Publish Date:Oct 23, 2025
మొన్నటి వరకూ అందరూ సునీత మాత్రమే మాగంటి గోపీనాథ భార్య. ఆమె పిల్లలు మాత్రమే ఆయనకు వారసులు. ఇదొక చిన్న కుటుంబం చింతలేని కుటుంబం. అనుకుంటున్నారంతా. ఇంతలో సడెన్ ఎంట్రీ ఇచ్చాడు తారక్ ప్రద్యుమ్న. తానే అసలైన వారసుడిననీ, తనకు చట్టరీత్యా రావల్సిన ఈ హక్కు తన తండ్రితో లివిన్ రిలేషన్లో ఉన్న సునీతకు ఎలా ఇచ్చారంటూ.. ఈసీకీ ఫిర్యాదు చేయడంతో ఇంటి గుట్టు- రాజకీయం రట్టుగా మారింది.
సునీతకు బీఆర్ఎస్ టికెట్ ఇచ్చిందే సెంటిమెంటు ద్వారా నాలుగు ఓట్లు పడతాయని. ఇపుడీ మొదటి భార్య కొడుకు కారణంగా బీఆర్ఎస్ ఆశలపై భారీగా నీళ్లు జల్లినట్టయ్యింది. అయితే మాగంటి గోపీనాథ్ చనిపోయినపుడు తలకొరివి పెట్టడానికి కానీ, ఆ తర్వాత ఆయన నివాళి సభలకు కానీ రాని తారక్ ప్రద్యుమ్న సడెన్ గా తాను గోపీనాథ్ మొదటి భార్య మాలినీదేవి కొడుకును, ఆయన అసలు సిసలు రాజకీయ వారసుడ్నిఅంటూ రావడంతో అంతా ఉలిక్కి పడ్డారు. సునీత తప్పుడు ఫ్యామిలీ సర్టిఫికేట్ చూపించి గోపీనాథ్ భార్యగా నిరూపించే యత్నం చేశారు. అక్టోబర్ 11న ఆ సర్టిఫికేట్ ని ఆర్డీఓ ఆఫీసు వారు కూడా రద్దు చేశారంటూ నానా యాగీ చేస్తున్న ఇతడిచ్చిన కంప్లయింట్ పై సునీత ఈసీకి వివరణ ఇస్తారు. అంతా బావుంది. మరి ఇప్పుడే ఇతడెందుకిలా బయటకొచ్చినట్టు? ఇతడి వెనక ఎవరున్నట్టు? అన్న ప్రశ్నకు ఆస్కారమేర్పడుతోంది.
అయితే ఇతడు మాగంటి ఇంటి పేరును కూడా తన పేరు చివర వాడటం లేదనీ.. కొసరాజు తారక్ ప్రద్యుమ్న అనే పేరుతో చెలామణీ అవుతున్నాడనీ.. తండ్రి చివరి సారి చూపులకు కూడా రాని ఇతడు.. ఇప్పుడే సడెన్ గా ఊడి పడ్డం వెనక కాంగ్రెస్ మార్క్ రాజకీయ కుట్ర కోణం ఉందనీ.. అంటున్నారు బీఆర్ఎస్ లీడర్లు. అయితే ఇప్పుడు సునీత మాగంటి గోపీనాథ్ భార్య అవునా కాదా? లివిన్ లో మాత్రమే ఉన్న జీవిత భాగస్వామా?
వంటివి పెద్దగా అడ్డంకులు కావు. ఎందుకంటే ఈ దిశగా చట్టాలు మారి చాలా కాలమే అయ్యింది. ఎలిజిబిటిటీ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ని బట్టిచూస్తే ఆడ, మగ తేడా లేకుండా ఎవరు ఎవరితోనైనా ఉండొచ్చు. సంచరించొచ్చు. సహజీవన భాగస్వామ్యం కొనసాగించవచ్చు. అయితే సునీత తప్పుడు ధృవీకరణ పత్రాలే అసలు సమస్య. ఇప్పటికే సునీత నామినేషన్ల సెట్ ఓకే చేసీన ఈసీ ఈ ఫిర్యాదు ద్వారా ఎలాంటి నిర్ణయం తీస్కుంటారన్న సస్పెన్స్ నడుస్తోంది.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/maganti-sunitha-facec-stepsibling-fight-25-208349.html
ఇరు రాష్ట్రాల మధ్యా జలవివాదాలు ఉండకూడదన్న లక్ష్యంతోనే నాడు కాంగ్రెస్ ప్రత్యేక తెలంగాణ రాష్ట్రానికి పచ్చ జెండా ఊపిందన్న రేవంత్ రెడ్డి, రాజకీయాలకు అతీతంగా నీటి వివాదాలను ఇరు రాష్ట్రాలూ పరిష్కరించుకోవాలన్నారు.
వాస్తవాలకు ఎలాంటి ముసుగులూ తగిలించకుండా ఉన్నది ఉన్నట్లు, కుండబద్దలు కొట్టినట్లుగా సమాజం తీరు తెన్నులను, రాజకీయ నాయకుల మధ్య నెక్సస్ ను, అధికారులు బాధ్యతారాహిత్యం, జవాబుదారీతనం లేని తనాన్ని కళ్లకు కట్టిన వాస్తవ ‘వేదిక’ తెలుగువన్ యూట్యూబ్ చానెల్ లో గురువారం ప్రసారమైంది.
ఇటీవల అసెంబ్లీ శీతాకాల సమావేశాలకు హాజరైన ప్రతిపక్ష నేత కేసీఆర్ వద్దకు సీఎం స్వయంగా వెళ్లి అభివాదం చేయడం, క్షేమ సమాచారాలు తెలుసుకోవడం రాజకీయంగా అత్యంత ప్రాధాన్యత సంతరించుకుంది.
ఇక ఎన్టీఆర్ రాజకీయ రంగప్రవేశం ఒక సంచలనం, ఒక ప్రభంజనం. తెలుగుదేశం పార్టీని స్థాపించి కేవలం 9 నెలలలో అధికారంలోకి వచ్చి నభూతో నభవిష్యత్ అన్న రికార్డు సృష్ఠించారు. అప్పటికి మూడున్నర దశాబ్దాలకు పైగా ఆంధ్రప్రదేశ్ లో సాగుతున్న కాంగ్రెస్ ఏకచ్ఛత్రాధిపత్యానికి తెరదించారు.
ప్రజాధనం దుబారాను నియంత్రించాల్సిన బ్యూరోకాట్లు, అఖిల భారత సర్వీసు అధికారులైన ఐఏఎస్ లు ఆ దిశగా ఎటువంటి ప్రయత్నం చేయకుండా కేవలం ప్రేక్షక పాత్ర వహిస్తూ.. ఏలిన వారు అంటే అధికారంలో ఉన్న వారి అడుగులకు మడుగులొత్తుతూ.. ఎక్కడ సంతకం పెట్టమంటే అక్కడ పెట్టేయడం అధికార దుర్వినియోగమే ఔతుందన్నారు.
మెజారిటీ ఉందికదా అని ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తామంటే అంగీకరించేది లేదన్నారు. మోడీ సర్కార్ పేదల పట్ల కక్ష సాధింపుధోరణితో వ్యవహరిస్తోందనీ, అందుకే మహాత్మాగాంధీ జాతీయ ఉపాధి హామీ పథకాన్ని నీరుగారుస్తోందనీ విమర్శించారు.
సీమ లిఫ్ట్ పై ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబునాయుడు, తెలుగుదేశం కూటమి ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. సీమకు చంద్రబాబు వెన్నుపోటు పొడిచారనీ, తెలంగాణ అసెంబ్లీ సాక్షిగా రేవంత్ రెడ్డి సీమ లిఫ్ట్ పై చేసిన వ్యాఖ్యల ఆధారంగా చంద్రబాబుపై విమర్శలు గుప్పించారు.
రాష్ట్రంలోని ఇండియా పొలిటికల్ యాక్షన్ కమిటీ (ఐ-ప్యాక్) ప్రధాన కార్యాలయాంపై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) దాడులు నిర్వహించడం కలకలం రేపింది. కాగా ఈడీ దాడులపై పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఆయన పుట్టిన రోజు సందర్భంగా బహిరంగంగా జంతువులను వధించినందుకు రాష్ట్ర వ్యాప్తంగా పలువురు వైసీపీ కార్యకర్తలపై జంతు హింస చట్టం కింద కేసులు నమోదైన సంగతి విదితమే. ఇప్పుడు జగన్ తాజాగా ఈ కేసులు ఎదుర్కొంటున్న తన పార్టీ మద్దతుదారులకు పార్టీ లీగల్ సెల్ అన్ని విధాలుగా అండగా నిలుస్తుందని హామీ ఇచ్చినట్లు తెలుస్తోంది.
ఈ నెల 16న పోలింగ్ స్టేషన్ల వివరాలతోపాటు ఫొటోతో కూడిన ఓటర్ల తుది జాబితాను ఆయా వార్డుల్లోని పోలింగ్ స్టేషన్ల వారీగా ప్రచురించాలని ఆదేశాలు జారీ చేశారు. అలాగే జనాభా ప్రాతిపదికన వార్డులు, డివిజన్లు, ఆయా మున్సిపాల్టీలు, కార్పొరేషన్ల రిజర్వేషన్లను ఖరారు చేయనున్నట్లు తెలిపారు.
తెలంగాణ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్కు సవాల్ విసిరారు
ప్రజాసమస్యలపై అధికారులతో చర్చిస్తారు. క్షేత్ర స్థాయిలో పరిశీలన కూడా చేస్తారు.
ఆయన సొంత నియోజకవర్గమైన పిఠాపురంలో శుక్రవారం జరగనున్న సంక్రాంతి సంబరాల్లో పవన్ కల్యాణ్ స్థానికులతో కలిసి పాల్గొంటారు.
ఈ భేటీలో చంద్రబాబు అమరావతి చట్టబద్దత, పోలవరం, బడ్జెట్ కేటాయింపులు, ఉపాధి హామీ పథకంలో వెసలుబాటు వంటి పలు అంశాలను ప్రస్తావించారు. వాటితో బాటుగా కేంద్ర మంత్రి వర్గ విస్తరణలో టీడీపీకి ఒక బెర్తు సైతం డిమాండ్ చేశారు.