు ఇది మరింత ఆగ్రహం తెప్పిస్తున్నది. సీఎం జగన్ ను నోరెత్తి ఒక్క మాట మాట్లాడినా వారిపై విరుచుకుపడే నేతలు.. పరాయి రాష్ట్రంలో జగన్ పాలనపై హేళన చేస్తున్నా కుక్కిన పెనులాగా కిక్కిరుమనకుండా ఉన్నారంటే వారి వైఫల్యాన్ని వారే  అంగీకరించినట్లు భావించాల్సి వస్తున్నదని   పరిశీలకులు విశ్లేషిసున్నారు.

By
en-us Political News

  
బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ అఖండ విజయం సాధించడంలో సువేందు కీ రోల్ పోషించారు. ఆ పార్టీ 206 స్థానాల్లో గెలిచి బెంగాల్‌లో తొలిసారిగా అధికారం చేపట్టబోతోంది. బీజేపీ తరఫున రెండు స్ధానాల నుంచి బరిలోకి దిగిన సువేందు అధికారి.. మరోసారి మమతా బెనర్జీని ఓడించారు. భవానిపూర్‌లో దీదీపై గెలిచిన ఆయన.. తన సొంత నియోజకవర్గమైన నందిగ్రామ్‌లోనూ గెలిచి పట్టు నిలుపుకున్నారు.
ముఖ్యంగా అస్సాం, పశ్చిమబెంగాల్ లో బీజేపీ ఎన్నికల సంఘం సహకారంతో ఫలితాలను చోరీ చేసిందన్నారు.
పశ్చిమబెంగాల్‌లో మూడున్నర దశాబ్దాల ఏళ్ల సీపీఎం పాలనకు బ్రేక్ వేసి 2011లో అధికార పగ్గాలు చేపట్టిన తృణముల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్టీ.. 2026 వరకు వరుస విజయాలతో ముఖ్యమంత్రిగా కొనసాగారు. ఆమె 15 ఏళ్ల ఆధిపత్యానికి ఎన్డీఏ తెర దించింది. మమతా సైతం కాంగ్రెస్‌లో కేంద్రమంత్రిగా, పలు కీలక పదవులు నిర్వహించి, తర్వాత సొంత కుంపటి పెట్టుకున్న నాయకురాలే కావడం గమనార్హం.
ప్రజా సమస్యలపై స్పష్టమైన అజెండాతో ఎన్నికల బరిలోకి దిగిన విజయ్‌ను తమిళ ప్రజలు ఆదరించడం శుభపరిణామమన్నారు.
తన పార్టీ స్థాపించిన నాటి నుండి నేటి వరకు ఆయన సాగించిన ప్రయాణం ఒక అద్భుతమైన రాజకీయ థ్రిల్లర్‌ను తలపిస్తుంది. ఎన్నికల ప్రచార సమయంలో విజయ్ అనేక ఆటంకాలను ఎదుర్కొన్నారు. ప్రత్యర్థి పార్టీల నుండి వచ్చిన తీవ్ర విమర్శలు, అధికార యంత్రాంగం విధించిన ఆంక్షలు ఆయనను ఉక్కిరిబిక్కిరి చేశాయి. వ్యక్తిగత జీవితంపై జరిగిన దుష్ప్రచారం విజయ్ ఇమేజ్‌ను దెబ్బతీస్తుందని అందరూ భావించారు.
తమిళనాడులో టీవీకే పార్టీ విజయాన్నిస్వాగతిస్తూ.. వైసీపీ సోషల్ మీడియా వేదికగా సంబరాలు మొదలు పెట్టింది. విజయ్ సాధించిన ఈ అద్భుత విజయం వెనుక వైసీపీ అధినేత జగన్ సహకారం ఉందంటూ వైసీపీ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున పోస్టులు వెల్లువెత్తుతున్నాయి. ముఖ్యంగా గతంలో ఒక వివాహ వేడుకలో వైఎస్ జగన్, విజయ్ ఇద్దరూ కలిసి దిగిన ఒక ఫోటోను ఇప్పుడు వైసీపీ నెట్టింట వైరల్ చేస్తోంది.
ఈ ఎన్నికల ఫలితాల్లో విజయ్ టవీకే పార్టీ స్పష్టమైన ఆధిక్యత కనబరిచింది. ప్రభుత్వ వ్యతిరేకతతో పాటు, కూటమి పక్షాల మధ్య సరైన సమన్వయం లేకపోవడం కూడా ఈ ఓటమికి ప్రధాన కారణాలుగా కనిపిస్తున్నాయి.
1982లో తెలుగువారి ఆత్మగౌరవం నినాదంతో తెలుగుదేశం పార్టీని స్థాపించిన ఎన్టీఆర్, కేవలం 9 నెలల కాలంలోనే రాష్ట్రమంతటా పర్యటించి ప్రభంజనం సృష్టించారు. 1983 ఎన్నికల్లో కాంగ్రెస్ వంటి బలమైన పార్టీని మట్టికరిపించి, తొలి ప్రయత్నంలోనే ముఖ్యమంత్రి పీఠాన్ని అధిష్టించి రికార్డ్ సృష్టించారు.
భారత రాజకీయ యవనికపై భారతీయ జనతా పార్టీ తన ఉనికిని మరింత శక్తివంతం చేస్తోంది.
చారిత్రాత్మక విజయం ఖాయమని తేలడంతో.. విజయం అభిమానుల సంబరాలు మిన్నంటాయి. అయితే.. ఈ నేపథ్యంలో సినీ నటి త్రిష పేరు సోషల్ మీడియాలో విపరీతంగా ట్రెండ్ అవుతోంది.
ఈ నియోజకవర్గం నుంచిఎన్డీయూ కూటమి అభ్యర్థి మల్లాడి కృష్ణారావు విజయం సాధించారు. తన సమీప ప్రత్యర్థి, కాంగ్రెస్ అభ్యర్థి గొల్లపల్లి అశోక్ పై నాలుగువేల ఐదు వందల ఓట్ల పైచిలుకు మెజారిటీతో గెలుపొందారు.
ఎన్నికల ఫలితాల్లో ఎన్డీయే కూటమి సాధించిన ఘన విజయంపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు హర్షం వ్యక్తం చేశారు.
తట్టంచావడి నియోజకవర్గం నుంచి ఆయన భారీ మెజారిటీతో విజయం సాధించారు. ఆయన పోటీ చేసిన మరో స్థానమైన మంగళంలోనూ భారీ ఆధిక్యంలో కొనసాగుతున్నారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.