Publish Date:May 18, 2023
నదీ నదాలూ,
అడవులు, కొండలు,
ఎడారులా మన కడ్డంకి?
పదండి ముందుకు!
అన్నట్లుగా లోకేష్ పాదయాత్ర సాగుతోంది. ప్రభుత్వ అవరోధాలనే కాదు, గయాలను కూడా లేక్క చేయకుండా.. రాష్ట్రంలో రాక్షస పాలన అంతమే లక్ష్యంగా లోకేష్ ముందడుగు వేస్తున్నారు. ఈ క్రమంలోనే గత 50 రోజులుగా భుజం నొప్పి తీవ్రంగా వేధిస్తున్నా.. క్షణం కూడా విశ్రమించకుండా పాదయాత్ర కొనసాగిస్తున్నారు. ముఖంలో బాధ, అలసట కూడా కనిపించనీయకుండా ప్రజలతో మమేకమౌతూ, కొరిన వారందరితో సెల్ఫీలు దిగుతూ, వారు చెబుతున్న సమస్యలను సావధానంగా వింటూ విరామం లేకుండా నడుస్తూనే ఉన్నారు. భుజం నొప్పి నుంచి ఉపశమనం కోసం ఫిజియో థెరపీ చేయించుకున్నా, వైద్యులు సూచనలు పాటించినా ఫలితం లేకపోయింది. దీంతో వైద్యుల సూచన మేరకు ఆయన ఈ రోజు నంద్యాలలోని మాగ్న ఎంఆర్ఐ సెంటర్ లో స్కానింగ్ చేయించుకున్నారు.
లోకేష్ పాదయాత్ర అనంతపురం జిల్లా కదిరి నియోజకవర్గంలో ప్రవేశించిన సమయంలో భారీగా జనం తరలి రావడంతో జరిగిన తొక్కిసలాటలో ఆయన భుజానికి గాయమైంది. అప్పటి నుంచీ ఈ 50 రోజులుగా లోకేష్ భుజం నొప్పితోనూ పాదయాత్ర కొనసాగిస్తున్నారు. ఫిజియో థెరపీ, నొప్పి ఉపశమనం కోసం వైద్యుల సూచనలూ పాటిస్తూ వస్తున్నారు. అయితే నొప్పి తగ్గక పోవడంతో వైద్యులు ఎంఆర్ఐ స్కానింగ్ అవసరమని చెప్పడంతో ఈ రోజు నంద్యాలలో ఎంఆర్ఐ స్కానింగ్ చేయించుకున్నారు. నారా లోకేష్ పాదయాత్ర ఈ రోజు 103వ రోజుకు చేరుకుంది. లోకేష్ పాదయాత్ర సందర్భంగా నంద్యాల జనసంద్రంగా మారింది. భుజం నొప్పి తీవ్రంగా ఉన్నా ఆయన సంకల్పం సడలలేదు. భుజానికి ఎంఆర్ఐ స్కానింగ్ కారణంగా ఈ రోజు పాదయాత్రలో రైతులతో ముఖాముఖీ కార్యక్రమాన్ని మధ్యాహ్నం రెండు గంటలకు చేపట్టాలని లోకేష్ నిర్ణయించారు.
ఆ తరువాత నంద్యాల యాతం ఫంక్షన్ హాలు వద్ద తన పాదయాత్ర 1300 కిలోమీటర్లకు చేరుకున్న సందర్భంగా మైలురాయిని ఆవిష్కరిస్తారు. అక్కడ నుంచి ఆయన కానాల జాతీయ రహదారి విస్తరణ బాధితులతో సమావేశమౌతారు. సాయంత్రానికి హెచ్ఎస్ కొట్టాల చేరుకుని అక్కడ స్థానికులతో సమావేశమౌతారు. అనంతరం ఎం చిన్న కొట్టాలలో కూడా స్థానికులతో భేటీ అవుతారు. అక్కడ నుంచి జూలపల్లి చేరుకుని వడ్డెర సామాజిక వర్గానికి చెందిన వారితే భేటీ అవుతారు. అక్కడ నుంచి పసరుపాడు మీదుగా తెల్లాపురి చేరుకుంటారు.
తెల్లాపురి నుంచి రాయపాడు చేరుకుని అక్కడ స్థానికులతో సమావేశమౌతారు. రాత్రికి రాయపాడు శివారు విడిది కేంద్రంలో బస చేస్తారు. ఉదయం స్కానింగ్ కారణంగా పాదయాత్ర ఆలస్యం కావడంతో ఆమేర ఆయన షెడ్యూల్ లో మార్పు చేసుకుని రాత్రి పదిన్నర వరకూ పాదయాత్రను కొనసాగించాలని నిర్ణయించారు.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/lokesh-undergoes-mri-scan-39-155510.html
రాయలసీమను హార్టికల్చర్ హబ్గా తీర్చిదిద్దేందుకు, రాష్ట్రంలో ఇరిగేషన్ సదుపాయాలను మెరుగుపరిచేందుకు చంద్రబాబు నాయుడు ప్రభుత్వం పకడ్బందీ ప్రణాళికలతో ముందుకు వెళ్తోందని స్పష్టం చేశారు. రాష్ట్రంలో సాగునీటి ప్రాజెక్టులు ఒక్కొక్కటిగా పూర్తవుతుండటంతో, ఇరిగేషన్ రంగంపై మాట్లాడటానికి ప్రతిపక్షానికి ఎలాంటి అవకాశాలు లేకుండా పోయాయని ఆయన కుండబద్దలు కొట్టారు.
జలయజ్ణం పేరుతో వైఎస్ చేసింది ధనయజ్ణమని విక్రమ్ పూల అన్నారు. ప్రాజెక్టుల అంచనా వ్యయం పెరగడం, ప్రాంతీయ సమతుల్యత లోపించడం, హెడ్ వర్క్స్ కంటే ముందుగా కాలువల తవ్వకం వంటి వాటికే వైఎస్ జలయజ్ణం పరిమితమైందని విక్రమ్ పూల వివరించారు.
కాంగ్రెస్ హైకమాండ్ మీనాక్షీ నటరాజన్ పై వేటు వేయాలని భావిస్తున్నట్లు చెబుతున్నారు. రాహుల్ గాంధీ నేతృత్వంలోని జాతీయ నాయకత్వం రాష్ట్రంలో కాంగ్రెస్ వ్వవహారాలను చక్కదిద్దేందుకు భూపేష్ బగెల్ సమర్ధంగా పని చేయగలరని భావించి ఆ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు చెబుతున్నారు.
తాను పూర్తిగా రాజకీయాల నుంచి తప్పుకుంటున్నాననీ, వచ్చే ఎన్నికలలో పోటీ చేయననీ ఆయన చేసిన ప్రకటన పొలిటికల్ సర్కిల్స్ లో హాట్ టాపిక్ గా మారింది. తెలుగుదేశం ఆవిర్భావం నుంచీ కూడా ప్రజా ప్రతినిథిగా, పొలిటికల్ లీడర్ గా సేవలందించిన అయ్యన్న పాత్రుడు హఠాత్తుగా రాజకీయాలకు రిటైర్మెంట్ అంటూ చేసిన ప్రకటన రాజకీయవర్గాలలో సంచలనం సృష్టించింది.
2019 ఎన్నికలలో వైసీపీ విజయంలో అప్పటి జగన్ పాదయాత్ర కీలక పాత్ర పోషించిన సంగతి తెలిసిందే. అయితే అప్పట్లో.. జగన్ వాగ్దానాలపై ప్రజలలో నమ్మకం ఉండేది. ప్రజలతో ఆయన మమేకమయ్యేవారు.
రాష్ట్ర విభజన తరువాత తెలంగాణలో తెలుగుదేశం పార్టీ అధికార రేసులో లేకపోయినప్పటికీ.. రాష్ట్ర రాజకీయాలను ప్రభావితం చేస్తూనే ఉంది. అందుకే రాష్ట్రంలో రాజకీయ వేడ రగిలిన ప్రతి సందర్భంలోనూ తెలుగుదేశం ప్రస్థావన వస్తూనే ఉంటుంది.
తెలంగాణ రాజకీయాల్లో గత కొన్ని రోజులుగా తీవ్ర దుమారం రేపుతున్న పరిణామాలు ఇప్పుడు అత్యంత ఆసక్తికర మలుపు తిరిగాయి.
తాజాగా ఆమె చేసిన వ్యాఖ్యలు ఆమె చూపు బీఆర్ఎస్ వైపు మళ్లిందా అన్న అనుమానాలకు తావిచ్చింది. కేబినెట్ నుంచి తనకు ఉద్వాసన పలికిన తరువాత మీడియాకు వరుస ఇంటర్వ్యూలు ఇస్తూ సంచలన వ్యాఖ్యలు చేస్తున్న కొండా సురేఖ.. తాజాగా బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావుపై ప్రశంసల వర్షం కురిపించారు.
పిడిక్కీ బియ్యానికీ ఒకే మంత్రం అన్నట్లుగా ఆమె తన బర్త్ రఫ్ కూ తెలుగుదేశం పార్టీకీ ముడి పెట్టారు. సీఎం రేవంత్ రెడ్డిది తెలుగుదేశం రక్తం కనుకనే తనకు కేబినెట్ నుంచి బర్త్ రఫ్ చేశారంటూ మీడియా సమావేశంలో కొండా సురేఖ చేసి కామెంట్స్ రాజకీయవర్గాలలో సంచలనంగా మారాయి.
ఈ ప్రాజెక్టుల నిర్మాణంలో తమ పాత్రే కీలకమని పేర్కొంటూ వైసీపీ క్రెడిట్ వార్ కు తెరతీసింది. సోషల్ మీడియా వేదికగా వైసీపీ వారు పోలవరం ప్రాజెక్టును దివంగత వైఎస్ రాజశేఖరరెడ్డి కలల ప్రాజెక్ట్గా అభివర్ణిస్తూ పోస్టులు షేర్ చేస్తోంది.
కోమటిరెడ్డి కుటుంబానికి నల్గొండ జిల్లాలో గట్టి పట్టు ఉంది. ఈ నేపథ్యంలో తాను కేవలం మంత్రి పదవిని మాత్రమే ఆశించే నాయకుడిని కాననీ.. వైఎస్ ఆశయాలను ముందుకు తీసుకువెళ్లే నాయకుడిననీ ఆయన అంటున్నారు.
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో అధికార కూటమి భాగస్వామ్య పక్షాలైన తెలుగుదేశం, జనసేన మధ్య సంబంధాలు పైకి కనిపించేంత సజావుగా లేవనే సంకేతాలు స్పష్టమవుతున్నాయి.
తెలంగాణ రాజకీయాల్లో ఒక్కసారిగా తీవ్ర కలకలం రేగింది