పార్టీ లైన్ దాటితే చర్యలు తప్పవు.. రాజగోపాల్రెడ్డి వ్యాఖ్యలపై.. టీపీసీసీ చీఫ్ ఫైర్..!
Publish Date:Aug 14, 2026
Advertisement
ఎవరైనా సరే పార్టీ గీత దాటి మాట్లాడితే సహించేది లేదు..మహేష్ కుమార్ గౌడ్..! తెలంగాణ కాంగ్రెస్ పార్టీ అంతర్గత వ్యవహారాలు తీవ్ర చర్చనీయాంశంగా మారిన వేళ, టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ క్రమశిక్షణ విషయంలో కీలక వ్యాఖ్యలు చేశారు. మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఇటీవల చేసిన వ్యాఖ్యలను పార్టీ నాయకత్వం అత్యంత తీవ్రంగా పరిగణిస్తోందని ఆయన వెల్లడించారు. ఎంతటి ముఖ్యాధికారి లేదా ప్రజాప్రతినిధి అయినా సరే, పార్టీ గీసిన లక్ష్మణరేఖను దాటి మాట్లాడితే సహించే ప్రసక్తే లేదని పీసీసీ చీఫ్ స్పష్టం చేశారు. పార్టీ ప్రయోజనాలు అధిష్టాన నిర్ణయాలే సర్వోపరి అని, క్రమశిక్షణా రాహిత్యాన్ని ఏమాత్రం ఉపేక్షించబోమని తేల్చిచెప్పారు. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి తనకు వ్యక్తిగతంగా మంచి మిత్రుడని, ఆయన మనస్తాపం ఆవేదన వెనుక ఉన్న కారణాలను తాము అర్థం చేసుకోగలమని మహేష్ గౌడ్ పేర్కొన్నారు. అయితే, వ్యక్తిగత అసంతృప్తులు ఏవైనా ఉంటే పార్టీ వేదికలపైనే చర్చించాలి తప్ప బహిరంగంగా వ్యాఖ్యలు చేయడం సరికాదని అభిప్రాయపడ్డారు. తెలంగాణ కాంగ్రెస్లో ఏ ఒక్కరి స్వయంప్రతిపత్తికైనా క్రమశిక్షణే ప్రాతిపదిక అని పీసీసీ నాయకత్వం నొక్కిచెప్పింది. పార్టీ నియమావళికి విరుద్ధంగా ప్రవర్తించే నాయకులపై అధిష్టానం దృష్టికి తీసుకెళ్లి తగిన నిర్ణయాలు తీసుకుంటామని పరోక్ష హెచ్చరికలు జారీ చేశారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుండి మంత్రివర్గ విస్తరణ పదవుల కేటాయింపులపై పలువురు సీనియర్ నాయకుల్లో కొంత అసంతృప్తి వ్యక్తమవుతోందనే వార్తలు వినిపిస్తున్నాయి. ఈ క్రమంలోనే రాజగోపాల్ రెడ్డి వ్యాఖ్యలు పార్టీ వర్గాల్లో కాకరేపాయి. ఈ పరిణామంపై రాజకీయ విశ్లేషకులు స్పందిస్తూ, అధికారంలో ఉన్న సమయంలో పార్టీ అంతర్గత విభేదాలు బయటపడటం ప్రభుత్వ ఇమేజ్పై ప్రభావం చూపే అవకాశం ఉందని అంటున్నారు. అందుకే పీసీసీ అధ్యక్షుడు వేగంగా స్పందించి పరిస్థితిని అదుపులోకి తెచ్చే ప్రయత్నం చేశారని భావిస్తున్నారు. ముందుముందు ఈ వివాదం ఏ మలుపు తిరుగుతుందనేది ఆసక్తికరంగా మారింది. మరోవైపు కాంగ్రెస్లో బయట నుంచి వచ్చిన నాయకుల పెత్తనం ఎక్కువైందని మాత్రమే తాను చెప్పానని మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజ్గోపాల్ రెడ్డి క్లారీటీ ఇచ్చారు. నిన్న చేసిన కామెంట్స్పై మరోసారి వివరణ ఇచ్చారు. రాహుల్ గాంధీ నాయకత్వంలో కాంగ్రెస్లోనే ఉంటానని రాజ్గోపాల్ రెడ్డి స్పష్టం చేశారు. Mahesh Kumar Goud, Komatireddy Rajgopal Reddy, Telangana Congress News, TPCC Chief Warning, CM Revanth reddy, Congress party
http://www.teluguone.com/news/content/mahesh-kumar-goud-39-228929.html





