మంచు లక్ష్మి గుండెల్లో గోదారి?
Publish Date:Mar 13, 2013
Advertisement
ప్రముఖ నటి మంచు లక్ష్మి నటించి నిర్మించిన ‘గుండెల్లో గోదారి’ సినిమా ప్రీవ్యూ చూసిన ఆమె తండ్రి మోహన్ బాబు, ప్రముఖ దర్శకుడు దాసరి నారాయణ రావు, ఆ సినిమా గొప్ప కలెక్షన్లు రాబట్టాక పోవచ్చునేమో కానీ, అనేక అవార్డులు మాత్రం స్వంతం చేసుకోవడం ఖాయం అని సినిమా విడుదలకు ముందుగానే జోస్యం చెప్పడం ఆ సినిమా భవిష్యత్ ఎలా ఉంటుందో తెలియజేసింది. ఊహించినట్లే, ‘గుండెల్లో గోదారి’ ఒక మంచి సినిమాగా పేరు సంపాదించుకోవడమే గాక మంచు లక్ష్మి అత్యుత్తమ నటనకు అద్దం పట్టింది. కానీ, నాలుగు ఫైట్స్, నాలుగు డ్యాన్సులు, ఓ పది పంచ్ డైలాగులు, ఒక ఐటెం సాంగుకి అలవాటు పడిన మన తెలుగు సినిమా జీవులకి ‘గుండెల్లో గోదారి’ వంటి సినిమాలు ‘కిక్కు’ ఇవ్వలేవు, గనుక ఆ సినిమా కలెక్షన్లు కూడా అంతంత మాత్రంగానే ఉన్నట్లు సమాచారం. ఇటీవల తనికెళ్ళ భరణి తీసిన అచ్చ తెలుగు సినిమా ‘మిధునం’కు కూడా అదే పరిస్థితి. అచ్చ తెలుగు సినిమా అంటూ సీతమ్మ వాకిట్లో సిరి మల్లె చెట్టు నాటాలని ప్రయత్నించిన ఆ సినిమా నిర్మాతలు కొంచెం వాస్తవ పరిస్థితులను దృష్టిలో పెట్టుకొని సీతమ్మ వాకిట్లో మహేష్ బాబు చేత రెండు స్టెప్పులు వేయించబట్టి ఆ సినిమా బ్రతికి బట్ట కట్టగలిగేలా చేసారు. లేదంటే వారి గుండెల్లో కూడా గోదారే పారేదేమో. ఇక విషయంలోకి వస్తే, మంచు లక్ష్మి గుండెల్లో దుఃఖం కట్టలు తెంచుకొన్న గోదారిలా పారుతుంటే, ఆ బాధతో వైరాగ్యం పెరగడం వల్లనో లేక తెలుగు ప్రేక్షకుల మీద అలిగారో తెలియదు కానీ ఇకపై చిత్రాల్లో నటించబోనని ప్రకటించారు. సినిమా సక్సెస్ కాకపోయినా నిర్మాతలకు తప్పనిసరి తద్దినంగా మారిన సక్సెస్ మీట్లో మంచు లక్ష్మీ మాట్లాడుతూ తాను ఇకపై సినిమాలలో నటించడం కానీ, నిర్మించడం గానీ చేయనని ప్రకటించారు. అందువల్లే తాను ఒక్క చిత్రానికి కూడా సంతకం చేయలేదని చెప్పారు. తానూ తిరిగి అమెరికాకు వెళ్లిపోయి తన భర్త ఆనంద్తో కలిసి హాయిగా కాపురం చేసుకొంటూ బ్రతకాలనుకొంటునానని ప్రకటించి అందరిని ఆశ్చర్య పరిచారు. ఇది ఆమె వ్యక్తిగత నిర్ణయం అయినప్పటికీ, ఒక మంచి నటిగా, మంచి అభిరుచి గల నిర్మాతగా పేరుపొందిన మంచు లక్ష్మి సినీ పరిశ్రమను వీడి వెళ్ళిపోవాలని అనుకోవడం సినీ పరిశ్రమే కాకుండా అటువంటి ప్రతిభావంతురాలిని ప్రేక్షకులకు కూడా దూరం చేసుకొంటున్నారని చెప్పవచ్చును. ఇందుకు ముఖ్య కారణం సగటు ప్రేక్షకుల అభిరుచిలో వచ్చిన తీవ్రమార్పులే. ఒక సినిమాను చూసి ‘ఎంజాయ్’ చేయడానికి, అనుభూతి చెంది ఆనందించడానికి చాలా వ్యత్యాసం ఉంది. ప్రస్తుతం సగటు ప్రేక్షకుడు సినిమా తనకు అవసరమయిన ‘ఎంజాయ్ మెంటు’ ఈయగలిగితే చాలునని భావించడం వల్లనే ఇటువంటి మంచి సినిమాలు గోదాట్లో కొట్టుకు పోతున్నాయి. అందువల్లే మంచి అభిరుచి ఉన్న దర్శక నిర్మాతలు కూడా నాలుగు పంచు డైలాగులు, నాలుగు పాటలు, నాలుగు ఫైట్సు, ఒక ఐటెం సాంగు వేసి రీళ్ళు చుట్టేస్తూ ‘మమ’ అనిపించేసి తమ జేబులు నింపుకొంటునారు. యదా ప్రజా తదా రాజా, తదా నిర్మాతః.
http://www.teluguone.com/news/content/manchu-lakshmi-32-21565.html
హాయిగా నవ్వుకునే టిట్ బిట్స్ వున్న ఫన్ బక్కెట్ కామెడీ పదమూడో ఎపిసోడ్ని ఎంచక్కా చూసి ఎంజాయ్ చేయండి..
మొన్నీమధ్య విడుదలైన గోపీచంద్ ‘సౌఖ్యం’ సినిమా మీద మన సక్కుబాయి రివ్యూ ఏమిటో చూసేద్దామా?
డిసెంబర్ 27, 2015 నుంచి జనవరి 02, 2016 వరకు వివిధ రాశులవారి గ్రహబలం ఈ చిన్న వీడియో ద్వారా తెలుసుకోవచ్చు.
ఈ రెండు నిమిషాల నిడివి వున్న ఫన్ బక్కెట్ పన్నెండో కాపీ చూడండి.. మీకు నచ్చి తీరుతుంది. మాదీ గ్యారంటీ..
2015 సంవత్సరంలో టాలీవుడ్లో బిగ్గెస్ట్ హిట్స్గా నిలిచిన సినిమాలు ఏవో ఈ వీడియోలో చూస్తే క్లియర్గా తెలుస్తుంది.
క్రీడాకారుల జీవిత కథలతో రూపొందించిన బాలీవుడ్ సినిమాలు ఘన విజయాలు సాధిస్తున్నాయి. ‘భాగ్ మిల్కా భాగ్’, ‘మేరీకోం’ సినిమాలు దీనికి ఉదాహరణలు. ఆ సినిమాల స్ఫూర్తితోనే అజారుద్దీన్, మహేంద్రసింగ్ ధోనీ జీవిత కథల ఆధారంగా కూడా సినిమాలు రూపొందుతున్నాయి. ఈ నేపథ్యంలో అందాల క్రీడాకారిణి
2015 సంవత్సరంలో టాలీవుడ్లో టాప్ 10 ఫ్లాపులుగా మిగిలిన కళాఖండాల గురించి తెలుసుకోవాలని అనుకుంటున్నారా.. అయితే ఈ వీడియో చూడండి చాలు.. ఫుల్లుగా క్లారిటీ వచ్చేస్తుంది.
టాలీవుడ్లో ఒక్కో ఏడాది కొంతమంది హీరోయిన్లు ఐరన్ లెగ్స్ అని పిలిపించుకుంటూ వుంటారు. ఎవరి అకౌంట్లో ఎక్కువ ఫ్లాపులు పడితే వాళ్ళని ఐరన్ లెగ్స్ అనడం టాలీవుడ్లో మామూలే. మరి 2015లో ఐరన్ లెగ్స్ అని పిలిపించుకుంటున్న హీరోయిన్లు ఎవరో చూద్దామా...
సుధీర్బాబు హీరోగా నటించిన ‘భలే మంచి రోజు’ గురించి స్టార్ హీరో ప్రభాస్ ఏమంటున్నాడంటే...
ఈవారం అంటే... 20 డిసెంబర్, 2015 నుంచి 26 డిసెంబర్ 2015 వరకు వివిధ రాశులవారి గ్రహబలం ఎలా వుందో తెలుసుకోవాలంటే ఈ కింది వీడియోను క్లిక్ చేస్తే చాలు..
డిసెంబర్ 13వ తేదీ నుంచి డిసెంబర్ 19వ తేదీ వరకు వివిధ రాశుల వారి గ్రహబలం ఎలా వుందో తెలుసుకోవాలంటే ఈ క్రింది వీడియో చూస్తే చాలు.
త్రిష అందంగా వుంటుంది.. ఇంకా చెప్పాలంటే సూపరుగా వుంటుంది. అయితే ఇప్పుడు త్రిషని అందరూ త్రిషా.. నువ్వు సూపరు అంటున్నారు. ఈ ప్రశంస ఆమె అందానికి సంబంధించినది కాదు.. ఆమె వ్యక్తిత్వానికి సంబంధించింది. అందాల నటిగా అందరి ప్రశంసలు అందుకోవడం మాత్రమే కాదు.. సమాజం పట్ల బాధ్యతగా కూడా వ్యవహరించే త్రిషను చాలామంది ఈ కోణంలో కూడా అభిమానిస్తూ వుంటారు. ఆమధ్య స్వచ్ఛ భారత్ కార్యక్రమంలో భాగంగా వీధులను ఊడ్చి స్ఫూర్తినిచ్చిన త్రిష అడపాదడపా సమాజ సేవా కార్యక్రమాల్లో
దర్శకుడు రాంగోపాల్ వర్మ అందరినీ మెప్పించగల సినిమాలు తీయడంలో విఫలమవుతున్నా, నిత్యం వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ ప్రజలను ఆకట్టుకోగలుగుతున్నారు. ఏ విషయంపైనైనా తనకు తోచినట్లు నిర్భయంగా చెప్పగలగడమే అతనికి చాలా పాపులారిటీ తెచ్చిపెట్టిందని చెప్పవచ్చును. అయితే ఆ పాపులారిటీ పెరుతున్న కొద్దీ అతను తన హద్దులను కూడా దాటిపోతున్నట్లు కనిపిస్తోంది. సహజ సిద్దమయిన కొన్ని సమాజ సూత్రాలను, నియమనిబంధనలను తనకు వర్తించవు అన్నట్లుగా వ్యవహరిస్తున్నారు.





