రాష్ట్రంలో వందలకోట్లు దండుకుంటున్న మెడికల్ మాఫియా
Publish Date:Mar 12, 2012
Advertisement
హైదరాబాద్: మద్యం మాఫియాపై నిరంతరం వార్తలు వస్తూనే ఉన్నాయి. నిజానికి రాష్ట్రాన్ని అడ్డంగా దోచుకుంటున్న మాఫియాలు అనేకం ఉన్నాయి. ఇటువంటి మాఫియాల్లో మెడికల్ మాఫియా ఒకటి. ప్రభుత్వ ఆంక్షలు, నియమ నిబంధనలు లేకపోవడంతో ఈ మెడికల్ మాఫియా రాష్ట్రంలో దర్జాగా వందలాది కోట్ల రూపాయలు దోచుకుంటుంది. 10రూపాయలు కూడా విలువచేయని మందులపై 90 నుంచి 100 రూపాయలు ఎమ్మార్పీ ముద్రిస్తునారు. వీటి ధరలకు నియత్రణ లేకపోవడంతో రోగులు నష్టపోతున్నారు. రూపాయి వస్తువుకు 10 రూపాయల ఎమ్మార్పీ నిర్ణయిస్తున్న మెడికల్ కంపెనీలు మధ్యలో వైద్యులకు, అధికారులకు ముడుపులు, ఏజెన్సీలకు, డాక్టర్లకు మార్జిన్లు, ప్రోత్సాహకాలు ఇస్తోంది. రాష్ట్రంలో సుమారు ఏటా రూ.8000 కోట్ల విలువైన ఔషధాలను విక్రయిస్తున్నట్లు అంచనా. అయితే ఈ రూ.8000 కోట్ల విలువైన మందులను తయారీకి అయ్యే ఖర్చు కేవలం వెయ్యికోట్లు రూపాయలు, మిగిలిన రూ.7000 కోట్ల రూపాయలు రోగులనుంచి దండుకొని వివిధ దశల్లో షాపుల యజమానులు, మందుల తయారీదారులు, డాక్టర్లు, అధికారులు అనుభవిస్తున్నారు. ఔషధాల ధరల నియంత్రణ, పర్యవేక్షణకు మనదేశంలో సరైన చట్టాలు లేవు. దీన్ని ఆసరాగా చేసుకుని మందుల తయారీదారులు రాష్ట్ర ప్రజలను దోచుకుంటున్నారు. లాభాలకు అలవాటుపడిన కొంతమంది యజమానులు ఎందుకూ పనికిరాని నాశిరకం మందులను, డూప్లికేట్ మందులను కూడా మార్కెట్లో ప్రవేశ పెట్టి రోగుల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు. మందులు వికటించి చనిపోతున్నవారి సంఖ్య కూడా రాష్ట్రంలో ఎక్కువగానే ఉంది. మద్యం మాఫియాను తలదన్నే విధంగా రాష్ట్రంలో మెడికల్ మాఫియా వేళ్ళానుకుని ఉంది. దీన్ని కూకటి వేళ్ళతో సహా పెకలించడానికి ప్రభుత్వం చర్యలు తీసుకోవాల్సిన అవసరముంది.
http://www.teluguone.com/news/content/medical-mafia-24-12554.html
సుబ్రతో రాయ్ అరెస్ట్ ...
ఖరారైన రాష్ట్రపతి పాలన ...
రాష్ట్రపతి పాలనకే మొగ్గు ...
విఫలమైన 'టి' కాంగ్రెస్
చంద్రబాబు పాదయాత్ర ఈ నెల 31న పునఃప్రారంభ౦ కానుంది. ఫిబ్రవరి నాల్గోతేదీ వరకు విజయవాడలో కోనసాగనుంది. ఆరోగ్య కారణాల రీత్యా చంద్రబాబు 29, 30లలో కూడా విశ్రాంతి తీసుకోనున్నారని తెలుగుదేశం నాయకులు ప్రకటించారు.
తెలంగాణ కాంగ్రెస్ ఎంపీలు కేకే నివాసంలో భేటి అయ్యారు. తెలంగాణపై పార్టీ అధిష్టానం వైఖరిని వ్యతిరేకిస్తూ పార్టీ సభ్యత్వానికి, పదవులకు కూడా రాజీనామా చేసి అధిష్టానం పై ఒత్తిడి పెంచేందుకు రంగం సిద్దం చేస్తున్నారు. రాజీనామా లేఖలను పార్టీ అధ్యక్షురాలు శ్రీమతి సోనియా గాంధి పంపించనున్నారు. భేటి అనంతరం లేఖలను మీడియాకు విడుదల చేయనున్నారు.
తెలుగు సినీ ప్రియులను తన అందచందాలతో, అసమానమయిన నటనతో ఒక ఊపుఊపిన అందాల తార జయప్రద, ఆ తరువాత బాలీవుడ్ లోను ఒక వెలుగు వెలిగింది. తెలుగుదేశంపార్టీలో జేరి రాష్ట్ర రాజకీయాలలో పాల్గొన్నపటికీ, చంద్రబాబుతో పొసగక ఏకంగా డిల్లీ రైలెక్కి ఉత్తర ప్రదేశ్ రాష్ట్రంలో వాలిపోయింది.
జానారెడ్డికి బుద్ది ,జ్ఞానం ఉందా? తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు మీద కాంగ్రెస్ ప్రకటన కోసం ఇంకా వేచిచూద్దాం అంటాడా. కాంగ్రెస్ ప్రకటనలో ఇంకా నిజాయితీ ఉందన్న జానారెడ్డి మాటలను తెలంగాణ ప్రజలు విశ్వసించరు. ముఖ్యమంత్రి పదవికోసం జానారెడ్డి గోతికాడ నక్కలా ఎదురు చూస్తున్నాడు.
వైయస్సార్ కాంగ్రెస్ చేపట్టిన కోటి సంతకాల సేకరణపై తెలుగుదేశం పార్టీ తీవ్ర విమర్శలు గుప్పించిన ఆరు నెలలకి ఇప్పుడు తాపీగా ఆ పార్టీ నేతలు స్పందించడం చూస్తుంటే ఆ పార్టీ నాయకత్వలోపం మరోసారి బయట పడుతోంది.
చంద్రబాబు తెలంగాణా జిల్లలో పాదయాత్ర చేస్తునంత కాలం తన వైయస్సార్ కాంగ్రెస్ పార్టీని, తన నాయకుడు జగన్ మోహన్ రెడ్డిని అయన ఎంత తీవ్రంగా విమర్శించినా స్పందించని కొడాలి నాని, చంద్రబాబు ఇప్పుడు తన కృష్ణా జిల్లాలో పాదయాత్ర చేస్తూ అదే విధంగా విమర్శలు చేసినప్పుడు మాత్రం వెంటనే స్పందించారు.
రాష్ట్ర రాజధానిలోఇందిరా పార్క్ వద్ద నేటి నుండి 36గంటల సమరదీక్షను నిర్వహించాలన్న పట్టుదలతో ఉన్న తెలంగాణా జేయేసీ నేతలు, పోలీసు ఆదేశాలను
నిర్విరామంగా సాగుతూ 117వ రోజుకు జేరుకొన్నచంద్రబాబు పాదయాత్ర ఈరోజు కృష్ణా జిల్లాలో పరిటాలకు చేరుకొంది. ముందు అనుకొన్న ప్రకారం అయితే ఈ రోజుతో ఆయన పాదయాత్ర ముగించాల్సి ఉంది. అయన కుటుంబ సభ్యులు, పార్టీ నేతలు మరియు వైద్యులు కూడా పాదయాత్ర ముగించమని కోరినప్పటికీ చంద్రబాబు తన పాదయాత్రను కొనసాగించడానికే నిశ్చయించుకొన్నారు.
తెలంగాణా జేయేసీ అద్వర్యంలో సికిందరాబాద్ లో ఇందిరా పార్క్ వద్ద 36గంటల సమరదీక్షకు అనుమతి కోరుతూ జేయేసీ నేతలు హోంమంత్రి సబితా ఇంద్రరెడ్డికి వినతిపత్రం సమర్పించగా, కొద్దిసేపటిలోనే వారికి అనుమతి నిరాకరిస్తున్నట్లు పోలీసుల నుండి వెంటనే లేఖ అందడంతో తెలంగాణావాదులు కిరణ్ కుమార్ రెడ్డి మీద, పోలీసుల మీద మండిపడ్డారు.





